Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telanga News. Show all posts
Showing posts with label Telanga News. Show all posts

Friday, November 16, 2012

స్వామిగౌడ్ నాకు కుడి భుజం: కేసీఆర్


Voice2telangana.blogspot.com





హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇవాళ కొత్తగా చేరిన కొత్త గులాబీ టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యమంలో స్వామిగౌడ్ తనతో వెన్నంటి ఉన్నారని, తనకు కుడి భుజంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికలకు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా కూడా స్వామిగౌడ్‌ను ఆహ్వానిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. స్వామిగౌడ్‌ది రాజీ పడని మనస్తత్వం అని అన్నారు. స్వామిగౌడ్‌కు ఉద్యమాభివందనాలు తెలుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. స్వామిగౌడ్ నేతృత్వంలో జరిగిన సకల జనుల సమ్మె ఒక అపూర్వ ఘట్టమని కేసీఆర్ పేర్కొన్నారు.

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

Read more...

Tuesday, December 20, 2011

రోజూ ఒక్క పూట బడే..?

 ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్‌కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.

కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.

కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్‌లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

 Take By: T News

Read more...

Monday, December 19, 2011

తీగలు తెంపిన రతనాల వీణ! ( Nizam In Telangana)

- నాడు వేల పరిక్షిశమలతో విలసిల్లిన నేల
- ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిజాం ప్రోత్సాహం

- లక్షల మందికి ఉపాధి వనరులు
- బలపడిన స్థానిక పారిక్షిశామిక వర్గం
- స్పిన్నింగ్.. ప్రింటింగ్.. షుగర్.. పేపర్ ఐరన్.. బటన్.. గ్లాస్..కెమికల్.. ఫిరంగులు..వీఎస్‌టీ.. డీబీఆర్.. ఆజంజాహి
- ఆనాటి కాలానికే అందివచ్చిన ప్రగతి
- ఆర్టీసీ ఏర్పడిందీ ఆనాడే
- స్టేట్ బ్యాంక్ ఘనతా అప్పటిదే


Industry-telangnaa-News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, డిసెంబర్ 18 (): తెలంగాణ.. కోటి రతనాల వీణ! నిజంగానే.. నిజంగానే ఇది రత్నగర్భ. సిరులు పొంగిన నేల. సింగరేణి బొగ్గు గనులను గర్భంలో దాచుకుంది. పారిక్షిశామికంగా విలసిల్లింది. ప్రపంచస్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది ఇప్పటి మాట కాదు. గత వైభవ వాస్తవ చరిత్ర. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. నిజాం హయాంలో సాధించిన ఘనత. భాగ్యనగరం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతమంతా పారిక్షిశామికంగా నాటి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందింది.

హైదరాబాద్‌ను అభివృద్ధి పర్చింది మేమేనని ఇటీవల మైకులు మింగి మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు చూడజాలని వాస్తవమది. ఇంతకుముందు.. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం.. హైదరాబాద్ అభివృద్ధికి ఆమడదూరంలో కునారిల్లిందా?.. ఆదుకునేవారేలేరని అంగలార్చిందా? ఆత్మగౌరవాన్ని తాకట్టుబెట్టి పరాధీనమయిందా?.. ఎంతమాత్రం కాదు. పారిక్షిశామికంగా హైదరాబాద్ నాడు భాగ్యనగరంగానే విలసిల్లింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు (1956) ముందే..

ఆ మాటకొస్తే భారతదేశ స్వాతంవూత్యానికి పూర్వమే నాటి తెలంగాణ.. నిజాం సంస్థానంలో అన్ని రకాలుగా ప్రగతి పథంలో పయనించింది. నాడే పలు రకాల పరిక్షిశమలు తమ ప్రత్యేకతను చాటిచెప్పాయి. కొన్ని ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రఖ్యాతిని దక్కించుకున్నాయి. వేల పరిక్షిశమలు లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పించాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రోత్సాహంతో పారిక్షిశామిక రంగం ముందుకు దూసుకుపోయింది.

స్పిన్నింగ్ మిల్ నుంచి కెమికల్ లేబోరేటరీ దాకా.. ఆర్టీసీ నుంచి ప్రాగా టూల్స్ దాకా.. హైదరాబాద్ దక్కన్‌లో వజీర్ సుల్తాన్ టొబాకో నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ దాకా పలురకాల పరిక్షిశమలు విస్తరించాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలతో తెలంగాణ విలసిల్లింది. ఇది చారివూతక వాస్తవం. తవ్విచూస్తే సజీవ సాక్ష్యాలకు కొదువలేదు. 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వస్తే.. అంతకు ముందు ఏడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అనుపమానం. 1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలుపెడితే 1947దాకా పారిక్షిశామిక రంగం బహుముఖంగా విస్తరించింది. 

1873లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ప్రారంభం కాగా, 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులోకి వచ్చాయి. 1910 దశకంలో సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ, 1919లో వీఎస్‌టీ ఫ్యాక్టరీ నెలకొన్నాయి. రెండో దశకంలో కెమికల్ లాబోరేటరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్; మూడో దశకంలో వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లులతో ప్రగతి శోభ చేకూరింది. 1932లో రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) స్థాపన మరో ముందడుగు. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాలుగో దశాబ్దానికి వస్తే, మొదటి అర్ధ భాగంలోనే 1941లో గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ నెలకొంది. 1942లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏర్పాటు గణనీయ పరిణామం. ఆ ఏడాదే స్థాపితమైన హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్, 1943లో ఏర్పడిన ప్రాగా టూల్స్ ఘనతను చాటేవే. 

1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్, 1947లో హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్ పారిక్షిశామిక ప్రగతిలో భాగం. ఆనాడు భాగ్యనగరంతోపాటు తెలంగాణ ప్రాంతమంతటా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కృషి కొనసాగింది. అందులో భాగమే.. డీబీఆర్ మిల్స్, వరంగల్ ఆజంజాహి మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ మెటల్స్ తదితర సంస్థల ఏర్పాటు. ఈ జాబితాకు అంతులేదు. తమ ప్రాంత ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం నాటి నిజాం ప్రభుత్వం చిత్తశుద్ధితో పారిక్షిశామిక విస్తరణకు ప్రయత్నించింది. అందుకు అవసరమైన విభాగాలను నెలకొల్పి ప్రోత్సాహకాలు కల్పించింది. తత్ఫలితంగా స్థానిక పారిక్షిశామికవర్గం బలపడింది. సాలార్‌జంగ్, బాబూఖాన్, లాహోటి, అల్లాద్దీన్, పన్నాలాల్ పిట్టి తదితర పారిక్షిశామిక కుటుంబాలు పరిక్షిశమల విస్తరణలో ఆసక్తి చూపి ఉపాధి వనరుల పెంపుదలలో దోహదపడ్డాయి.

1956లో సమైక్యరాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో పరిక్షిశమలు కోస్తా ప్రాంతం కంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే నిజాం రాజులు హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల ఏర్పాటుకోసం దృష్టి కేంద్రీకరించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. 19వ శతాబ్దంలో తెలంగాణలో జంపఖానాలు, తివాచీలు, నూలుబట్టలు, ఇనుప వస్తువులు, ఉక్కు, కత్తులు, తుపాకులు, టస్సర్ పట్టుబట్టలు, కాగితం పరిక్షిశమలుండేవి. రుద్రమదేవి కాలంలోనే బట్టల పరిక్షిశమకు వరంగల్ ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఇంగ్లండు దేశస్థుడు మార్కోపోలో రుద్రమదేవి కాలంలోని బట్టలను చూసి సాలెపురుగు దారాలని భ్రమపడ్డారని చరివూతకారులు పేర్కొన్నారు. నిజాం హయాంలో 1851 కాలంలోనే వరంగల్ తివాచీలు, జంపఖానాలు ఇంగ్లాండులో జరిగిన వస్త్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 

దీనినిబట్టి ఆనాడే నైపుణ్యమైన వస్తువుల తయారీలో ఎంత ముందంజలో ఉన్నది అర్థమవుతుంది. వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఇంగ్లీష్‌వారి వ్యాపారం వల్ల అప్పటికే హైదరాబాద్ రాజ్యంలో వెలసిన పరిక్షిశమలు 1800 నుంచి 1850 మధ్య కాలంలో క్షీణదశకు చేరుకున్నాయని ఆంధ్రుల సాంఘిక చరివూతలో సురవరం ప్రతాపడ్డి రాశారు. మొత్తంగా నిజాం ప్రభుత్వ హయాంలో ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి కొనసాగింది. హైదరాబాద్ చుట్టూరా తెలంగాణ జిల్లాలో అపారమైన ఖనిజ వనరులున్నాయి.

ఆధునిక భావాలు కలిగిన సాలార్‌జంగ్ ప్రవేశంతో పారిక్షిశామిక ప్రగతి వేగం పుంజుకుంది. నిజాం రాజులు హైదరాబాద్ రాజ్యాన్ని పారిక్షిశామికీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని సర్కారు భాగస్వామ్యంతో అనేక పరిక్షిశమలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పారిక్షిశామిక వేత్తలను ప్రోత్సహించారు.హైదరాబాద్ చుట్టూ పరిక్షిశమల భద్రత కోసం 1912లో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖను ఏర్పాటుచేయగా, అభివృద్ధి కోసం 1918లో రెవెన్యూశాఖ అనుసంధానంతో ప్రత్యేకంగా ఇండవూస్టీస్ అండ్ కామర్స్ విభాగాన్ని నెలకొల్పారు. దీనిని మరింత విస్తృతం చేస్తూ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేశారు. 

ఈ శాఖ 1927 వరకు పరిక్షిశమల స్థాపనకు ఉదారంగా రుణ సదుపాయాలను కల్పించింది. పరిక్షిశమల ఏర్పాటుకు నిజాం రాజు కల్పించిన ప్రోత్సాహకాల ఫలితంగా 1924, 25 నాటికి 507 ఫ్యాక్టరీలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోనే 121 నెలకొన్నాయి. వాటిలో 116 రైస్, ఫ్లోర్, దాల్‌మిల్లులను విద్యుత్ శక్తితో నడిపారు. 1928లో టింబర్ సీజనింగ్ ప్లాంట్‌ను మింట్ వర్క్‌షాప్ స్థలంలో ఏర్పాటుచేశారు. 1928 నాటికే ఎన్నో సర్కారు, ప్రైవేట్ పరిక్షిశమలను స్థాపించారు. పరిక్షిశమలకు రుణాలివ్వడానికి నిజాం ప్రభుత్వం 1929లోకోటి రూపాయలతో ఇండవూస్టీయల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించేది. దీనికోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టర్‌ను నియమించారు. ఫలితంగా చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు వేయి పరిక్షిశమలు హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడ్డాయి. పరిక్షిశమల ఏర్పాటులో అలనాటి ప్రభువర్గంలోని సాలార్‌జంగ్, బాబుఖాన్, లాహోటి, అల్లాద్దీన్, దొరాబ్జీ, చినాయ్, తయాబ్జీ, లాయక్‌అలీ, పన్నాలాల్ పిట్టి కుటుంబాలకు చెందినవారు ప్రభుత్వ రాయితీలు పొంది పరిక్షిశమలను నిర్వహించారు.

సింగరేణితో సిరుల ప్రస్థానం
niZams talangana patrika telangana culture telangana politics telangana cinema
1871లో సింగరేణి బొగ్గు గనులతో మొదలైన భారీపరిక్షిశమల ప్రస్థానం.. స్పిన్నింగ్ మిల్లు, ఫిరంగుల ఫ్యాక్టరీ, గ్లాస్ ఫ్యాక్టరీ, కెమికల్ లాబోరేటరి, ప్రాగాటూల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్, సిగట్, ఆస్‌బెస్టాస్, హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్.. ఇలా అన్ని ఉత్పాదక రంగాలలో కొనసాగింది. పరిక్షిశమల ఉత్పత్తి ద్వారా హైదరాబాద్ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు దాదాపు లక్షనుంచి రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఓల్డ్‌మిల్స్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ 1874లో ఏర్పడింది. ఈ పరిక్షిశమలో 1700 మంది కార్మికులు పనిచేయగా, ఏడాదికి రూ.50 లక్షల ఆదాయంతో మంచి స్థితిలో నడిచింది. హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో 1929లో దివాన్ బహదూర్ రాజగోపాల్ (డీబీఆర్) మిల్స్ ఏర్పరిచారు. 

ఇందులో 1600 మంది కార్మికులు పనిచేసేవారు. ఏడాదికి 72 లక్షల ఆదాయం లభించేది. ఈ కంపెనీకి కోర్సుకాటన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని ప్రొఫెసర్ కే ఎస్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. నిజాం సర్కారు ఉదారంగా రుణాలు ఇవ్వడంకోసం కామర్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడంతో 1927లో రూ.42.6 లక్షల పెట్టుబడితో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏర్పడింది. ఇందులో 400 మంది కార్మికులు పనిచేసేవారు. 

1942లో రూ.62 లక్షల పెట్టుబడితో సనత్‌నగర్ ఏరియాలో హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇందులో మెటల్, స్టీల్ ఫర్నీచర్, బ్యాంకు సేఫ్స్, స్ట్రాంగ్‌రూములు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో అవసరమైన అనేక వస్తువులను ఉత్పత్తి చేశారు. ఈ కంపెనీ దినదినాభివృద్ది చెందుతూ 1964లో రెండు లండన్ కంపెనీలైన పార్క్ రాయల్ వెహికల్స్ లిమిటెడ్, ప్రెస్‌స్టీల్ కంపెనీ లిమిటెడ్‌ల సహాయంతో బస్సుబాడీలు, రిఫ్రిజిరేటర్లు తయారుచేయగలిగింది. దీంతోపాటుగా ఆల్విన్ అసెంబుల్డ్ బస్సులు తయారుచేశారు. ఈ విధానం దేశంలో పశ్చిమబెంగాల్, హైదరాబాద్‌లలో మినహా ఎక్కడా లేదు. భారత ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్‌లను కూడా ఆల్విన్ ఉత్పత్తి చేసింది.

వేల కుటుంబాలకు ఉపాధి వనరులు
వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్‌టీ) లిమిటెడ్ కంపెనీని చార్మినార్ లేబుల్‌తో 1919లో కోటి రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఈ కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడింది. అలాగే గోల్కొండ లేబుల్‌తో హైదరాబాద్ దక్కన్ సిగట్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటైంది. సిగట్ల ఉత్పత్తితో ఈ రెండు అగ్రగామి సంస్థలుగా వెలుగొందాయి. 1943లో జూబిలి సిగట్ కంపెనీని స్థాపించారు. ఈ సిగట్ కంపెనీలలో వర్జీనియా పొగాకును సిగట్లకు, మిగతా పొగాకును బీడీలు చేసేందుకు వాడేవారు. 

1916లో దక్కన్ బటన్ పరిక్షిశమ ఏర్పడింది. అప్పట్లో బనియన్లు, డ్రాయర్లు ఉత్పత్తి చేసే పరిక్షిశమను కూడా ఏర్పాటుచేశారు. ద ఇండియన్ హ్యూం పైప్ కంపెనీ లిమిటెడ్‌ను ఆజామాబాద్‌లో 1933లో ఆరు అదనపు శాఖలతో ప్రారంభించారు. సనత్‌నగర్‌లో ద హైదరాబాద్ ఆస్బెస్టాస్ లిమిటెడ్ సంస్థ 22 లక్షల పెట్టుబడితో 500 మంది కార్మికులతో ఏర్పడింది. సనత్‌నగర్ పారిక్షిశామికవాడలోనే 1947లో బెక్‌లైట్ లిమిటెడ్ లండన్ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌లో హైదరాబాద్ లామినేటెడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 

1942లో ఆధునిక అమెరికా మిషన్లతో రూ.42 లక్షల పెట్టుబడితో ద బయో కెమికల్ అండ్ సింథటిక్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇదే ఏడాదిలో రూ.40 లక్షల పెట్టుబడితో 32 ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. 1946లో ఒకేసారి వంద ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. వీటిల్లో 10 వేల మంది కార్మికులు పనిచేసేవారు.

పెట్టుబడులకు ప్రభుత్వ ధీమా
నిజాం ప్రభుత్వం ఇతర పారిక్షిశామికవేత్తలకు భరోసా ఇచ్చే విధంగా, కార్మికులకు రక్షణగా నిలిచే పద్ధతిలో భారీ సంస్థలలో 51 శాతం మేర తన పెట్టుబడులు పెట్టేది. ఆ రకంగానే పలు కంపెనీలను ఏర్పాటుచేసింది. దీంతో అనేక కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా పనిచేశాయి. ఫలితంగా నిజాం ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం రావడంతోపాటు లక్ష మందికి ఉపాధి లభించింది.

బహుజన పరిక్షిశమలు
హైదరాబాద్ సంస్థానంలో మొదట్లో చేతివృత్తుల పరిక్షిశమలదే పైచేయి. వీటిల్లో బహుజన కులాలకు చెందినవారే ఎక్కువగా పనిచేసేవారు. పలు రకాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా కూనసమువూదము, దిదరుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాద్‌లలో ఇనుమును కరిగించి వస్తువులు తయారుచేసేవారు. 

నిర్మల్ వద్ద శ్రేష్టమైన ఉక్కును తయారుచేసేవారు. ఎల్లందల్, ఇబ్రహీంపట్నం, కోనాపూరు, చింతలపేట తదితర స్థలాల్లో మంచి ఉక్కు తయారయ్యేది. 1890వరకు హైదరాబాద్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లలో విరివిగా కత్తులు తయారుచేసేవారు. ఖమ్మం జిల్లాలోని జగదేవపూరులో బంగారు నీరు పోసిన కత్తులు తయారుచేసేవారు. గద్వాలలో తుపాకులు తయారయ్యేవి. రోహిలాలు పట్టే పెద్ద తుపాకులను వనపర్తి, గద్వాల, నిర్మల్‌లో చేసేవారు. నూలు, పట్టు కలిపిన మష్రూ బట్టలను హైదరాబాద్‌తోపాటు కరీంనగర్ జిల్లాలోని మాధాపురంలో నేసేవారు. నిజామాబాద్ జిల్లా ఇందూరు, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లోని కోయిలకొండలో కాగితాన్ని ఉత్పత్తి చేసేవారు. ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికే సంపదతో స్థానిక బహుజన ప్రజలు తయారుచేసేవారు. ఈ విధంగా గ్రామాలలో ఈ పరిక్షిశమలన్నీ చేతి వృత్తుల వారికి జీవనోపాధి కలిగించేవి. కాలక్షికమంలో చేతి వృత్తుల పరిక్షిశమ క్షీణించింది. యూరప్ ప్రభావంతో నిజాం కాలంలో భారీ పరిక్షిశమలు వచ్చాయి.


నిజాం హయాంలో తెలంగాణలో ఏర్పడిన కొన్ని పరిక్షిశమలు:
1871               సింగరేణి బొగ్గు గనులు
1873               మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876               ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910               సోడా, ఐరన్ ఫ్యాక్టరీలు
1916               దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919               వీఎస్‌టీ ఫ్యాక్టరీ
1921               కెమికల్ లాబోరేటరీ
1927               దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929               డీబీఆర్ మిల్స్
1931               వరంగల్ అజంజాహి మిల్స్
1932               ఆర్‌టీసీ స్థాపన
1937               నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939               సిర్పూర్ పేపర్ మిల్
1941               గోల్కొండ సిగట్ ఫ్యాక్టరీ
1942               హైదరాబాద్ స్టేట్ బ్యాంక్,  హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ 1943 ప్రాగా టూల్స్
1946               హైదరాబాద్ ఆస్‌బెస్టాస్
1947               హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్ట్


ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతి
నిజాం కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో పరిక్షిశమలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన పరిక్షిశమలు ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. టెక్స్‌టైల్స్ రంగం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆనాడు డిఫెన్స్ పరికరాలు తయారుచేయడంలో ప్రాగా టూల్స్ కీలక పాత్ర వహించింది. చెరుకు పంటకు హైదరాబాద్ సంస్థానం కీలకం కావడంతో నిజాంషుగర్స్‌ను ఏర్పాటు చేసి 39 ఫ్యాక్టరీలను నెలకొల్పారు. తెలంగాణతోపాటు కర్ణాటకలోని రెండు జిల్లాలకు, మరట్వాడలోని 3 జిల్లాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది.
- బాల్‌డ్డి, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్


తెలంగాణలో భారీగా ఖనిజ సంపద ఉన్నట్లు క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం 1వ శతాబ్దం మధ్యనే గుర్తించినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 14 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్‌తో కత్తులు, తల్వార్లు తయారుచేసేవారు. అరబ్బు చక్రవర్తులు ఈ తల్వార్లను దిగుమతి చేసుకున్నారు. నిజాం రాజు అజాంజాహి కాలంలో మోడరన్ ఇండవూస్టీలు వచ్చాయి. 1956కన్నా ముందు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం పారిక్షిశామికంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. నిజాం సర్కారు పరిక్షిశమలు ప్రతి జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 1910 నుంచి 1940 వరకు పరిక్షిశమల అభివృద్ధి వేగంగా జరిగింది.
- ఎన్.వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్


కుత్‌బ్‌షాహిల కాలంలోనే గోల్కొండ డైమండ్ మైనింగ్ కంపెనీ మణికొండలో 60వేల మంది కార్మికులతో పనిచేసేది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన తావర్నీయర్, డాక్టర్ డెర్నియర్‌లు తమ రచనలో తెలిపారు. పారిక్షిశామికీకరణలో ఎంత ముందున్నామో తెలిపేందుకు ఈ ఒక్క సంఘటన చాలు. నిజాం రాజు పరిక్షిశమల కోసమే సనత్‌నగర్‌ను నెలకొల్పారు. ఆనాడు పరిక్షిశమల అభివృద్ధి కారణంగా తెలంగాణలోనే ఎనిమిది విమానాక్షిశయాలు ఏర్పాటయ్యాయి. చ్నై, విజయవాడల కంటే ముందుగానే హైదరాబాద్‌కు ప్రత్యేక రైల్వే వ్యవస్థ ఉన్నది. 1910లోనే థర్మల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు అయింది. 150 ఏళ్ల నుంచే బొగ్గు ఉత్పత్తి మొదలైంది. చేనేత రంగంలో నిపుణులైన కార్మికులు ఒక్క తెలంగాణలోనే ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి నిపుణులైన కార్మికులను బొంబాయి, బీవండిలకు తీసుకెళ్లేవాళ్లు.

ఎన్ని రకాల పరిక్షిశమలో..
నిజాం కాలంలో పలు రకాల పరిక్షిశమలు విస్తరించాయి. టెక్స్‌టైల్స్, మింట్, ఇంజనీరింగ్, రైల్వేస్, వాటర్ పంపింగ్ స్టేషన్, విద్యుత్, బ్రీవరేజెస్, ప్రింటింగ్, సబ్బులు, ఉండ్ అండ్ కార్పెంటరీ, జైలుఫ్యాక్టరీ, ఇండవూస్టియల్ స్కూల్స్.. ఇలా రకరకాల పరిక్షిశమలు అప్పటి అవసరాలకు, ప్రగతికి ప్రతీకలుగా నిలిచాయి. అవన్నీ ప్రభుత్వం రంగంలో ఏర్పడిన పరిక్షిశమలు కావడం గమనార్హం.

ప్రైవేట్ యాజమాన్యంలోనూ అదే స్థాయిలో టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, మెటల్స్, ఫుడ్ డ్రింక్ అండ్ టొబాకో, ఉడ్ అండ్ గ్లాస్, కెమికల్ అండ్ డ్రగ్స్ తదితర పరిక్షిశమలు వచ్చాయి. 1932లో ఆరులక్షల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ ఏర్పడింది. 1943లో రూ. తొమ్మిది లక్షల పెట్టుబడితో హైదరాబాద్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించారు. 1943లోనే హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీలు రెండో ప్రపంచ యుద్ధానికి కావాల్సినంతగా ఉత్పత్తి చేసి, ఆర్థికంగా బలపడ్డాయి.
- పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు

Continue Read 2 Part click this link






Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP