Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label T News. Show all posts
Showing posts with label T News. Show all posts

Tuesday, October 23, 2012

రగిలిన రాజోలి

-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు


రాజోలి రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

బాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం, స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు. చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

( మహబూబ్‌నగర్) :వస్తున్నా మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని ప్రకటించారు.

కానీ కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఖండించారు.

సోమవారం ఉదయం నుంచి మక్తల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా.. తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.


- T News

Read more...

Tuesday, September 18, 2012

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Monday, September 17, 2012

‘Suthi Velu’ dead

A comedian and character artiste with over 200 films to his credit between 1982 and 2009, Suthi Velu is no more. He died of cardiac arrest early on Sunday at his residence in Chennai and is survived by wife Lakshmi Rajyam, three daughters and a son. 

He was born Kurumaddali Lakshmi Narasimha Rao on August 7, 1947, but most people have forgotten it because he is famous as ‘Suthi Velu’ only. This name is synonymous with humour that was re-defined by this son of a teacher in every role he essayed. 

The man debuted with ‘Mudda Mandaram’ in 1982, but it was his second film ‘Nalugusthambaalaata’ directed by Jandhyala, where he entertained the masses together with Suthi Veerabhadra Rao that turned the spotlight on him. It was in 1982 when he played the role of ‘Suthi’ in ‘Nalugusthambaalaata’ that he got the name ‘Suthi Velu’ (Velu means finger in Telugu, denoting his lean physique). He got a Nandi award for the best supporting actor in ‘Vandemataram’ in 1985
.
Interest in acting
At the age of seven, he gave a stage performance, which his father did not like. He did not have a good personality or voice, but due to his interest, he decided to take up acting seriously. 

After ‘Mudda Mandaaram,’ he did several films with Jandhyala wielding the megaphone. 

Films apart, Suthi Velu worked in several television serials on Doordarshan, ETV and Gemini. 

As news of his demise spread, a flood of condolences poured in here.
Condolences 

In a press release, Congress leader and Rajya Sabha member K. Chiranjeevi expressed grief, terming it as the loss of a good artiste known for his discipline and punctuality. 

He recalled the character Ganapathi in ‘Chantabbayi’, where he had a full-length role with him. 

Telugu Desam Party president N. Chandrababu Naidu too condoled the death. 

Take By: The Hindu News

Read more...

స్వేచ్ఛకోసం ..నెత్తురోడిన మెతుకు సీమ

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

సరిగ్గా 64 ఏళ్ల కిందట ఇదే రోజు మెదక్‌లో మువ్వన్నెల పతాకం రెపరపలాడింది. రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు అది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. ఏడో నిజాం నవాబు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట మోకరిల్లిన క్షణం.. తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు మిన్నంటాయి. ఈ పోరాటంలో ‘మెతుకుసీమ’ పాత్ర మరువలేనిది. రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి మెతుకుసీమ బిడ్డలు చరివూతలో నిలిచిపోయారు. రాచరికపు బానిస సంకెళ్లు తెంచి పోరాట స్ఫూర్తి ప్రదర్శించారు. ఇపుడు మళ్లీ అదే సందర్భం. అదే స్ఫూర్తితో ముందడగు వేయాల్సిన ఆవశ్యకత. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటఘట్టాలపై

మెదక్, (): 1947 ఆగస్టు 15న దేశం మొత్తం మీద ఓ వైపు సంబురాలు జరుగుతుంటే మరోవైపు ఆంధ్రవూపదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఫర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రజలు రజాకార్ల వ్యతిరేక పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి నిజాం నిరాకరించాడు. తన ఆధీనంలోని రాజ్యంలో 1947 ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదని నిషేధాజ్ఞలు విధించాడు. 1946 మే 10, 11వ తేదీల్లో సంగాడ్డి మండలం కంది గ్రామంలో జరిగిన 13వ ఆంధ్రమహాసభలతో ఉత్తేజితులైన ప్రజలు జిల్లావ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. గ్రామాల్లో పండించిన పంటలు, ఆస్తులు దోచుకుంటున్న రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామ గ్రామాన యువకులు, ఆర్యసమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. 1947 జూన్ 16, 17, 18వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ సమావేశాలకు జిల్లా నుంచి తేర్పోల్‌కు చెందిన జె.రామిడ్డి తదితరుల నాయకత్వంలో పలువురు హాజరయ్యారు. ఊరూరా జెండా వందనాలు చేయాలని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌వాదులు జిల్లాలోని కల్పగూర్, అల్లాదుర్గం, శంకరంపేటల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే రజాకార్ల దురాగతాలు పెచ్చుమీరడంతో ఆవేదన చెందిన నాందెడ్ జిల్లా తహసీల్దార్ ఫరీద్‌మీర్జా 1947 జూలై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేయడం ఉద్యమకారులకు మరింత బలాన్నిచ్చింది. 1947 ఆగస్టు 11న జోగిపేటలో బస్వ మాణయ్య అనే నాయకుడి ఇల్లు సోదా చేసి ఆయనను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆగ్రహం చెంది పోలీస్‌స్టేషన్‌పై దాడికి యత్నించగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు ఉద్యమకారులు మెదక్‌ను ఎంచుకున్నారు.

మెదక్‌లో తూటాలకు ఎదురొడ్డి పతాకావిష్కరణ
1947 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, తూటాలకు ఎదురొడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు మెదక్ పట్టణాన్ని ఎంచుకున్నారు. మెదక్ నివాసి గడియారం హన్మంతరావు నివాసంలో ఈ విషయమై రహస్యంగా సమావేశం నిర్వహించి శంకర్‌రావు తోటలో జెండా వందనానికి రంగం సిద్ధం చేశారు. 1947 ఆగస్టు 15న జెండా ఆవిష్కరించిన వారిని కాల్చి చంపుతామని ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు హెచ్చరికలు జారీ చేశారు. రజాకార్ల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు మెదక్‌లో జెండా వందనానికి హాజరుకాగా, కూచన్‌పల్లికి చెందిన రామాగౌడ్ పతాకావిష్కరణ చేశారు. 1947 సెప్టెంబర్ 2న సంగాడ్డిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు నిర్ణయించారు. మహంకాళి నారాయణ, వెంకయ్య, శంకర్‌ల నాయకత్వంలో సెప్టెంబర్ 2న తెల్లారేసరికి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.

సజీవ దహనాలు
1947 సెప్టెంబర్ 4న కోడూర్ గ్రామ పటేల్ రంగాడ్డి రజాకార్ల దురాగతానికి బలవ్వగా, ఖాదిరాబాద్‌లో ఉద్యమకారుడు దుగ్గిశెట్టి విశ్వనాథం తండ్రిని రజాకార్లు సజీవ దహనం చేశారు. రైతు సంగప్ప అనే వ్యాపారిని 1947 అక్టోబర్ 24వ తేదీన రజాకార్లు సజీవ దహనం చేసి చంపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పటాన్‌చెరు మండటం జానకంపేట వాసులు కంది శ్రీనివాస్‌రావు నాయకత్వంలో బాణాలతో పోరాడారు. కంది కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, మచ్చ వెంక గుప్తల ఆధ్వర్యంలో పటాన్‌చెరు, పరిసర గ్రామాల్లో ఉద్యమకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించి పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు, పాటి ఘణపూర్, కిష్టాడ్డిపేట గ్రామాలకు చెందిన వెంకటరత్నం, మల్లయ్యలను అరెస్ట్ చేసి సికింవూదాబాద్ జైల్లో నిర్బంధించారు.

దగ్ధమైన సదాశివపేట
1947 అక్టోబర్ 24వ తేదీ సదాశివపేటలో చరివూతలో మరువలేనిది. ఆ రోజు ఒకవైపు దసరా పండగ సంబురాలను ప్రజలు జరుపుకుంటుండగా..అజాంఖాన్, శంశోద్దీన్‌ల నాయకత్వంలో రజాకార్లు సదాశివపేటపై దాడి చేసి మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను దగ్ధం చేశారు. కిరోసిన్ దుకాణంతో పాటు మొదలుపెట్టిన ఈ దహనకాండకు తన దుకాణానికి తోరణం కడుతున్న సంగప్ప అనే వ్యాపారిని అదే దుకాణంలో వేసి సజీవ దహనం చేశారు.

ప్రేరణనిచ్చిన కలం యోధుడు మాణిక్యరావు
సురవరం ప్రతాప్‌డ్డి ప్రారంభించిన గోల్కొండ పత్రికలో పాత్రికేయుడిగా పనిచేసిన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. ఫిరోజ్ మీర్జా, బాకర్ అలీమీర్జా, సిరాజుల్‌హాసన్ వంటి ప్రగతి కాముక ముస్లిం మేధావుల మాటలను పెడచెవిన పెట్టిన మత ఛాందసవాద, ఫాసిస్టు భావజాల రజాకార్ల మాటలు విని ప్రజలపై విపరీతమైన దురాగతాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ నిజాంపై హైదరాబాద్ స్టేట్ ప్రజల పిలుపు మేరకు ఇండియన్ యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరిట 1948 సెప్టెంబర్ 13న నల్దురుపై దాడి చేసి వశపర్చుకున్నాయి. ఆ తర్వాత వరుసగా భారత సైన్యాలు పురోగమించడంతో నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారు. దీంతో నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. రాచరిక పాలన అంతమైంది.

Take By: T News

Read more...

Sunday, September 2, 2012

పిల్లలకు నేర్పండి...‘పొదుపు’కథలు


పదేళ్ళ అబ్బాయికి ఓ పది రూపాయలిస్తే ఏంచేస్తాడు? ఏ చాక్లెట్టో..ఐస్‌క్రీమో..కొనుక్కుంటాడు. లేకపోతే స్పైడర్‌మేన్, సచిన్ టెండూల్కర్ స్టిక్కర్లు కొనుక్కుంటాడు. కొంత మంది బుద్ధిమంతులైన పిల్లలైతే ఆ పదిరూపాయల్ని తీసుకెళ్ళి తమ కిడ్డీబ్యాంకులో వేసుకుం టారు. అది కూడా అవన్నీ కూడబెట్టి పెద్ద బ్యాట్ కొనుక్కోవడానికే అయ్యుం టుంది. అలా కాకుండా ఆ పదిరూపాయలతో ఆ పిల్లవాడు ‘డాడీ..దీంతో ఫలానా షేరు కొంటాను...మూడు నెలల్లో పదిరెట్లు అవుతుంది’ అన్నాడనుకోండి. 

నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని ఆ తండ్రి పుత్రోత్సాహానికి అంతుండదు. కానీ పిల్లలకు ఈ వయసు నుంచే అంతపెద్ద పొదుపు, పెట్టుబడి మాటలెందుకని అనిపించొచ్చు. కాలం మారింది.

ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు విలువ, పొదుపు అలవాటు, పెట్టుబడి పరిజ్ఞానం తెలియడం చాలా అవసరమని అంటున్నారు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకరైన వారెన్ బఫెట్ తొలి షేర్‌ను 11 ఏళ్ళ వయసులో కొన్నాడట. ‘అబ్బా..ఇంకాస్త చిన్న వయసులో మొదలుపెట్టి ఉంటే మరింత ధనవంతుడయ్యేవాడ్ని కదా’ అని సరదాగా బాధపడుతుంటాడట బఫెట్.
డబ్బు విలువ తెలియజేయడం కన్నా ముఖ్యమైనది పిల్లలలో పొదుపు, పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం. చిన్నప్పుడే అంత పెద్ద అలవాట్లు ఎందుకు అని తల్లిదండ్రులు అనుకోకుండా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేయడం మంచిది.

కిడ్డీబ్యాంక్‌తో పొదుపభ్యాసం
పిల్లలు ప్రీస్కూల్, కిండర్‌గార్డెన్ వయసులో ఉండగానే ప్రాథమిక డబ్బు విలువను అర్థం చేసుకోగల సమర్థత కలిగి ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. అందుకే అప్పుడే కిడ్డీ బ్యాంక్‌ను ప్రవేశపెట్టాలి. ఆకర్షణీయమైన ట్రాన్స్‌పరెంట్ కిడ్డీ బ్యాంక్ బొమ్మను కొనివ్వండి. అందులో వేసే డబ్బులు బయటికి కనిపించే విధంగా ఉండాలి. అందులో వేసిన డబ్బులు చూపిస్తూ, డబ్బు ఎంతటి విలువైనదో ఎన్ని పనులు చేస్తుందో చిన్నచిన్న ఉదాహరణలతో, మాటలతో కొద్దిగా చెప్పండి. డబ్బు బయటకు కనిపించే కిడ్డీ బ్యాంక్‌లోంచి పిల్లలు డబ్బులు తీసినప్పుడు తగ్గిపోవడం, వేసినప్పుడు పెరగడం చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి. ఆ దశలో డబ్బు విలువను పిల్లలు రాశితోనే ఎక్కువ తక్కువలుగా లెక్కిస్తారు. కాబట్టి డబ్బు తగ్గిపోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. పొదుపు, బ్యాంక్, డిపాజిట్ వంటి పదాలు, వాటి అర్థాలు ముఖ్యంగా చిన్న కథల సహాయంతో చెప్తే పిల్లలకు ఎంతగానో హత్తుకుంటాయి.

కిడ్డీబ్యాంక్ నుండి ఆన్‌లైన్ బ్యాంక్‌కి
పిల్లలు కొద్దిగా ఎదిగి కేజీ చదువులు దాటి ముందుకు వెళ్తూ మేథ్స్ సబ్జెక్టులో బోలెడన్ని లెక్కలు చేస్తున్న దశకు చేరుకున్న సమయంలో పాకెట్ మనీని ఎలాగూ అలవాటు చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపడా డబ్బులివ్వడమే కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వండి. అలా ఇస్తూ చూద్దాం. ‘దాన్ని నువ్వు ఎంత తెలివిగా పొదుపు చేస్తావో’ అని పరోక్షంగా ఒక ప్రోత్సాహానిచ్చే కామెంట్ కూడా చేయాలి. దాంతోపాటు పిల్లలు చేసే ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో రాసే అలవాటును కూడా ప్రోత్సహించండి. ‘ఆ యాభై రూపాయలు ఏం చేశావు’ అని అడిగినప్పుడు పిల్లలు గుర్తుకురాక తడబడుతూ, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో తెగ ఇబ్బంది పడుతున్న సమయంలో ‘అందుకే అన్నీ ఒక పుస్తకంలో రాస్తే..ఏదీ మర్చిపోవు’ అని చెప్తే పిల్లల మనసులో బలంగా ముద్రించుకుపోతుంది. ఆ మరునాటి నుంచే పిల్లలు కూడా అకౌంట్స్ మెయింటెన్ చేయడం మెదలు పెడతారు. అదే సమయంలో పిల్లల పేరు మీద ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయాలి. అందులో కొంత డబ్బు డిపాటిజ్ చేసి కిడ్డీ బ్యాంక్‌కి, ఈ బ్యాంక్‌కి గల తేడాను పిల్లలకి చెప్పాలి. ‘కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ బ్యాంక్‌లో డబ్బులు వేస్తే పెరుగుతాయి’ అని వారికి వడ్డీ గురించి వివరించాలి. ‘ఆ వడ్డీతో నువ్వు ఏం కొనుక్కున్నా..అసలు అలాగే ఉంటుంది’ అని తేలికైన పదాలతో వారికి శాస్త్రీయమైన పొదుపు పద్ధతుల గురించి చెప్పాలి. వీటన్నింటి నేపథ్యంలో డబ్బు విలువను పిల్లలు పదేపదే తెలుసుకుంటూ ఉంటారు. ఫలితంగా డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిపోయి, జాగ్రత్త గౌరవం పెంచుతాయి.

పొదుపు నుంచి పెట్టుబడికి
బాల్యంలో డబ్బు విషయాలు పెద్దవాళ్ళ విషయాలుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ నేటి మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో పిల్లలను కుటుంబంలోని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం వీలు పడదు. అయినా, ఇప్పు డు అనేక సందర్భా లలో పిల్లలముందే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. పైగా ‘బోలెడంత ఫీజులు కట్టి చదివిస్తున్నాం..బాగా చదువు’ అని ఎలాగూ పిల్లలతో అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలా ఆర్థిక విషయాల గురించి నెగెటివ్ భావాలు పెంపొందించే బదులు పాజిటివ్ భావాలు పెంపొందించడం మంచిది కదా..అని సలహా ఇస్తున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణులు.
పిల్లలు 7వ తరగతికి వచ్చేసరికే వారి సిలబస్ చూస్తే వారు ఎంతటి కీలకమైన ఆర్థిక పరమైన అంశాలను అభ్యాసం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆ పనుల నుండే వారికి ఏ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత వస్తాయి. ఒక 50 వేలు డిపాజిట్ చేస్తే ఏయే బ్యాంక్‌లో ఎంత ఆదాయం వస్తుంది. మొదలైన బాధ్యతలు పిల్లలకే అప్పగించాలి. డిపాజిట్లు, పెట్టుబడుల పద్ధతుల గురించి వారితో చర్చించాలి. ముఖ్యంగా వివిధ పెట్టుబడుల పద్ధతుల గురించి, ఎందులో పొదుపు చేస్తే, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందో..పిల్లలకు వివరించాలి.

ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో పిల్లలలో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కంపెనీలలో షేర్లు మొదలైనవి వారికి కొంత అర్థమవుతాయి. అందులోని సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలి. ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి పిల్లలకే పెట్టుబడి నిర్ణయాధికారం ఇవ్వాలి. ‘ఇదిగో ఈ లక్ష రూపాయలు, లేదా ఓ ఇరవై వేలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టమంటావో చెప్పు’ అని తల్లిదండ్రులు పిల్లలని అడిగితే, వాళ్ళు ఆ విషయంపై ఎంతో పరిశోధన, విశ్లేషణ చేస్తారు. ఆ ప్రక్రియలో పిల్లలు ఆర్థిక అంశాల విషయంలో ఎంతో తెలివైన వారుగా రూపుదిద్దుకుంటారు.

కొంత డబ్బుతో ప్రత్యేకంగా పిల్లల సలహామేరకు వారి స్వేచ్ఛా నిర్ణయానుసారం పెట్టుబడులు జరుగుతుంటే ఆ డబ్బు పెరుగుతుంటే ఆ అంశంపై వారికి మరింత ఆసక్తి రావడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. డబ్బుపట్ల విపరీతమైన జాగ్రత్త పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఏదైనా అనవసరంగా ఖర్చు చేస్తే పిల్లలే అది వృథా ఖర్చని, వద్దని వారించే స్థితికి వస్తారు.

ఏ వయస్సులో..
ఎలాంటి పొదుపు?

సం॥ వయస్సున్న పిల్లలకు కిడ్డీ బ్యాంక్ పొదుపు అలవాటు చేయండి. పెరిగే, తరిగే డబ్బును చూపిస్తూ డబ్బు విలువ తెలియజేయండి. చిన్న చిన్న పొదుపు లక్ష్యాలు పెట్టండి. 100 రూపాయలు ఎప్పుడూ చేస్తారో అప్పుడు బొమ్మ కొనుక్కోవచ్చు వంటి సరదా లక్ష్యాలు పెట్టండి.
సం॥ వయసు ఉన్న పిల్లల పేరుమీద బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించాలి. ఆపాస్ పుస్తకం, అందులో పేర్లు పిల్లలకి ఆసక్తిగా ఉంటాయి. అప్పుడే బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ పద్ధతులు, వడ్డీ వివరాలు చెప్పాలి. ఆ సమయంలో పిల్లలకు సరిగా అర్థంకాక అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి.
సం॥ వయసు పిల్లలకు అప్పటికే డబ్బు, పొదుపు, పెట్టుబడి అంశాలపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కాబట్టి పొదుపు పెట్టుబడుల విషయంలో వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. వారి వెంట ఉంటూ వాటిని అమలు చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మంచిది? అందుకు కారణాలేమిటో పిల్లల్ని అడగాలి. దాని నుంచి వచ్చే జవాబులు ఎంతో కీలకమైనవి.
సం॥ వయసున్న పిల్లలకు చేతిలో కొంత డబ్బు ఇచ్చి దాని పూర్తి పెట్టుబడి బాధ్యత, ఆ మొత్తాన్ని ఎక్కువ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. అది చిన్న చిన్న మొత్తాలుగా ఉండాలి. వారి నిర్ణయాలలో తారుమారై నష్టం సంభవించినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. అది వారికి ఎంతో విలువైన అనుభవం అవుతుంది.

Take By: T News

Read more...

Friday, June 29, 2012

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Thursday, June 28, 2012

ఏజెన్సీ మద్యం దుకాణాలకు బినామీల అవతారం



- వెనకుండి కథ నడిపించిన మద్యం మాఫియా
- విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న వ్యాపారులు
- ‘టీమీడియా’ పరిశీలనలో వెల్లడైన నిజాలు
- ప్రశాంతంగా మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ


ఖమ్మం టౌన్, జూన్ 27():‘నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. నవసమాజ నిర్మాతలు’ అని మన పెద్దలు సూక్తీకరించారు. కానీ ఆ విద్యార్థులు జిల్లాలో వేళ్లూనుకున్న మద్యం వ్యాపారంలో నేడు పావులుగా మారారు. అక్రమ మద్యం వ్యాపారంలో ఆరితేరి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కొందరు రాబందులు వెనుక బడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తమ ఉన్నతికి మెట్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కథ కాదు. పచ్చి నిజం..టీమీడియా పరిశీలనలో వెల్లడైన నిప్పులాంటి నిజం. జిల్లాలోని 153 మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 71దుకాణాలను ఏజెన్సీ ప్రాంతానికి కేటాయించింది. అయితే ఏజెన్సీలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేయాలంటే స్థానిక గిరిజనుడికే మొదటి ప్రాధాన్యత. అలాగే సంబంధిత తహసీల్దార్ ఇచ్చిన నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలనే కచ్చితమైన నిబంధన అమల్లో ఉంది. కాగా ఆ రెండు సర్టిఫికెట్‌లు పొందాలంటే ప్రస్తుత చట్టాల ప్రకారం సామాన్యులకు వెంటనే సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఎప్పటి నుంచో మద్యంతో మన్యం ప్రజలను దగా చేస్తున్న అక్రమార్కుల కన్ను విద్యార్థులపై పడింది.

ఉన్నత విద్య కోసం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఆసరాగా చేసుకుని విద్యార్థులను ముగ్గులోకి లాగింది మద్యం మాఫియా. ఈనెల 19 నుంచి 25 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన వారిని పరిశీలించడంతోపాటు రెండు రోజులు( మంగళ, బుధవారాల్లో) రామకృష్ణా ఫంక్షన్‌హాల్లో చేపట్టిన లాటరీ ప్రక్రియకు హాజరైన వారిని ‘టీమీడియా’ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో వారిని పలకరిస్తే నిజాలు నిగ్గు తేలాయి. వారు ఏషాపునకు దరఖాస్తు చేశారో.. ఎంత డబ్బు చెల్లించారో ఎవ్వరికీ తెలియదు. లాటరీలో దుకాణం దక్కినా.. ఈఎండీ ఫీజు డబ్బు చెల్లించడానికి వెనకుండి ఉరికిచ్చిన వారు సకాలంలో ఎవరూరాక పోవటంతో నేరం చేసిన వాళ్ల లాగా బిక్కమొహాలేసుకుని గంటల తరబడి హాల్‌లోనే కూర్చున్నారు. ఇలా చదువుతో చక్కని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే విద్యార్థులను మద్యం మాఫియా బినామీ వ్యాపారులుగా మార్చారు.

ముగిసిన లాటరీ ప్రక్రియ...
మైదానంలో 2, ఏజెన్సీలో 71 కలిపి జిల్లాలో మొత్తం 153మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా ఆయా ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మైదానంలో1591, ఏజెన్సీలో 971 మొత్తం 2562 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా అదికారులు వాటికి పట్టణంలోని బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణా ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎంఎం నాయక్ సమక్షంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లాటరీ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఆ క్రమంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు మైదాన ప్రాంత దుకాణాలకు(2)కు లాటరీ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. కాగా మిగిలిన ఏజెన్సీ ప్రాంత దుకాణాలు (71) కు సంబంధించి నిబందనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లాటరీ తీయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సూచించడంతో బుధవారం ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో వ్యాపారులు కొంత అసహనానికి గురై ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే అక్కడకు వచ్చిన నాయక్ ఉన్నతాధికారులతో సంప్రదించి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మిగిలిన 71 ఏజెన్సీ దుకాణాల్లో 11 దుకాణాలకు ఒకే ఒక్కరు దరఖాస్తులు చేశారు. వాటిల్లో కొత్తగూడెం మండలం చుంచుపల్లి(92), భద్రాచలం మండల కేంద్రం(115), కూనవరం(122), చింతూరు(126), మణుగూరు(131, 133, 135, 136, 139, 141, 142) ఉన్నాయి. వీటి దరఖాస్తులకు లాటరీ ప్రక్రియ చేపట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే చింతూరు మండల కేంద్రంలోని దుకాణానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవటంతో లాటరీ నిలిపేశారు. కాగా ఏజెన్సీ ప్రాంత దుకాణాలకు లాటరీ ప్రక్రియలో స్థానిక నివాస, కుల సర్టిఫికెట్లను సమర్పించిన వారినే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. కొందరు తమ పిల్లల సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత చేసినా ఇన్‌చార్జ్ కలెక్టర్ నాయక్ వాటిని తిరస్కరించారు. మరికొన్ని దుకాణాలకు ఇద్దరు కలిసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు.

శభాష్ నాయక్..!
కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు ఆ మరుసటి రోజే గురుతరమైన బాధ్యత భుజాలపై పడింది. అదే మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ. గతంలో టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారి పలువురి మెడలకు ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అసలు ఈ వ్యవహారమంటేనే వణుకు పుట్టే పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఈక్రమంలో రెండ్రోజుల పాటు సాగిన లాటరీ ప్రక్రియను నాయక్ తన భుజాలపై వేసుకున్నారు. దరఖాస్తుదారుల జాతకాలు చూసే ఈ ప్రక్రియను మొదటి రోజు ప్రారంభించిన ఆయన ఆధ్యంతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. తొలి రోజున తెల్లవారుజామున మూడు గంటల వరకూ అక్కడే ఉండి లాటరీ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

ఎక్సైజ్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కలుగకుండా దిశానిర్దేశం చేశారు. రెండోరోజున మొదలైన ఏజెన్సీ షాపుల ఎంపికలోనూ పారదర్శకత పాటించారు. దరఖాస్తుదారులు స్థానిక గిరిజన, నివాస ధ్రువపత్రాలను సమర్పించే విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించారు. షాపుల వారీగా ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. ఒకానొక సందర్భంలో ఏజెన్సీ సర్టిఫికెట్లను సరైన రీతిలో పరిశీలించకుండా దరఖాస్తుదారులను లోపలికి అనుమతించిన ఓ పోలీసు అధికారిపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఆయనకు మెమో జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇతరులెవరికీ లాటరీ తీసే అవకాశం కల్పించకుండా మీడియా, పత్రికల ప్రతినిధులతో టోకెన్లను తీయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Take By: T News

Read more...

Sunday, February 12, 2012

Films, TV shows influencing child crimes?

The recent cases of a 12-year-old who died aping a TV serial suicide and a 15-year-old who stabbed his teacher to death after being reportedly influenced by watching revenge drama "Agneepath" have put the spotlight on the influence showbiz exerts on young, impressionable minds. But films and TV shows are not alone to blame, say experts.


Media literacy for kids is one way out, suggests child psychiatrist Samir Parikh.
"Our education system needs to spread media literacy among kids and infuse life skills into them so that they can differentiate between reality and fiction. There's no other way out," Parikh told IANS.

Read Full News click this Link :

Read more...

ప్రాణం విలవిల -



NILOFER-HOSPITAL talangana patrika telangana culture telangana politics telangana cinema -పేద రోగులతో సర్కారు ఆటలు
-ప్రభుత్వ ఆస్పవూతుల్లో స్తంభించిన అత్యవసరం
-రాష్ట్రంలో13 మంది రోగుల మృతి
-గాంధీలో 10 మంది.. నీలోఫర్‌లో ఒకరు, కర్నూలులో ఇద్దరు..
-జూడాలతో చర్చలు విఫలం
-స్టైపెండ్ పెంచేది లేదన్న సర్కారు
-డిమాండ్లు తీరేదాకా సమ్మె
-తేల్చిచెప్పిన జూడాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 ():ప్రభుత్వం మొండితనం, నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పవూతుల్లో రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. అత్యవసర సేవలు అందక శుక్రవారం రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ప్రభుత్వం సాధారణ చావులుగానే పరిగణించింది. ఆస్పవూతుల్లో వైద్య సేవలు అందక.. ప్రైవేట్ ఆస్పవూతులకు వెళ్లే స్థోమత లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా.. వాటి ఆనవాళ్లు ఆస్పవూతుల్లో మచ్చుకు కూడా కనిపించడంలేదు.

అన్ని ఆస్పవూతుల్లో అన్ని వైద్య సేవలు దాదాపు స్తంభించిపోయాయి. ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో సాధారణ రోగుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలనూ నిలిపివేసిన తొలిరోజే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పవూతుల్లో 13 మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క గాంధీ ఆస్పవూతిలోనే 10 మంది రోగులు వైద్యం అందక తనువు చాలించారు. నీలోఫర్‌లో అత్యవసరం వైద్యం అందక ఓ చిన్నారి కన్నుమూసింది. కర్నూలు జనరల్ ఆస్పవూతిల్లో మరో ఇద్దరు రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో రోగులు ప్రభత్వ ఆస్పవూతులకు వెళ్లాలం జంకుతున్నారు. మరోవైపు, జూడాలతో శనివారం కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 

రోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పట్టువిడుపుదల ధోరణితో వ్యవహరించాల్సిన ప్రభుత్వం అదే మొండివైఖరిని ప్రదర్శించడంతో జూడాలు కూడా పట్టువీడలేదు. దీంతో సాయంత్రం మొదలైన చర్చలు అర్ధరావూతివరకు కొనసాగినా ఎటూ తేలకుండానే ముగిశాయి. జూడాల తీరువల్లే చర్చల వల్లే చర్చలు విఫలమయ్యాయని ప్రభుత్వం పేర్కొంటే.. ప్రభుత్వ తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని జూడాలు ఆరోపించారు.

జూడాల 13 డిమాండ్లలో పదకొండింటిని అంగీకరించామని, అయినా వారు స్టైపెండ్ కోసం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. జూడాల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని, అందుకే ఇదంతా జరుగుతోందని పేర్కొంది. చర్చల ప్రక్రియను ప్రభుత్వమే ఉద్దేశపూర్వంగా చిక్కుముడిగా మార్చిందని, ఎమ్జన్సీ సేవల బంద్ విరమించుకోకుంటే సోమవారంనుంచి తలల పగులుతాయని హెచ్చరించిందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

స్టైపెండ్ కోసం తాము పట్టుబడుతున్నామని ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తోందని అన్నారు. తమ పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని, సమ్మె కొనసాగిస్తామని, ప్రజా సంఘాలతో ఆదివారం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

By :T News

Read more...

Tuesday, January 31, 2012

కొనబోతే కొరివి

http://namasthetelangaana.com/updates/2012/JAN/31/slidePic.jpg30ibp1 talangana patrika telangana culture telangana politics telangana cinema
 









- వినియోగదారుడు విలవిల
- దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- దళారులదే రాజ్యం
- రైతుకు దక్కని మద్దతు
- ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
- మార్కెట్‌లో స్టోరేజీల కొరత
- పెరిగిన రవాణా చార్జీలు
- బెండకాయలు కిలో రూ. 40
- వంకాయలు కిలో రూ. 30ఏది కొన్నా జేబుకు చిల్లే
- చుక్కల్లో కూరగాయల ధరలు

చిక్కుడు... కొండెక్కింది..! చింతపండు మరీ పులుపెక్కింది..! కాకరకాయ చేదునే మిగులుస్తున్నది..! ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఊర్ల గడ్డ.. ఏ కూరగాయలు తీసుకున్నా భగ్గుమంటున్నాయి. పాలకూర, మెంతికూర, చుక్కకూర.. ఏ ఆకుకూర అయినా ముట్టుకుంటేనే మూర్ఛ వచ్చేలా ఉంది. ఎన్నడూ లేనంతగా మార్కెట్‌లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. పొద్దస్తమానం కాయకష్టం చేసి వాటిని పండించే రైతుకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. దళారుల రాజ్యంలో ఇటు రైతు, అటు వినియోగదారుడు నిండా మునిగిపోతున్నారు. వారం వ్యవధిలో మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు ఊహించని స్థాయిలో పెరిగి పోయాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్‌కు పోతే... ఒకటీ, రెండు కూరగాయలు తప్ప ఏమీ కొనలేని పరిస్థితి.

t205 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఇన్నాళ్లు 15 రూపాయలకు కిలో దొరికిన బెండకాయలు ఇప్పుడు రూ.40 పెట్టినా గానీ దొరకడం లేదు. రవాణా చార్జీలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి కరువు పరిస్థితులూ తోడై దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గి పోవడం తోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటు న్నారు. తాము పంట పండించినా మార్కెట్‌లో అమ్ము కోవడానికి ప్రభుత్వ సహకారం లభించడం లేదని, ఫలితంగా దళారులను ఆశ్రయిస్తున్నా మని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు కూరగాయల ధరలు పెరిగి పోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

(టీ న్యూస్-నెట్‌వర్క్): గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి.. అన్నట్లుంది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 69,42,562 హెక్టార్లలో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరిగిపోతే వాటిని పండించిన రైతులు ప్రయోజనం పొందాలి. కానీ వారికి మద్దతు ధర దక్కడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కూరగాయాలకు వారే ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 650 వరకు రైతు బజార్లు ఉన్నాయి.

హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానమైనవి 16 రైతు బజార్లు ఉన్నాయి. ఏ ఒక్క రైతు బజారులోనూ రైతులు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు అప్పటికప్పుడు అమ్ముకొని పోవాల్సి వస్తోంది. లేకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి టామాటలను కిలోకు ఒక్క రూపాయి చొప్పున దళారులు కొంటారు. వాటిని వినియోగదారులకు రూ. 6 చొప్పున అమ్ముతారు. దళారుల దందా మూలంగా ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.
రవాణా చార్జీలు పెరగడం కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పెరిగిన డీజిల్ ధరలు రైతులపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. పంట వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్నింది మొదలు మార్కెట్‌కు కూరగాయలను తరలించే వరకు డీజిల్ ధరల ప్రభావం వారిపై పడుతున్నది. రైతులు నష్టపోవడానికి ఇదీ ఓ కారణం. రైతులు పండించిన పంటలు బహిరంగ మార్కెట్‌లో వారే ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం కల్పించినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.
tama05 talangana patrika telangana culture telangana politics telangana cinema

హైబ్రీడ్ విత్తనాలతో రైతుల బేజారు
విత్తనాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రకరకాల కంపెనీల పేరుతో హైబ్రీడ్ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. హైబ్రీడ్ విత్తనాల పంటలు ఏపుగా పెరుగుతున్నాయి తప్ప కాత కాయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు కాంప్లెక్స్ ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోతున్నది తప్ప పంట దిగుబడి రావడం లేదు. హైబ్రీడ్ విత్తనాలతో వచ్చిన తొలి పంటను రిలయన్స్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. మలి పంటను తీసుకోవడానికి ఈ సంస్థలు నిరాకరిస్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ రైతులు మార్కెట్‌కు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నది.

చైతన్యం నింపని సదస్సులు
ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులు రాజకీయ సదస్సులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ కాలంలో ఏయే పంటలు వేయాలి.. ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పంటను మార్కెట్‌కు తరలించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? దళారుల బారిన పడకుండా పంటను ఎలా విక్రయించుకోవాలి తదితర విషయాల్లో రైతులకు ఈ సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా వీటిని నిర్వహించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్‌కు ధరల సెగ
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. మరో 20 రోజుల్లో ఉత్పత్తి పడిపోనుంది. వారం రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.1 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పడిపోవడం, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు వాటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా సరిపడా కూరగాయలు దిగుమతి కావడం లేదు. నగరంలో రోజుకు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 200-300 మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ కూరగాయలు లేకపోవడంతో దళారులదే రాజ్యంగా మారుతోంది. వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్‌లో 40 శాతం ధరలను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.
4654 talangana patrika telangana culture telangana politics telangana cinema

దళారుల ధరలు..
రైతుబజార్లలో ధరలకు సంబంధించి 1999లో ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. వాటి ధరలు సమీపంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ల ధరలకు దగ్గరగా ఉండాలి. ఎస్టేట్ అధికారులు, రైతులు కలిసి నాణ్యత ప్రమాణంగా ధర ఖరారు చేయాలి. కానీ హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూరగాయల రేట్ల ఆధారంగా హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లలో ధరలు నిర్ణయిస్తున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే అక్కడ సాధారణంగా ధరలు పెంచుతారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రైతుబజార్లపై పడుతుంది. వాస్తవంగా అక్కడి కూరగాయలకు, రైతుబజార్లలో రైతులు తీసుకువచ్చే వాటికి ఎలాంటి సంబంధం లేదు.

మెదక్‌లో కూర‘గాయాలు’: రాష్ట్ర రాజధాని మెదక్ జిల్లాకు ఆనుకొని ఉండటంతో నగరవాసుల కూరగాయల అవసరాల్లో సింహభాగం మెదక్ జిల్లానే తీరుస్తున్నది. జిల్లాలోని వర్గల్, ములుగు, గజ్వేల్, తూప్రాన్, జగదేవపూర్, తొగుట, గుమ్మడిదల, జిన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 170 నుంచి 200 టన్నుల కూరగాయలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. నగరవాసుల అవసరాలు తీరుస్తున్నా స్థానికంగా మాత్రం కూరగాయల రేట్లు మండిపోతున్నాయి.

మహబూబ్‌నగర్, ఖమ్మంలో కష్టాలు
జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో నీటి శాతం తగ్గింది. వాటితో పాటు ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల కూరగాయలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనూ కూరగాయల ధరలు భగ్గున మండుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యులు మార్కెట్లో కూరగాయలు కొనలేని దుస్థితి ఏర్పడుతోంది. అంగట్లో అదిరిపోయే ధరలతో సామాన్యుల దిమ్మ తిరుగుతోంది. పూటగడవని కూలీలకు పచ్చళ్ళే పంచభక్షపరమాన్నాలుగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర అందటంలేదు.

ఆదిలాబాద్ అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత పక్షం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, వర్షాభావ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక కొన్ని కూరగాయలు మార్కెట్‌లలో దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. మార్కెట్‌లో క్యాలిఫ్లవర్, తోటకూర, బీరకాయ, గోరుచిక్కుడు, దోసకాయ, చిక్కుడుకాయ లాంటి కూరగాయలు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే టమాట, ఆనిగపుకాయ, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంతికూర, దిగుబడి 50 శాతం మేరకు తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాబేజీ పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి.

కరీంనగర్‌లో తగ్గిన విస్తీర్ణం
కరువు కారణంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2,65 హెక్టార్లు కాగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. లేబర్ కొరత కారణంగా కూరగాయలు సాగు మాని పత్తిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. పత్తిపంటకు గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో అటువైపు మొగ్గుచూపారు. ఎక్కువ కూరగాయల ఉత్పత్తులు జరిగే కరీంనగర్ మండలాన్నే తీసుకుంటే గత ఏడాది 1500 ఎకరాల్లో సాగు జరిగితే ఈ ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. బోయినపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో ఏటా ఐదు వందల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే ఈ ఏటా రెండువందల ఎకరాల్లో మాత్రమే సాగుజరిగింది. జిల్లాలో ఒక్క టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వరంగల్, నిజామాబాద్, నల్లగొండతో పాటు సీమాంవూధలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

Take By: T News

Read more...

Monday, January 30, 2012

అధికారానికి బడుగులే!

సామాజిక న్యాయం చట్టుబండలుబీసీలకు రిజర్వేషన్లు ఏవి?
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమూ అంతంతేఎక్కడా దక్కనిదామాషా వాటా

- పార్టీల్లోనూ టికెట్లు కరువే
- మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు
- సంక్షేమ పథకాల కుప్పల్లో కూరుకుపోయిన బలహీన వర్గాలు
- అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే
- పార్టీ జెండా మోయడానికే పరిమితం!


kulammain talangana patrika telangana culture telangana politics telangana cinema(, హైదరాబాద్)వారికి జెండా మోయడం తెలుసు! తమ నాయకులను అధికారంలోకి తేవడం తెలుసు! పార్టీ కోసం గొంతుచించుకుని అరవగల సత్తా వారిది! నేతలు ఇబ్బంది పడితే తామే ఇబ్బందిపడినట్లు బాధపడే మనస్తత్వం వారిది! ఏళ్ల తరబడి కొన్ని కొన్ని పార్టీలను నమ్ముకుని ఉన్నారు! అగ్రకుల పార్టీ నేతలకూ ఆ విషయం తెలుసు! అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత ప్రేమ! కానీ ఆ ప్రేమ వారితో జెండా మోయించేంత వరకే! ఓట్ల పండగలో వెంట తిప్పుకోవడం వరకే! మహా అయితే అందులో ముఖ్యమైన వారికి ఐదో పదో పదవులు, కొన్ని ప్రయోజనాలు కల్పించడం! అంతవరకే! కానీ వారిలో ఎవరూ ఆ పార్టీలో కీలక స్థానాలకు ఎదగలేరు! ఇక ముఖ్యమంత్రి పదవంటే మాటలా! ఇది దశాబ్దాలుగా రాజకీయ కుల సమరంలో ఎప్పుడూ ఓడిపోతున్న బడుగు వర్గాల కార్యకర్త పరిస్థితి! ఓట్ల పరంగా అధిక సంఖ్యాకులైనప్పటికీ.. అధికార పంపిణీలో మాత్రం చిన్నచూపే! టికెట్లు కేటాయించే దగ్గర మొదలు.. గెలిస్తే కీలక పదవులు కట్టబె అదే వివక్ష! బడుగులకు రాజ్యాధికారం సహించని తత్వమేనన్నది కడుపుమండినవారి విమర్శ! అది అగ్రకుల తత్వమేనన్నది సమాజాన్ని కాచివడపోసిన వారి మాట! ఏది ఏమైనా.. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నాయి! అగ్రకుల పెత్తనంలో కొనసాగుతున్న పార్టీలు వారిని ఆ స్థాయికి తీసుకురావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి! ఇది నగ్న సత్యం!రాష్ట్ర చరివూతలో అప్పుడు ఇప్పుడూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందని పండుగానే ఉంది. ఓట్ల రాజకీయాల కోసం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ఈ పార్టీలే దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోవడం గమనార్హం.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తమ ఆటలు సాగవనేది గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు బీసీలు ఉద్యమాలతో సంఘటితం కాకుండా దృష్టిమళ్ళించే చర్యలకు పాల్పడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినవారిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నప్పటికీ.. అధిక శాతం ఓట్లున్న బీసీలకు రాజకీయపార్టీలు తగిన రీతిలో టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ‘పదవుల్లో’ లేకుండా పోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రకుల పక్షపాత పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ ‘రాజకీయ అధికార’ సామాజిక నేపథ్యమే ఇందుకు నిదర్శనం. 1955 నుంచి 2004 వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థుల కుల నేపథ్యం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం పౌరులందరికీ ‘రాజకీయ సమానత్వం’ ఇచ్చింది. దీన్ని అన్ని స్థాయిల్లో ఆచరణలో నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చట్టసభల్లో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు వారి వారి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలదే బాధ్యతగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి స్పీకర్, మంత్రులు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీ అధినాయకులు, కేంద్రంలో, రాష్ట్రంలో నియమితులైన మంత్రుల సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాజకీయ సమానత్వం చట్టుబండలైన విషయం బట్టబయలు అవుతుంది.

గత అరవై సంవత్సరాల కాలంలో రాజకీయ నిర్ణయాధికారం అందరికీ సమానంగా రాలేదనేది నగ్నసత్యం. రాజకీయాధికారం సాధించిన కొన్ని అగ్రకులాలు జనాభా రీత్యా అల్ప సంఖ్యాకులైనప్పటికీ వారు తమ చేతుల్లోకి అధికారాన్ని వినియోగించుకుని త్వరితగతిన అభివృద్ధి సాధించగలిగారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అంతా ఆ కీలక ‘నిర్ణయాధికారం’ చుట్టూ పరివూభమిస్తున్నది. నిర్ణయాధికారం లేని కారణంగా జనాభా పరంగా 0% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో సగభాగమైన మహిళలు వెనుకబాటుతనానికి, అసమానతలకు, వివక్షకు, దోపిడీకి నిరంతరం గురవుతున్నారు. ఫలితంగా ఈ వర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి రాజకీయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యంలేక కేవలం ‘ఓటర్లు’గా మిగిలిపోతున్నారు. రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కమ్మ, రెడ్డి కులాలకు ప్రస్తుతం కాపులు కూడా జతకలుస్తున్నారు. దీంతో మెజారిటీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వావలంబన, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి వాటిని కోల్పోతున్నారని బడుగు వర్గాల నేతలు విమర్శిస్తున్నారు.

బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్, టీడీపీలు
ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల(బీసీ) కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించాయి. అయితే ఆచరణలో బీసీలైన బలహీనవర్గాలకు ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందలేదు. సంక్షేమ పథకాలపై వివరీతంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వాలు ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఓట్లను రాబట్టుకున్నాయి. కానీ బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో బ్యాంకుల జాతీయకరణ, సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ, ఇరవై సూత్రాల అమలు, ఆర్థిక సరళీకృత విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ వెనుకబడిన కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి జరగలేదన్నది జగద్విదితం. వివిధ సంక్షేమ పథకాలు అన్నీ నిద్రావస్థలో నిమగ్నమయ్యాయి. ఫలితంగా బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి బయటపడి 192లో ఎన్.టి.రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఎన్టీర్ తన పార్టీని పటిష్టపరుచుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓట్ల రాజకీయాల్లో బీసీలు అన్ని పార్టీలకు అవసరమైనప్పటికీ వాస్తవంగా బీసీ జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా లభించలేదు. బీసీల సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన టీడీపీ.. అధికార పంపిణీ విషయంలో బీసీలకు మొండిచెయ్యి చూపింది. అందుకే మెజారీటీ బీసీలు టీడీపీకి ప్రత్యామ్నాయంగా మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఓట్ల రాజకీయాలు, అగ్రకులాల ఎత్తుగడల మధ్య బీసీ ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాలు, అధికారమార్పిడితో సమిధలుగా మారి రాజ్యాధికారానికి దూరమయ్యారు.

టిక్కెట్ల కేటాయింపుల స్థాయిలోనే దగా!
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికల్లో కేటాయించే టికెట్లలో అగ్రతాంబూలం అగ్రకులాలకే దక్కుతున్నదన్నది వాస్తవం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా దాదాపు 90 శాతం సీట్లు అగ్రకులాలకే ఇస్తున్నాయి. వాటిల్లో కాంగ్రెస్ సహజంగానే తన ఆధిపత్య కులమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. టీడీపీ తన ఆధిపత్య కులమైన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. పేరుకు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మాటలు చెబుతున్న ఈ రెండు పార్టీలూ తమ తమ సామాజిక వర్గాలకే పదవులు పొందే అవకాశం ఇస్తున్నాయి. పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీచ చేయలేని ఆర్థిక పరిస్థితులు బీసీలకు మరో ఆటంకం. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమున్నా బీసీల వద్ద తగినన్ని ఆర్థిక వనరులు, నియోజకవర్గమంతా ఒంటరిగా తిరిగి వ్యక్తిగతంగా ప్రచారం, బలసమీకరణ, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విధాన ప్రకటనలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు కలుగుతున్నాయి.

నైజాం స్టేట్ విలీనం తర్వాత
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు 1956లో అంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1962 ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు, ఆంధ్రవూపాంత ప్రజా ప్రతినిధులతో కలిసి ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ఏర్పాటైంది. మళ్ళీ ఆతర్వాత 1962లో ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ఒకేసారి సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ద్విసభ్య నియోజకవర్గాలున్నాయి. ఆయా స్థానాల్లో జనరల్ అభ్యర్థితో పాటు అదే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉండేది. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ద్విసభ్య 23 అభ్యర్థులు, తెలంగాణ ప్రాంతంలో ద్విసభ్య 21 మంది అభ్యర్థులు కలిపి మొత్తంగా 44 ద్విసభ్య నియోజకవర్గాల నుంచి ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధి గెలిచే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా రూపొందించి 54 శాసనసభ స్థానాలను షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ)లకు రిజర్వు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 10 స్థానాలు అదనంగా పెరిగినప్పటికీ వారికి కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకు ముందు వరకు ఎస్సీ, ఎస్టీల్లో జిల్లాకు కనీసం ఒక్కరిద్దరికైనా ప్రాతినిధ్యం దక్కేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దీనికి గండిపడినట్లయ్యింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఏర్పాటులో స్థానాల గుర్తింపు వల్ల శాసనసభ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగి జిల్లా స్థాయిలో సంఖ్యాపరంగా భిన్నత్వం గోచరిస్తున్నది. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తదుపరి 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాలో న్యాయం జరగలేదనే అభివూపాయం ఇప్పటికీ వ్యక్తం అవుతున్నది. దీంతో అధికార వ్యవస్థలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర పరిమితంగానే ఉంటోంది.




kulam talangana patrika telangana culture telangana politics telangana cinema


Take By: T News

Read more...

Tuesday, January 24, 2012

తెలంగాణ నిరుద్యోగకి ఆంద్రా సర్కార్ దగా!

- పది జిల్లాల్లో 9వేల మందిపై కేసులు
students1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- హత్యాయత్నం కేసులు సహా కొందరిపై పదుల సంఖ్యలో..
- పిడమర్తి రవిపై 151 కేసులు
- ముందుకొచ్చిన 1.16 లక్షల ఉద్యోగాలు
- కేసులున్న ఉద్యోగార్థులకు మొండి చెయ్యే
- చురుకైనవారికీ దక్కని పోస్టులు!
- కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ తాత్సారం
- మరో రెండేళ్లు పట్టే అవకాశం
- ఈలోగా జోరుగా నోటిఫికేషన్‌లు
- హడావిడిగా పరీక్షలకు ఏర్పాట్లు
- పట్టించుకోని టీ ప్రజా ప్రతినిధులు
- ఉద్యోగాలను సీమాంవూధకు తరలించే కుట్ర
- కేసులు ఎత్తేసేదాకా పోరాడుతాం
- తేల్చిచెబుతున్న తెలంగాణ విద్యార్థిలోకం

కళ్లముందు ఆశగా కనిపిస్తున్న లక్షాపదహారువేల ఉద్యోగాలు! వాటిని అందుకునేందుకు పోటీ పడినా.. అడ్డుకుంటున్న కేసులు! ఎత్తివేతకు హామీ ఇచ్చిన కేంద్రం.. ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంది! కేంద్రం ఆదేశాలను పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది! ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రాంత నేతలు.. ఇది తమకు సంబంధించిన విషయం కాదని దులిపేసుకుంటున్నారు! తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ హోం శాఖను నిర్వహిస్తున్నా.. జరిగిన న్యాయం లేదు! నిలదీయాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మనకెందుకుకొచ్చిన వ్యవహారమన్నట్లు చూసీ చూడకుండా పోతున్నారు! మధ్యలో టీ ఎంపీలు కేసుల ఎత్తివేత కోసం నిరసన దీక్షలకు దిగినా..


అది ఉత్తుత్తి దీక్షగా మిగిలిపోయింది! ఉద్యమ శక్తులు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు! చూస్తాం.. చేస్తాం.. ఎత్తేస్తాం.. అన్న మాటలే తప్పించి.. కేసుల ఎత్తివేత ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి! వెరసి.. తెలంగాణ నిరుద్యోగి మరోసారి దగా పడుతున్నాడు! యూనివర్సిటీ దాటుకుని.. ఉపాధి వేటలో పడుతున్న విద్యార్థి.. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నాడు! 2009 పరిణామాలు మొదలుకుని.. తాజాగా సకల జనుల సమ్మె వరకూ వివిధ సందర్భాల్లో పెట్టిన కేసులు కలవర పెడుతుండగా దాదాపు 9వేల మంది రానున్న 1.16 లక్షల ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్నారు! అటు ఉద్యమాన్ని నీరుగార్చడానికి విద్యార్థులపై పుంఖానుపుంఖాలుగా కేసులు తెరిచిన ప్రభుత్వం..

ఇప్పుడు తెలంగాణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగుల నోట్లో మట్టికొ సిద్ధమవుతోంది! ఇన్నాళ్లూ జరిగిన మోసాలను భరించి, ఇక భరించలేక తెగించి కొట్లాడే తత్వాన్ని అలవర్చుకున్న విద్యార్థులు.. తక్షణ సమస్యగా ముందుకొచ్చిన కేసుల ఎత్తివేతపై మరో సమరశీల పోరాటానికి సిద్ధపడుతున్నారు! ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలపై సమరభేరీ మోగిస్తున్నారు!

హైదరాబాద్, జనవరి 23 (టీ న్యూస్): తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర సర్కార్ మరో ద్రోహం తలపెడుతోందా? లక్షా పదహారువేల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతూ ఉద్యమాన్ని పలుచన చేయడానికి పావులు కదిపిన ప్రభుత్వం.. అవే ఉద్యోగాలను తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కకుండా కుట్ర చేసిందా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. వాటిని ఎత్తేయడంలో ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందా? కేసుల సంగతి తేల్చకుండానే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ముగించేసేందుకు హడావిడి పడుతోందా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించి, దగ్గరపెట్టుకోవడం గమనిస్తే..

కేసులు లేని విద్యార్థుల భవిష్యత్తుతో సైతం ప్రభుత్వం ఆటలాడుకునేందుకు సమాయత్తమవుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని విద్యార్థి నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని, మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేందుకు సర్కారు సిద్ధమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం వారి ఆటలు కొనసాగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.

cuffs-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదశాబ్దాల ఆరాటమైన తెలంగాణ కోసం జరుగుతున్న మలిదశ పోరాటంలో విద్యార్థులు అగ్రభాగాన ఉన్న విషయం తెలిసిందే. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చటానికి విద్యార్థులు పోలీసుల లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వేర్వేరు రూపాల్లో నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకులు విద్యార్థులపై కక్షగట్టారని ఉద్యమక్షిశేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాకుండా చేయటానికి శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని చాపకింది నీరులా అమలు చేస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నవారిపై పోలీసులతో విచ్చలవిడిగా కేసులు నమోదు చేయించారని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఉద్యమంలో ముందుంటున్న ఒక్కో విద్యార్థిపై పది నుంచి ఇరవై వరకు కేసులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

తీవ్రమైనవిగా పరిగణించే రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌తోపాటు ఐపీసీ 324, 332, 333, 149, 353, 149, 120(బీ), 147, 148 రెడ్‌విత్ 149, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం చేశారన్న నేరారోపణలపై 307 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారని వివరిస్తున్నారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో దాదాపు 9 వేల మంది విద్యార్థులపై కేసులు ఉన్నాయని అంచనా. వీటిని అడ్డం పెట్టుకుని పోలీసులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేయటం, బెయిల్ మీద బయటకు రాగానే మరో కేసులో అరెస్టు చూపించి మళ్లీ జైలుకు పంపించటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని లక్ష్యం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు భాగం కాకుండా చేయాలన్నదేనన్నది సుస్పష్టమని వారు పేర్కొంటున్నారు.

ఇచ్చిన మాట బుట్టలోకి
‘డిసెంబర్ 9 ప్రకటన’ చేసిన రోజునే అప్పటి వరకూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చారు. కానీ మళ్లీ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగింది. ఇదే అంశంలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసనతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు మరోసారి హామీ ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు కూడా పంపింది. అయితే, ఇక్కడి సీమాంధ్ర పాలకులు మాత్రం ఈ దిశలో అవసరమైనంత వేగంగా చర్యలు తీసుకోవటం లేదు. ఈ విషయమై పోలీసుశాఖలోని సీనియర్ అధికారులతో మాట్లాడితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినట్టుగానే కేసుల ఎత్తివేత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని కేసులను ఇప్పటికే ఎత్తివేశామని, మిగతావాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు మాత్రం అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావటం లేదు. చట్ట ప్రకారం జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఏడాది.. రెండేళ్లు పట్టొచ్చు..అంతకన్నా ఎక్కువ సమయం కావచ్చని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి కావాలనే ఇలా చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా చేయాలన్నదే దీని వెనక లక్ష్యమని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారాలో ఉద్యోగాల భర్తీకి పరీక్షలను ప్రభుత్వం జరిపిస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఉత్తీర్ణత సాధించినా...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు హాజరై ఉత్తీర్ణత సాధించినా వారికి కొలువులు దక్కే పరిస్థితి లేదు. దీనికి కారణం వారిపై కేసులను ఎత్తివేయకపోవటమే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఎవరైనా ఉత్తీర్ణత సాధిస్తే వారిపై పోలీసులతో ఎంక్వయిరీ జరిపిస్తారు. అందలో వారిపై ఎలాంటి పోలీసు కేసులు లేవని నిర్థారణ అయితేనే ఉద్యోగం ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. నమోదైన కేసుల నుంచి వాళ్లు నిర్దోషులుగా బయటపడితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులే పేర్కొంటున్నారు. కేసుల ఎత్తివేత ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించటం లేదు. ఫలితంగా తెలంగాణకు చెందిన దాదాపు 9 వేలమంది విద్యార్థులు సమర్థత ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

కేసులు లేనివారిని సైతం...
కేసులు ఎదుర్కొంటున్నవారి పరిస్థితి ఇలా ఉంటే కేసులు లేనివారిని సైతం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారమే తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న వేలాదిమంది విద్యార్థుల వివరాలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్, స్పెషల్‌వూబాంచ్ విభాగాల సిబ్బందితో సేకరించి పెట్టుకుంది. వీరిలో మరింత క్రియాశీలకంగా ఉన్నవారిని పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోంది. 2008లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2011లో నిర్వహించిన ఎసై్స రాతపరీక్షల్లో ఉస్మానియా వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులకు ఇదే అనుభవం ఎదురైంది. ఉద్యమం కారణంగా తాము పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని, కొంత గడువు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులు పలువురు అప్పట్లో డిమాండ్ చేశారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు ఇదే డిమాండ్‌తో సీఎం, హోంమంత్రి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌తోపాటు పలువురిని కలిసి వినతిపవూతాలు సమర్పించారు.

వీరి విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వం పోలీసుల ద్వారా వారి వివరాలను మాత్రం సేకరించింది. ఆ తరువాత జరిగిన ఎసై్స రాతపరీక్షలకు వీళ్లంతా హాజరయ్యారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోవటం గమనార్హం. మార్కుల షీట్ల కోసం అడిగితే మీరంతా డిస్‌క్వాలిఫై అయ్యారన్న సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. ఇలా చెబుతూపోతే మరిన్ని ఉదంతాలున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపైనే తెలంగాణవాదులు మండిపడుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగాల ప్రకటనతో...
ఒకవైపు తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను దూరం చేయటానికి వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. నిన్నమొన్నటి దాకా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చిన పాలకులు తాజాగా వేర్వేరు శాఖల్లో 1.16లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. సాధారణంగా కేసులు ఉంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలకు అనర్హులవుతారు. ఇదే ఆలోచించిన ప్రభుత్వం.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామంటూనే జాప్యం చేస్తూ.. మరోవైపు ఉద్యోగాల భర్తీకి మాత్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

- మరోసారి ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు
రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థులపై కేసులు ఎత్తేయకపోవటం దారుణం. విద్యార్థులు మళ్లీ ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా శాశ్వతంగా ఉద్యోగాలకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులు ఇప్పటివరకు ఎత్తేయకపోవటం పట్ల ఉద్యోగాల భర్తీలో సీమాంవూధులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా కుట్ర చేస్తున్నది. అన్నం పెడతాం రమ్మంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి తలుపులు మూసివేసినట్లుగా ఉంది. విద్యార్థులపై పెట్టిన కేసులు భేషరతుగా వెంటనే ఎత్తివేయాలి.
- చుక్కా రామయ్య, విద్యావేత్త


అన్నా టీంపై పెట్టని కేసులు ఇక్కడెందుకు?
అవినీతిపై పోరాడుతున్న అన్నా బృందంపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు దానిని ఒక సామాజిక ఉద్యమంగా పరిగణించే కేసులు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమమూ సామాజిక ఉద్యమమే. అలాంటప్పుడు తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎందుకు పెట్టారు? ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే ఆలోచనతో ఉంటే వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి. విద్యార్థులు ప్రజల ఆకాంక్ష కోసం ఉద్య మించారు. అక్రమ కేసుల కారణంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీసాలు లభించటం లేదు. వెంటనే కేసులు ఎత్తివేసి వారికి న్యాయం చేయాలి.
- పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఉస్మానియా ఆర్ట్స్ విభాగం మాజీ డీన్


వివక్షకు ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలి?

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా వివక్ష ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేస్తోంది. దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. కేసులు వెంటనే ఎత్తివేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
- డాక్టర్ పి. మధుసూదన్‌డ్డి, ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్


ఉద్యమాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ కుట్ర
తెలంగాణ విద్యార్థులు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదిక 8వ అధ్యాయంలో ఉద్యమాన్ని అణివేత నిర్వహణకు సూచించిన అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగంగానే లక్ష ఉద్యోగాలు ఆశ చూపి విద్యార్థులు ఉద్యమాల వైపు చూడకుండా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాపార భాగస్వామ్య సదస్సులో ప్రైవేటు రంగంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా సీమాంధ్ర కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగాలు సీమాంధ్ర విద్యార్థులకే లభిస్తాయి. తెలంగాణ వారికి మిగిలింది ప్రభుత్వ ఉద్యోగాలు మత్రమే. ఆ ఉద్యోగాలు కూడా దక్కకుండా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా భవిష్యత్తులో ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావని విద్యార్థులను భయవూభాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసులు ఎత్తి వేయటం లేదు.
- ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్

ఉద్యోగాలతో లింకుపెట్టవద్దు
విద్యార్థులు కేవలం వారి వ్యక్తిగత అవసరాలకు చేసిన ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజావూపయోజనాల కోసం వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించింది. ఇది చాలా దారుణం. వెంటనే వారిపై పెట్టిన కేసులు భేషరతుగా ఎత్తివేయాలి. ఉద్యమాల నుంచి విద్యార్థులు ఉద్యగాల వేటలో పడ్డారు. ఉద్యమ కేసులకు ఉద్యోగాలకు లింకుపెట్టవద్దు. కేసులు ఎత్తివేసి తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమన్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- ప్రొఫెసర్ వినయ్‌బాబు, ప్రిన్సిపల్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ

Take By: T News

Read more...

Sunday, January 22, 2012

చేనేత రుణమాఫీకి వడ్డీల మోత!

-మాఫీ ప్రకటించి రెండేళ్లయినా
- పూర్తి నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- రూ.312 కోట్లలో విడుదలైంది 114 కోట్లే
- వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అంటున్న బ్యాంకులు

23SDP03E-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జనవరి 21( ): పాత రుణాలు మాఫీ కావు.. కొత్త రుణాలు అందవు.. వడ్డీల మోతతో బ్యాంకుల హుకూం.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులివి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తున్నామని 2009లో ప్రకటించిన ప్రభుత్వం రెండేళ్లయినా ఆ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. మూడో వంతు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇదిలాఉండగా ప్రభుత్వం విడుదల చేసే అసలు సొమ్ముతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రుణాల్ని మాఫీ చేస్తామంటూ బ్యాంకులు నిబంధన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు అంద దీంతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

గొప్పగా ప్రకటించి..
చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం 2009లో ప్రకటించింది. ఈ మేరకు 2008, మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సహకార సంఘాలు, ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న రుణాలను (239 కోట్ల రూపాయలను) వడ్డీ కలిపి (రూ.312 కోట్లు) మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో సుమారు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం కలిగింది. అయితే రుణ మాఫీని అమలు చేయడంలో సర్కారు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 2009-10 బడ్జెట్‌లో రూ.312 కోట్లను కేటాయించినా నిధులను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో నిధులను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పింది.

తీరా రూ.109 కోట్లను మాత్రం విడుదల చేసింది. 2010, మార్చి నాటికే విడుదల చేయాల్సిన ఈ నిధులు 2011, ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఈ జాప్యాన్ని పట్టించుకోని బ్యాంకులు 2010, ఏప్రిల్ నుంచి వడ్డీ కట్టాలని తేల్చిచెప్పాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రుణమాఫీకి రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తం రూ.312 కోట్ల రుణమాఫీ నిధుల్లో ఇప్పటివరకు రూ.114 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసినా చేనేత బడ్జెట్‌లో పదో వంతు నిధులు కూడా విడుదల చేయకపోవడం చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఇప్పటికే 20 నెలలకు చేరిన వడ్డీ భారం
2010, ఏప్రిల్‌లో విడుదల చేసిన రూ.109 కోట్ల రుణమాఫీ నిధులకు సంబంధించి లబ్ధిదారులు 20 నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంది. మిగతా రుణ నిధులు ఎప్పుడు విడుదలవుతాయో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఒకవేళ ఈ నిధులు త్వరలోనే విడుదలైనా వడ్డీ భారం తడిసిమోపెడు కానుంది. అసలు కంటే వడ్డీ భారం అధికమయ్యే ప్రమాదమూ లేకపోలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పాత రుణాలు మాఫీ కాక ఇటు కొత్త రుణాలు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP