Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label sonia. Show all posts
Showing posts with label sonia. Show all posts

Tuesday, September 18, 2012

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Friday, June 29, 2012

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

Monday, June 25, 2012

సోనియాతో నేడు చిరు భేటీ


-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!

హైదరాబాద్, ():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు. కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్ సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్ కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP