Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label CM. Show all posts
Showing posts with label CM. Show all posts

Wednesday, February 8, 2012

5వ కేటగిరీ లోనూ.. కేసలు ఎత్తేయండి



CM talangana patrika telangana culture telangana politics telangana cinema -అవసరమైన చర్యలు చేపట్టండి
-మిగతా కేసులనూ ఎత్తేయండి
-ఉద్యమ కేసులపై సీఎం కిరణ్ కీలక నిర్ణయం
-సీఎస్, డీజీపీలతో ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 ():తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో కేటగిరీలోతీవూవమైన నేరారోపణ కింద నమోదు చేసిన 140 కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మిగతా కేటగిరీల్లో ఇంకా మిగిలి ఉన్న 306 కేసులను కూడా ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. 

ముఖ్యంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి వారిపై కేసుల ఉపసంహరణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదో కేటగిరీ కేసుల ఉపసంహరణ విషయంలో తానేమీ చేయలేనని హోంమంత్రి సబితాఇంవూదాడ్డి కూడా చేతుపూత్తేసిన నేపథ్యంలో.. ఈ కేసులపై సీఎం జారీ చేసిన ఆదేశాలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఉపశమనం కలిగించనున్నాయి. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, డీజీపీ దినేశ్‌డ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నవంబర్ 11, 2009- అక్టోబర్ 15, 2010 మధ్య కాలంలో 1,44 కేసులు నమోదయ్యాయని, వీటిని ఐదు కేటగిరీలుగా విభజించామని సీఎంకు అధికారులు వివరించారు.

మొదటి కేటగిరీలోని 565 కేసుల్లో ఇప్పటికే 399 కేసులను జీవోలు జారీ చేయటం ద్వారా ఉపసంహరించామని, మరో 166 కేసులను పోలీసుల దర్యాప్తు స్థాయిలోనే ఎత్తివేసినట్టు తెలిపారు. ఇక, కేటగిరీ 2, 3, 4ల్లోని 247 కేసుల్లో 169 కేసులను ఎత్తివేశామని, మరో 306 కేసులు ఎత్తివేయాల్సి ఉందని వివరించారు.

 By: T News

Read more...

Wednesday, December 28, 2011

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

Monday, December 26, 2011

మహిళా కమిషన్ చైర్మన్‌గా జయసుధ?

- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?


jaya-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్‌కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్‌లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్‌కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్‌కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Take By: T News

Read more...

Sunday, December 25, 2011

కిరణ్‌కు కొత్త టీం!

- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.

.
1-(6)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.

ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.

కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.

తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.

ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.

ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.

Take By: T News  

Read more...

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

Read more...

Monday, December 19, 2011

చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!

- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Chiranjivi-12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Take By: T News

Read more...

Sunday, December 18, 2011

మరో 1200 మంది నోటరీల నియామకం

హైదరాబాద్, డిసెంబర్ 17 (: రాష్ట్రంలో మరో 1200 మంది నోటరీలను నియమించాలని స్టాంప్స్ అండ్ రిజివూస్టేషన్స్ శాఖ నిర్ణయించింది. గతంలో రాష్ట్రం మొత్తం మీద సుమారు 700 మంది మాత్రమే నోటరీలు ఉండేవారు. దీనివల్ల తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవలే 1200 మంది నోటరీలను నియమించింది. ఇప్పుడు కొత్తగా మరో 1200 మందిని నియమించేందుకు రూపొందించిన ఫైలుపై సంబంధిత శాఖ మంత్రి సంతకం కూడా చేశారు. ప్రజలకు ఎక్కువ మంది అందుబాటులో ఉండేందుకు త్వరలో మరికొన్ని నియామకాలు చేపట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో మూడు వేలకుపైగా నోటరీలు ప్రజలకు అందుబాటులోకి రానున్నారు.

Read more...

తెలంగాణ ఉద్యోగులపై సర్కారు కుట్ర

- సమ్మెను సక్సెస్ చేసినందుకు కక్షసాధింపు
- ఒప్పందానికి విరుద్ధంగా 240 జీవో జారీ
- 3 నుంచి 4 వేల మందికి పెన్షన్ల నిలిపివేత
- వేలాదిగా ఆగిపోతున్న పదోన్నతులు
- అసలు విషయం తేల్చని సర్కారు
- చోద్యం చూస్తున్న తెలంగాణ మంత్రులు


One105-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్,: తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ఇచ్చిన హామీలపై మాట తప్పింది. సమ్మె తర్వాత సర్కారు జారీ చేసిన 240 జీవో పుణ్యమాని వేలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ద్వంద్వ వైఖరి కారణంగా తెలంగాణలో సుమారు 45వేల పైచిలుకు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. నాలుగైదు వేల మందికి పెన్షన్లు అగిపోయాయి. ఆర్హత ఉన్నా పదోన్నతులు అందకుండా పోతున్నాయి. జీవోను సవరించి ఇచ్చిన మాట నిలుపుకోవాలని.. ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించాలని పలుమార్లు సంఘాల నేతలు కోరుతున్నా సర్కారు స్పందించడం లేదు.

ప్రభుత్వ దమననీతితో పది జిల్లాల్లోని వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తి, రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణ ఉద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగే ప్రమాదముంది. టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

ఒప్పందం వేరు.. ఇచ్చిన జీవో వేరు
తెలంగాణ సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 13 నుంచి ఆక్టోబర్ 24వరకు 42 రోజుల పాటు నిర్విరామంగా సాగిన సకల జనుల సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా 42 రోజుల సమ్మెకాలాన్ని ఆర్ధ వేతన సెలవుగా పరిగణించి మంజూరు చేస్తామని లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఉద్యోగ సంఘాలు ఆయిష్టంగానే సమ్మతించాయి. సర్వీస్ బ్రేక్ కాకుండా ఉండటం, పెన్షన్, ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ప్రతిబంధకాలు ఉండవన్న ఒకే ఒక కారణంతో ఉద్యోగ సంఘాల జేఏసీలు దీనికి అంగీకారం తెలిపాయి. అయినా ప్రభుత్వం ఇక్కడా మోసమే చేసింది.

లిఖిత పూర్వక ఒప్పందం ప్రకారం జీవోలు జారీ కావాల్సి ఉన్నా.. అసలు విషయాన్ని పక్కన పెట్టింది. ఒప్పందానికి సంబంధించి 28-10-2011న జీవోనంబర్ 240 విడుదలచేసింది. జీవోలో ఎక్కడా ‘అర్ధవేతన సెలవు’ అంశాన్ని పొందుపరచలేదు. ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

అగిన ఇంక్రిమెంట్లు.. నిలిచిపోతున్న పెన్షన్లు
42 రోజుల సమ్మెకాలాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో తెలంగాణ ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంక్రిమెంట్లు, పెన్షన్ల మంజూరు, పదోన్నతులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏడాదికోమారు వార్షిక ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఏడాది పూర్తికాగానే ఉద్యోగి ఖాతాలో అటోమెటిక్‌గా ఇంక్రిమెంట్ కలుపుతారు. ఈ లెక్కన తెలంగాణ జిల్లాల్లో సుమారు ప్రతి నెలా సుమారు 10 నుంచి 15వేల మందికి ఇంక్రిమెంట్ కలుస్తుంది. సమ్మె కాలాన్ని సర్కారు తేల్చకపోవడంతో అక్టోబర్1, నవంబర్ 1, డిసెంబర్ 1న కలువాల్సిన ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోనే 6,200 పైచిలుకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. పది జిల్లాల్లో సుమారు 45వేల పైచిలుకు ఇంక్రిమెంట్లు ఆగిపోయినట్లు సమాచారం.

ప్రతి నెలలో తెలంగాణలోని ఒక్కో జిల్లాలో 100 నుంచి 120 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి పెన్షన్ మంజూరు చేసి డబ్బుల కోసం అకౌటెంట్ జనరల్ కార్యాలయానికి ఫైల్ పంపిచాలి. కానీ ఇక్కడ కూడా 42 రోజుల సమ్మె కాలాన్ని ఎటూ తేల్చకపోవడంతో 42 రో జులను సర్వీసులో ఎలా తీసుకోవాలో తెలియక ఫైళ్లను పెడింగ్‌లో పెడుతున్నారు. దీం తో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3 నుంచి 4వేల పైచిలుకు ఉద్యోగుల పెన్షన్ల మం జూరు నిలిచిపోయింది. బాధిత ఉద్యోగులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నా ప్రభుత్వం నుంచి ఎటుంటి స్పష్టత రాలేదని ఉద్యోగులుచెబుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో అన్ని శాఖల్లోనూ నెలవారీ పదోన్నతులు ఉంటాయి. అవి కూడానిలిచిపోయాయి. మొత్తంగా వేలాదిగా పదోన్నతులు నిలిచిపోతున్నాయి.

రాష్ట స్థాయి కేడర్‌లో అన్యాయం జరిగే ప్రమాదం
ప్రధానంగా ఎంపీడీవో, ఎంఆర్‌ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ హోదా గల పోస్టులను రాష్ట కేడర్‌గా గుర్తిస్తారు. ఈ విషయంలో సర్వీస్ ఒకే రకంగా ఉన్నా సమ్మెకాలం తేలకపోతే, ఆంధ్రా ఉద్యోగులు ముందకు దూసుకెళ్తారు. తెలంగాణ ఉద్యోగులు వెనుకపడే ప్రమా దం పొంచి ఉంది. తద్వారా ఉన్నత పదవుల పదోన్నతుల్లో భారీగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనుంది. సమ్మెకాలానికి సరిపోయేలా సెలవుల్లో పనిచేయాలని ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందనే విమర్శలు వెల్లు టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

మంత్రులు స్పందిస్తేనే సమస్యకు మోక్షం
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేల్చిచెప్పకపోతే మున్ముందు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అస్కారం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసేలా ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు ఒత్తిడి తేవాలని పలువురు కోరుతున్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP