Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Hyderabad. Show all posts
Showing posts with label Hyderabad. Show all posts

Sunday, January 13, 2013

నిత్యం తోడేళ్ళు సంచరిస్తుండే లోకంలో చెల్లీ ! జర జాగ్రత్త !



roadఢిల్లీ ఉదంతం తర్వాత దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. చదువుకునే లేదా ఉద్యోగాలు చేసే తమ బిడ్డలు ఎంత సురక్షితంగా ఉన్నారన్న సందేహం వారిని వెంటాడుతోంది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పరిసరాలు ఎంత పదిలమో పరిశీలించుకునేందుకు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ అందిస్తున్న సూచనలు.

క్రూర మృగాలుండే దట్టమైన అడవుల్లో కూడా ఒకే చక్కటి నిబద్ధత ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఈ క్రూరమృగాలు అనవసరంగా బలహీన జంతువులను తమ వినోదం కోసం చంపవు. చిన్న ప్రాణుల ప్రాణాలతో ఏ క్రూరమృగం చెలగాటాలు ఆడవు. మరి ఇదే నిబంధన మన సభ్య సమాజానికి వర్తిస్తుందా? ఢిల్లీలో మొన్న జరిగిన కిరాతకం, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇంకా ఎన్నో సంఘటనలు, మనల్ని మరోలా ఆలోచించేట్టు చేస్తున్నాయి.

ఈ కాలంలో ఇటు అమ్మాయిలూ, అటు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయిల భవిష్యత్తు బంగారు బాటగా మారేట్టు జాగ్రత్త పడాలి. అమ్మాయిలను సమస్యల వలయంలో చిక్కుకోకుండా కాపాడుకోవాలి. అమ్మాయిలు కూడా తమను తాము నియంత్రించుకోవాలి. అలాగని ఇంతవరకు జరిగిన విపత్తులకు అమ్మాయిలే బాధ్యులు అని అనుకోవడం, అతిపెద్ద పొరపాటు. అమ్మాయిల జీవితాలు సవ్యంగా ఉండేలా, వాళ్ళు సవ్యంగా ఎదిగి, వాళ్ళ జీవితం మూడుపువ్వులు, ఆరు కాయలు కావడా నికి, వాళ్ళేమి చేయాలి? అమ్మానాన్నల బాధ్యతలేమిటి? అన్న విషయాలను చర్చించు కోవడం సమంజసమే.

చదువు పైనే ధ్యాస
విద్యార్థినులు ఐడిల్‌గా ఉండకూడదు. చదువుతూ పోవాలి. ప్రఖ్యాత సైంటిస్ట్ ఇజాక్ న్యూటన్ కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుందని, చలనం లేని వస్తువు నిశ్చలంగానే ఉంటుందని తెలిపాడు. ఇది చదువుకూ వర్తిస్తుంది. శ్రద్ధతో చదువుతున్న విద్యార్థి చదువుతూ ఉంటే, పుస్తకమే ముట్టని వాళ్ళు, యధాతధంగా ఉండిపోతారు. అందుకే అమ్మాయిలూ ఎప్పుడూ చదువుతూ పోవాలి. వాళ్ళెప్పుడు చదువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఆలోచనలు ప్రవర్తనల కింద మారుతాయి. ఈ ప్రవర్తన అలవాటు కింద మారుతుంది. అప్పుడు సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచనలు మనసులో మెదలాడవని మనకు తెలుసు. అలాగని అమ్మాయిలు సినిమాలు చూడ కూడదని, షికార్లకు వెళ్లకూడదని అనుకోకూడదు. చదువుకుంటూ అవన్ని చేయవచ్చు. కానీ వాళ్ళు బాయ్‌ఫ్రెండ్స్‌తో సమయం వెళ్ళబుచ్చుతూ, తీసు కోవలసిన జాగ్రత్తల్ని మాత్రం మరవొద్దు.

మంచి స్నేహం ఒక కవచం
పాత కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు యోధులు కవచాన్ని ధరించేవారు. ఈ కవచం శత్రువుల కత్తిపోట్ల నుంచి యోధుణ్ని రక్షించేది. స్నేహం కూడా ఈ కవచంలాంటిదే. కవచం శరీరాన్ని కాపాడితే, స్నేహం మనస్సును గాయపడకుండా కాపాడుతుంది. స్నేహం కేవలం మనస్సును బాధలతో తట్టుకునేట్టు కాపాడడమే కాకుండా, మనిషి జీవితం లోనే ఒక సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. అందుకే ‘ఏనాయిస్ నిన్’ అనే ప్రముఖ విద్యావేత్త ఉద్దేశ్యం ప్రకా రం ప్రతి మిత్రుడు మనకొక కొత్త ప్రపంచం. మిత్రుడు తారసపడే వరకు మనకు ఈ ప్రపంచమే లేదు. వాళ్ళను కలుసుకున్న తక్షణమే ఈ కొత్త ప్రపంచం ఎల్లలు మనసు స్పర్శిస్తాయి.

హెన్రీ స్టాక్ సుల్లివాన్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ మిత్రత్వానికి ఎక్కువ ప్రముఖ్యత ఇస్తాడు. విద్యార్థుల మానసిక మెరుగుదల, ఎదుగుదల మిత్రుల పైననే ఆధారపడి ఉంటుందంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు అడాలిసెంట్స్, ప్రధమం గా మిత్రులతోనే చెప్పుకుంటారని, పార్లీ అనే సైకాలజిస్ట్ చెబుతాడు. మంచి స్నేహితురాలు విద్యార్థినికి ఒక కొత్త స్పూర్తిని ఇస్తుంది. ఒక చక్కటి గమ్యాన్ని నిర్ణయించుకొనేందుకు సహకరిస్తుంది. అల్లరి చిల్లరగా తిరుగుతూ, ప్రస్తుత కోరికల సంతృప్తికే ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి స్నేహితు రాలుగా దొరికితే మాత్రం ఒక సమస్యగా మారుతుంది. తాజెడిన కోతి, వనమెల్ల చెరిచింది అనే సామెత మాదిరి, ఈ అమ్మాయి స్నేహం వలన మిగతా పిల్లలు కూడా ఇదే వంతు పాట పాడుతారు. అప్పుడు అమ్మాయిలు ప్రమాదాల్ని ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకే అమ్మాయి స్నేహితులు ఎలాంటి వాళ్ళు అన్నది అమ్మానాన్నలు గమనించాలి. అలాగని అమ్మాయిల పైన మరీ పోలిసీంగ్ కూడా చెయ్యకూడదు.

తెలివితేటలు దేవుడిచ్చిన బహుమానం
మనం ఒక మిత్రుని పుట్టిన రోజు పార్టీకి వెళ్లామని అనుకుందాం. అతనికి మనమొక చక్కటి బహుమానం తీసుకెళ్ళతాము. ఈ బహుమానాన్ని మిత్రునికి ఇచ్చినప్పుడు, అతని దాన్ని దగ్గరున్న చేత్త బుట్టలోకి విసిరేస్తే, మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. లాగి లెంపకాయ కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. మనమిచ్చిన బహుమానాన్ని అవమానపరిస్తే,మనల్ని అవమానపరచినట్టు బాధ పడతాం. మరి తెలివితేటలు దేవుడు మనకి చ్చిన బహుమానం.ఈ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించి మనం ఎదగకపోతే, దేవున్నే అవ మానపరిచినట్టు అవుతుంది కదా? ఈ విషయాన్ని అమ్మాయిలు గుర్తుంచుకోవాలి. ఒకవేళ అమ్మాయి లు మరచి పోతే అమ్మానాన్నలు గుర్తు చేయ్యాలి.

నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు
మరణం పట్ల అందరికుండే ఆలోచన మనందరికి తెలుసు. మరణం ఖాయమైనప్పటికి, ‘ఇది నాకు వర్తించదు మిగతా వాళ్ళకే ఇది పరిమితం. నేను చనిపోను. అని ప్రతి వ్యక్తి అనుకుంటాడు’ అని జొనాధన్ బ్రూనెస్టీన్ అనే ప్రముఖ ఫిజిషియన్ అంటాడు.

దీన్నే సైకాలజీలో ఎస్కేపిజం అని అంటాము. ఇలాంటి ఎస్కేపిజం మనం అడోలిసెంట్స్ దశలో గమనిస్తాం. ఈ దశలో ఉన్న పిల్లలు, అమ్మాయిలైన, అబ్బాయిలైనా చాలా రాష్‌గా ప్రవర్తిస్తారన్ని మనకు తెలిసిందే. నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు, అనే ఆలోచన వీరిది. ఈ దశలో వీళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ఈ వయస్సులో మరణించడం జరిగితే, 40శాతం పైగా మోటారు ప్రమాదాల్లో జరుగుతుందని సర్వేలు తేలిపాయి. కేవలం మోటార్ సైకిల్స్, కార్లు వేగంగా నడపడమే కాదు, వీళ్ళ జీవితమే ఫాస్ట్‌లేన్‌లో ఉంటుంది. సెన్సేషన్ -సీకింగ్ వీళ్ళ వేదాంతం. అందుకే ఈ వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు అనవసరమైన రిస్క్ తీసుకుంటారు. చీకటిపడ్డా ఒంటరిగా పోవాలను కుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి సమయాన్ని పట్టించుకోకుండా ఇంటికి రావాలనుకుంటారు. నాకేమీ జరగదులే అని భావిస్తారు. అమ్మానాన్నలు, అమ్మాయిలను ఇలా ప్రవర్తించకుండా నియంత్రిం చాలి. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న వ్యవహారాలు మనందరి కళ్ళు తెరిపించాలి.

ప్రేమ ఒక ఎండమావి ఈ కాలంలో కొంతమంది అమ్మాయిల సమస్యల్లా, ప్రేమలో పడ్డామని భ్రాంతి పడడం. ఈ భ్రాంతి వీళ్లను , అబ్బాయిలైతే స్వేచ్ఛగా తిరిగేట్టు ప్రేరేపిస్తుంది. ప్రేమించాను అని అనుకున్న అబ్బాయిలైతే సినిమాలు, షికార్లు మొదలవుతాయి. అప్పుడు అమ్మానాన్నల మాటలు నీటి మూటలనిపిస్తాయి. చదువు కాస్తా చట్టబండలౌతుంది. నిజం చెప్పాలంటే ఈ వయస్సులోని అమ్మాయిల్లో చెలరేగే శారీరక ఉత్తేజాన్ని ప్రేమ అని నిర్వచించడం పొరపాటు. ఇది కేవలం ఈవయస్సులో శరీరాల్లో విడుదలవుతున్న హార్మోన్స్ ప్రభావం వల్ల, వీళ్ళలో కలిగే శారీరక ఉత్తేజం అని , ప్రేమ కాదని తెలుసుకోవాలి. అందుకే వీళ్ళు ప్రేమ అనుకునే ఈ మానసిక స్థితి ఎక్కువ కాలం నిలవదు. సైకాలజిస్ట్‌ల సర్వేల ప్రకారం అడోల్‌సెంట్స్ లో ప్రేమనుకొని దగ్గరయ్యేవాళ్ళు, అతి త్వరలోనే మళ్ళీ దూరమవుతారని తేలిపోయింది. అందుకే ప్రేమని భ్రమపడి, కొంతకాలం రాసుకొని,పూసుకొని తిరిగిన అమ్మాయిలు త్వరలోనే తెలుసుకొని, అబ్బాయిలనుండి విడిపోతారు. ఇటు అబ్బాయేమో, ‘మనసు పారేసుకున్నాను,సినిమాలకు, షికార్లకు ఈమెను తిప్పి నా మొత్తం డబ్బు తగలేసాను.

అయినప్పటికి ఈమె నాకు చెయ్యిచ్చింది.’ అనుకొని బాధపడతాడు. ఈ అబ్బాయి కాస్తా పోకిరి వాడైతే లేదా దుష్ట స్వభావం కలవాడైతే అమ్మాయికి ప్రమాదమే. ఇలాంటి అబ్బాయిలు యాసిడ్ దాడులు చేయ్యొచ్చు. ఇంకేదైనా దుష్ట చేష్టలు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, వయస్సులో ఉన్న అమ్మాయిలు ఎక్కువ సమయం అబ్బాయిలతో ఒంటరిగా కలిసి తిరుగకూడదు. గ్రూప్‌లో అందరితో కలిసి మాత్రమే మెలగాలి. అలాకాకుండా అమ్మాయి ఒంటరిగా అబ్బాయితో కలిసి తిరుగుతూ సమయం గడుపుతుందంటే, అమ్మానాన్నలు తెలుసుకుని తక్షణం రంగంలోకి దూకాలి. పనుల్లో మునిగి, ఆలస్యం చేయకూడదు.

Read more...

Thursday, December 27, 2012

Muslim women on top in the battle against premarital sex: US Study

Hyderabad, December 26:
The burqa really works. When you cover your women head to toe with cloth to keep them from being viewed by men outside their family, and you keep them strictly segregated from men throughout their growing years until they get married, you’re going to have less premarital sex.

That was the Rev Paul Sullins’ reaction to a new study on sex outside marriage. Sullins is a sociologist at the Catholic University of America.

With their “True Love Waits” jewelry, conferences and T-shirts, Christians may be the face of the abstinence movement, but Muslims are more likely to abstain from premarital sex.

Of all the world's major religious groups, Muslims are the least likely to have sex outside of marriage, new research found. And as a country's Muslim population grows, the rate of premarital sex declines for all residents, even non-Muslims, according to the study.

Researchers analyzed the responses of over 620,000 people (ages 15-59) who were interviewed as part of the Demographic and Health Surveys in 31 mostly developing nations from 2000 to 2008. Most countries included in the sample had either a Muslim or Christian majority, except India and Nepal, which have Hindu majorities, and Cambodia which has a Buddhist majority. (The United States was not included in the study.)

That’s the conclusion of a new study in the American Sociological Review, which also found that Muslims and Hindus — at least in the developing world — are more likely than Christians and Jews to refrain from extramarital sex.

“All major world religions discourage sex outside of marriage, but they are not all equally effective in shaping behavior,” said Amy Adamczyk of the John Jay College of Criminal Justice, who co-authored the study with John Jay doctoral student Brittany E. Hayes.

Adamczyk said the study evolved from another study she was doing that found countries with large Muslim populations have very low rates of HIV and AIDS. “I was trying to figure out why that would be,” she said. One reason she considered was lower rates of sex outside of marriage.

“In many countries around the world — but in Muslim countries specifically, there’s just much less interaction between the sexes,” said Adamczyk. “It’s just going to be much less likely that they’re going to meet a potentially romantic partner.”

Drawing on the Demographic and Health Surveys funded by the U.S. Agency for International Development, the study included data from 31 developing nations collected between 2000 and 2008. The authors focused on individuals’ responses to questions on religious affiliation, marital status, and sexual behavior outside of marriage.

The authors hypothesized that the larger the proportion of Muslims and Hindus in a country, the lower the rates of premarital and extramarital sex.

Adamczyk and Hayes found that 94 percent of Jews in the nations they studied reported having premarital sex, compared to 79 percent of Christians, 65 percent of Buddhists and 43 percent of Muslims.

As for extramarital sex, 4 percent of Jews reported having sex outside of marriage, compared to 3 percent of Christians. Less than one percent each of Muslims, Hindus and Buddhists reported having extramarital sex.

Suzy Ismail, a marriage and divorce counselor and the author of several books on Muslim marriage, said low rates of premarital and extramarital sex among Muslims are rooted in the religion.

Read more...

Tuesday, September 18, 2012

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Tuesday, July 3, 2012

శాఖ కరెంటు టెంటు ఆంధ్రోళ్ల టెంటు

Power500 talangana patrika telangana culture telangana politics telangana cinema

తరలిపోయిన
కీలక ప్రాజెక్టులు
యథేచ్ఛగా
ఉద్యోగాల దోపిడీ
తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన
ప్రాజెక్టులను సీమాంవూధకు
తరలించడం ద్వారా ఉద్యోగాల్లో జరిగిన నష్టం
వనరుల్లేనిచోట పవర్‌ప్లాంట్లు
తెలంగాణకు మొండి చేతులు
ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు
పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
కోల్పోయిన తెలంగాణ ప్రాంతం
సీమాంధ్రలో నూరుశాతం స్థానికులే
అందుకోసం జీవోలూ జారీ
నెల రోజుల్లో అమలైన జీవో 564
దశాబ్దంగా మూలపడి
ఉన్న జీవో 610
నిర్ణయాత్మక స్థానాల్లో
సీమాంధ్రులు
వారి ప్రాంతాలకు
అనుగుణంగా జీవోలు
కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు
dddd talangana patrika telangana culture telangana politics telangana cinema

తెలంగాణ ప్రాంతంలోని జెన్‌కో పవర్ ప్రాజెక్టుల్లో 60 శాతం ఉద్యోగులు సీమాంవూధవారే! కానీ.. సీమాంవూధలోని జెన్‌కో ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జాడే కనిపించదు! తెలంగాణ ప్రాంతానికి నీరందించే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో 70 శాతం ఉద్యోగులు సీమాంవూధులే! కానీ.. విజయవాడలోని వీటీపీఎస్ ప్రాజెక్టులో కేవలం పట్టుమని ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు కూడా లేరు! 2011 మార్చి వరకు విద్యుత్‌రంగంలో 80,920 పోస్టులు మంజూరై ఉండగా, వాటిల్లో 23,366 పోస్టులు మాత్రమే తెలంగాణ వారికి దక్కాయి! ఇందులోనూ మూడు వేల మంది తెలంగాణకు వలస వచ్చినవారే! అంటే.. తెలంగాణ గడ్డపై పుట్టిన వారికి దక్కింది కేవలం 20వేల ఉద్యోగాలేనన్నమాట! అంతేకాదు.. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు సీమాంవూధకు తరలిపోవడంతో ప్రత్యక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. సమైక్యాంవూధలో తెలంగాణకు జరిగిన నష్టానికి విద్యుత్ రంగంలోని ఈ అన్యాయాలు మచ్చుతునకలు! విద్యుత్ బయటికి కనిపించదు.. కానీ పట్టుకుంటే షాక్‌కొడు తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలూ అంతే.. పట్టిచూస్తే కానీ అంతుచిక్కవు!!

శాఖ కరెంటు ఆంధోళ్ల టెంటు
తరలిపోయిన కీలక ప్రాజెక్టులు.. యథేచ్ఛగా ఉద్యోగాల దోపిడీ
- వనరుల్లేని చోట పవర్‌ప్లాంట్లు.. తెలంగాణకు మొండి చేతులు
- ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
- కోల్పోయిన తెలంగాణ ప్రాంతం.. సీమాంవూధలో నూరుశాతం స్థానికులే
- అందుకోసం జీవోలూ జారీ.. నెల రోజుల్లో అమలైన జీవో 564
- దశాబ్దంగా మూలపడి ఉన్న జీవో 610
- నిర్ణయాత్మక స్థానాల్లో సీమాంవూధులు
- వారి ప్రాంతాలకు అనుగుణంగా జీవోలు
- కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
- సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు

Contral0 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జూలై 2 (): సీమాంధ్రులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది! విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, 4 డిస్కమ్‌లలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కకుండా సీమాంవూధులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతల వాదన! లోతుగా తరచి చూస్తే.. నివురుగప్పిన అన్యాయం.. నిప్పులా కనిపిస్తుంటుంది. శాతాలు, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు వాటా దక్కినట్లు కనిపించినా.. కనిపించని అన్యాయం మరోటి ఉంది. అదే తెలంగాణ కోల్పోయిన ఉద్యోగాలు! విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు పుష్కలంగా లభ్యమవుతున్నా తెలంగాణ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకపోవడం, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నష్టపోయిన ఉద్యోగాలు 16వేలకుపైనే! ట్రాన్స్‌కోలో 8,302 మంది, జెన్‌కోలో 15,647 మంది, నాలుగు డిస్కమ్‌లలో 56,971 మంది ఉద్యోగులున్నారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కమ్‌లలో రెండు డిస్కమ్(ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లు పూర్తిగా సీమాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 26,605 మంది పనిచేస్తుండగా, సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 30,366 మంది ఉద్యోగులున్నారు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వలసవాదులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉండడంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్నారు. సీమాంవూధలో నూటికి నూరుశాతం అక్కడివారే ఉద్యోగాలు పొందుతుండగా అదే విధానం తెలంగాణలో ఎందుకు పాటించడం లేదన్నది ప్రశ్న!
Power10 talangana patrika telangana culture telangana politics telangana cinema

అంటే.. వంద మార్కులు వచ్చేలా చదివిన విద్యార్థికి 40మార్కులు వేసి.. అసలు ఒక్కమార్కు వచ్చేందుకూ ఆస్కారం లేని విద్యార్థికి 60 మార్కులు వేసిన ప్రభుత్వం.. సమతుల్యం పాటించామంటూ మోసగించే యత్నాలను నిస్సిగ్గుగా చేస్తున్నది! అంతేకాదు.. ఈ అన్యాయంలో పెను జీవన విధ్వంసం కూడా కనిపిస్తుంది. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా కోసం తెలంగాణ నుంచి బొగ్గు అందిస్తున్నారు. ఈ పేరుతో భారీ స్థాయిలో ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వి.. వందల వేల గ్రామాల ఉనికిని అదృశ్యం చేస్తున్నారు. వెరసి.. విద్యుత్ రంగంపై సీమాంధ్ర పాలకుల వివక్ష ఫలితంగా అటు ఉద్యోగిత పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగానూ తెలంగాణ నష్టపోయింది. మరోవైపు వనరుల్లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి బొగ్గు రవాణా, అక్కడి ప్రాజెక్టులనుంచి విద్యుత్ పంపిణీలో నష్టాలు కలిసి.. అక్కడ తయారయ్యే విద్యుత్ ఖరీదును అమాంతం పెంచివేస్తున్నది.

1969లో వికసించిన విద్యుత్ తేజం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున రాజుకొనడానికి నాంది పలికింది విద్యుత్ రంగమే! 1957లో ఏపీ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ టు రెసిడెన్సీ యాక్ట్‌ను విద్యుత్ బోర్డు.. నాటి ఎపీఎస్‌ఈబీలో అమలు చేయాలంటూ ఓ విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. దవానలంలా వ్యాపించి.. తెలంగాణ పది జిల్లాలకూ విస్తరించింది. జై తెలంగాణ అంటూ యావత్ ప్రాంతం నినదించేందుకు గొంతుక అయ్యింది! అదే స్ఫూర్తి విద్యుత్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నది.

మొన్నటి సహాయ నిరాకరణ ఉద్యమం, తదుపరి సకల జనుల సమ్మెలో విద్యుత్ తేజం వికసించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమరశంఖం పూరించింది. విద్యుత్ రంగంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకుండా సీమాంవూధులు కుట్రలు చేస్తే ఉప్పెనలాంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీ జాక్) హెచ్చరిస్తున్నది. గత ఆరు దశాబ్దాల చరివూతను నెమరేసుకుని సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయనేతలు మసలు కుంటారో, మలిఉద్యమాన్ని చవిచూస్తారో వారే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపజేయాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులుంటే ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Power50 talangana patrika telangana culture telangana politics telangana cinema

1957లో చట్టం
ఏపీ ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్-1957 ప్రకారం 14 ఏళ్లపాటు పాటు స్థానికంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ చట్టాన్ని విద్యుత్‌బోర్డు(ఎపీఎస్‌ఇబి)లో వర్తింపజేయాలని తెలంగాణ యువకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ చట్టం విద్యుత్‌బోర్డుకు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒక విద్యార్ధి చేసిన ఆమరణ నిరాహారదీక్ష తీవ్రత దావానలంగా తెలంగాణ జిల్లాలకు విస్తరించి 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు సైతం విద్యుత్‌బోర్డుకు 1957 చట్టం వర్తించదని హైకోర్టు తీర్పునే ఖరారుచేసింది. దాంతోపాటు 1957 చట్టం అమలుకు ముందున్న ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు 1971లో తీర్పు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న పీవీ నరసింహారావు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దానిని జీర్ణించుకోలేని సీమాంధ్ర రాజకీయనేతలు ముల్కీ రూల్స్ అమలుచేస్తే తమకు ఉద్యోగ అవకాశాలు దక్కవని గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షతో జై ఆంధ్రా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపందాల్చడంతో నాటి కాంగ్రెస్ అధిష్ఠానం పీవీతో సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఆ తర్వాత కేంద్రం 1974లో రాజ్యాంగ సవరణ (37) చేసి ముల్కీ నిబంధనలను తొలగించింది. అనంతరం 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అయితే నాడు అధికారంలో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయనేతల ఉద్యమం ఫలితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గిర్‌గ్లానీ కమిషన్ 2004లో ప్రభుత్వానికి సుదీర్ఘమైన నివేదిక సమర్పించింది. విద్యుత్ రంగానికి సంబంధించిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సంస్థల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని సిఫారసు చేసింది.

బొగ్గు సింగరేణిది-సోకు సీమాంధ్రులుది
విద్యుత్ రంగంలో మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులదే పైచేయిగా ఉంది. ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్‌రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్‌రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రం ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు, మరో అడుగు ముందుకేసి విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బొగ్గు ఆధారంగానే సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ.. సీమాంధ్ర పాలకులు వాటిని తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. దీనికి అదనంగా తెలంగాణలో బొగ్గు తవ్వకాలకు ఓపెన్‌కాస్టుల పేరిట పెను జీవన విధ్వంసం జరుగుతున్నది.

సీమాంధ్రులదే పెత్తనం......
విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అగ్రభాగంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన బడా కాంట్రాక్టర్లు 21మంది ఉంటే.. వారిలో 19మంది సీమాంవూధులే. ఇలాంటి పరిస్థితులకు నాటి సీఎం చంద్రబాబు ప్రధాన కారణమన్న విమర్శ బలంగా ఉంది. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసి, ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన హయాంలోనే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకుకు అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు హయంలో సీమాంవూధుల నక్కజిత్తుల కారణంగా ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఏపీఎస్‌ఈబీ నాటినుంచే సీమాంవూధులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో పనిచేసిన మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ, వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుట్రపూరితంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సంస్కరణల తదుపరి అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసినవారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌వూపాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎన్నో మతలబులున్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో ప్రాజెక్టు విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతోనే ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబు ఉంది. అంతే కాకుండా మర్చంట్ పవర్‌వూపాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టును ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా రైతుకూలీలు, పరిక్షిశమల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కొరవడింది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాలేదు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. సత్తుపల్లి ప్రాజెక్టు వస్తే తెలంగాణ సస్యశ్యామలమై ఉండేది. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు 2002లోనే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కేవలం 26 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.

గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. సకాలంలో ఇది పూర్తి అయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు వ్యవసాయ, పారిక్షిశామికరంగాల్లో తెలంగాణ దూసుకు పరిస్థితులుండేవి. ఇదే సమయంలో 2003లో సీమాంవూధకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే 220 మెగావాట్లు, వేమగిరి 370 మెగావాట్లు, గౌతమి 464 మెగావాట్లు, కోనసీమ 445 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 1400 మెగావాట్ల సామర్థ్యం గల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్నీ అనుమతులు వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసింది. కాంతానపల్లితోపాటు మరికొన్ని హైడెల్ పవర్ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయరంగం, పారిక్షిశామికరంగాలు ఎదగాల్సినంతగా ఎదలేకపోయాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది.

ఒప్పందాల ఉల్లంఘనలు
విద్యుత్ సంస్కరణల సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో అనేకం ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. గతేడాది సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు మెరుగైన కరెంటు సేవలు అందిస్తూనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమై కీలక భూమిక పోషించారు. సింగరేణి కార్మికుల సమ్మె, తదుపరి కరెంటోళ్ల సమ్మె సర్కారును ఇరకాటంలో పెట్టింది. దాంతో గత ఏడాది అక్టోబర్ 25న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. మొత్తం 13 అంశాలపై యాజమాన్యాలు అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎం జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరఫున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు.

జీవోల అమలులో ఎంతో తేడా
ఆచరణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడంపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలను తట్టుకునేందుకు 1985 డిసెంబర్‌లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్ 610 జీవో తెచ్చారు. విచిత్రం ఏమంటే 610 జీవో జారీకి నెల ముందు రాయలసీమ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 564ను తీసుకువచ్చింది. రాయలసీమ జిల్లాల్లో (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ఇతర జిల్లాల ఉద్యోగులు ఉండరాదనేది జీవో సారాంశం. ప్రభుత్వం ఈ జీవోను నెలలో అమలుచేసి రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఉన్నపళాన వెనక్కి పంపించింది. అప్పట్లో రాయలసీమ నేతలు తెలంగాణ ఉద్యోగుల పట్ల కిరాతకంగా వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఉద్యోగులు మరచిపోలేదు. కేవలం నెల గడువులో 564 జీవోను నిఖార్సుగా అమలు చేసిన ప్రభుత్వం దశాబ్దకాలంగా 610 జీవోను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదంటే తెలంగాణపై ఎంతటి పక్షపాతధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రత్యేకవాదులు అంటున్నారు.

రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌వూపాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పొతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒప్పందంలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్ (హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కాంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయి కల్పించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన (కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు
అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్తూపాన్ని
తెలంగాణ చౌరస్తా (మింట్ కాంపౌండ్)వద్ద ఏర్పాటు చేయడం.

Take By: T Media

Read more...

Monday, July 2, 2012

సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు


సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు

- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు

దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!


సర్కారీ ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు.. కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..! దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!

జిల్లావ్యాప్తంగా 71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు (బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1, బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు. పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.

దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది. 29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.

Take by: T news

Read more...

Friday, June 29, 2012

బి.ఇడి సీటు చాలా హాటు!


బి.ఇడి ఎంట్రన్స్‌ను తేలికగా తీసుకున్నవారు ఇప్పుడు కౌన్సిలింగ్‌లో సీటు కోసం కుస్తీ పట్టవలసి ఉంటుంది. సోషల్ స్టడీస్‌లో, బయోలాజికల్ సైన్స్, మేథమేటిక్స్ గ్రూపుల్లో ప్రతి సీటుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీపడుతుంటే ఇక ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా, ఐ.ఎ.ఎస్.ఇ. , కాకతీయ కాంపస్‌లలో సీటు రావాలంటే ర్యాంకు ఎంత కనిష్టంగా వుంటే అంత సులువు అవుతుందని తెలిసిందే. 2011 కౌన్సిలింగ్ ముగింపు ర్యాంకుల ఆధారంగా విశ్లేషణ.

బి.ఇడి సోషల్ స్టడీస్ మెథడాలజీలో 19,500 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 59,605. ఇక బి.ఇడి మేథమేటిక్స్ మెథడాలజీలో 16,250 సీట్లు ఉండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 25,257. బయోలాజికల్ మెథడాలజీలో 13,000 సీట్లు వుండగా, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 37,375. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 9,750 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 11,237, చివరగా బి.ఇడి ఇంగ్లీష్ మెథడాలజీలో 6,500 సీట్లు ఉండగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 3193. బి.ఇడి సీట్లు, సంబంధిత బి.ఇడి మెథడాలజీ సీట్లు, ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను బట్టి చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ మినహాయిస్తే అన్ని మెథడాలజీలలో అందుబాటులో ఉన్న సీట్లకంటే అర్హత గల అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక గత ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,92, 389) కంటే, ఈ ఏడాది బి.ఇడికి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య (1,36,667).

57 వేలు తగ్గినప్పటికీ నిర్థిష్ట మెథడాలజీలల్లో పోటీ కనిపించటం విశేషం. డియస్సీ రిక్రూట్‌మెంటులో ఎస్.జి.టి. పోస్టులకు బి.ఇడి. అభ్యర్థులను అనుమతించకపోవటంతో బి.ఇడి కోర్సుపై గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తక్కువ మోజు కనబరుస్తున్నారనేది తాజా ఎడ్‌సెట్ పోటీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ఆయా మెథడాలజీ బి.ఇడి కోర్సుల సీట్లకంటే పోటీపడే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించాల్సిన విషయమే.


 Drawe00 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


కేంపస్‌లో సీటు పొందాలంటే?
ఎడ్‌సెట్ పరీక్షలో బెస్ట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా కోరుకునేవి యూనివర్సిటీ బి.ఇడి కోర్సులనే. ఉన్నత విద్యకు, ఉత్తమ సదుపాయాలకు యూనివర్సిటీలే కేంద్రాలు. అందుకే ఇవి అఫర్ చేసే బి.ఇడి సీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. హాస్టల్ వసతి అదనపు ఆకర్షణగా అభ్యర్థులు కేంపస్ బి.ఇడిలకు మొగ్గు చూపుతుంటారు. గత ఏడాది జరిగిన ఉస్మానియా వర్సిటీ కేంపస్ కాలేజీ బి.ఇడి.అడ్మిషన్స్‌లో బి.ఇడి సీట్లు కైవసం చేసుకున్న టాప్ ర్యాంకర్ల వివరాలు పరిశీలిస్తే బి.ఇడి మ్యాథ్స్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ వుండగా, అలాగే ఫిజికల్ సైన్స్‌లో 26వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 1వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 16వ ర్యాంకర్, ఇంగ్లీష్ మెథడాలజీలో 8వ ర్యాంకర్ అభ్యర్థులున్నారు.

అలాగే కాకతీయ యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి. కాలేజీలో సీట్లు సాధించిన ర్యాంకర్ అభ్యర్థులు బిఇడి మ్యాథమెటికల్ మెథడాలజీలో 367వ ర్యాంకర్, బయోలాజికల్ సైన్స్‌లో 86వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 14వ ర్యాంకర్, చివరగా ఇంగ్లీష్ మెథడాలజీ బి.ఇడిలో 26వ ర్యాంకర్ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇదే పంథాలో టాప్ 100 నుంచి 500 ర్యాంకుల మధ్యన గల ర్యాంకర్లు ఆయా యూనివర్సిటీ కేంపస్ బి.ఇడి కాలేజీలలో సీట్లు పొందగలరు. ఉదాహరణకు బి.ఇడి. కేంపస్ సీట్లు ఇంకా ప్రైవేటు బి.ఇడి సీట్లు మొత్తం సంఖ్యలో 15శాతం సీట్లు యూనివర్సిటీయేతర అభ్యర్థులు మెరిట్ ర్యాంకుతో రాష్ట్రంలో ఎక్కడైనా బి.ఇడి. సీటును కోరుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో బి.ఇడి. సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ జిల్లాలు), ఆంధ్రా వర్సిటీ (కోస్తాంధ్ర జిల్లాలు), శ్రీవేంకటేశ్వర వర్సిటీలలో (రాయల సీమ జిల్లాలు) భర్తీ అవుతాయి.

 edcet0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


100 సీట్లు గల బి.ఇడిలో 85 సీట్లు స్థానికులకు రిజర్వ్ చేయగా 15 సీట్లు స్థానికులు లేదా స్థానికేతరులు ఎవరైనా మెరిట్‌తో ఎంపిక అవుతారు. సాధారణంగా కేంపస్ బి.ఇడి సీటు డిమాండ్ ఉస్మానియా వర్సిటీకి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడకు వచ్చి కోర్సు చేస్తే బహుముఖ అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం అభ్యర్థుల్లో వుంది. దానితో ఉస్మానియా బి.ఇడి కోర్సు పట్ల ఇతర యూనివర్సిటీ అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. యూనివర్సిటీ కాలేజీ బి.ఇడి. అభ్యర్థులకు ప్రముఖ కార్పోరేట్ సంస్థలో ప్లేస్‌మెంట్స్ ఇస్తుండటంతో కేంపస్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది.

ఐ.ఎ.ఎస్.ఇ అంటే క్రేజ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐ.ఎ.ఎస్. ఇ.) ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఉదా॥ మాసాబ్‌ట్యాంకులోని ఐ.ఎ.ఎస్.ఇ. విద్యా సంస్థ 1959లో ఏర్పాటైన పురాతన కాలేజీగా ఖ్యాతి గడించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బి.ఇడి. కాలేజీల్లో ఒకటైన కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఆఫర్ చేస్తున్న బి.ఇడి కోర్సులకు ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. పటిష్టమైన విద్యాబోధన అందించే సీనియర్ క్వాలిఫైడ్ లెక్చరర్లు ఐ.ఎ.ఎస్.ఇ.;సి.టి.ఇ.లలో ఉండటం, అత్యంత తక్కువగా ఫీజు చెల్లించి బి.ఇడి ని సొంతం చేసుకునే అవకాశం ఉంటున్న దృష్ట్యా ఇక్కడి బి.ఇడి కోర్సులకు డిమాండ్ ఉంటోంది.
మాసాబ్‌ట్యాంక్‌లోని ఐ.ఎ.ఎస్.ఇ.లో 2011 బి.ఇడి సీట్లు పొందిన టాప్ ర్యాంకర్లను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 46వ ర్యాంక్, ఫిజికల్ సైన్స్‌లో 208వ ర్యాంక్, బయోలాజికల్ సైన్స్‌లో 25వ ర్యాంకర్, సోషల్ స్టడీస్‌లో 46వ ర్యాంకర్ చివరగా ఇంగ్లీష్ మెథడాలజీలో 30వ ర్యాంక్ అభ్యర్థులు అడ్మిషన్లు కైవసం చేసుకున్నారు.

 B.Ed0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema


ప్రఖ్యాత బి.ఇడి. కాలేజీలు
రాష్ట్రంలో బి.ఇడి మొత్తం కాలేజీలు 605, ఇందులో మొత్తం సీట్లు 65వేలు ఉన్నాయి. ఫీజుల పరంగా సౌలభ్యం ఇతర సదుపాయాలపరంగా సౌకర్యం గల కేంపస్, గవర్నమెంట్ బి.ఇడి.కాలేజీల సంఖ్య పట్టుమని 15 మించడం లేదు. ఇందులో మొత్తం బి.ఇడి సీట్లు సంఖ్య 2వేలకు మించదు. పోటీకీ సమీపంలో గల ఎయిడెడ్ కాలేజీలలో ఫీజులు సాధారణంగానే ఉన్న దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు సదరు బి.ఇడి. కోర్సుల వైపు చూస్తున్నారు.

ఎక్కువభాగం బి.ఇడి సీట్లు ప్రైవేట్ బి.ఇడి కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ బి.ఇడి. కాలేజీలు కేంపస్ కాలేజీలతో పోటీపడేలా బి.ఇడి కోర్సును ఆఫర్ చేస్తూ అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఫీజులు మాత్రం కాస్త భారీగానే చెల్లించాల్సిందే. గత ఏడాది ప్రైవేటు కాలేజీలలో బి.ఇడి సీటు పొందాలంటే రూ. 16,500 ట్యూషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా, కేంపస్ బి.ఇడి కాలేజీలలో రూ.8,000 ఉండగా ఐ.ఎ.ఎస్.ఇ విద్యా సంస్థల్లో రూ.3000లతో బి.ఇడి కోర్సు చేసే అవకాశం ఉంటున్నది.
ఇంకా ఎస్.సి. , బి.సి, ఎస్.టి.కి చెందిన నిర్థిష్ట రూ.లక్ష రూపాయల కుటుంబ వార్షికాదాయం గల వారికి బి.ఇడి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వం నుంచి కాలేజీలకు రీయం బర్స్‌మెంటు లభించటం అభ్యర్థులకు తెలిసిందే.

Take By: T News

Read more...

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Thursday, June 28, 2012

సమన్వయం లేదు అందుకే ఓడాం - చిరంజీవి


Chieee talangana patrika telangana culture telangana politics telangana cinema
సోనియాకు నివేదించిన చిరంజీవి మీరూ కారణమేనన్న అధినేత్రి
‘ఉప’ ఓటమిపై పోస్ట్‌మార్టం
- పార్టీ బలోపేతంపై చర్చించాం
- పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో మేడమ్ కార్యాచరణ
- నాయకత్వ మార్పు ఉండదు
- నావల్లే గెలిచామని నేననలేదు మీడియానే వక్రీకరించింది
- సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి
- రాష్ట్రంపై అధినేత్రి ప్రత్యేక దృష్టి
- అందుకే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు
- నాయకత్వ మార్పు అక్కర్లేదు: రఘువీరా
- అధిష్ఠానం ఆదేశిస్తే చిరును సమర్థిస్తాం

న్యూఢిల్లీ, జూన్ 27 ():కాంగ్రెస్‌లో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సమన్వయం లోపించడంవల్లే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధినేత్రి సోనియాగాంధీ కూడా అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె దృష్టి సారించినట్లు తెలిపారు. దానిపై ఆమె రూపొందించే కార్యాచరణ ప్రణాళికను తామంతా అనుసరించి పార్టీని బలోపేతం చేస్త్తామని చెప్పుకొచ్చారు. కిందిస్థాయి నాయకులకు పార్టీ, నామినే పదవులు ఇచ్చి పని కల్పించాలని మేడమ్‌ను లేదు సమన్వయం.. అందుకే ఓడాం
కోరినట్లు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర మంత్రులు సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాసరావులతో కలిసి సోనియాతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. పార్టీ ఓటమి చెందడానికి కారణాలపై తనదైన నివేదికను ఆమెకు అందజేశారు.

ఆంధ్రవూపదేశ్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం పార్టీ అగ్ర నేతలు పలువురు అధిష్ఠానాన్ని కలిసి తమ వివరణలను, అభివూపాయాలను నివేదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం చిరంజీవి కాంగ్రెస్ అధ్యక్షురాలితో భేటీ అయ్యారు. అగ్ర నాయకత్వం నుంచి, క్షేత్రస్థాయి వరకు అన్నిచోట్లా సమన్వయ లోపం కారణంగానే పార్టీకి దారుణ అనుభవం ఎదురైందని ఆయన విశ్లేషించినట్లు సమాచారం. తిరుపతిలాంటిచోట్ల కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటం, అంతర్గత గ్రూపు తగాదాలవల్లే పార్టీ నష్టపోయిందని వివరించినట్లు తెలిసింది. రాజంపేట, రాయచోటి లాంటిచోట్ల సరైన అభ్యర్థులను నిలుపలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గంతో పోలిస్తే తన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పార్టీకి పడ్డాయని ఆయన నియోజకవర్గాలవారీగా సమాచారాన్ని సోనియాకు అందించినట్లు తెలిసింది.

దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీ పీఆర్పీ విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని, తన వర్గానికి ప్రాధాన్యం లభించలేదని చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సోనియా సైతం చిరంజీవి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం సహకరించటం లేదని ఫిర్యాదు చేస్తున్న మీరు సమన్వయం కోసం ఏం ప్రయత్నాలు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విలీనమై ఏడాది గడుస్తున్నా సొంత వర్గీయులైన గంటా, రామచంవూదయ్యలను వెంట తిప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సీనియర్లతో, నాయకులతో సఖ్యత యత్నాలు ఆశాజనకంగా లేవని అన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అహంభావాలకు పోకుండా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

అందుకే కేంద్ర పదవి అడుగుదామనుకున్న చిరంజీవి ఆ పనిచేయకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది. సోనియాతో సమావేశమైన అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంలోనూ తాను కేంద్ర పదవిని ఆశించలేదంటూ నిట్టూర్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సోనియాతో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సానుభూతే జగన్ విజయానికి కారణమని, అదే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారిందన్న అంశం తమ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. రెండుస్థానాల్లో పార్టీ విజయానికి కారణాలపై సైతం చర్చించినట్లు చెప్పారు. అన్ని విషయాలపై మేడమ్‌కు అవగాహన ఉందని, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలి? పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. రామచంవూదాపురం, నరసాపురంలో పార్టీ తనవల్లే గెలిచిందని తానెప్పుడూ అనలేదని వివరణ ఇచ్చారు. అదంతా మీడియా వక్రీకరణ అంటూ కొట్టిపారేశారు.

‘‘కలిసికట్టుగా పనిచేయడంవల్లే ఆయా స్థానాల్లో విజయం సాధించాం. ఇదే రకంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పా. నావల్లే అక్కడ గెలిచారని నేనన్నట్లు మీడియా పదే పదే ప్రచారం చేయడం భావ్యం కాదు’’ అని సూచించారు. అందరం కలిసి ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేశామని, వెంకటరమణ ఎంపిక సమిష్టి నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత చిరంజీవే సీఎం అన్న పెడన ఎమ్మెల్యే జోగు రమేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ- అది ఆయన అభిమానంగా చూస్తున్నాను తప్ప ఆయన పదాల్లోని అర్థాన్ని తాను చూడటం లేదని అన్నారు. పార్టీలో తననెవ్వరు టార్గెట్ చేయడం లేదన్న ఆయన, దాన్ని మీడియానే ఎక్కువచేసి చూపుతోందన్నారు. తెలంగాణ అంశంగానీ, తనకు కేంద్ర మంత్రి పదవి అంశంగానీ చర్చకు రాలేదన్నారు. ‘‘సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా బాధ్యత ఏమిటన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప నేను ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదు. కేంద్ర పదవి ఇవ్వకపోయినా, సంతృప్తిగా పనిచేస్తా. ప్రజలకు ఏం చేయాలన్నదే నాకు ముఖ్యం తప్ప నాకేం కావాలన్నది ముఖ్యం కాదు. ఎంపీగా అవకాశం ఇచ్చారు. నన్ను నిరూపించుకోనీయండి’’ అని స్పందించారు. ప్రభుత్వ పెద్దల పనితీరుపై అధ్యక్షురాలి వద్ద అసంతృప్తి వ్యక్తంచేయలేదని చెప్పారు. కేవలం భవిష్యత్తు ఎలా ఉండాలన్న దానిపైనే సలహాలిచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాయకత్వ మార్పుల అంశం తమ చర్చలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. నాయకత్వ మార్పుంటుందని తాననుకోవడంలేదని చెప్పారు. మనుషులను సోనియా మారుస్తారని అనుకోనన్నారు. సీఎం మార్పుపై చర్చే లేనప్పుడు మీడియా వారికి నాయకత్వ మార్పుపై అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందన్నది కేవలం అభియోగమే తప్ప అది నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు.

అవినీతి నిర్ధారణ అయితే తాను ఖచ్చితంగా స్పందిస్తానని బదులిచ్చారు. కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లేశారా అన్న ప్రశ్నకు తానేం మాట్లాడనని సమాధానమిచ్చారు. ఓట్లు ఎవ్వరు వేసినా వేయకపోయినా కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన అది ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇతరుల ఓట్లు ఎంత మేర సాధించుకుంటామన్నదే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పీఆర్పీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయలోపం కొనసాగుతోందని అంగీకరించారు. దాన్ని అధిగమించేలా పార్టీ కార్యాచరణ చేపట్టాలని కోరిన ఆయన అధిష్ఠానం చేపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఆగస్టులోపు పార్టీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టడానికి పార్టీ పెద్దలు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలవల్లే పదవుల భర్తీ జరగలేదని తెలిపారు. నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

దాంట్లో అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీని కలిసి అభినందనలు తెలియచేశారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక్కడి పార్టీ పరిస్థితులపై అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అడిగినవారికల్లా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభివూపాయపడుతున్నాయి.
4200 talangana patrika telangana culture telangana politics telangana cinema
నాయకత్వ మార్పుపై అధిష్ఠానానిదే నిర్ణయం: మంత్రి రఘువీరాడ్డి
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులను గాడిలో పెట్టడానికి నాయకత్వ మార్పు అవసరం లేదని రాష్ట్రమంత్రి రఘువీరాడ్డి అభివూపాయపడ్డారు. తనతో సహ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న ఆయన పార్టీని బలోపేతం చేయడమే తమ బాధ్యతని చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఢిల్లీ వచ్చిన రఘువీరాతో ఎంపీ చిరంజీవి బుధవారం కొద్దిసేపు మంతనాలు జరిపారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. పార్టీలో సమన్వయం లోపించిందన్న చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికార పార్టీలో ఇలాంటివి సహజమని అన్నారు. దానికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఓటమికి కారణాలు వెతకడానికే పరిమితం కాకుండా ఓటమిని అధిగమించే విధంగా కార్యాచరణ రూపొందించుకుని నాయకులు ఐక్యంగా పనిచేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇకపై దానిపై మాట్లాడబోమని తెలిపారు. పదే పదే నాయకులు అభివూపాయాలను వ్యక్తంచేయడం భావ్యం కాదన్నారు. అధిష్ఠానం చిరంజీవి నాయకత్వంలో పనిచేయాలని ఆదేశిస్తే దాన్ని తాము ధిక్కరించబోమని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అధిష్ఠానం చెబితే చిరుతో సహా ఎవరి నాయకత్వాన్నైనా అంగీకరిస్తామని తెలిపారు.

Take By: T News

Read more...

గోప్యజ్ఞానం కాల్‌యుగ! కాల్‌లిస్టుల సంచలనం క్యా హై?


వ్యక్తుల ప్రైవసీ మాటేమిటి?.. మీడియా పాత్రేమిటి? చట్టం చుట్టరికం ఎందాక?
- కాల్‌లిస్టుల వ్యవహారంలో సందర్భాన్ని బట్టి నేరం తీవ్రత పెరుగుతుందా?
- బోఫోర్స్ నుంచి తెహల్కా దాకా.. మారుతూ వచ్చిన మీడియా మాటేమిటి?
- రెండుగా చీలిన రాష్ట్ర మీడియాలో ఏది సత్యం.. ఏదసత్యం?

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన మొబైల్‌లో ఎవరితో మాట్లాడారు క్లాస్‌మేట్ చంద్రబాల ఎవరికి ఫోన్ చేశారు.. వారి మొబైల్ కాల్‌లిస్టులో ఎవవరి నంబర్లున్నాయి ఇది తెలుసుకోవాలంటే చట్టవూపకారం తెలుసుకోవచ్చా.. తెలుసుకోవచ్చుననుకుంటే అది వారి ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా?.. వారే కాదు, ఎవరి నంబర్ల నుంచి కాల్స్ ఎటు వెళ్లాయో ఏ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పోలీసు అధికారుల స్థాయిలో ఇది సాధ్యమే అయినా, ప్రైవేటు వ్యక్తులు దొడ్డిదారిన ఆ పని చేస్తే ఎలా? అసలు వ్యక్తుల ప్రైవసీకి అర్థమే లేదా?.. ఒకవేళ ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించి ఈ సమాచారాన్ని తెలుసుకుంటే అది అధికార రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరం అవుతుందా?

ఆధునిక సాంకేతిక పరిజ్ఖానంతో మీడియా బహుదా విస్తరించిన కాలంలో ఉన్నాం. కాలంతో పాటు కొత్త ప్రశ్నలూ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే కాల్‌లిస్టుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు, దానిని అందిపుచ్చుకొని ప్రైవసీ పరిధిని ఛేదించుకొని సమాచార సేకరణ దిశగా పరుగులు పెడుతున్న మీడియా మరోవైపు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు పెను తుఫాన్‌గా మారిన కాల్‌లిస్టుల వ్యవహారంపై.. ఇప్పటికే రాష్ట్రంలో రెండుగా విడిపోయిన మీడియాను గమనిస్తున్నవారికి, ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కాల్‌లిస్టులను సేకరించి నేర పరిశోధన చేసిన ఉదంతాలు ఒక ఎత్తయితే, ఇదే కాల్‌లిస్టుల వ్యవహారంలో ఏకంగా ఓ జర్నలిస్టుపై కేసులు నమోదు కావడం ఇప్పుడు తాజా పరిణామం. జాతీయ స్థాయిలో బోఫోర్స్ కుంభకోణం మొదలుకొని గత దశాబ్దంలోని తెహల్కా స్టింగ్ ఆపరేషన్ వరకు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు మీడియా కొత్త పుంతలు తొక్కింది.

మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు ఆనాడు చట్టబద్ధత లేకపోయినా, మారిన పరిస్థితుల్లో ఆ ఆపరేషన్‌ను కోర్టులు కూడా ఆమోదించాయి. అదే క్రమంలో ఇప్పుడున్న మార్గాలను దాటి జర్నలిస్టులు సమాచార సేకరణకు పూనుకుంటే చట్టపరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఇప్పుడు రాష్ట్రంలో కాల్‌లిస్టుల వివాదం ముందుకు తెచ్చింది. గతంలో మద్దెలచెరువు సూరి హంతకుడు భాను అజ్ఞాతంలో ఉన్నపుడు అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్టును మీడియా ప్రతినిధులే బయటపెట్టారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన కాల్‌లిస్టును బయటపెట్టడమూ సంచలనమే అయింది. గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మాట్లాడారంటూ ఓ వ్యక్తి కాల్‌లిస్టుతో కోర్టుకెక్కడమూ జరిగింది. అయితే, ఆ కేసులు వేరు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసు తీవ్రత వేరు కేసు తీవ్రతను బట్టి కాల్‌లిస్టుల సేకరణలో నేరం తీవ్రత కూడా మారుతుందా అనేది ఇక్కడ ప్రశ్నగా నిలిచింది. జర్నలిస్టు యాదగిరిరెడ్డి అక్రమ మార్గంలో జేడీ కాల్‌లిస్టును సేకరించారు. అది నేరమే కావచ్చు. అంతమాత్రాన అధికార రహస్యాల చట్టం కింద పరిగణించేంత నేరమా అనేది మరో ప్రశ్న.

హైదరాబాద్, జూన్ 27 () సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...ఆయన క్లాస్‌మేట్ వాసిడ్డి చంద్రబాల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టుల వ్యవహారంలో ఇటు మీడియా, అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అక్రమాస్తులు, కంపెనీల కేసుల నేపథ్యంలో ఇప్పటికే రెండుగా విడిపోయిన మీడియా రంగం తమకు ఆసక్తి ఉన్న కోణాల్లో మాత్రమే వార్త కథనాలను వండివారుస్తూ మొదలుపెట్టిన ‘మీడియా యుద్ధం’ చివరకు జర్నలిస్టుల విధులనే ప్రశ్నార్థకం చేసే దశకు చేరుకుంది. వేర్వేరు కుంభకోణాలు...కేసులకు సంబంధించి వివరాలు కావాల్సి వచ్చినపుడు మీడియా ప్రతినిధులు వేర్వేరు మార్గాల్లో సమాచారాన్ని సేకరించటం పరిపాటి. ఆనాటి బోఫోర్స్ కుంభకోణం మొదలుకుని రాష్ట్రాన్ని కుదిపేసిన మాజీ గవర్నర్ తివారీ రాసలీలల వ్యవహారం...మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న భాను సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ వరకు జర్నలిస్టులు తమకు వీలైన మార్గాల్లోనే సమాచారాన్ని సంపాదించారు.

ప్రయివేట్ వ్యక్తులు ఐపీఎస్ అధికారుల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టులను సేకరించి బయటపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉదంతంలోనూ జర్నలిస్టులపైగానీ.పయివేట్ వ్యక్తులపైగానీ కేసులు నమోదు కాలేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...వాసిడ్డి చంద్రబాల సెల్‌ఫోన్ల కాల్‌లిస్టుల ఉదంతంలో మాత్రం మీడియా ప్రతినిధి యాదగిరిడ్డిపై కేసులు నమోదయ్యాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా సదరు జర్నలిస్టుపై కేసులు పెట్టటం. యాదగిరిడ్డి చేసింది తప్పే...అయితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదని న్యాయ నిపుణులు చెబుతుండగా, ఓ మీడియా ప్రతినిధిగా రాష్ట్రం మొత్తం మీద చర్చనీయంగా ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వృత్తి ధర్మంలో భాగంగానే అతను చంద్రబాల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సేకరించాడని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు. కాగా, చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించేందుకు సదరు జర్నలిస్టు అనుసరించిన విధానం ఖచ్చితంగా తప్పేనని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తమిళనాడు తరహాలో పార్టీలవారీగానో...సొంత ప్రయోజనాల కోసమో మీడియా రెండుగా విడిపోవటం వల్ల ఏ అంశంలోనూ ప్రజలకు పూర్తి నిజాలు తెలియకుండా పోతుండటంతోపాటు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అందరి దృష్టి...
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జగన్ కంపెనీలపై కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మేళ్లు పొందిన సంస్థలు, వ్యక్తులే జగన్‌కు చెందిన కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సీబీఐ అధికారులు దర్యాప్తులో తేల్చారు. అంతా క్విడ్-వూపో-కో పద్ధతిలోనే జరిగిందంటూ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో అభియోగాలు కూడా మోపారు. జగన్‌తోపాటు ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్‌ఛైర్మన్ విజయసాయిడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను అరెస్టు కూడా చేశారు. ఆరేళ్లపాటు ముఖ్యమంవూతిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌కు సంబంధించిన కేసు కావటంతో దీనిపై మొదటి నుంచి అటు మీడియా ఇటు ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రెండుగా విడిపోయిన మీడియాలో ఒకరు అంతా చట్టవూపకారమే జరిగిందంటూ వాదనలు వినిపిస్తుండగా మరొకరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ వరుస కథనాలను ఇ స్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

ఆరోపణలతో దుమారం...
సరిగ్గా దీనిపైనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగా మీడియాలో కొందరికి లీకులు ఇస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఉప ఎన్నికల సమయంలో కావాలని జగన్‌ను దెబ్బతీసేలా లీకులు ఇస్తూ, జగన్ వర్గం మరింతగా బలపడకుండా సీబీఐ అధికారులు కుట్ర పన్నారనేది వారి ప్రధాన ఆరోపణ. జగన్ అరెస్టు, ఇతరత్రా కథనాలు ఎంతో ముందుగా లీక్ కావడంతో కూడా ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఎంతో నష్టంగా వారు భావిస్తున్నారు.

ఇలాంటి లీక్‌లు రానట్లయితే ఇంకా కొందరు నేతలు తమ పార్టీలోకి వచ్చే వారని రెండు కీలక పార్టీల నుంచి వలసలు ఇంకా పెరిగేవని, కానీ సీబీఐ లీక్‌ల వల్లనే ఇవి కొంతవరకు తగ్గినట్లుగా కూడా జగన్ వర్గం వారు వాదిస్తూ, ఇది కుట్రలో భాగమనే విధంగా విమర్శలు చేస్తూ, లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ప్రభుత్వంలో సలహాదారునిగా పనిచేసిన ఓ నాయకుని బంధువు లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్టును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం నాందేడ్‌లోని ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీని ఆశ్రయించారు. సదరు ఏజన్సీ నిర్వాహకులు నాందేడ్ ఎస్‌పీ సహాయంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించి దానిని అతనికి అందచేసినట్టుగా పోలీసులు అంతర్గతంగా జరిపిన విచారణలో వెల్లడైంది. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నేత బంధువు జగన్ కంపెనీల కేసులో లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.

కారణాలు తెలియవుగాని ఆ తరువాత కొన్నిరోజులకు ఆయన తన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలా బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరింది. ఆ తరువాత మీడియా ప్రతినిధి యాదగిరిడ్డి చేతికి చిక్కింది. కాగా, తన మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు వచ్చిందని తెలిసి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను అప్పుడే మార్చుకున్నారు. తప్పితే తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై మాత్రం ఆరా తీయలేదు. అయితే పోలీసు కేసు లేకుండా ఫోన్ కాల్స్ లిస్టును కోరడంలో ఔచిత్యం లేదని.. అయినప్పటికీ జేడీ, చంద్రబాల లిస్టును పోలీసులు సేకరించడం తప్పని, అయితే జర్నలిస్టుగా తనకు లభించిన వివరాలను ప్రచురిస్తే మాత్రమే తప్పనే విధంగా పోలీసుల కేసు నమోదు చేయడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నారు.

ఇవిగో ఆధారాలు..
ఆ తరువాత కొన్నిరోజులకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు దొరికాయని ప్రకటించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు తరచుగా వాసిడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్లు చేస్తున్నారని...ఆమె తన మొబైల్ నుంచి ఓ పత్రిక అధినేతకు కూడా ఫోన్లు చేసినట్టుగా ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే లీకులు నిజమే అనిపిస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఓ మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వరుస కథనాలు రాగా మరో మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను సమర్థిస్తూ కథనాలు వచ్చాయి. దాంతో అసలు జరిగిందేమిటి? వాస్తవాలు ఏమిటి? అన్నది జనానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

చంద్రబాల ఫిర్యాదుతో...
ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాల తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించి దానిని బహిరంగ పరచటం ద్వారా ప్రతిష్టను దెబ్బ తీశారంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి జరిపిన దర్యాప్తులో జర్నలిస్టు యాదగిరి నాచారం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సహాయంతో ఆమె మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించినట్టుగా తేలింది. యాదగిరిడ్డి అడిగిన వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా...పైగా మల్కాజిగిరి డీసీపీ ఈ-మెయిల్ ఐడీని తస్కరించి కాల్‌లిస్ట్‌ను తెప్పించి యాదగిరిడ్డికి ఇచ్చారు. దీని ఆధారంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాలపై ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఈ విషయంపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడినపుడు.. ఈ విషయంలో యాదగిరిడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు చేసింది చట్టవూపకారం తప్పేనని వ్యాఖ్యానించారు. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారుల్లో సంపాదించే హక్కు ఎవ్వరికీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇదే మొదటిసారి కాదు...
యాదగిరిడ్డిపై తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. మీడియా ప్రతినిధులు...చివరకు ప్రయివేట్ వ్యక్తులు సైతం ఇతరుల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులను సంపాదించటం ఇదే మొదటిసారి కాదన్నారు. మద్దెలచెరువు సూరిని హత్య చేసిన భాను అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం మీడియా ప్రతినిధులే అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. భాను మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులో సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉండటాన్ని కూడా మీడియానే వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. గుంటూరు రూరల్ ఎస్‌పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మొబైల్‌ఫోన్‌లో మాట్లాడారంటూ కే.కార్తిక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయటమే కాకుండా కాల్‌లిస్ట్‌ను సమర్పించిన ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసినపుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను ఫోన్‌లో వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని కూడా ఉదహరించారు. ఏ డిటెక్టీవ్ ఏజన్సీకి వెళ్లి...ఫలానా నెంబర్ వివరాలు కావాలంటే ఒకటి రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వటం లేదా? అని ప్రశ్నించారు. ఈ అన్ని సందర్భాల్లో ప్రస్తావనకు రాని అధికార రహస్యాల చట్టం ఇప్పుడెలా ముందుకు వచ్చిందని అడిగారు. ఈ పరిణామాలు దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై ఖచ్చితంగా అనుమానాలు కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.

అంత తీవ్ర చట్టమా?
సైబరాబాద్ పోలీసులు జర్నలిస్టు యాదగిరి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో అధికార రహస్యాల చట్టం ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో? తమకు అర్థం కావటం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించటానికి యాదగిరిడ్డి అనుసరించిన మార్గం తప్పుడుదే అయినా...ఓ ప్రయివేట్ మహిళ కాల్‌లిస్ట్ సంపాదిస్తే అది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొనసాగుతున్న వార్‌లో భాగంగా ఓ వర్గం మీడియా జరిగినదాన్ని భూతద్దంలో చూపించటం...దర్యాప్తు సంస్థలు సైతం యాదగిరిడ్డిని మీడియా ప్రతినిధిగా కాకుండా జగన్‌కు చెందిన పత్రికలో పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన మనిషిలా చూడటం వల్లనే ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారేమో అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా.. అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సమర్థించక పోవటం గమనార్హం. అయితే అటు లక్ష్మీనారాయణ, ఇటు చంద్రబాల కాల్‌లిస్ట్‌లను అక్రమ పద్ధతిలో సంపాదించడం కూడా సరైనది కాదని మరికొందరు అభివూపాయపడుతున్నారు. వీరితో మాట్లాడినపుడు రాష్ట్రంలోని మీడియాలో క్రమంగా తమిళనాడులోని మీడియా తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అక్కడ పార్టీలవారీగా విడిపోయిన మీడియా పరస్పరం బురద చల్లుకోవటం సర్వసాధారణమైపోయిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలో...పార్టీల వారీగా పక్షం తీసుకోవటం వల్లనే తెలియదుగాని మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషించారు.

ప్రైవసీ ఇంకా ప్రాథమిక హక్కు కాదు
- జీవించే హక్కులో అంతర్భాగమన్న సుప్రీంకోర్టు

హైదరాబాద్, జూన్ 27 (టీ మీడియా): రాజ్యాంగ నిర్మాణం జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రైవసీ ప్రాథమిక హక్కుగా గుర్తింపునకు నోచుకోలేదు. 1964లో ఉత్తరవూపదేశ్- ఖరక్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవసీ అన్నది జీవించే హక్కులో అంతర్భాగమని మాత్రమే వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి జీవితంలోకి మరో వ్యక్తి తొంగిచూడటం ప్రైవసీని భంగపరిచినట్టు కాదంటూ మేనకాగాంధీ-రచయిత కుష్వంత్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కుష్వంత్‌సింగ్ రచించిన ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మలైస్ పుస్తకంలో తన ప్రైవసీకి భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.

ప్రైవసీ హక్కు అన్నది రాజ్యాంగం కల్పించలేదని, అయితే కేసు అంశాల ఆధారంగా మాత్రమే దానిని గుర్తించాలని వ్యాఖ్యానించింది. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ స్టాకింగ్, సైబర్ స్నూపింగ్, స్పాం మెయిల్, మొబైల్‌ఫోన్లు, హ్యాకింగ్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలోకి ఇతరులు జోక్యం చేసుకోవటానికి అనేక అవకాశాలు లభించాయి. దీనిని అరిక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 72 ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మరెవరికో అందజేస్తే, చట్టం ప్రకారం సదరు అధికారి శిక్షార్హుడవుతాడు.

వాస్తవాలను వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా ఇప్పటికీ అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


మీడియా సంస్థల్లోకి రాజకీయాలు వచ్చి అవి విడిపోయాయి. మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేని కోసమో వాడడు. చంద్రబాల కాల్ లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవు
సమాచార సేకరణలో జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవుగానీ ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో వాస్తవాలను వెల్లడించడానికి అనువుగా కొన్ని సదుపాయాలున్నాయి. వార్తను ఇచ్చే, చెప్పే వ్యక్తుల దగ్గర ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. సమాచార సేకరణ వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వ వర్గాలతోపాటు, సమాజంలోని పలు వర్గాల ప్రజలతో జర్నలిస్టులు సన్నిహితంగా మెలుగుతారు. కొన్ని సందర్భాలలో వాస్తవాల వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి. వీటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో ఈ అంశాలను కొన్నింటిని ప్రచురిస్తే, ప్రసారం చేస్తే అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కింద నేరారోపణ చేసి విచారించడానికి ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. ఒక వర్కింగ్ జర్నలిస్టుగా, ప్రజావూపయోజనమే పరమావధిగా భావించేవారు అవసరమైతే కష్టనష్టాలను కూడా ఎదుర్కోవాలి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు,
ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు
సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమే పత్రికా స్వేచ్ఛ. జర్నలిస్టులు వార్తలు రాయడానికి అనేక పద్ధతులు అవలంబిస్తారు. వారిని ఆపే హక్కు ఎవరికీ లేదు. అయితే వికిలీక్స్ అధినేత అసాంజే, తెహల్కా విలేకరులు కుంభకోణాలు బయట పెట్టడంతో ప్రభుత్వాలు చట్టం దృష్టితో వారిని శిక్షించాయి. కానీ వారి చర్యలను ప్రజలు హర్షించారు. మన రాష్ట్రంలోని విషయాలకు వస్తే ఈ మధ్యన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కొన్ని పత్రికలు, చానెళ్లతో మాట్లాడిన వ్యవహారాన్ని బయటపెట్టినప్పుడు వ్యక్తులుగా జర్నలిస్టులను ఇందులోకి లాగవద్దని చెప్పాం. మీడియా సంస్థల్లో రాజకీయాలు వచ్చి విడిపోయాయి.

మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేనికోసం వాడడు. చంద్రబాల కాల్‌లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత అధికార రహస్యాల చట్టానికి కాలం చెల్లింది. ఆ చట్టం కింద నేరారోపణ చేయడం ఆక్షేపణీయం.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


అధికార రహస్యాల చట్టానికి విలువ లేదు
అధికార రహస్యాల చట్టం బ్రిటీష్ కాలం నాటి పురాతన చట్టం. సమాచార హక్కు చట్టం రావటానికి ముందే దీనికి విలువ లేకుండా పోయింది. విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత, రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాదాపు 12 కేసుల్లో తీర్పులు వెలువరిస్తూ స్పష్టం చేసింది. జర్నలిస్టులపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదు. స్టోలెన్ ఎవిడెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఎవిడెన్స్ (దొంగిలించబడిన సాక్ష్యం పరిగణనలోకి తీసుకోవాలి) అంటూ బ్రిటీష్ కాలంనాటి ప్రీవీ కౌన్సిల్ (అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం) సైతం చెప్పింది. ఇప్పటికీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు దీనిని అనుసరిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించవచ్చు. దానిని బహిరంగపరచవచ్చు.
- కే రామకృష్ణాడ్డి, సీనియర్ న్యాయవాది


జర్నలిస్టులపై కేసులు తప్పు
ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వాతంత్య్రం, ప్రైవసీ అన్నది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు. తాజా వివాదాన్ని అలా పక్కనబెడితే ప్రైవసీ చాటున తప్పుడు వ్యవహారాలకు పాల్పడినపుడు రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉండదు. తప్పులు చేసినవారి గురించి బయటపెట్టటంలో తప్పు లేదు. వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై కేసులు పెట్టటం తప్పు. దీనిపై మీడియా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది.
-ఎస్ రాంచందర్‌రావు, సీనియర్ న్యాయవాది


సమాచార సేకరణ విలేకరుల వృత్తి ధర్మం
కుంభకోణాల కేసుల్లో వాస్తవ వివరాలను తెలుసుకుని బహిర్గతం చేయడం అన్నది జర్నలిస్టుల వృత్తి. దీనివల్లనే బోఫోర్స్ లాంటి కుంభకోణాలు సైతం వెలుగు చూశాయి. మావోయిస్టులతో, గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో సైతం మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. అటువంటి సందర్భాల్లో సైతం కేసులు నమోదు కాలేదు. ఓ మహిళ మొబైల్ ఫోన్ కాల్‌లిస్ట్‌ను తీసుకున్నంత మాత్రాన తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసు నమోదు చేయటం సరైంది కాదు.
- శ్రీరంగారావు, న్యాయవాది

Take By: T News

Read more...

Monday, June 25, 2012

సోనియాతో నేడు చిరు భేటీ


-కాంగ్రెస్ నేతలే కొంప ముంచారు
-పార్టీలో ఐక్యత లోపించింది
-పీఆర్పీకి ద్వితీయ శ్రేణి గుర్తింపే!
-ఓటమికి ఇవే కారణాలు
-ఉప ఫలితాలపై నివేదిక!

హైదరాబాద్, ():కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చిరంజీవి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు భేటి అయిన రెండోరోజే చిరంజీవి సోనియాతో సమావేశమై ఉప ఎన్నికల ఫలితాలను వివరించనున్నారు. కాంగ్రెస్ నేతల వైఖరివల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని తన నివేదికను ఆయన సోనియాకు సమర్పించే అవకాశాలున్నట్లు పూర్వ పీఆర్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామచంవూదాపురం, నర్సాపురం రెండు స్థానాల్లో కాంగ్రెస్ తనవల్లే గెలిచిందని, మిగతాచోట్ల పీఆర్పీ శ్రేణులకు కాంగ్రెస్ సహకరించలేదని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఐకమత్యం లోపించిందని, విలీనమైనా కూడా పీఆర్పీ శ్రేణులను ఇప్పటికీ ద్వితీయక్షిశేణి నేతలుగానే పరిగణిస్తున్నారని, నామినేటెడ్ పదవులు భర్తీచేయకపోవడం వంటి పరిణామాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన అధినేత్రి దృష్టికి తీసుకెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవి విషయం కూడా తేల్చుకోనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగానియమించినప్పటికీ ఇంకా మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నాన్చుతుండటం చిరులో అసంతృప్తికి కారణమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపిస్తే చిరంజీవికి మంత్రి పదవి కచ్చితంగా వచ్చేదని, ఇప్పుడు పార్టీ ఓటమితో ప్రస్తుతానికి ఆ పదవి కూడా డౌటేనని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరుకు రాజ్యసభ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి పదవితోపాటు రాష్ట్రంలో ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చేందుకుగతంలో ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వీటిలో కేంద్ర మంత్రి పదవి తప్ప మిగతావన్నీ చిరు సాధించుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. చిరు ప్రభావం ఎంతమాత్రం కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. చిరు ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోగా అక్కడ ఓటమికి కాంగ్రెస్ వారే కారణమని చిరు నిందలు వేయడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగించింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు వంటి పరిణామాలు చిరుకు కేంద్ర మంత్రి పదవి విషయంలో మైనస్ కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read more...

Tuesday, January 24, 2012

కొత్త నియామకాలలో కాంట్రాక్ట్ కార్మికులకు అవకాశం ఇవ్వాలి: అసదుద్దీన్ ఒవైసీ

సిటీన్యూస్, జనవరి 23 (: ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న వారికి కొత్త చేపట్టే నియామకాల్లో అవకాశాలు కల్పించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం మింట్ కంపౌండ్‌లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన ఏపీ ఎలక్షిక్టికల్ ఉద్యోగుల ముస్లిం మైనారిటీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీఐ పూర్తి చేసిన వారి కన్నా కాంట్రాక్ట్ కార్మికులే మెరుగ్గాపని చేస్తారని అన్నారు. కార్యక్షికమంలో ఏపీఈఈఎంఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎం భాషా,యూసుఫ్, అబ్బాస్‌అలీ, జీలాన్‌బాషా, ముస్తాక్, నాగరాజు పాల్గొన్నారు.

Read more...

Sunday, January 22, 2012

High security registration plates for new vehicles by April: official



By April, new vehicles hitting the city roads will come with high security registration plates (HSRP). The existing vehicles would also have to comply within two years.

A senior Transport Department official said that a schedule is being drawn and each vehicle owner would be given a specific date to visit their respective Regional Transport Office (RTO) for replacing the existing number plates with the HSRP.

The move to introduce the high security registration plates has been under review since 1989. After the Supreme Court criticised the State governments in September last year for the repeated delays in implementation, most of the States floated tenders for the project. The Supreme Court on Friday set a deadline of March 31.

In Tamil Nadu, five entities have prequalified, based on a set of technical criteria, and the financial bids were opened last week. The Transport Department official said that an evaluation is being carried out and the company that will implement the project will be announced shortly.

Based on the experience of other cities, the new embossed high-security plates are expected to be available for around Rs.300, which would have to be paid at the time of registration.
While the scheme would be implemented throughout the State, a pilot implementation would happen in a few RTOs in Chennai first. Eventually embossing/fixing stations would come up within the premises of all the RTOs and unit offices in the State.

The official said that the number plates would have features such as a laser hologram and a non-removable/non-reusable snap lock to prevent counterfeiting and duplication.

Any attempt to remove or replace the number plate will damage the snap lock making it impossible to install any other number plate in the vehicle. 

All plates would also have a unique identification number and can be tracked all across India, the official added. It would also eliminate the problem of fancy number plates.

Take By: The Hindu News

Read more...

ఏప్రిల్‌లో సెట్.. మార్చిలో నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 21(): డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పరీక్ష సెట్‌ను ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఈ పరీక్షను స్లెట్‌గా పరిగణించినప్పటికీ ప్రస్తుతం దాన్ని సెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. సెట్ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.

మార్చిలో సెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహించి మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలోగా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ యూజీసీ అక్రిడేషన్ పొందాల్సి ఉంది. సెట్ పరీక్ష ఏర్పాట్లపై యూజీసీ కమిటీ తనిఖీ చేసి సెట్ పరీక్షకు గుర్తింపు ఇస్తుంది. యూజీసీ గుర్తింపు ప్రక్రియ ఫిబ్రవరికల్లా పూర్తయినా మార్చిలో నోటిఫికేషన్ వెల్లడించేందుకు సెట్ నిర్వహణా కమిటీ చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తోంది.

Take By: T News

Read more...

తెలంగాణ విద్యార్థిపై కేసుల ఉచ్చు

- కేసుల ఎత్తివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ
- ఇంతవరకూ ఎత్తేసింది లేదన్న విద్యార్థులు
- ఇది ‘శ్రీకృష్ణ’ చీకటి అధ్యాయం అమలే!


police talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 21 () నిరసన కొత్త కాదు. ఆందోళన పాతదే. ఉద్యమాలూ ఈనాటివి కాదు! విద్యార్థులో, కష్టజీవులో, అన్యాయానికి గురైనవారో, దుర్మార్గాలపై కడుపు మండినవారో గతంలో ఏదైనా ఆందోళనకు దిగితే.. ఉద్యమం చేపడితే పరిస్థితి చేయిదాటినా.. అలాంటి పరిస్థితి ఉన్నా అదుపులోకి తీసుకోవడం పరిపాటి! వారిని సాయంత్రం దాకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి.. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టడం మామూలే! కొన్ని మినహాయింపులు ఉన్నా.. అత్యంత తీవ్రమైన అభియోగాలు నమో దు చేసిన ఉదంతాలు కొన్నే! కానీ.. తెలంగాణ విద్యార్థి విషయంలో మాత్రం పక్షపాతం! కుట్ర! విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా.. ఒకరిమీదో వంద మంది మీదో కాదు.. సుమారు 9వేల మందిపై! విద్యార్థులపై మునుపెన్నడూ నమోదు చేయని సెక్షన్లు..! ప్రదర్శనలో పాల్గొన్నందుకు.. దిష్టిబొమ్మ దహనం చేసినందుకు.. కోపంతో ఓ రాయి విసిరినందుకు! ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా! తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా! ఒక కేసులో అరెస్టయి బయటికి వస్తే.. మరో కేసులో అరెస్టు చేసి జైలుకు పంపేంత స్థాయిలో! ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టేంత గుడ్డిగా..! ఇదీ సీమాంధ్ర పాలకులు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిపై చూపుతున్న వివక్ష! అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకూ ఒక్కరిపైనా కేసులు ఎత్తేయని వైనం!: తెలంగాణ కో సం జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణ కమిటీలోని చీకటి అధ్యాయాన్ని సీమాంధ్ర పాలకులు అమలు చేస్తున్నారా? పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసు ఉన్నతాధికారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారా? ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారిపై మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టడం ఉద్దేశపూర్వకమేనా? కేసుల పేరుతో ఇప్పటికీ విద్యార్థులను మానసికహింసకు గురి చేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామన్న హామీని నెరవేర్చకుండానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా పరీక్షలు జరపటానికి సన్నాహాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

వేర్వేరు డిమాండ్లపై రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఊరేగింపులు, దిగ్బంధనాల ద్వారా డిమాండ్ల సాధనకు వేర్వేరు వర్గాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు అదుపుతప్పి శాంతిభవూదతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. లాఠీచార్జీలు, కాల్పులు, బాష్పవాయువు గోళాల ప్రయోగాలు జరిగాయి. అయినా ఉద్యమకారులపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు పెట్టిన దాఖలాలు వేళ్ల మీద లెక్కబె సంఖ్యలో కూడా లేవని పరిశీలకులు అంటున్నారు. మహా అయితే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవటం.. వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించటం, చీకటి పడేవరకు పోలీస్‌స్టేషన్లలోనే ఉంచి, ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేయటం ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నది. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగినపుడు మాత్రమే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కేసులు పెట్టేవారు. ఈ కేసులు కూడా ఆయా నిరసనలను ముందుండి నిర్వహించినవారిపైనే ఉండేవి.

తెలంగాణ విద్యార్థులపై కుప్పలకొద్దీ సెక్షన్‌లు
ఉద్యమంలో భాగంగా శాంతియుతంగా ప్రదర్శనలు జరిపినా, ఊరేగింపులు నిర్వహించినా, ధర్నాలు చేసినా మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులపై పోలీసులు వందలాది కేసులు నమోదు చేశారు. ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. పోలీసుల ఈ అణచివేత వైఖరికి పరాకాష్ట ఏమిటంటే ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టటం. ఎస్‌సీ, ఎస్‌టీలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయటానికి అవకాశం లేదని తెలిసి కూడా ఈ కేసులు పెట్టారం ప్రభుత్వం, పోలీసుల కుట్రను అర్థం చేసుకోవచ్చని ఉద్యమనేతలు అంటున్నారు.

జైళ్లలో మగ్గేలా చేస్తూ...
అడ్డగోలుగా విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీటిని అడ్డం పెట్టుకుని విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విచారణ పేరిట పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరిని అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. బెయిల్‌పై విడుదల కాగానే ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసి కారాగారాల్లోనే మగ్గేలా చేస్తున్నారు. ఇలా విద్యార్థులపై విచ్చలవిడిగా నమోదు చేసిన కేసులపై తెలంగాణ మొత్తం భగ్గుమంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఢిల్లీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇక్కడ నిరాహారదీక్షలు చేశారు. దాంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి దశలవారీగా రెండు నెలల్లోనే ఈ ప్రక్రియను ముగిస్తామని స్వయంగా ప్రకటించారు.

అయితే, నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చటం లేదు. ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడగా కేసుల ఎత్తివేత దశలవారీగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి ఎంత సమయం పట్టవచ్చని అడిగితే ఏడాది పట్టొచ్చు... రెండేళ్లు పట్టొచ్చు అని సమాధానం ఇస్తున్నారు.
కేసులను అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యోగాలను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల వల్ల విద్యార్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఉద్యోగాలకైనా దరఖాస్తు చేయొచ్చు. పరీక్షలనైనా రాయవచ్చు. కానీ ఉద్యోగాల నియామకం సమయంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆడిగి, కేసుల పేరుతో నిరాకరించే ఆలోచనలో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని రకాల కేసులను ఎత్తివేయాల్సిందే.
- గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ కో కన్వీనర్

 Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP