Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Chiru. Show all posts
Showing posts with label Chiru. Show all posts

Sunday, March 17, 2013

‘తుఫాన్’గా వస్తున్న ‘జంజీర్’!


ramcharanరామ్‌చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘జంజీర్’.

 అమితాబ్‌బచ్చన్ కథానాయకుడిగా 1973లో విడుదలైన హిట్ సినిమా ‘జంజీర్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అపూర్వలాఖియా దర్శకుడు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తోంది. 

అపూర్వలాఖియా, అమిత్ మెహ్రా నిర్మాతలు. ప్రాణ్ పోషించిన షేర్‌ఖాన్ పాత్రను ఈ తాజా రీమేక్‌లో సంజయ్‌దత్ పోషిస్తుండగా..తెలుగు వెర్షన్‌లో అదే పాత్రను హీరో శ్రీహరి పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. హిందీలో ‘జంజీర్’గా విడుదల కానున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మెరుపు, ‘జ్వాల’ అనే పేర్లు పరిశీలిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

 అయితే తాజాగా ఈ చిత్రానికి ‘తూఫాన్’ అనే పేరుని ఖరారు చేశామని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలుగు వెర్షన్‌కు ‘చింతకాలయరవి’ ఫేమ్ యోగి దర్శకత్వ పర్య వేక్షణ చేస్తున్నాడు.

 ఈ చిత్ర ప్రచార చిత్రాలను రామ్‌చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 27న విడుదల చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం.

Read more...

Monday, October 29, 2012

Tourism Ministry - Chinranjeevi Images



Read more...

Thursday, October 25, 2012

చిరుకు టూరిజం


chiru
కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం.. రాష్ట్రానికి మొత్తం రెండు పదవులు
వీలు చిక్కితే మరోటి వచ్చే చాన్స్.. ఉన్నవారిలో కొందరికి ప్రమోషన్?
నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. సీమాంధ్ర కోటాలో చిరంజీవి.. తెలంగాణ నుంచి రేసులో వీహెచ్, సర్వే, అంజన్ లాబీయింగ్‌లో కావూరి, కోట్ల.. మంత్రి పదవులపై రాష్ట్ర ఎంపీల ఆశలు

హైదరాబాద్, అక్టోబర్ 23 ():కష్టకాలంలో పార్టీని విలీనం చేసి ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవి త్యాగానికి గుర్తింపు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి బెర్తు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరొకరికి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తుది కూర్పులో వీలు చిక్కితే ఆంధ్రవూపదేశ్‌కు మరో బెర్తు లభించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న కొందరికి ప్రమోషన్‌లు కూడా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఖాయంగా కనిపిస్తున్న రెండు బెర్తుల్లో ఒకటి చిరంజీవికి పోను.. మిగిలినది తెలంగాణ ప్రాంతానికి దక్కుతుందని అంటున్నారు. ఈ స్థానం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత వీ హన్మంతరావు, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చాలా కాలం నుంచి కేంద్ర కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి సైతం వారి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నెలాఖరులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తథ్యమని మస్తిన నుంచి బలమైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పదవులపై రాష్ట్ర ఎంపీలు ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్నది రెండు ఖాళీలకే అయినా ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మూడో మంత్రిని కూడా రాష్ట్రం నుంచి తీసుకోవాలని భావించిన పక్షంలో రాయలసీమ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అదృష్టం లేక పోలేదంటున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం జరిపిన ఢిల్లీ పర్యటనలో సైతం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకునే వారి పేర్లపై పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా వేడుకలు ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం నుంచి హస్తినకు చేరుకోగానే కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ
వర్గాల సమాచారం.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ జైపాల్‌డ్డి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేబినెట్ మంత్రులుగా, పళ్లం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి సహాయ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్‌డ్డి ఒకరే కేబినెట్‌లో ఉండగా మిగతా నలుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. వీరిలో పళ్ళం రాజు, పురంధేశ్వరిలలో ఒకరికి ప్రమోషన్ ఖాయమని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలను అందించిన ఆంధ్రవూపదేశ్ నుంచి కేంద్రంలో కేవలం ఐదుగురు మంత్రులే ప్రాతినిధ్యం వహించడం, వారిలో ఇద్దరు మాత్రమే కేబినెట్ హోదా కలిగి ఉండటం కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

సీమాంధ్ర కోటాలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కచ్చితంగా ఉంటారని, మరో పదవిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉందని పీసీసీ అగ్రనేత ఒకరు స్పష్టం చేశారు. జగన్ దెబ్బతో కష్టాల్లో పడిన కిరణ్ ప్రభుత్వాన్ని ఆదుకుని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గించడమే కాకుండా, ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆపద్భాంధవుడిలా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి నేనున్నాంటూ అభయమిచ్చినందుకు ప్రతిఫలంగా పూర్వ పీఆర్పీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలనే పట్టుదలతో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పీఆర్పీ విలీనం సమయంలోనే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన అభయాల మేరకు ఆయన్ని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని అంటారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో అవకాశం కల్పిస్తారని ఈ ఏడాది మార్చ్ నుంచి కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ప్రధాని తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ చిరుకు అవకాశం లభించ లేదు. అయితే కేంద్ర కేబినెట్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు ఇటీవల రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, వివిధ కారణాల రీత్యా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం, మరో కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృతి చెందడం, మరికొందరు అదనపు బాధ్యతల్లో కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఈసారి ఎక్కువ మందినే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా, ముగ్గురిని ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి పర్యాటక శాఖ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన్ని అందుబాటులో ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు!
తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు, మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింవూదాబాద్ ఎంపీ ఎం అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. వీహెచ్ మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్, సోనియా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. చిరంజీవికి మంత్రిపదవి ఇచ్చిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌ను కేంద్రంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే చిరంజీవి సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, తెలంగాణ ప్రాంతం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వీహెచ్ సీనియారిటీ కూడా కేంద్ర మంత్రి పదవికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మంగళవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ పరిస్థితులు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని కూడా వీహెచ్ ఈ సందర్భంగా అధినేవూతికి విన్నవించినట్లు తెలిసింది.

వీహెచ్ కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆయన కూడా పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి, హైకమాండ్ గీసిన గీత దాటని నేతగా ముద్రపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి మంత్రిగా ఉన్నందున, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. హైకమాండ్‌తో సఖ్యతగా మెలుగుతూ, తెలంగాణ కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమా బాట పట్టినా సర్వే సత్యనారాయణ కలిసిరాలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రిపదవిపై ఆయన ఆశపెట్టుకోవటమే దీనికి కారణమనే వాదన ఉంది. వీరిద్దరు కాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు, తెలంగాణలో తమకు నమ్మినబంటుగా ఉంటాడనే సమీకరణలతో అంజన్‌ను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా ముగ్గురికి అవకాశం కల్పించే పరిస్థితి వస్తే సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు (ఆంధ్ర), కోట్ల సూర్యవూపకాష్‌డ్డి (రాయలసీమ)లలో ఒకరికి చాన్స్ ఉంటుందంటున్నారు. కావూరి చాలా కాలంగా కేంద్రంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన్ని తీసుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో కనిపించారు. అంతే కాకుండా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగినప్పుడు.. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం సమంజసం కాదని చిరంజీవిని ఉద్దేశించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా రాయలసీమ నుంచి గతంలో కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న సాయివూపతాప్ రాజీనామా అనంతరం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

ఈ లోటును పూడ్చడానికి కర్నూలు నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన కోట్ల సూర్యవూపకాష్‌డ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్యవూపకాష్‌డ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌డ్డి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి విస్తరణలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

- T News

Read more...

Sunday, September 2, 2012

Baba Sehgal Pavan kalyan Power Song

Pawa pawa pawa Pawan Kalyan, pawa pawa pawa Pawan Kalyan”… 

This is the hook line of the power song, an exclusive tribute to the power star 'Pawan Kalyan', from his most ardent and self declared fan Baba Sehgal.

 
Inspired by what his fans call ‘Pawanism’, Baba Sehgal dedicates the ‘Power Song’ to the millions of Pawan Kalyan fans. Telugu film audiences love the power star for his humility and positive energy and admittedly, the lyrics of the song are based on the charisma and ideologies of the matinee idol.

Lucknow-born Baba Sehgal, one of indipop’s highest selling artiste, ruled the 90s with his brand of pop-rap. He also acted in a few films and popular TV shows. He has produced over 22 music albums after the success of his hit first album ‘Thanda Thanda Pani’. Baba Sehgal writes, composes and sings for his albums. He is also referred to as the ‘King of Rap’ in India.
His foray into Telugu playback began with the song Chik Chik Chiklette for Chiranjeevi starrer ‘Rikshavadu’. As a playback singer in south Indian films, especially Telugu, Tamil and Kannada, Baba has sung over 90 songs for all the major stars in the south. Some of the instant hits in Telugu include Jalsa, Aarya 2, Adhurs, Don Seenu, Singham and Gabbar Singh. His most recent hit, the title song of Gabbar Singh has became one of his most popular songs.

After the success of the Gabbar Singh title song, Baba Sehgal fans have lovingly labeled him as the power singer. Baba celebrates a golden period of his film songs in south Indian cinema, and the Power Song is his way of sharing his gratitude to all his music lovers. “Like for me, Pawan Kalyan has been an inspiration to many of his fans, and on the eve of his birthday, it is my pleasure to dedicate this song to the Power Star,” says Baba.
The first look of the POWER SONG will be releasing on all major channels, radio stations and be available as callertunes from the 2nd of September.

 

Read more...

Friday, June 29, 2012

తిక్కా .లెక్కా ..అన్నీ కుదిరాయి..!


gabbarsing 

ఓ హీరోతో సినిమా తెరకె క్కించాలంటే ఆ దర్శకుడు పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. ఆ హీరోని అభిమానిస్తూ.. ఆ హీరో అభిమాని అయితే చాలు’ ఇది ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో చిరంజీవి అన్న మాటలు.. సరిగ్గా అదే అభిమానాన్ని గుండెల్లో దాచుకొని ‘గబ్బర్‌సింగ్’ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు హరీష్ శంకర్. గత పది సంవత్సరాల నుంచి సరైన విజయం లేక, విజయ దాహం తీరక ఎదురుచూస్తున్న పవన్‌కు, ఆయన అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాలనుకున్న ఈ యువ దర్శకుడికి తోడుగా నిలిచాడు నిర్మాత బండ్ల గణేష్. పవన్ నాకు ఓ వ్యసనం అంటూ తన అభిమానాన్ని వెల్లడించిన ఈ నిర్మాత పవన్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు తన సినిమానే కరెక్ట్ అనుకున్నాడు. 

అందుకే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొంది ఘన విజయం సాధించిన ‘దబాంగ్’ను పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’ పేరిట నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా రీమేక్ చేశాడు. పవన్ అంటే ప్రాణం ఇచ్చే దర్శకుడు, నిర్మాత కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలించిందో తెలుసుకుందాం..!

కథ: కొండవీడు గ్రామంలో నివసించే ఓ రైస్‌మిల్ యజమాని (నాగినీడు) తన భార్య మరణంతో, భర్త మరణించి కొడుకు ఉన్న ఓ మహిళని (సుహాసిని) పెళ్ళి చేసుకుంటాడు. ఆమె కొడుకే వెంకటరత్నం నాయుడు (పవన్ కళ్యాణ్), మొదట్నుంచీ సవతి తండ్రి వివక్షని తట్టుకోలేక చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి హాస్టల్‌లో వుండి చదువుకొని తన ఊరికే పోలీస్ అధికారిగా తిరిగి వస్తాడు వెంకటరత్నం నాయుడు. ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్రధారి అయిన ‘గబ్బర్‌సింగ్’ను ఆరాధించే వెంకటరత్నం నాయుడు తన పేరును ‘గబ్బర్‌సింగ్’గా మార్చుకుంటాడు. అంతేకాదు పోలీస్ అధికారిగా తనదైన ‘తిక్క’తో తనకున్న లెక్కతో పనిచేస్తుంటాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ను గబ్బర్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌గా పేరు మార్చేస్తాడు. ఇక అదే గ్రామంలో పేరుమోసిన రౌడీషిటర్ సిద్ధప్ప నాయుడు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంటాడు గబ్బర్‌సింగ్. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ దానికోసం సిద్దప్ప నాయుడు చేసే దుశ్చర్యలను అడ్డుకుంటుంటాడు. ఇక గబ్బర్‌సింగ్‌ను అడ్డుతొలగించాలని సిద్ధప్ప నాయుడు వేసే ప్లాన్స్‌ను తిప్పికొట్టి తన శైలిలో రెచ్చిపోతుంటాడు గబ్బర్‌సింగ్. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మీ (శ్రుతిహాసన్)తో ప్రేమలో పడతాడు..! ఇక అడుగడుగునా తన ఆధిపత్యానికి అడ్డంకిగా తయారైన గబ్బర్‌సింగ్‌ను సిద్ధప్ప ఏం చేశాడు? భాగ్యలక్ష్మితో అతని ప్రేమ ఫలించిందా..? గబ్బర్‌సింగ్ సిద్ధప్పకు ఎలా బుద్ధి చెప్పాడు? అతని ఆగడాల నుంచి కొండవీడు ప్రజలను ఎలా రక్షించాడు? అనేది మిగిలిన కథాంశం.

‘ఖుషీ’ తర్వాత పవన్ ఫుల్ జోష్‌తో నటించిన సినిమా ఇది. అతని నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెంటిమెంట్, వినోదం, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో నటించాడు. పవన్ స్టయిల్, గెటప్, నడకతీరు చూసి ఇక అభిమానులైతే థియేటర్స్‌లో పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత డాన్స్ మూమెంట్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు పవన్‌కళ్యాణ్. శృతిహాసన్ నటనలో ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్న హీరోయిన్‌గా కనిపించింది. నాగినీడు, సుహాసిని తమ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయారు. పవన్ తర్వాత ఈ సినిమాకు ప్రాణం పెట్టింది మాత్రం దర్శకుడు హరీష్‌శంకర్ అని చెప్పుకోవాలి. పవన్‌కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ హీరో పవన్‌ను ఎలా చూపిస్తే అభిమానులు ఖుషీ అవుతారో అచ్చంగా అలాగే చూపించాడు. 

ముఖ్యంగా ఆయన రాసిన సంభాషణలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’ ‘ట్రెండ్‌ని ఫాలో అవను, ట్రెండ్‌ను సెట్ చేస్తా’ వంటి సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ‘పాపులారిటీదేముంది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, నేను ఆకాశం లాంటి వాడ్ని, నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ అనే సంభాషణలు పవన్ నోట పలుకుతుంటే అభిమానులు థియేటర్స్‌లో క్లాప్స్ కొడుతున్నారు. ఈ సంభాషణలే మున్ముందు ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేస్తాయి. ఈ చిత్రానికి వున్న మరో బలం దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం.

 సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్‌హిట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే పాటలను విజువల్‌గా మరింత బాగా తీసుంటే బాగుండనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం డీసెంట్‌గా వుంది. ఓవరాల్‌గా గబ్బర్‌సింగ్ పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. సమ్మర్ సీజన్ కావడంతో ఇక ‘గబ్బర్‌సింగ్’కు వసూళ్లకు అడ్డు వుండదని చెప్పొచ్చు.

Read more...

Thursday, June 28, 2012

సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి


Chieee talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం

న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.

ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.

దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.

‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.

అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
4200 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.

Take By: T News

Read more...

Monday, June 25, 2012

సోనియాతో నేడు చిరు భేటీ


-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!

హైదరాబాద్, ():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు. కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్ సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్ కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read more...

Friday, January 20, 2012

నెరవేరిన చిరు కోరిక

- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన

55505-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.

కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.

వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..

Take By: T News

Read more...

Wednesday, January 18, 2012

గెలుపు ఎవరిది? (Who is Win)

ఆజాద్‌తో కిరణ్ సుదీర్ఘ భేటీ
మంత్రుల జాబితాపై చర్చ?
శాఖలపైనా మంతనాలు!

సీఎం మాటను మన్నించిన ఆజాద్?
పునర్వ్యవస్థీకరణకు ఓకే
బొత్సను తప్పించే అవకాశం
ముందే బొత్సతో మాట్లాడిన ఆజాద్
నేనుంటేనే పార్టీకి మంచిది
ఆజాద్ ముందు బొత్స వాదన
సమన్వయ కమిటీలో ఉన్నారుగా..
నచ్చజెప్పిన రాష్ట్ర ఇన్‌చార్జ్
సీఆర్‌తో మొదలైన కిరికిరి

ఆయనపై సీఎం విముఖత?


పూర్తి ప్రక్షాళనతో సొంత టీమ్ కోసం కిరణ్
మార్పులకు బ్రేక్ కోసం బొత్స ఫైట్
హస్తినాపురంలో జోడెద్దుల మంతనాలు

కేబినెట్‌లో మాకూ చోటివ్వండి... సీనియర్ ఎమ్మెల్సీల డిమాండ్
తెరపైకి వచ్చిన తెలంగాణ ఖాళీలు
రెండు డిమాండ్ల వెనుక సీఎం?

Kiran205-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 17 (): విస్తరణ రాజకీయం హస్తినకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఎడతెగని చర్చల్లో మునిగిపోయింది. మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి తనకంటూ ఒక జట్టును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి... కొందరు సీనియర్లకు ఉద్వాసన పలికి, కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రాంతాల మధ్య సమతుల్యం సాధించాలి.. ఇది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి యోచన! పార్టీని, ప్రభుత్వాన్ని ఆపత్కాలంలో ఆదుకున్న చిరు బ్యాచ్‌కు తక్షణమే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి.. ఇతర మంత్రుల శాఖలను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చరాదు.. ఇది పీసీసీ చీఫ్ మనోగతం! ఇద్దరు నేతలూ రెండు వాదాలతో ఢిల్లీలో అడుగుపెట్టడంతో కాంగ్రెస్‌లో సమస్యల కొలిమి మరోసారి రాజుకున్నట్లయింది. దీనికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న సీ రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండటంతో మేమే తక్కువా? అంటూ ఎమ్మెల్సీలు సైతం తిరగబడుతుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పునర్వ్యవస్థీకరణే జరిగితే తెలంగాణ కోటాలో ఏర్పడిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజాగా మంత్రి పదవుల డిమాండ్‌ను లేవనెత్తడం దీనికి నిదర్శనం.

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. విమానాక్షిశయం నుంచి నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాను పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నదీ ఆయనకు మరోసారి వివరించారు. ప్రధానంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు శాఖల కేటాయింపుపై వారిరువురూ సుదీర్ఘంగా చ ర్చించారని తెలిసింది. సీఎం తెచ్చిన కొత్త మంత్రుల జా బితా, వారి కేటాయించాలనుకుంటున్న శాఖలపై ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నందున ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొని, పాలనాపరంగా మరింత దూకుడుగా వ్యవహరించగలిగే కొంతమంది మంత్రులు కావాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. సుమారు గంటన్నరకు పైగా జరిగిన భేటీలో సొంత టీం ఏర్పాటుకు తనకు స్వేచ్ఛనివ్వాలన్న సీఎం విన్నపాన్ని ఆజాద్ అమోదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో పాత టీంను మార్చాలన్న ఆయన ప్రతిపాదనకు ఆజాద్ ఓకే చెప్పినట్లు తెలిసింది. తనకు తలనొప్పిగా మారిన పీసీసీ అధ్యక్షుడు బొత్స, శంకపూరావులను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎంతో కాలంగా సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఈ దఫా ఫలించేటట్లు కనిపిస్తున్నాయి. పీఆర్‌పీ నుంచి చిరంజీవి ప్రతిపాదిస్తున్న సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాస్‌రావుకు స్థానం కల్పించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సను తప్పించాల్సిందేనని ఆజాద్‌ను కిరణ్ ఒప్పించారని అంటున్నారు. సీఎం ప్రతిపాదనను ముందే గుర్తించిన ఆజాద్.. కిరణ్ తనను కలవడానికి ముందే బొత్సను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. మధ్యాహ్నం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పిస్తున్న అంశాన్ని బొత్సకు తెలియపరిచారని సమాచారం.

అయితే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి తాను మంత్రిగా కొనసాగితేనే ఉపయోగకరమని బొత్స వాదించినట్లు తెలిసింది. అయితే దీనికి ఆజాద్ సుముఖత చూపించలేదని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ఇప్పటికే తన అధ్యక్షతన సమన్వయ కమిటీ పనిచేస్తున్నదని, దానిలో మీరు కూడా సభ్యులైనందున అక్కడ పార్టీ అభివూపాయాలను సీఎం దృష్టికి తీసుకురావచ్చని ఆజాద్ సూచించారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో లోపాలను సైతం ఎత్తిచూపొచ్చని, దానికి మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదన్న ధోరణిలో బొత్సను ఆజాద్ ఒప్పించినట్లు సమాచారం. మంత్రి శంకపూరావును కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం రూపొందించిన జాబితాపై అభివూపాయం తెలపడానికి అందుబాటులో ఉండాలని బొత్సను ఆజాద్ కోరినట్లు తెలిసింది. తాను రూపొందించిన జాబితాపై ఆజాద్‌తో ఆమోద ముద్ర వేయించుకున్న కిరణ్.. సోనియాతో బుధవారం భేటీ అయి.. ఆమె అనుమతి తీసుకుని రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

ఎవరి ప్రయోజనాలు వారివే!
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), కోమటిడ్డి వెంకట్‌డ్డి (నల్గొండ) తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యతను పాటించాలంటే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాళీలను తాజా విస్తరణలో భర్తీ చేయాలని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి మంగళవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్సీలు ఉండగా వారిని కాదని పీఆర్పీ ఎమ్మెల్సీ రామచంవూదయ్యకు మంత్రిపదవి ఎలా ఇస్తారని అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేలు ఉత్తంకుమార్‌డ్డి, దామోదర్‌డ్డి, గండ్ర వెంకటరమణాడ్డి, మల్లు భట్టి విక్రమార్క్‌లకు దక్కవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రి శంకపూరావును తొలగించాల్సి వస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీల విషయానికి వస్తే డీ శ్రీనివాస్, పాలడుగు వెంకవూటావు, మహ్మద్ జానీ, రుద్రరాజు పద్మరాజు, ఇంద్రసేన్‌డ్డి, జగదీశ్వర్‌డ్డి, భూపాల్‌డ్డి, భానువూపసాద్ మంత్రిపదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో పాలడుగు, పద్మరాజు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక మల్లు భట్టివిక్షికమార్క ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ ఢిల్లీ వెళ్ళారు.

తెలంగాణ ఉద్యమ వాతావరణం కొంత చల్లబడటంతో పాటు రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, యువతకు అనేక పథకాలు, కార్యక్షికమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నందున ఇదంతా తన గొప్పతనంగా కిరణ్ చెప్పుకుంటున్నారు. వీటిని చూపి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. మొత్తంగా ప్రభుత్వంలో తన పట్టుపెంచుకునేందుకు పావులు కదిపారని సమాచారం. తనకు అడ్డంకిగా ఉన్న మంత్రులు బొత్స, శంకపూరావు, డీఎల్ వంటి సీనియర్లను కూడా కేబినెట్ నుంచి తొలగించుకోవాలని కిరణ్ ఆరాట పడుతున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ ఆలోచనలను ముందే పసిగట్టిన బొత్స తదితరులు కిరణ్‌కు వ్యతిరేకంగా అధిష్ఠానానికి సవివరంగా నివేదికలు పంపినట్లు సమాచారం.

పథకాల్లో డొల్లతనాన్ని వారు ఆ నివేదికలో పొందుపర్చారని తెలిసింది.మంత్రివర్గంలోకి రామచంవూదయ్యను తీసుకోవడంపై సీఎం సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు వంగా గీత, బండారు సత్యానందరావు తదితరులతో భేటీ కావడం పీఆర్పీ వర్గాల్లో కలకలం రేపింది. పీఆర్పీ నేతల్లో చీలికి తెచ్చేందుకు సీఎం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రుల శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండడంతో మంత్రులు ఆర్ వెంకట్‌డ్డి, ఏరాసు ప్రతాప్‌డ్డి, సబితా ఇంద్రాడ్డి, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్ధసారధి, మహిధర్‌డ్డి, రఘువీరాడ్డి, పీ విశ్వరూప్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణాడ్డి పలువురు ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పులి ఉప ఎన్నిక సందర్భంగా మంత్రిపదవికి రాజీనామా చేసిన వైఎస్ వివేకానందడ్డి కూడా కిరణ్‌ను కలిశారు.

హస్తినకు ఆశావహుల క్యూ
మంత్రి వర్గంలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న వార్తలతో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఆశావహులు హస్తినబాట పట్టారు. మంత్రులు ఏరాసు, శైలాజానాథ్, చీఫ్ విప్ కొండ్రు మురళి, డిప్యూటీ స్పీక్ మల్లు, ఎమ్మెల్యేలు గండ్ర, ముత్యండ్డి, మస్తాన్‌వలీ తదితరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం జరుగుతుందన్న వార్తలతో అసంతృప్తులు రగులుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అందరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఈ నేపథ్యంలోనే మంత్రులు రాష్ట్ర నేతలను కోరుతున్నారు.

మా సంగతేంటి?
ఎమ్మెల్సీ కోటా నుండి రామచంవూదయ్యకు మంత్రి వర్గంలో స్థానం దాదాపు ఖరారు కావడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధిష్ఠాన తీరును తప్పుబడుతున్నారు. తాము మంత్రి పదవి అడిగినప్పుడు ఎమ్మెల్సీలకు అవకాశం లేదన్న పార్టీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా రామచంవూదయ్యకు పదవి కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వదలుచుకుంటే పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన తనకివ్వాలని పాలడుగు కోరుతున్నారు. ఇదే విషయంపై ఆజాద్‌తోపాటు పార్టీ కోర్‌కమిటీ సభ్యులనూ ఆయన కలవనున్నారు. ఎమ్మెల్సీలు బాషా, పద్మరాజు, రంగాడ్డి తదితరులు కూడా ఇదే వాదనతో ఢిల్లీ పెద్దలను కలువనున్నారు.

Take By: T News

Read more...

Tuesday, January 17, 2012

తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట



CMpostlist telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema -నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు

ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.

నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.

పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.

CMpostlist_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.

సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.

నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.

మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.

Take By : T News

Read more...

Wednesday, December 28, 2011

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

ఎట్టకేలకు లోక్‌పాల్

-లోక్‌సభలో రోజంతా చర్చ..
-లొసుగులపై విపక్షాల రచ్చ
-తొందరేంలేదు.. మళ్లీ తీసుకురండి
-2, 3 నెలలైనా ఫర్వాలేదు: సుష్మ
-అవినీతిపై పోరుకు సహకరించండి
-లోక్‌పాల్‌ను ఆమోదించండి
-పార్లమెంటుకు ప్రధాని విజ్ఞప్తి
-సీబీఐని చేర్చేది లేదని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, డిసెంబర్ 27:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లును మంగళవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది. ఒకవైపు బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ముంబైలో నిరాహార దీక్షకు కూర్చోగా, మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై పలు పార్టీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లుపై చర్చలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును తేవాలని బీజేపీ డిమాండ్ చేయగా, మార్పులు అవసరమని వివిధ పార్టీలు సూచించాయి. సమతుల్యతతో రూపొందించిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శలు, విసుర్లు, ఛలోక్తులతో ఆసక్తి కలిగించారు.లోక్‌సభలో బిల్లు పెడుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి పార్లమెంటు ఔన్నత్యం గురించి నొక్కిచెప్పారు. ‘‘మనం ఈ సభకు మాత్రమే తలవంచాలి. అంతేతప్ప మరెవరికీ కాదు’’ అని పరోక్షంగా అన్నాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి సంబంధించిన నేరానికి పాల్పడ్డట్లు విశ్వసించిన పక్షంలో అలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అధికారం లభిస్తుందని, లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని మంత్రి చెప్పారు. లాలు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల లోకాయుక్తలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. లోకాయుక్తల ఏర్పాటు గురించి, గుజరాత్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లేకపోవడం గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా ఏఐఏడీఎంకే, బీజేపీ సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లు పూర్తి లోపాలతో ఉందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.

‘‘బిల్లును ఉపసంహరించాలి. హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తిరిగి స్థాయీసంఘానికి పంపించండి. 3, 4 నెలల తర్వాత తిరిగి ప్రవేశపెట్టండి. ఈ సమావేశాల్లోనే బిల్లు కావాలని మేం కోరాం. కాని, మేము ఇలాంటి బిల్లును కోరుకోలేదు’’ అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తలకు సంబంధించి ప్రభుత్వం తొలుత గందరగోళాన్ని తొలగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా అనుసరించాలా లేదా వాటి ఇష్టవూపకారం వ్యవహరించవచ్చా అన్నది స్పష్టం చేయాలన్నారు. మంత్రి కపిల్ సిబల్ ఐచ్ఛికమంటుంటే మరోమంత్రి నారాయణస్వామి విధిగా నెలకొల్పాల్సిందేనంటున్నారని ఆమె తప్పుబట్టారు. బిల్లు సమాఖ్య స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. లోక్‌పాల్‌లో మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించి ఆమె రెండో అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ప్రతిపాదన విభజనకు విత్తనాలను నాటుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండానే మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఉన్నత పదవులను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె లాలూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కుటిలత్వాన్ని లాలు అర్థం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఇప్పుడాయన తెలుసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆమె వ్యాఖ్యానించగా, ‘‘బీజేపీ దేశాన్ని విడదీయాలని కోరుకుంటోంది’’ అని లాలూ బదులిచ్చారు. లోక్‌పాల్‌ను ప్రభుత్వం అన్ని రకాలుగా నియంవూతించేలా ప్రస్తుత బిల్లు ఉందని, ప్రధానికి చాలా రక్షణలు కల్పించారని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని సుష్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కపిల్‌సిబల్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బిల్లును ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా లోకాయుక్తల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంతో విభేదించాయి. బలమైన లోక్‌పాల్ అవసరమని, ఆ వ్యవస్థ పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య కోరారు.

-సీబీఐని లోక్‌పాల్‌లో చేర్చం
-ప్రధాని మన్మోహన్ స్పష్టీకరణ

లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు. దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేప లేదని స్పష్టం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకుంటూ అవినీతిపై పోరాటంలో ఫెడరలిజం అడ్డంకి కాకూడదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి క్యాన్సర్‌పై పోరాటంలో కలిసిరావాలని, బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడమనే ప్రతిపాదన సరికాదు. దానివల్ల పార్లమెంటుకు వెలుపల ఒక కార్యనిర్వాహక నిర్మాణం ఏర్పడుతుంది.. అది ఎవరికీ జవాబుదారీకాకుండాపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది’’ అని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతి, దాని పర్యవసానాలు ఎలా దారితీస్తున్నాయో గుర్తుంచుకోవాలని, గత ఏడాది కాలంలోనే ప్రజాక్షిగహం ఎలా వ్యక్తమయిందో గమనించాలని అన్నారు. అందుకే ప్రతిపాదిత బిల్లును ఆమోదించాలని కోరారు. బిల్లును రూపొందించే ముందు విసృ్తతంగా సంప్రతించామని, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. లోక్‌పాల్‌పై రోజంతా చర్చ కొనసాగగా, ప్రధానమంత్రి అలాగే కూర్చున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, అవినీతిపై పోరాటంలో సభ అభివూపాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. లోకాయుక్తల ఏర్పాటు అవసరాన్ని ప్రధానమంత్రి గట్టిగా సమర్థించారు. ‘ఆమ్ ఆద్మీ’ (సాధారణ పౌరుడు) పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్, మునిసిపల్ సేవలు, భూమి రికార్డులు, పోలీస్, రేషన్‌షాపులు.. తదితర నిత్యావసర సమస్యలన్నీ రాష్ట్రాలకు, స్థానిక అధికార సంస్థలకు సంబంధించినవని, ఈ సమస్యల పరిష్కారానికి లోకాయుక్తల ఏర్పాటు అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘లోకాయుక్తలను ఏర్పరచకపోతే అవినీతి క్యాన్సర్ విస్తరిస్తుంది. ఈ విషయంలో మనం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదు’’ అని ఆయన అన్నారు.

లోక్‌పాల్‌తో అవినీతి పోదు: ములాయం
లోక్‌పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చలో పాల్గొంటూ- పార్లమెంటు కన్నా మరేదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌పాల్ బిల్లు అవినీతిని నిర్మూలించదు. బిల్లులో చాలా లోపాలున్నాయి. అది చాలా అంశాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం లోక్‌పాల్ కన్నా పెద్దది. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. దానికన్నా మరేదీ ఉన్నతం కాదు. ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఎంపీలు భయపడతారు’’ అని ఆయన అన్నారు. ‘‘సీబీఐపై చేసిన ఆరోపణలను లోక్‌పాల్‌పైనా చేయొచ్చు. ఈ లోక్‌పాల్ బిల్లు అమలుచేయాల్సినంత మంచిదేంకాదు’’ అని ములాయం వ్యాఖ్యానించారు.

సీబీఐకి స్వేచ్ఛ, కొత్త లోక్‌పాల్ అవసరం: జేడీ (యూ)
ప్రభుత్వం మెరుగైన బిల్లు తేవాలని, సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు అవినీతిని నిరోధించలేదని ఆయన లోక్‌పాల్‌పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఫలితంగా కోర్టు కేసుల సంఖ్య పెరగడం తప్ప అసలైన ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీకి మంత్రి కపిల్ సిబల్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని చెప్పే బదులు బిల్లును మెరుగుపరచాలని సూచించారు.‘‘ప్రజలు ఈ నాటకాన్ని అర్థంచేసుకోవడం లేదని సిబల్ భావిస్తున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు అవినీతిని నిర్మూలిస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక చట్టాలను తేవాలనుకునేవారు బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తొలి లోక్‌పాల్.. మన్మోహన్!
తొలి లోక్‌పాల్‌గా నిజాయితీపరుడైన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎన్నుకోవాలని ఆర్‌జేడీ నేత లాలూవూపసాద్ యాదవ్ సూచించగా మంగళవారం లోక్‌సభలో నవ్వులు విరిశాయి. అందరు బిగ్గరగా నవ్వగా, ప్రధాని మన్మోహన్ చిరునవ్వుతో స్పందించారు. లోక్‌పాల్ ఎన్నిక ప్రక్రియ గురించి లాలూ మాట్లాడుతూ తనకు ఆయన కంటే నిజాయితీపరుపూవరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు మరొకరిని ప్రధానమంవూతిగా చేసుకోండి’’ అని అధికార కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అన్నా హజారే తీరుపై లాలూ మండిపడ్డారు.

Take By: T News

Read more...

Thursday, December 22, 2011

Telugu Cinema Hyderabad Diary 2012 released


Much water has flown under the bridge ever since Tollywood shifted its base from Chennai to Hyderabad. There's development on all fronts. Many studios including some with world class standards and the graphics, creative wings and of course the post production suits have come up. The availability of artists is also easier and in one sense, Hyderabad has almost become the hub of Tollywood. As the city sleeps, Tollywood awakens.

 
Krishnanagar, Filmnagar, Jubilee Hills and Banjara Hills buzz with life as the film world prepares for a day on the sets. A workforce of around 1 lakh people cook up dreams for all of Hyderabad and the rest of the state. In a city where theatre has been reduced to a hobby and music is an afterthought, Cinema provides entertainment and escape.

Keeping all these thigs in mind a theme-based diary detailing the long journey of Telugu Cinema was released by a city based Hindi daily Hindi Milap. The diary is a tribute to our city and captures the flavour of our streets, our people, and our culture.


Hyderabad Diary 2012 is a tribute to the Telugu Film Industry or Tollywood as it is popularly referred to. The film industry has played a major role in popular culture and Hyderabad as a city has absorbed elements of Telugu cinema. The diary showcases 75 year history of Telugu Cinema through glorious posters with a small focus on depicting the effect of Tollywood in Hyderabad – on the streets, amongst people and in their daily lives.

Written by noted film maker Sandeep Gunnam, and introductory remarks by Gangaraju Gunnam, the diary has over 50 spectacular posters from all eras. The cost of the diary is `365.

Take By: The Hans India News

Read more...

Monday, December 19, 2011

చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!

- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Chiranjivi-12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP