Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Namasthe Telangaana. Show all posts
Showing posts with label Namasthe Telangaana. Show all posts

Saturday, December 8, 2012

కాసేపు హీరో మరికాసేపు జీరో

తీవ్రమైన అసహనం... అశాంతి. కాసేపు తనకు తానే గొప్ప... మరి కాసేపటిలో తీవ్రమైన న్యూనతాభావం కలిసి టీనేజిలోకి ప్రవేశించిన వారి మానసిక పరిస్థితిలో సంచలన మార్పు వస్తుంది. టీనేజర్ల అంతరంగమేమిటో అవలోకిద్దాం.

టీనేజ్‌కి ముందు పిల్లలు తమ తల్లిదండ్రులు అందించిన సహాయ సహకారాల మీద పూర్తిగా ఆధారపడతారు. అయితే టీనేజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు తమ వ్యక్తిత్వం మీద నిలబడాలనే తపనతో తల్లిదండ్రుల సహాయాన్ని స్వీకరించటానికి ఇష్టపడరు. అదే సమయంలో తమకు తాము అడ్జెస్ట్ కావటమూ చాతకాదు.

ఎవరిని నిందించాలో తెలియక, అసలు కారణం అంతుపట్టక సహాయానికి రాబోయిన తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు.

పైగా వీళ్ళను సినిమాలలోనూ పత్రికలలోనూ కనిపించే ప్రకటనలు ఈ దుస్తుల్ని ధరించు, ఆ సబ్బును వాడు, ఈ చెప్పులను వేసుకో, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించు అంటూ రెచ్చగొడుతుంటాయి.

ఆ బాపతు ప్రకటనలు అందించే అంచనా లకూ వాస్తవ జీవితంలో లభించే సౌకర్యాలకూ పొత్తు కుదరకపోవటం కూడా వాళ్ళు బోరు చెందటానికి ఒక కారణంగా ఉం టుంది.
ఇది నాణానికి ఒకవైపు మాట!

రెండో వైపున -
వాళ్ళు ఇప్పుడిప్పుడే బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంటారు.
ఎంతో వైవిధ్యంతో కూడుకున్న జీవితాను భవాలు ఎదురుగా ఉంటాయి.

కాలేజీకి వెళ్ళటం, ఫలానా కోర్సు చదవటం, చదువులో లేక ప్రేమలో తోటివాళ్ళతో పోటీ, మనస్సును ఆకట్టుకునే క్రీడా ప్రపంచం, ఉద్వేగాల్ని వశీకరించుకునే సినిమా ప్రపంచం, వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

ఒక్క క్షణాన తమకు తాము ఎంతో ప్రాముఖ్యత కలవాళ్ళుగా భావిస్తారు. మరుక్షణమే తమనెవరూ పట్టించుకోవటం లేదని బాధ చెందుతుంటారు.

భవిష్యత్తులో తానేదో సూపర్‌స్టార్ అయిపోవా లనీ, గొప్ప క్రీడాకారుడు కావాలనీ ఆశలు పెంచుకుంటారు. అనుకోకుండా ఎక్కడ నుంచో ఆస్తి వచ్చి పడుతుందని కలలు కంటుంటారు.
కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎన్నాళ్ళు గడిచినా జరగవు. (ఏడాది రెండేళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఎక్కువ కాలమేనన్న సంగతి మర్చిపోవద్దు!) ఫలితంగా జీవితం ‘బోర్’ అనిపిస్తుంది.
టీనేజర్స్ మీద తోటివాళ్ళ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంగతి ముందే చెప్పుకున్నాం.

తోటివాళ్లు తనను మెచ్చుకోవాలని ఉంటుంది లోలోపల. కానీ వాళ్ళు తనను లెక్కచేయటం లేదనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నారనిపించి నప్పుడు వాళ్ళు బోర్‌గా కనిపిస్తారు.
పిల్లలు స్కూలు బోరు కొడుతోందని అంటున్నారంటే స్కూలులో వాళ్ళు రాణించలేక పోతున్నారనీ, చదువులో వెనకబడుతున్నారనీ అర్థం. అక్కడ వాళ్ళకు పాఠాలు సరిగ్గా అర్థం కావటం లేదనో లేక మరేదో అసౌకర్యానికి ఫీలవుతున్నారనో అనుకోవాలి.

చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ తమ తెలివితేటలకు తగ్గ చదువు స్కూలులో లభించక పోయినా బోరు చెందుతారు.

కారణం ఏమైనప్పటికి టీనేజర్లలో బోర్ ఫీలింగ్‌ను గమనించి వారికో వ్యాపకం కల్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వారిలో క్రమేపి నిరాశ ఏర్పడే ప్రమాదముంది. మొత్తం మీద టీనేజర్ల అంతరంగం అంతా పలు ఆలోచనలతో నిండి స్థిరంగా ఉండదు. వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

Read more...

Tuesday, October 23, 2012

రగిలిన రాజోలి

-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు


రాజోలి రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

బాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం, స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు. చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

( మహబూబ్‌నగర్) :వస్తున్నా మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని ప్రకటించారు.

కానీ కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఖండించారు.

సోమవారం ఉదయం నుంచి మక్తల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా.. తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.


- T News

Read more...

Monday, September 17, 2012

సెప్టెంబర్ 17 తెలంగాణం

 pidikili2హైదరాబాద్, సెప్టెంబర్ 16 ):
1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో దోబూచులాడాయి..!

 బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..! దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!

దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది. నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా..

ఇదీ చరిత్ర...
బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం చేయాల్సిందేనని నినదించారు.

ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు అమరులయ్యారు.

గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్‌ప హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు.

ఆ క్రమంలో జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ ప్రమాణం చేయించారు.

ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో 1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

‘సమైక్య’ కుట్ర..:నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంవూధలో కలిపేశారు. దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట తెలంగాణను అణచివేస్తూనే ఉంది.


Take By: T News

Read more...

Sunday, September 2, 2012

పిల్లలకు నేర్పండి...‘పొదుపు’కథలు


పదేళ్ళ అబ్బాయికి ఓ పది రూపాయలిస్తే ఏంచేస్తాడు? ఏ చాక్లెట్టో..ఐస్‌క్రీమో..కొనుక్కుంటాడు. లేకపోతే స్పైడర్‌మేన్, సచిన్ టెండూల్కర్ స్టిక్కర్లు కొనుక్కుంటాడు. కొంత మంది బుద్ధిమంతులైన పిల్లలైతే ఆ పదిరూపాయల్ని తీసుకెళ్ళి తమ కిడ్డీబ్యాంకులో వేసుకుం టారు. అది కూడా అవన్నీ కూడబెట్టి పెద్ద బ్యాట్ కొనుక్కోవడానికే అయ్యుం టుంది. అలా కాకుండా ఆ పదిరూపాయలతో ఆ పిల్లవాడు ‘డాడీ..దీంతో ఫలానా షేరు కొంటాను...మూడు నెలల్లో పదిరెట్లు అవుతుంది’ అన్నాడనుకోండి. 

నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని ఆ తండ్రి పుత్రోత్సాహానికి అంతుండదు. కానీ పిల్లలకు ఈ వయసు నుంచే అంతపెద్ద పొదుపు, పెట్టుబడి మాటలెందుకని అనిపించొచ్చు. కాలం మారింది.

ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు విలువ, పొదుపు అలవాటు, పెట్టుబడి పరిజ్ఞానం తెలియడం చాలా అవసరమని అంటున్నారు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకరైన వారెన్ బఫెట్ తొలి షేర్‌ను 11 ఏళ్ళ వయసులో కొన్నాడట. ‘అబ్బా..ఇంకాస్త చిన్న వయసులో మొదలుపెట్టి ఉంటే మరింత ధనవంతుడయ్యేవాడ్ని కదా’ అని సరదాగా బాధపడుతుంటాడట బఫెట్.
డబ్బు విలువ తెలియజేయడం కన్నా ముఖ్యమైనది పిల్లలలో పొదుపు, పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం. చిన్నప్పుడే అంత పెద్ద అలవాట్లు ఎందుకు అని తల్లిదండ్రులు అనుకోకుండా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేయడం మంచిది.

కిడ్డీబ్యాంక్‌తో పొదుపభ్యాసం
పిల్లలు ప్రీస్కూల్, కిండర్‌గార్డెన్ వయసులో ఉండగానే ప్రాథమిక డబ్బు విలువను అర్థం చేసుకోగల సమర్థత కలిగి ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. అందుకే అప్పుడే కిడ్డీ బ్యాంక్‌ను ప్రవేశపెట్టాలి. ఆకర్షణీయమైన ట్రాన్స్‌పరెంట్ కిడ్డీ బ్యాంక్ బొమ్మను కొనివ్వండి. అందులో వేసే డబ్బులు బయటికి కనిపించే విధంగా ఉండాలి. అందులో వేసిన డబ్బులు చూపిస్తూ, డబ్బు ఎంతటి విలువైనదో ఎన్ని పనులు చేస్తుందో చిన్నచిన్న ఉదాహరణలతో, మాటలతో కొద్దిగా చెప్పండి. డబ్బు బయటకు కనిపించే కిడ్డీ బ్యాంక్‌లోంచి పిల్లలు డబ్బులు తీసినప్పుడు తగ్గిపోవడం, వేసినప్పుడు పెరగడం చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి. ఆ దశలో డబ్బు విలువను పిల్లలు రాశితోనే ఎక్కువ తక్కువలుగా లెక్కిస్తారు. కాబట్టి డబ్బు తగ్గిపోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. పొదుపు, బ్యాంక్, డిపాజిట్ వంటి పదాలు, వాటి అర్థాలు ముఖ్యంగా చిన్న కథల సహాయంతో చెప్తే పిల్లలకు ఎంతగానో హత్తుకుంటాయి.

కిడ్డీబ్యాంక్ నుండి ఆన్‌లైన్ బ్యాంక్‌కి
పిల్లలు కొద్దిగా ఎదిగి కేజీ చదువులు దాటి ముందుకు వెళ్తూ మేథ్స్ సబ్జెక్టులో బోలెడన్ని లెక్కలు చేస్తున్న దశకు చేరుకున్న సమయంలో పాకెట్ మనీని ఎలాగూ అలవాటు చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపడా డబ్బులివ్వడమే కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వండి. అలా ఇస్తూ చూద్దాం. ‘దాన్ని నువ్వు ఎంత తెలివిగా పొదుపు చేస్తావో’ అని పరోక్షంగా ఒక ప్రోత్సాహానిచ్చే కామెంట్ కూడా చేయాలి. దాంతోపాటు పిల్లలు చేసే ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో రాసే అలవాటును కూడా ప్రోత్సహించండి. ‘ఆ యాభై రూపాయలు ఏం చేశావు’ అని అడిగినప్పుడు పిల్లలు గుర్తుకురాక తడబడుతూ, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో తెగ ఇబ్బంది పడుతున్న సమయంలో ‘అందుకే అన్నీ ఒక పుస్తకంలో రాస్తే..ఏదీ మర్చిపోవు’ అని చెప్తే పిల్లల మనసులో బలంగా ముద్రించుకుపోతుంది. ఆ మరునాటి నుంచే పిల్లలు కూడా అకౌంట్స్ మెయింటెన్ చేయడం మెదలు పెడతారు. అదే సమయంలో పిల్లల పేరు మీద ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయాలి. అందులో కొంత డబ్బు డిపాటిజ్ చేసి కిడ్డీ బ్యాంక్‌కి, ఈ బ్యాంక్‌కి గల తేడాను పిల్లలకి చెప్పాలి. ‘కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ బ్యాంక్‌లో డబ్బులు వేస్తే పెరుగుతాయి’ అని వారికి వడ్డీ గురించి వివరించాలి. ‘ఆ వడ్డీతో నువ్వు ఏం కొనుక్కున్నా..అసలు అలాగే ఉంటుంది’ అని తేలికైన పదాలతో వారికి శాస్త్రీయమైన పొదుపు పద్ధతుల గురించి చెప్పాలి. వీటన్నింటి నేపథ్యంలో డబ్బు విలువను పిల్లలు పదేపదే తెలుసుకుంటూ ఉంటారు. ఫలితంగా డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిపోయి, జాగ్రత్త గౌరవం పెంచుతాయి.

పొదుపు నుంచి పెట్టుబడికి
బాల్యంలో డబ్బు విషయాలు పెద్దవాళ్ళ విషయాలుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ నేటి మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో పిల్లలను కుటుంబంలోని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం వీలు పడదు. అయినా, ఇప్పు డు అనేక సందర్భా లలో పిల్లలముందే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. పైగా ‘బోలెడంత ఫీజులు కట్టి చదివిస్తున్నాం..బాగా చదువు’ అని ఎలాగూ పిల్లలతో అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలా ఆర్థిక విషయాల గురించి నెగెటివ్ భావాలు పెంపొందించే బదులు పాజిటివ్ భావాలు పెంపొందించడం మంచిది కదా..అని సలహా ఇస్తున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణులు.
పిల్లలు 7వ తరగతికి వచ్చేసరికే వారి సిలబస్ చూస్తే వారు ఎంతటి కీలకమైన ఆర్థిక పరమైన అంశాలను అభ్యాసం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆ పనుల నుండే వారికి ఏ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత వస్తాయి. ఒక 50 వేలు డిపాజిట్ చేస్తే ఏయే బ్యాంక్‌లో ఎంత ఆదాయం వస్తుంది. మొదలైన బాధ్యతలు పిల్లలకే అప్పగించాలి. డిపాజిట్లు, పెట్టుబడుల పద్ధతుల గురించి వారితో చర్చించాలి. ముఖ్యంగా వివిధ పెట్టుబడుల పద్ధతుల గురించి, ఎందులో పొదుపు చేస్తే, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందో..పిల్లలకు వివరించాలి.

ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో పిల్లలలో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కంపెనీలలో షేర్లు మొదలైనవి వారికి కొంత అర్థమవుతాయి. అందులోని సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలి. ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి పిల్లలకే పెట్టుబడి నిర్ణయాధికారం ఇవ్వాలి. ‘ఇదిగో ఈ లక్ష రూపాయలు, లేదా ఓ ఇరవై వేలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టమంటావో చెప్పు’ అని తల్లిదండ్రులు పిల్లలని అడిగితే, వాళ్ళు ఆ విషయంపై ఎంతో పరిశోధన, విశ్లేషణ చేస్తారు. ఆ ప్రక్రియలో పిల్లలు ఆర్థిక అంశాల విషయంలో ఎంతో తెలివైన వారుగా రూపుదిద్దుకుంటారు.

కొంత డబ్బుతో ప్రత్యేకంగా పిల్లల సలహామేరకు వారి స్వేచ్ఛా నిర్ణయానుసారం పెట్టుబడులు జరుగుతుంటే ఆ డబ్బు పెరుగుతుంటే ఆ అంశంపై వారికి మరింత ఆసక్తి రావడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. డబ్బుపట్ల విపరీతమైన జాగ్రత్త పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఏదైనా అనవసరంగా ఖర్చు చేస్తే పిల్లలే అది వృథా ఖర్చని, వద్దని వారించే స్థితికి వస్తారు.

ఏ వయస్సులో..
ఎలాంటి పొదుపు?

సం॥ వయస్సున్న పిల్లలకు కిడ్డీ బ్యాంక్ పొదుపు అలవాటు చేయండి. పెరిగే, తరిగే డబ్బును చూపిస్తూ డబ్బు విలువ తెలియజేయండి. చిన్న చిన్న పొదుపు లక్ష్యాలు పెట్టండి. 100 రూపాయలు ఎప్పుడూ చేస్తారో అప్పుడు బొమ్మ కొనుక్కోవచ్చు వంటి సరదా లక్ష్యాలు పెట్టండి.
సం॥ వయసు ఉన్న పిల్లల పేరుమీద బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించాలి. ఆపాస్ పుస్తకం, అందులో పేర్లు పిల్లలకి ఆసక్తిగా ఉంటాయి. అప్పుడే బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ పద్ధతులు, వడ్డీ వివరాలు చెప్పాలి. ఆ సమయంలో పిల్లలకు సరిగా అర్థంకాక అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి.
సం॥ వయసు పిల్లలకు అప్పటికే డబ్బు, పొదుపు, పెట్టుబడి అంశాలపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కాబట్టి పొదుపు పెట్టుబడుల విషయంలో వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. వారి వెంట ఉంటూ వాటిని అమలు చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మంచిది? అందుకు కారణాలేమిటో పిల్లల్ని అడగాలి. దాని నుంచి వచ్చే జవాబులు ఎంతో కీలకమైనవి.
సం॥ వయసున్న పిల్లలకు చేతిలో కొంత డబ్బు ఇచ్చి దాని పూర్తి పెట్టుబడి బాధ్యత, ఆ మొత్తాన్ని ఎక్కువ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. అది చిన్న చిన్న మొత్తాలుగా ఉండాలి. వారి నిర్ణయాలలో తారుమారై నష్టం సంభవించినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. అది వారికి ఎంతో విలువైన అనుభవం అవుతుంది.

Take By: T News

Read more...

Tuesday, July 3, 2012

గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి


గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి

yADAGIRE talangana patrika telangana culture telangana politics telangana cinemaఇదీ యాదగిరి చిట్టాపద్దు
- సోమశేఖరరెడ్డి నుంచి అడ్వాన్సుగా రూ.9.5 కోట్లు.
- యాదగిరి నొక్కేసింది రూ.6.5 కోట్లు
- గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో రూ.3.75 కోట్ల నిల్వ
- చలపతిరావుకు ఇచ్చింది రూ.3 కోట్లే
- ఇంటి పక్కనే ప్లాటు కొనుగోలుకు రూ.40 లక్షలు
- నాచారంలో ఇల్లు కొనుగోలుకు రూ.20 లక్షలు
- మారుతి స్విఫ్ట్ కారు కొనుగోలుకు రూ.8.10 లక్షలు కుక్కలను కట్టేసేచోట ఆస్తుల పత్రాలు
- గెస్ట్‌హౌస్‌లో వాటర్‌ట్యాంక్‌కు 20 సీసీ కెమెరాల నిఘా
- డబ్బు స్వాధీనం.. పత్రాలు సీజ్
- లెక్క దొరకని మొత్తం రూ.2.07 కోట్లు
- కర్నూలులో యాదగిరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు
- అజ్ఞాత జీవితానికి గాలి సోదరుడి సహకారం!
- మొబైల్ కాల్స్‌ను ట్రాక్ చేసి పట్టుకున్న ఏసీబీ బెయిల్ ఫర్ సేల్ కేసులో రౌడీషీటర్ అరెస్ట్

హైదరాబాద్, జూలై 2 (): బెయిల్ ఫర్ సేల్ కేసులో కీలక పాత్రధారి అయిన రౌడీషీటర్ యాదగిరిరావు అలియాస్ యాదగిరి అలియాస్ గిరిని ఏసీబీ అధికారులు కర్నూలులోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించేందుకు అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి అడ్వాన్సుగా 9.5కోట్ల రూపాయల నగదును తీసుకున్నట్టు యాదగిరి విచారణలో వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను రిటైర్డ్ జడ్జి చలపతిరావుకు ఇచ్చినట్టు వెల్లడించాడు. కొంత డబ్బును తన నివాసంలో దాచిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున యాదగిరిని వెంటబెట్టుకుని నాచారంలోని అతని ఇంటికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. అదే ప్రాంతంలో ఉన్న యాదగిరి గెస్ట్‌హౌస్‌లో కూడా సోదాలు చేసి, వాటర్‌ట్యాంక్‌లో దాచిపెట్టిన రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కుక్కలను కట్టి ఉంచే చోటు నుంచి విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.

యాదగిరి తండ్రి బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలికి బెయిల్ డీల్‌లో ఇంకా స్వాధీనం కాకుండా ఉన్న 2.07 కోట్ల రూపాయలు ఎక్కడికి? ఎవరి చేతికి? వెళ్లాయన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బెయిల్ డీల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి చేతికి ఈ డబ్బు చేరిందా? లేక యాదగిరి ఈ మొత్తాన్ని తన సంబంధీకుల వద్ద దాచి పెట్టుకున్నాడా? అన్న కోణాల్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మంగళవారం యాదగిరిని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మొత్తం వ్యవహారంపై అతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించాలని నిశ్చయించారు.
Gali05 talangana patrika telangana culture telangana politics telangana cinema
గాలి బెయిల్ డీల్‌లో భాగంగా అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి 9.5కోట్ల రూపాయల నగదును అడ్వాన్సుగా తీసుకున్న యాదగిరి బెయిల్ మంజూరైన రాత్రే తన మనిషి ద్వారా చలపతిరావు ఇంటికి రూ.3 కోట్లు ఇచ్చి పంపించాడు. మిగిలిన రూ.6.5కోట్లను తన వద్దనే పెట్టుకున్నాడు. ఒప్పుకున్న ప్రకారం రూ.5కోట్లు ఇవ్వాలి కదా.. అని చలపతిరావు ఫోన్ చేయగా గాలికి మంజూరైన బెయిల్‌పై సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారని, దానిపై నిర్ణయం వెలువడిన తరువాత మిగతా రూ.2కోట్లు ఇస్తానని చెప్పాడు. అయితే.. చలపతిరావు సీబీఐ అధికారులకు చిక్కగానే యాదగిరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ కోసం డీల్ కుదుర్చుకున్న ఆయన తమ్ముడు సోమశేఖరడ్డి, కర్ణాటక రాష్ట్రం కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబులు యాదగిరికి సహకరించారని, పోలీసులకు చిక్కకుండా యాదగిరిని కొన్నిరోజులు బెంగళూరు శివార్లలో దాచిపెట్టినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.

యాదగిరి కోసం వేటను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు.. బెంగళూరుకు ప్రత్యేక బృందాలను కూడా పంపించారు. సోమశేఖరడ్డి తదితరుల కదలికలపై నిఘా పెట్టారు. యాదగిరితోపాటు సోమశేఖరడ్డి తదితరుల మొబైల్‌ఫోన్లపై కన్నేసి ఉంచారు. దీనిని పసిగట్టిన యాదగిరి ఇటీవలే కర్నూలుకు చేరుకుని ఓ హోటల్‌లో బస చేశాడు. అతని మొబైల్‌ఫోన్ కాల్స్ ద్వారా యాదగిరి కర్నూలులో ఉంటున్నట్టు పసిగట్టిన ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

9.5కోట్లు తీసుకున్నా : విచారణలో యాదగిరి
గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించటానికిగాను అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి రూ.9.5కోట్లను అడ్వాన్సుగా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో యాదగిరి వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను వెంకట చలపతిరావుకు అందచేసినట్టు తెలియచేశాడు. కొంత డబ్బును తన గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో భద్రపరిచినట్టు చెప్పాడు. ఇక, అడ్వాన్సుగా తీసుకున్న మొత్తం నుంచి రూ.40లక్షలు వెచ్చించి తన ఇంటి పక్కనే ఉన్న ప్లాటును, మరో 20లక్షల రూపాయలతో నాచారంలో ఓ ఇల్లును కొన్నట్టు వెల్లడించాడు. మరో 8.10లక్షలు ఖర్చు చేసి మారుతి స్విఫ్ట్ కారు కొన్నట్టు చెప్పాడు.
తెల్లవారుజాము సమయంలో..: ఈ నేపథ్యంలో యాదగిరిని వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున నాచారంలోని అతని ఇంటికి చేరుకున్నారు. యాదగిరి నివాసంతోపాటు అతని గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు జరిపారు.

తనిఖీల్లో గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో యాదగిరి దాచిపెట్టిన 3.75 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సెక్యూరిటీగా యాదగిరి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఓ వాచ్‌మెన్‌ను కూడా నియమించుకున్నట్టు విచారణలో నిర్ధారించుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న తరువాత ఏసీబీ అధికారులు యాదగిరితోపాటు తమ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మరోసారి ప్రశ్నించగా విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తన ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశంలో భద్రపరిచినట్టుగా యాదగిరి వెల్లడించాడు. దాంతో మధ్యాహ్నం 12.30గంటలకు మరోసారి యాదగిరిని వెంట తీసుకుని నాచారం వచ్చిన ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశం నుంచి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Take By: T Media

Read more...

శాఖ కరెంటు టెంటు ఆంధ్రోళ్ల టెంటు

Power500 talangana patrika telangana culture telangana politics telangana cinema

తరలిపోయిన
కీలక ప్రాజెక్టులు
యథేచ్ఛగా
ఉద్యోగాల దోపిడీ
తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన
ప్రాజెక్టులను సీమాంవూధకు
తరలించడం ద్వారా ఉద్యోగాల్లో జరిగిన నష్టం
వనరుల్లేనిచోట పవర్‌ప్లాంట్లు
తెలంగాణకు మొండి చేతులు
ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు
పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
కోల్పోయిన తెలంగాణ ప్రాంతం
సీమాంధ్రలో నూరుశాతం స్థానికులే
అందుకోసం జీవోలూ జారీ
నెల రోజుల్లో అమలైన జీవో 564
దశాబ్దంగా మూలపడి
ఉన్న జీవో 610
నిర్ణయాత్మక స్థానాల్లో
సీమాంధ్రులు
వారి ప్రాంతాలకు
అనుగుణంగా జీవోలు
కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు
dddd talangana patrika telangana culture telangana politics telangana cinema

తెలంగాణ ప్రాంతంలోని జెన్‌కో పవర్ ప్రాజెక్టుల్లో 60 శాతం ఉద్యోగులు సీమాంవూధవారే! కానీ.. సీమాంవూధలోని జెన్‌కో ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జాడే కనిపించదు! తెలంగాణ ప్రాంతానికి నీరందించే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో 70 శాతం ఉద్యోగులు సీమాంవూధులే! కానీ.. విజయవాడలోని వీటీపీఎస్ ప్రాజెక్టులో కేవలం పట్టుమని ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు కూడా లేరు! 2011 మార్చి వరకు విద్యుత్‌రంగంలో 80,920 పోస్టులు మంజూరై ఉండగా, వాటిల్లో 23,366 పోస్టులు మాత్రమే తెలంగాణ వారికి దక్కాయి! ఇందులోనూ మూడు వేల మంది తెలంగాణకు వలస వచ్చినవారే! అంటే.. తెలంగాణ గడ్డపై పుట్టిన వారికి దక్కింది కేవలం 20వేల ఉద్యోగాలేనన్నమాట! అంతేకాదు.. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు సీమాంవూధకు తరలిపోవడంతో ప్రత్యక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. సమైక్యాంవూధలో తెలంగాణకు జరిగిన నష్టానికి విద్యుత్ రంగంలోని ఈ అన్యాయాలు మచ్చుతునకలు! విద్యుత్ బయటికి కనిపించదు.. కానీ పట్టుకుంటే షాక్‌కొడు తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలూ అంతే.. పట్టిచూస్తే కానీ అంతుచిక్కవు!!

శాఖ కరెంటు ఆంధోళ్ల టెంటు
తరలిపోయిన కీలక ప్రాజెక్టులు.. యథేచ్ఛగా ఉద్యోగాల దోపిడీ
- వనరుల్లేని చోట పవర్‌ప్లాంట్లు.. తెలంగాణకు మొండి చేతులు
- ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
- కోల్పోయిన తెలంగాణ ప్రాంతం.. సీమాంవూధలో నూరుశాతం స్థానికులే
- అందుకోసం జీవోలూ జారీ.. నెల రోజుల్లో అమలైన జీవో 564
- దశాబ్దంగా మూలపడి ఉన్న జీవో 610
- నిర్ణయాత్మక స్థానాల్లో సీమాంవూధులు
- వారి ప్రాంతాలకు అనుగుణంగా జీవోలు
- కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
- సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు

Contral0 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జూలై 2 (): సీమాంధ్రులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది! విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, 4 డిస్కమ్‌లలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కకుండా సీమాంవూధులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతల వాదన! లోతుగా తరచి చూస్తే.. నివురుగప్పిన అన్యాయం.. నిప్పులా కనిపిస్తుంటుంది. శాతాలు, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు వాటా దక్కినట్లు కనిపించినా.. కనిపించని అన్యాయం మరోటి ఉంది. అదే తెలంగాణ కోల్పోయిన ఉద్యోగాలు! విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు పుష్కలంగా లభ్యమవుతున్నా తెలంగాణ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకపోవడం, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నష్టపోయిన ఉద్యోగాలు 16వేలకుపైనే! ట్రాన్స్‌కోలో 8,302 మంది, జెన్‌కోలో 15,647 మంది, నాలుగు డిస్కమ్‌లలో 56,971 మంది ఉద్యోగులున్నారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కమ్‌లలో రెండు డిస్కమ్(ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లు పూర్తిగా సీమాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 26,605 మంది పనిచేస్తుండగా, సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 30,366 మంది ఉద్యోగులున్నారు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వలసవాదులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉండడంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్నారు. సీమాంవూధలో నూటికి నూరుశాతం అక్కడివారే ఉద్యోగాలు పొందుతుండగా అదే విధానం తెలంగాణలో ఎందుకు పాటించడం లేదన్నది ప్రశ్న!
Power10 talangana patrika telangana culture telangana politics telangana cinema

అంటే.. వంద మార్కులు వచ్చేలా చదివిన విద్యార్థికి 40మార్కులు వేసి.. అసలు ఒక్కమార్కు వచ్చేందుకూ ఆస్కారం లేని విద్యార్థికి 60 మార్కులు వేసిన ప్రభుత్వం.. సమతుల్యం పాటించామంటూ మోసగించే యత్నాలను నిస్సిగ్గుగా చేస్తున్నది! అంతేకాదు.. ఈ అన్యాయంలో పెను జీవన విధ్వంసం కూడా కనిపిస్తుంది. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా కోసం తెలంగాణ నుంచి బొగ్గు అందిస్తున్నారు. ఈ పేరుతో భారీ స్థాయిలో ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వి.. వందల వేల గ్రామాల ఉనికిని అదృశ్యం చేస్తున్నారు. వెరసి.. విద్యుత్ రంగంపై సీమాంధ్ర పాలకుల వివక్ష ఫలితంగా అటు ఉద్యోగిత పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగానూ తెలంగాణ నష్టపోయింది. మరోవైపు వనరుల్లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి బొగ్గు రవాణా, అక్కడి ప్రాజెక్టులనుంచి విద్యుత్ పంపిణీలో నష్టాలు కలిసి.. అక్కడ తయారయ్యే విద్యుత్ ఖరీదును అమాంతం పెంచివేస్తున్నది.

1969లో వికసించిన విద్యుత్ తేజం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున రాజుకొనడానికి నాంది పలికింది విద్యుత్ రంగమే! 1957లో ఏపీ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ టు రెసిడెన్సీ యాక్ట్‌ను విద్యుత్ బోర్డు.. నాటి ఎపీఎస్‌ఈబీలో అమలు చేయాలంటూ ఓ విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. దవానలంలా వ్యాపించి.. తెలంగాణ పది జిల్లాలకూ విస్తరించింది. జై తెలంగాణ అంటూ యావత్ ప్రాంతం నినదించేందుకు గొంతుక అయ్యింది! అదే స్ఫూర్తి విద్యుత్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నది.

మొన్నటి సహాయ నిరాకరణ ఉద్యమం, తదుపరి సకల జనుల సమ్మెలో విద్యుత్ తేజం వికసించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమరశంఖం పూరించింది. విద్యుత్ రంగంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకుండా సీమాంవూధులు కుట్రలు చేస్తే ఉప్పెనలాంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీ జాక్) హెచ్చరిస్తున్నది. గత ఆరు దశాబ్దాల చరివూతను నెమరేసుకుని సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయనేతలు మసలు కుంటారో, మలిఉద్యమాన్ని చవిచూస్తారో వారే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపజేయాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులుంటే ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Power50 talangana patrika telangana culture telangana politics telangana cinema

1957లో చట్టం
ఏపీ ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్-1957 ప్రకారం 14 ఏళ్లపాటు పాటు స్థానికంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ చట్టాన్ని విద్యుత్‌బోర్డు(ఎపీఎస్‌ఇబి)లో వర్తింపజేయాలని తెలంగాణ యువకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ చట్టం విద్యుత్‌బోర్డుకు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒక విద్యార్ధి చేసిన ఆమరణ నిరాహారదీక్ష తీవ్రత దావానలంగా తెలంగాణ జిల్లాలకు విస్తరించి 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు సైతం విద్యుత్‌బోర్డుకు 1957 చట్టం వర్తించదని హైకోర్టు తీర్పునే ఖరారుచేసింది. దాంతోపాటు 1957 చట్టం అమలుకు ముందున్న ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు 1971లో తీర్పు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న పీవీ నరసింహారావు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దానిని జీర్ణించుకోలేని సీమాంధ్ర రాజకీయనేతలు ముల్కీ రూల్స్ అమలుచేస్తే తమకు ఉద్యోగ అవకాశాలు దక్కవని గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షతో జై ఆంధ్రా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపందాల్చడంతో నాటి కాంగ్రెస్ అధిష్ఠానం పీవీతో సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఆ తర్వాత కేంద్రం 1974లో రాజ్యాంగ సవరణ (37) చేసి ముల్కీ నిబంధనలను తొలగించింది. అనంతరం 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అయితే నాడు అధికారంలో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయనేతల ఉద్యమం ఫలితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గిర్‌గ్లానీ కమిషన్ 2004లో ప్రభుత్వానికి సుదీర్ఘమైన నివేదిక సమర్పించింది. విద్యుత్ రంగానికి సంబంధించిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సంస్థల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని సిఫారసు చేసింది.

బొగ్గు సింగరేణిది-సోకు సీమాంధ్రులుది
విద్యుత్ రంగంలో మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులదే పైచేయిగా ఉంది. ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్‌రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్‌రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రం ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు, మరో అడుగు ముందుకేసి విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బొగ్గు ఆధారంగానే సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ.. సీమాంధ్ర పాలకులు వాటిని తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. దీనికి అదనంగా తెలంగాణలో బొగ్గు తవ్వకాలకు ఓపెన్‌కాస్టుల పేరిట పెను జీవన విధ్వంసం జరుగుతున్నది.

సీమాంధ్రులదే పెత్తనం......
విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అగ్రభాగంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన బడా కాంట్రాక్టర్లు 21మంది ఉంటే.. వారిలో 19మంది సీమాంవూధులే. ఇలాంటి పరిస్థితులకు నాటి సీఎం చంద్రబాబు ప్రధాన కారణమన్న విమర్శ బలంగా ఉంది. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసి, ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన హయాంలోనే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకుకు అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు హయంలో సీమాంవూధుల నక్కజిత్తుల కారణంగా ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఏపీఎస్‌ఈబీ నాటినుంచే సీమాంవూధులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో పనిచేసిన మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ, వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుట్రపూరితంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సంస్కరణల తదుపరి అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసినవారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌వూపాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎన్నో మతలబులున్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో ప్రాజెక్టు విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతోనే ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబు ఉంది. అంతే కాకుండా మర్చంట్ పవర్‌వూపాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టును ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా రైతుకూలీలు, పరిక్షిశమల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కొరవడింది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాలేదు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. సత్తుపల్లి ప్రాజెక్టు వస్తే తెలంగాణ సస్యశ్యామలమై ఉండేది. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు 2002లోనే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కేవలం 26 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.

గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. సకాలంలో ఇది పూర్తి అయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు వ్యవసాయ, పారిక్షిశామికరంగాల్లో తెలంగాణ దూసుకు పరిస్థితులుండేవి. ఇదే సమయంలో 2003లో సీమాంవూధకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే 220 మెగావాట్లు, వేమగిరి 370 మెగావాట్లు, గౌతమి 464 మెగావాట్లు, కోనసీమ 445 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 1400 మెగావాట్ల సామర్థ్యం గల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్నీ అనుమతులు వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసింది. కాంతానపల్లితోపాటు మరికొన్ని హైడెల్ పవర్ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయరంగం, పారిక్షిశామికరంగాలు ఎదగాల్సినంతగా ఎదలేకపోయాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది.

ఒప్పందాల ఉల్లంఘనలు
విద్యుత్ సంస్కరణల సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో అనేకం ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. గతేడాది సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు మెరుగైన కరెంటు సేవలు అందిస్తూనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమై కీలక భూమిక పోషించారు. సింగరేణి కార్మికుల సమ్మె, తదుపరి కరెంటోళ్ల సమ్మె సర్కారును ఇరకాటంలో పెట్టింది. దాంతో గత ఏడాది అక్టోబర్ 25న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. మొత్తం 13 అంశాలపై యాజమాన్యాలు అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎం జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరఫున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు.

జీవోల అమలులో ఎంతో తేడా
ఆచరణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడంపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలను తట్టుకునేందుకు 1985 డిసెంబర్‌లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్ 610 జీవో తెచ్చారు. విచిత్రం ఏమంటే 610 జీవో జారీకి నెల ముందు రాయలసీమ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 564ను తీసుకువచ్చింది. రాయలసీమ జిల్లాల్లో (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ఇతర జిల్లాల ఉద్యోగులు ఉండరాదనేది జీవో సారాంశం. ప్రభుత్వం ఈ జీవోను నెలలో అమలుచేసి రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఉన్నపళాన వెనక్కి పంపించింది. అప్పట్లో రాయలసీమ నేతలు తెలంగాణ ఉద్యోగుల పట్ల కిరాతకంగా వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఉద్యోగులు మరచిపోలేదు. కేవలం నెల గడువులో 564 జీవోను నిఖార్సుగా అమలు చేసిన ప్రభుత్వం దశాబ్దకాలంగా 610 జీవోను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదంటే తెలంగాణపై ఎంతటి పక్షపాతధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రత్యేకవాదులు అంటున్నారు.

రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌వూపాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పొతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒప్పందంలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్ (హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కాంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయి కల్పించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన (కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు
అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్తూపాన్ని
తెలంగాణ చౌరస్తా (మింట్ కాంపౌండ్)వద్ద ఏర్పాటు చేయడం.

Take By: T Media

Read more...

Friday, June 29, 2012

సెక్రటేరియట్..వలసల ఎస్టేట్



SECRETAR-సచివాలయంలో తెలంగాణ ఫెయిర్ షేర్ మాయం-ఉద్యోగాల్లో సీమాంవూధుల తిష్ఠ
-అగ్రక్షిశేణి ఉద్యోగాల్లో అందరూవాళ్లే
-తెలంగాణోళ్లు నాలుగో తరగతి ఉద్యోగులే
-ఏళ్లు గడుస్తున్నా తొలగని వ్యత్యాసాలు
-అడగడుగునా ఒప్పందాల ఉల్లంఘన
-సరిచేస్తామంటూ కుప్పలుగా కమిషన్లు
-అతీగతీ లేకుండాపోయిన నివేదికలు
-తాజాగా రంగంలోకి రాయ్‌కోటి కమిషన్
-జ్యుడీషియల్ అధికారాల్లేని ‘ఏకసభ్య’

graffహైదరాబాద్, జూన్ 24 ():సచివాలయం! రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పరిపాలనలో భాగస్వాములై రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు. సెక్రెటెరియట్ లో ప్రధానంగా ఎనిమిది బ్లాకులలో 40 ప్రధాన శాఖలు పని చేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మహానగరంలో 180 హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. సెక్రెటెరియట్ లో జరిగిన అన్ని నియామకాలలో ఉల్లంఘనలు జరిగాయి. ఉల్లంఘనలన్నీ యదార్థమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన గిర్‌గ్లానీ కమిటీ సోదాహరణంగా వివరించింది. ప్రధానంగా సెక్రెటెరియట్ లో ఉద్యోగులకు చెందాల్సిన ఫెయిర్‌షేర్ 42 శాతం వాటా ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రాంతానికి దక్కలేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి అడిషనర్ సెక్రటరీ స్థాయి వరకు ఏ హోదాలో కూడా తెలంగాణకు దక్కాల్సిన 42% వాటా దక్కలేదు. ఈ అసంతృప్తుల నుండే తెలంగాణ ఉద్యమం పెల్లుబుకుతున్నది. పెద్దమనుషుల ఒప్పందం నుండి 2011 అక్టోబర్ 24న జరిగిన సకల జనుల సమ్మె విరామ ఒప్పందం వరకు అన్ని నిబంధనలను, అంగీకారాలను ఉల్లంఘించారు. వ్యతిరేకించారు. ప్రధానంగా సెక్రెటెరియట్ లో నియామకాలలో దిగువ స్థాయి నుండి అన్యాయానికి పాల్పడ్డారు.14.8.1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందాలలో 14 అంశాలను చేర్చారు. వీటన్నింటిలో ప్రధానమైనదే ఉద్యోగుల నియామకం. ఉద్యోగుల నియామకాలలో తప్పకుండా హైదరాబాద్ స్టేట్‌లో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాలను
ఉల్లంఘించి వందల సంఖ్యలో సీమాంధ్ర నుండి యువకులను తీసుకొచ్చి సెక్రెటెరియట్ లో నియమించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్న యువకులకు తెలుగులో పరీక్షపెట్టి అనుత్తీర్ణులను చేశారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఉద్యోగులకు ఆంధ్ర ఉద్యోగులకన్నా వేతనాలు ఎక్కువగా ఉండేవి. సెక్రెటెరియట్ లో సీనియర్ అసిస్టెంట్‌కు హైదరాబాద్ స్టేట్‌లో 135-200 జీతం స్కేల్ ఉండేది. ఇదే క్యాడర్‌లోని సీమాంధ్ర
ఉద్యోగికి 90-170 వేతనం ఉండేది. ఈ వ్యత్యాసాలను క్రమబద్ధీకరించే పేరుతో తెలంగాణ ఉద్యోగులకు 35 శాతం వేతనాన్ని కత్తిరించారు. 100- 200 దగ్గర స్థిరీకరించారు. ఈ సందర్భంలోనే టీఎన్జీవో
నాయకత్వంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వ్యత్యాసాలను పరిశీలిస్తామని తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తామని పాలకులు హామీ ఇచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించిన 14 అంశాలను తుంగలో తొక్కారు. 1969లో 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఆరు సూత్రాలను ప్రకటించారు. ఈ సూత్రాలలో ప్రధానంగా ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈ ఆరుసూవూతాలను కూడా పాతర పెట్టారు. ఈ క్రమంలోనే 610 జీవోను, గిర్‌గ్లానీ సిఫారసులను, గిర్‌గ్లానీ సిఫారసుల అమలు కోసం వచ్చిన జీవోలను, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను, శాసనసభా సంఘం సిఫారసులను ఉల్లంఘించారు.

మార్చి 4-2011 న జరిగిన ఒప్పందాలలో ఉల్లంఘనలన్నింటినీ చర్చించేందుకు పరిష్కరించేందుకు జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిటీకి అన్నీ సమస్యలను తెలియపరచవచ్చునని ఒప్పందాలలో పేర్కొన్నారు. ఒప్పందాల ప్రకారం రాయ్‌కోటి కమిటీని ఏర్పరిచినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించడానికి వీలుగా జ్యుడిషియల్ అధికారాలు లేని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందాలన్నింటినీ పాతర పెట్టారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

sachivalayamచిన్న స్థాయి ఉద్యోగాల్లోనూ వివక్షే
పెద్ద ఉద్యోగాలే కాదు.. చిన్న స్థాయి ఉద్యోగాలలో కూడా పాలకులు తెలంగాణపట్ల వివక్షను కొనసాగిస్తున్నారు. ఇందుకు డ్రైవర్ల నియామకమే ఒక నిదర్శనం. 1985 నాటికి ఒక్క సెక్రెటెరియట్ లో మొత్తం 310 మంది డ్రైవర్లు పనిచేసేవారు. 2012 జూన్ వచ్చేసరికి వీరి సంఖ్య 75కు చేరుకున్నది. ఈ అంశంపై సెక్రెటెరియట్ లో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్‌ను టీ మీడియా సంప్రతించినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతం నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చి కనీసం డైవ్రర్లుగానైనా సెటిల్ అవుదామని 1986, 1987లలో ఎక్కువ సంఖ్యలో వచ్చారని, అయితే
డ్రైవర్ల ఉద్యోగాల కోసం తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో మొత్తం పోస్టులనే అబాలిష్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. మూడు వందల వాహనాలను సెక్రెటెరియట్ లో అధికారులు
ఉపయోగించుకుంటున్నారని, వీరందరూ ఔట్‌సోర్సింగ్ నుండి వచ్చినవారేనని, వాహనాలన్నీ కూడా ఆంధ్ర ట్రావెల్స్‌కు చెందిన యజమానులవేనని యాసిన్ చెప్పారు. సెక్రెటెరియట్ లో తెలంగాణ నిరుద్యోగులకు
జరుగుతున్న అన్యాయాలకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. నిబంధనల ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదా నుండి మాత్రమే కారు సౌకర్యం ఉన్నప్పటికీ డిప్యూటీ సెక్రటరీ హోదా నుండి కారు
ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ఖజానాపైన భారం వేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల ఆరోపణ. సెక్రెటెరియట్ లో 2012 జూన్‌నాటికి దాదాపు 104మంది ఐఏఎస్
అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.

ఒక్కొక్క అధికారి సగటున మూడు కార్లను ఉపయోగించుకుంటున్నారని అధికారిక అంచనా. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి అల డ్రైవర్లు, అటెండర్ల జీతాలు అన్నీ వసతులతో కలిపి నెలకు లక్షరూపాయల వరకు బిల్లులు చేస్తున్నారని అధికారిక నివేదికలే తెలియచేస్తున్నాయి. ఒకవైపు సాక్షాత్తు ఆర్థికమంత్రే ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా ఖర్చులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, సాధారణ ఉద్యోగులకు మెడికల్ బిల్లులు కూడా చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ, అధికారులు తమ విలాసాల విషయంలో మాత్రం ఎప్పుడు ఆలోచించరని అధికారిక ఖర్చుల పట్టికలే తెలియచేస్తున్నాయి. ఐఏఎస్‌లు, మంత్రుల విలాసాల ఖర్చులలో మార్పులు ఉండడం లేదనేది చాలాకాలంగా ఉన్న విమర్శ.

సెక్రెటెరియట్ లో లిఫ్ట్ ఆపరేటర్ నుండి అడిషనల్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం 14 క్యాడర్లు ఉన్నాయి. ఈ 14 విభాగాలలో ఏ విభాగంలో కూడా తెలంగాణవారికి ఫెయిర్‌షేర్ లభించలేదు. మరో చిత్రమేమిటంటే లిఫ్ట్ ఆపరేటర్ వంటి దిగువస్థాయిలో 68శాతం ఉద్యోగులు తెలంగాణ వారు పనిచేస్తుండగా అడిషనల్ సెక్రటరీ వంటి ఉన్నతస్థాయిలో 7శాతం మాత్రమే అధికారులు తెలంగాణ వారు ఉన్నారు.

ఉద్యమపథంలో టీఎన్జీవోలు
సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్‌జీవో యూనియన్ చాలా బలమైన సంఘం. మొత్తం 2760 మంది ఉద్యోగులలో 659 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. సంఖ్యాబలంలో తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్
తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని ఝంఝామారుతం మాదిరిగా వినిపించడంలో మహోన్నత భూమిక పోషిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సురేశ్‌కుమార్‌ల సారధ్యంలో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె ఉద్యమాలలో వెలుపల ఎంత బలమైన ఉద్యమాలు నిర్మించారో అంతేబలంగా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ నాయకత్వంలో మంత్రుల కుర్చీలను కూడా గడగడలాడించి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ మంత్రులు సెక్రెటెరియట్ లో రావాలం భయపడిపోయారు. 1956 నవంబర్ 1 నుండి కూడా సెక్రెటెరియట్ లో తెలంగాణ ఎన్జీవో యూనియన్ తెలంగాణ వాదాన్ని ఖండితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో, సైద్ధాంతిక పునాదితో, సగర్వంగా వినిపిస్తునే ఉన్నది. స్వామినాధం వంటి నాయకులు ఈ సంస్థకు కొత్త ఊపిర్లు ఊదారు. ఈ క్రమంలోనే 17.5.2010లో ఆనాటి అధ్యక్షులు గంధం సురేశ్‌కుమార్, ప్రధానకార్యదర్శి బీ శ్రవణ్‌కుమార్‌డ్డిల సారధ్యంలో శ్రీకృష్ణకమిటీకి సెక్రెటెరియట్ లో తెలంగాణ వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఒక పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. 1956 పెద్ద మనుషుల ఒప్పందం నుండి సకల జనుల సమ్మె వరకు పాలకులు చేసిన ఉల్లంఘనలన్నింటినీ శ్రీకృష్ణకమిటీకి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.

సెక్రెటెరియట్ లో ఉద్యోగుల సంఖ్యలు వివరించి ఫెయిర్‌షేర్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అదే విధంగా ఈ సంస్థ గతంలో జైభారత్‌డ్డి కమిషన్, గిర్‌గ్లానీ కమిషన్, శాసనసభాసంఘం, మంత్రివర్గ ఉపసంఘం, తదితర అన్నీ సంఘాలకు, సంస్థలకు తెలంగాణకు సెక్రెటెరియట్ లో జరిగిన విద్రోహాన్ని సోదాహరణంగా వివరిస్తూ నివేదికలను అందించింది. హన్మంతడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కూడా చాలా బలంగా పనిచేస్తున్నది. సెక్రెటెరియట్ లో వరకు ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు చాలా వరకు కనిపించవు. సకల జనుల సమ్మె సందర్భంలో తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఆంధ్ర ఉద్యోగులు విడిపించుకొచ్చారు. తెలంగాణవాదంలో నిజాయితీ, న్యాయం ఉన్నాయని ఆంధ్ర ఉద్యోగుల సంఘాలు నమ్ముతున్నాయి. తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు, సీమాంధ్ర అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు చాలా స్నేహపూరితంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

మహిళా ఉద్యోగులూ తక్కువే
మొత్తం సెక్రెటెరియట్ లో 678 మంది మహిళలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వీరిలో 102 మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులు. షెడ్డూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగులు 443 మంది ఇక్కడ
పనిచేస్తున్నారు. వీరిలో 115 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగహక్కులు ఉన్నప్పటికీ ఇక్కడ వాటిని కూడా పాతర పెట్టారని తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల ఆరోపణ.

నియామకాలన్నీ నేరుగానే
సెక్రెటెరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి నియామకాలు జరుగుతూ ఉంటాయి. 1985 వరకు టైపిస్ట్, అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు డైరక్ట్ పద్ధతిలోనే నియామకాలు జరుగుతూ
ఉండేవి. సెక్రెటెరియట్ లో నియామకం పొందిన వారికి సెక్రెటెరియట్ లో వెలుపల పదోన్నతులకు అవకాశాలు లేకపోవడంతో సెక్రెటెరియట్ లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టులు రద్దు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండే నియామకాలు చేస్తున్నారు. హెచ్‌వోడీల నుండి పన్నెండున్నరశాతం మంది ఉద్యోగులను ఏఎస్‌వోలుగా నియమిస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుండి పదోన్నతుల ద్వారానే నియమిస్తున్నారు. గతంలో ఏఎస్‌వోలకు ఏసీటీవో, లేబర్ ఆఫీసర్, తదితర హోదాలలో నియామకాలు పొందేందుకు అవకాశాలు ఉండేవి. ఈ అవకాశాలన్నీ రద్దు కావడంతో
88 శాతం నియామకాలు డైరక్ట్ పద్ధతిలోనే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నాయి.


ఏ బ్లాకుల్లో ఏముంది?
బ్లాక్ ‘ఏ’A_BLOCkహోంశాఖకు కేంద్ర స్థానం. మూడు, నాలుగు అంతస్తులలో ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాంతిభవూదతలను పర్యవేక్షిస్తారు. హోంశాఖకు సంబంధించిన 28 విభాగాలను ఇక్కడి నుండి పరిపాలిస్తుంటారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్‌శాఖ నుండి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ సేఫ్టీ అథారిటీ, స్పెషల్ సెక్రటరీలు ఇలా మొత్తం 28 విభాగాలు ఈ భవనంలో పనిచేస్తుంటాయి. వీఐపీల రక్షణకు సంబంధించిన వ్యూహరచనలు, వీఐపీలల కదలికలు, వారిపట్ల ఉండాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎవరిపైన నిఘాలను కట్టుదిట్టం చేయాలన్న అంశాల్లో కూడా ఏ బ్లాక్‌నుండే
మంత్రరచన చేస్తుంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్, స్టేట్ విజిపూన్స్ అధికారులకు ఇక్కడి నుండే అదేశాలు వెళుతుంటాయి. లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, లీగల్ పరిపాలనావిభాగం ‘ఏ’ బ్లాక్‌లో పనిచేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అధికారులు, మైనారిటీ సంక్షేమశాఖ ఈ భవననంలో ఉన్నాయి.

బ్లాక్ ‘బీ,సీ’B-BLOCKఈ రెండు బ్లాక్‌లలో నార్త్ హెచ్, సౌత్ హెచ్ విభాగాలలో సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) విభాగాలు పని చేస్తుంటాయి. సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనం నుండి పరిపాలనను కొనసాగిస్తుంటారు. సాధారణ పరిపాలనాశాఖలుగా వ్యవహరించే ఈ భవనాలలో చాలా సున్నితమైన పరిపాలనాంశాలపైన చర్చలు జరుగుతుంటాయి. ఒక్క బీ బ్లాక్‌లోనే 37 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 19 మంది అసిస్టెంట్ సెక్రటరీ హోదాగల అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పీఆర్సీలు, ఎనామలీస్ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ముఖ్యమంత్రి ఒప్పందాలలో అంగీకరించిన అంశాలు తదితర ముఖ్యమైన అంశాలన్నింటికీ ‘బీ’, ‘సీ’ విభాగాలలోని సాధారణ పరిపాలనాశాఖ అధికారులు బాధ్యత వహిస్తుంటారు.


బ్లాక్ ‘సీ’C-BLOCKఇది ఆంధ్రవూపదేశ్ అధికారానికి రాజదండం. ముఖ్యమంత్రి అధికార సింహాసనం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, మంత్రివర్గ సమావేశ మందిరం సీ బ్లాక్ ప్రత్యేకతలు. ఇందులోని ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కొలువుతీరి ఉంటారు. ఐదవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, నాలుగవ అంతస్తులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు, మంత్రివర్గ సమావేశం హాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో చీఫ్‌సెక్షికటరీ, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, ఇతర ముఖ్యఅధికారులు కొలువు తీరి ఉంటారు. ఒకటి రెండు ఫ్లోర్‌లలో సాధారణ పరిపాలనా అధికారులు ఉంటారు. సాధారణా పరిపాలనకు సంబంధించిన 28 ప్రాముఖ్యమైన విభాగాలు ‘సీ’ బ్లాక్‌లో ఉన్నాయి.

బ్లాక్ ‘డీ’d-blockసాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి వివిధ సంక్షేమశాఖలు ఇక్కడే ఉన్నాయి. మూడవ అంతస్తులో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చక్కబెట్టే ఆర్థికమంవూతిత్వశాఖ నుండి ఆర్థికశాఖకు సంబంధించిన చాలా విశిష్టమైన శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకోసం రచించిన సంక్షేమ పథకాలకు ఇక్కడి నుండే నిధులు మంజురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు ఇక్కడి నుండి జీవోలు వెలువడాల్సిందే. అదీ లెక్క. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్, సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం వంటి వివిధ సంక్షేమ కార్యాలయాలు మొత్తం వివిధ విభాగాలకు చెందిన 84 సెక్షన్లు ఈ భవనంలో ఉన్నాయి. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి, పరిక్షిశమలు, వాణిజ్య శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు ఈ భవనంలో ఉంటారు. వ్యవసాయం, సహకారశాఖ, ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ, ఇంధనశాఖలు ఇక్కడ నుండి పనిచేస్తుంటాయి. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులు, ఆర్థిక సలహాదారులు, ప్రొక్యూర్‌మెంట్ మానిటరింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రొక్యూర్‌మెంట్ తదితర అధికారులు డీ బ్లాక్‌లో ఉంటారు. కాగా.. ‘ఈ’, ‘ఎఫ్’, ‘జీ’ బ్లాకులు నిర్మాణంలో ఉన్నాయి.

బ్లాక్ ‘జే’J_BLOCKఇక్కడ ఉన్నతవిద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య వంటి చాలా ప్రాధాన్యమైన శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ, రవాణా- రోడ్డుల విభాగం, నీటిపారుదల విభాగం, తదితర శాఖలు ఇక్కడ ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన 11 మంది సీనియర్ అధికారులు ఈ భవనంలో ఉన్నారు. నీటిపారుదల రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ అధికారులు ఈ భవనం నుండి పరిపాలనలను చక్కదిద్దుతున్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యవహారాలు, భూసేకరణ విభాగం ఇక్కడ నుండే పనిచేస్తున్నాయి. విజిపూన్స్ -1, విజిపూన్స్-2 సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘హెచ్’H,BLOCKఇందులో విజిపూన్స్ కమిషన్‌కు సంబంధించిన 24 సెక్షన్లు పని చేస్తున్నాయి. ‘హెచ్’ బ్లాక్ ఉత్తరవిభాగంలో విజిపూన్స్ కార్యాలయం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో సాధారణ పరిపాలనాశాఖకు సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి. ఈ భవనం దక్షిణ విభాగంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కార్యాలయం ఉన్నాయి. సువిశాలమైన, అందమైన సెక్రెటెరియట్ లో లైబ్రరీ ఈ భవనంలో ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ రాజనరసింహ ఈ భవనం నుండే అధికారిక కార్యక్షికమాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్,విజిలిన్స్ కమిషన్, విజిపూన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రికార్డులను భద్రపరిచే విభాగం తదితర పరిపాలనా విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి

బ్లాక్ ‘కే’K.BLOCKఇందులో తెలంగాణ ఎన్జీవో యూనియన్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. రెయిన్‌షాడో డెవలప్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఎగ్జామినర్ విభాగానికి చెందిన 8 మంది అధికారులు ఇక్కడి నుండి పనిచేస్తుంటారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో ఆర్కైవ్స్‌కు సంబంధించిన అద్భుతమైన విభాగం పనిచేస్తున్నది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీలు ఇక్కడ ఉన్నాయి.

బ్లాక్ ‘ఎల్’L-blockఇందులో పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, కార్మికశాఖ, ప్లానింగ్, మెడికల్ అండ్ హెల్త్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూకు సంబంధించిన 24 విభాగాలు, పంచాయతీరాజ్‌కు అనుబంధంగా ఉండే 18 శాఖలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దాదాపు నూరుకు పై చిలుకు విభాగాలు ఈ భవనంలో ఉన్నాయి.

Take By: T News

Read more...

Thursday, June 28, 2012

ఏజెన్సీ మద్యం దుకాణాలకు బినామీల అవతారం



- వెనకుండి కథ నడిపించిన మద్యం మాఫియా
- విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న వ్యాపారులు
- ‘టీమీడియా’ పరిశీలనలో వెల్లడైన నిజాలు
- ప్రశాంతంగా మద్యం దుకాణాలకు ముగిసిన లాటరీ


ఖమ్మం టౌన్, జూన్ 27():‘నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. నవసమాజ నిర్మాతలు’ అని మన పెద్దలు సూక్తీకరించారు. కానీ ఆ విద్యార్థులు జిల్లాలో వేళ్లూనుకున్న మద్యం వ్యాపారంలో నేడు పావులుగా మారారు. అక్రమ మద్యం వ్యాపారంలో ఆరితేరి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న కొందరు రాబందులు వెనుక బడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తమ ఉన్నతికి మెట్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కథ కాదు. పచ్చి నిజం..టీమీడియా పరిశీలనలో వెల్లడైన నిప్పులాంటి నిజం. జిల్లాలోని 153 మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిల్లో 71దుకాణాలను ఏజెన్సీ ప్రాంతానికి కేటాయించింది. అయితే ఏజెన్సీలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేయాలంటే స్థానిక గిరిజనుడికే మొదటి ప్రాధాన్యత. అలాగే సంబంధిత తహసీల్దార్ ఇచ్చిన నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలనే కచ్చితమైన నిబంధన అమల్లో ఉంది. కాగా ఆ రెండు సర్టిఫికెట్‌లు పొందాలంటే ప్రస్తుత చట్టాల ప్రకారం సామాన్యులకు వెంటనే సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఎప్పటి నుంచో మద్యంతో మన్యం ప్రజలను దగా చేస్తున్న అక్రమార్కుల కన్ను విద్యార్థులపై పడింది.

ఉన్నత విద్య కోసం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను ఆసరాగా చేసుకుని విద్యార్థులను ముగ్గులోకి లాగింది మద్యం మాఫియా. ఈనెల 19 నుంచి 25 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన వారిని పరిశీలించడంతోపాటు రెండు రోజులు( మంగళ, బుధవారాల్లో) రామకృష్ణా ఫంక్షన్‌హాల్లో చేపట్టిన లాటరీ ప్రక్రియకు హాజరైన వారిని ‘టీమీడియా’ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో వారిని పలకరిస్తే నిజాలు నిగ్గు తేలాయి. వారు ఏషాపునకు దరఖాస్తు చేశారో.. ఎంత డబ్బు చెల్లించారో ఎవ్వరికీ తెలియదు. లాటరీలో దుకాణం దక్కినా.. ఈఎండీ ఫీజు డబ్బు చెల్లించడానికి వెనకుండి ఉరికిచ్చిన వారు సకాలంలో ఎవరూరాక పోవటంతో నేరం చేసిన వాళ్ల లాగా బిక్కమొహాలేసుకుని గంటల తరబడి హాల్‌లోనే కూర్చున్నారు. ఇలా చదువుతో చక్కని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే విద్యార్థులను మద్యం మాఫియా బినామీ వ్యాపారులుగా మార్చారు.

ముగిసిన లాటరీ ప్రక్రియ...
మైదానంలో 2, ఏజెన్సీలో 71 కలిపి జిల్లాలో మొత్తం 153మద్యం దుకాణాలు ఉన్నాయి. కాగా ఆయా ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మైదానంలో1591, ఏజెన్సీలో 971 మొత్తం 2562 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా అదికారులు వాటికి పట్టణంలోని బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణా ఫంక్షన్‌హాల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎంఎం నాయక్ సమక్షంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న లాటరీ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఆ క్రమంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు మైదాన ప్రాంత దుకాణాలకు(2)కు లాటరీ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. కాగా మిగిలిన ఏజెన్సీ ప్రాంత దుకాణాలు (71) కు సంబంధించి నిబందనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లాటరీ తీయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సూచించడంతో బుధవారం ప్రక్రియ కొంత ఆలస్యమైంది. దీంతో వ్యాపారులు కొంత అసహనానికి గురై ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే అక్కడకు వచ్చిన నాయక్ ఉన్నతాధికారులతో సంప్రదించి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే మిగిలిన 71 ఏజెన్సీ దుకాణాల్లో 11 దుకాణాలకు ఒకే ఒక్కరు దరఖాస్తులు చేశారు. వాటిల్లో కొత్తగూడెం మండలం చుంచుపల్లి(92), భద్రాచలం మండల కేంద్రం(115), కూనవరం(122), చింతూరు(126), మణుగూరు(131, 133, 135, 136, 139, 141, 142) ఉన్నాయి. వీటి దరఖాస్తులకు లాటరీ ప్రక్రియ చేపట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే చింతూరు మండల కేంద్రంలోని దుకాణానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవటంతో లాటరీ నిలిపేశారు. కాగా ఏజెన్సీ ప్రాంత దుకాణాలకు లాటరీ ప్రక్రియలో స్థానిక నివాస, కుల సర్టిఫికెట్లను సమర్పించిన వారినే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. కొందరు తమ పిల్లల సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత చేసినా ఇన్‌చార్జ్ కలెక్టర్ నాయక్ వాటిని తిరస్కరించారు. మరికొన్ని దుకాణాలకు ఇద్దరు కలిసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు.

శభాష్ నాయక్..!
కలెక్టర్ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు ఆ మరుసటి రోజే గురుతరమైన బాధ్యత భుజాలపై పడింది. అదే మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ. గతంలో టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారి పలువురి మెడలకు ఉచ్చు బిగిసిన నేపథ్యంలో అసలు ఈ వ్యవహారమంటేనే వణుకు పుట్టే పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఈక్రమంలో రెండ్రోజుల పాటు సాగిన లాటరీ ప్రక్రియను నాయక్ తన భుజాలపై వేసుకున్నారు. దరఖాస్తుదారుల జాతకాలు చూసే ఈ ప్రక్రియను మొదటి రోజు ప్రారంభించిన ఆయన ఆధ్యంతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. తొలి రోజున తెల్లవారుజామున మూడు గంటల వరకూ అక్కడే ఉండి లాటరీ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

ఎక్సైజ్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కలుగకుండా దిశానిర్దేశం చేశారు. రెండోరోజున మొదలైన ఏజెన్సీ షాపుల ఎంపికలోనూ పారదర్శకత పాటించారు. దరఖాస్తుదారులు స్థానిక గిరిజన, నివాస ధ్రువపత్రాలను సమర్పించే విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించారు. షాపుల వారీగా ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లాటరీ ప్రక్రియకు అనుమతించారు. ఒకానొక సందర్భంలో ఏజెన్సీ సర్టిఫికెట్లను సరైన రీతిలో పరిశీలించకుండా దరఖాస్తుదారులను లోపలికి అనుమతించిన ఓ పోలీసు అధికారిపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఆయనకు మెమో జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇతరులెవరికీ లాటరీ తీసే అవకాశం కల్పించకుండా మీడియా, పత్రికల ప్రతినిధులతో టోకెన్లను తీయించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Take By: T News

Read more...

Saturday, June 23, 2012

ముందున్నది...ఉపద్రవం

నోరుతెరిచి నడిరోడ్డుపైకి పొంగిన నాలా పాదచారికి ప్రాణగండమవుతుంది.. జలదిగ్బంధనంలో నీటమునిగిన పల్లె పగలూరాత్రి తెలియక విలవిల్లాడుతుంది.. ఏటా కట్ట తెంచుకునే చెరువు ఊరిమీదికి ఉరిమి దూకుతుంది.. లోలెవల్ వంతెనలపై నుంచి వాగులు సాగిపోతుంటే, రాకపోకలు రోజులు లెక్కిస్తూ నిలిచిపోతాయి.

చినుకు పడ్డప్పుడల్లా అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. భారీ వర్షం పడితే ఇక పరిస్థితి భయానకమే. ఏజెన్సీ ఏరియానేకాదు దాదాపు అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో పదే పదే ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే తలెత్తే ప్రమాదకర పరిస్థితికి సర్కారు తాత్కాలిక మరమ్మతులతోనే పరిష్కారాన్ని ముగిస్తోంది. అందుకే జిల్లాయంత్రాంగం ముందు సవాళ్లుగా నిలుస్తున్న ఈ సీజన్‌లోని ప్రమాదకర ప్రాంతాలపై టీ-

మీడియా ఫోకస్.......మాటేసిన దస్రూమాటు..
ములుగు, దేవగిరిపట్నం ప్రధాన రహదారిపై గల దస్రూమాటు పొంగితే దేవగిరిప ట్నం అవతలి గ్రామాలైన 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లక్నవరం ముందు భాగంలోని పెద్ద వాగు పొంగితే అంకన్నగూడెం, జగ్గన్నగూడెం గ్రామాల జలదిగ్బంధం అవుతాయి. ఇక్కడ ఐటీడీఏ అధికారులు రూ. 35 లక్ష లు ఖర్చు పెట్టి లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి వర్షాకాలంలో ఎప్పుడూ నీళ్లల్లో మునిగిపోయే ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకల కోసం నాటు పడవలను వాడకతప్పని పరిస్థితి.

కొమ్ములవంచ రిజర్వాయర్‌కూ ఏటా గండ్లే..
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారులో ఆకేరు వాగుపై 1964లో అప్ప టి రెవెన్యూ శాఖా మంవూతిగా పని చేసిన నూకల రాంచంవూదాడ్డి, పబ్లిక్ వర్క్ శాఖామంత్రి ఏసీ.సుబ్బాడ్డిలు ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు కుడికాల్వ కింద నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు శివారులో 1100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎడమ కాల్వ ద్వారా నెల్లికుదురు మండలం మదనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆకేరు వాగును ని ర్మించారు. 2006లో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి రూ.1.0కోట్లు కేటాయించి కుడికాల్వ పనులు చేపట్టారు. సిమెంట్ కాల్వకు బుంగ, ఆనకట్టకు ఉన్న షటర్(తూము)లు తుప్పు పట్టి వచ్చిన నీరంతా నిల్వ ఉండకుండా వృథాగా పోతున్నప్పటికీ ప్రతీ ఏటా ఐబీ అధికారులు నామమావూతపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోయే పరిస్థితులు ఉన్నాయి.

మారేడు పొంగితే అంతే..
వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య గల మా రేడుగూడెం చెరువు మత్తడి పొంగిపొర్లితే పెద్దాపురం వైపు గల సుమారు 12 గ్రామా లకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏళ్ల తరబడి లోలెవల్ వంతెన దర్శనమిస్తోంది. ఇటీవల వెంకటాపురం చెల్పూర్ ప్రధాన రహదారికి సుమారు రూ. మూడు కోట్లతో నూతన తారు రోడ్డును వేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు కాజ్‌వేను నిర్మించడం మరిచారు.

గుండ్లవాగుతో కడగండ్లే..
గోవిందరావుపేట మండలంలో గుండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తే అమృతండా, చం ద్రూతండాల గిరిజనులకు భాహ్య ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలాగే పస్రా సమీ పంలోని దయ్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తే నార్లాపురం, మేడారం పరిధిలోని 1 గ్రామాలకు ప్రధాన రహదారి బంద్ అయినట్లే. ప్రతీసారి మేడారం జాతరకు అధికారులందరూ ఇదే లోలెవల్ కాజ్‌వే మీది నుంచి పోతారు... వస్తారు. కానీ ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలనే ఆలోచనే వారికి తట్టదు. జంపన్నవాగు పొంగితే ముత్తాపురం మూలకు పడుతది.

రేగొండ మండలంలోని భాగిర్థిపేట క్రాస్‌రోడ్డు సమీపంలో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్‌వేతో ప్రతీయేటా సమస్యలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేకు దగ్గర్లోనే చెరువు ఉండడంతో వర్షాకాలంలో చెరువు నిండడం మూలంగా నీరుబయటకు వచ్చి కాజ్‌వే మీదుగా వెళ్తుంటుంది. కాజ్‌వేపై నీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం వందలాది లారీలలో బొగ్గు తరలిపోతుండడంతో వర్షాకాలంలో లారీలు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారికి ఎంతో కొంత చెల్లించి ద్విచక్ర వాహనాలను మాత్రం కాజ్‌వే నుంచి దాటించుకుంటారు.

భయంభయంగా లోతట్టు ప్రాంతాలు
వరంగల్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు, 20 లోతట్టు కాలనీలు వణికిపోతుంటాయి. శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురికావాల్సి వస్తోంది. కచ్చా డ్రైనేజీలు నిర్మించి తాత్కాలిక పనులు మాత్రమే బల్దియా చేపడుతోంది.నిధుల కొరత, సాంకేతిక సమస్యలు సాకుగూ చూపుతూ అధికారులు శాశ్వత పరిష్కారాన్ని పక్కనబెడుతున్నారనేది ప్రధాన విమర్శ.

ఆకేరు పొంగితే రాకపోకలు ఆగుడే..
లోలెవల్ బ్రిడ్జి మూలాన వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు కొన్ని రోజుల పాటు రాకపోకలు స్తంభిస్తాయి. తొర్రూరు కేంద్రం నుండి నెల్లికుదురు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ ప్రాంతాలకు ఈ రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. దశాబ్దాలకాలంగా ఈ సమస్య ప్రతీ వర్షాకాలంలో తలెత్తుతున్నా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారులోని మొండివాగు సైతం రోడ్డుపైనే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీని కారణంగా నెల్లికు దురు నుండి మహబూబాబాద్ వైపు ఎవరు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల నూతనంగా బీటి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ హైలెవల్ బ్రిడ్జిని మాత్రం నిర్మించలేదు. దీంతో ఈ రెండు రహదారులపై నెలకొన్న సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

Take By: T News

Read more...

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

Read more...

Sunday, February 12, 2012

Films, TV shows influencing child crimes?

The recent cases of a 12-year-old who died aping a TV serial suicide and a 15-year-old who stabbed his teacher to death after being reportedly influenced by watching revenge drama "Agneepath" have put the spotlight on the influence showbiz exerts on young, impressionable minds. But films and TV shows are not alone to blame, say experts.


Media literacy for kids is one way out, suggests child psychiatrist Samir Parikh.
"Our education system needs to spread media literacy among kids and infuse life skills into them so that they can differentiate between reality and fiction. There's no other way out," Parikh told IANS.

Read Full News click this Link :

Read more...

ప్రాణం విలవిల -



NILOFER-HOSPITAL talangana patrika telangana culture telangana politics telangana cinema -పేద రోగులతో సర్కారు ఆటలు
-ప్రభుత్వ ఆస్పవూతుల్లో స్తంభించిన అత్యవసరం
-రాష్ట్రంలో13 మంది రోగుల మృతి
-గాంధీలో 10 మంది.. నీలోఫర్‌లో ఒకరు, కర్నూలులో ఇద్దరు..
-జూడాలతో చర్చలు విఫలం
-స్టైపెండ్ పెంచేది లేదన్న సర్కారు
-డిమాండ్లు తీరేదాకా సమ్మె
-తేల్చిచెప్పిన జూడాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 ():ప్రభుత్వం మొండితనం, నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పవూతుల్లో రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. అత్యవసర సేవలు అందక శుక్రవారం రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ప్రభుత్వం సాధారణ చావులుగానే పరిగణించింది. ఆస్పవూతుల్లో వైద్య సేవలు అందక.. ప్రైవేట్ ఆస్పవూతులకు వెళ్లే స్థోమత లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా.. వాటి ఆనవాళ్లు ఆస్పవూతుల్లో మచ్చుకు కూడా కనిపించడంలేదు.

అన్ని ఆస్పవూతుల్లో అన్ని వైద్య సేవలు దాదాపు స్తంభించిపోయాయి. ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో సాధారణ రోగుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలనూ నిలిపివేసిన తొలిరోజే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పవూతుల్లో 13 మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క గాంధీ ఆస్పవూతిలోనే 10 మంది రోగులు వైద్యం అందక తనువు చాలించారు. నీలోఫర్‌లో అత్యవసరం వైద్యం అందక ఓ చిన్నారి కన్నుమూసింది. కర్నూలు జనరల్ ఆస్పవూతిల్లో మరో ఇద్దరు రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో రోగులు ప్రభత్వ ఆస్పవూతులకు వెళ్లాలం జంకుతున్నారు. మరోవైపు, జూడాలతో శనివారం కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 

రోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పట్టువిడుపుదల ధోరణితో వ్యవహరించాల్సిన ప్రభుత్వం అదే మొండివైఖరిని ప్రదర్శించడంతో జూడాలు కూడా పట్టువీడలేదు. దీంతో సాయంత్రం మొదలైన చర్చలు అర్ధరావూతివరకు కొనసాగినా ఎటూ తేలకుండానే ముగిశాయి. జూడాల తీరువల్లే చర్చల వల్లే చర్చలు విఫలమయ్యాయని ప్రభుత్వం పేర్కొంటే.. ప్రభుత్వ తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని జూడాలు ఆరోపించారు.

జూడాల 13 డిమాండ్లలో పదకొండింటిని అంగీకరించామని, అయినా వారు స్టైపెండ్ కోసం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. జూడాల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని, అందుకే ఇదంతా జరుగుతోందని పేర్కొంది. చర్చల ప్రక్రియను ప్రభుత్వమే ఉద్దేశపూర్వంగా చిక్కుముడిగా మార్చిందని, ఎమ్జన్సీ సేవల బంద్ విరమించుకోకుంటే సోమవారంనుంచి తలల పగులుతాయని హెచ్చరించిందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

స్టైపెండ్ కోసం తాము పట్టుబడుతున్నామని ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తోందని అన్నారు. తమ పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని, సమ్మె కొనసాగిస్తామని, ప్రజా సంఘాలతో ఆదివారం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

By :T News

Read more...

Tuesday, January 31, 2012

కొనబోతే కొరివి

http://namasthetelangaana.com/updates/2012/JAN/31/slidePic.jpg30ibp1 talangana patrika telangana culture telangana politics telangana cinema
 









- వినియోగదారుడు విలవిల
- దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- దళారులదే రాజ్యం
- రైతుకు దక్కని మద్దతు
- ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
- మార్కెట్‌లో స్టోరేజీల కొరత
- పెరిగిన రవాణా చార్జీలు
- బెండకాయలు కిలో రూ. 40
- వంకాయలు కిలో రూ. 30ఏది కొన్నా జేబుకు చిల్లే
- చుక్కల్లో కూరగాయల ధరలు

చిక్కుడు... కొండెక్కింది..! చింతపండు మరీ పులుపెక్కింది..! కాకరకాయ చేదునే మిగులుస్తున్నది..! ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఊర్ల గడ్డ.. ఏ కూరగాయలు తీసుకున్నా భగ్గుమంటున్నాయి. పాలకూర, మెంతికూర, చుక్కకూర.. ఏ ఆకుకూర అయినా ముట్టుకుంటేనే మూర్ఛ వచ్చేలా ఉంది. ఎన్నడూ లేనంతగా మార్కెట్‌లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. పొద్దస్తమానం కాయకష్టం చేసి వాటిని పండించే రైతుకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. దళారుల రాజ్యంలో ఇటు రైతు, అటు వినియోగదారుడు నిండా మునిగిపోతున్నారు. వారం వ్యవధిలో మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు ఊహించని స్థాయిలో పెరిగి పోయాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్‌కు పోతే... ఒకటీ, రెండు కూరగాయలు తప్ప ఏమీ కొనలేని పరిస్థితి.

t205 talangana patrika telangana culture telangana politics telangana cinema
ఇన్నాళ్లు 15 రూపాయలకు కిలో దొరికిన బెండకాయలు ఇప్పుడు రూ.40 పెట్టినా గానీ దొరకడం లేదు. రవాణా చార్జీలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి కరువు పరిస్థితులూ తోడై దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గి పోవడం తోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటు న్నారు. తాము పంట పండించినా మార్కెట్‌లో అమ్ము కోవడానికి ప్రభుత్వ సహకారం లభించడం లేదని, ఫలితంగా దళారులను ఆశ్రయిస్తున్నా మని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు కూరగాయల ధరలు పెరిగి పోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

(టీ న్యూస్-నెట్‌వర్క్): గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి.. అన్నట్లుంది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 69,42,562 హెక్టార్లలో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరిగిపోతే వాటిని పండించిన రైతులు ప్రయోజనం పొందాలి. కానీ వారికి మద్దతు ధర దక్కడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కూరగాయాలకు వారే ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 650 వరకు రైతు బజార్లు ఉన్నాయి.

హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానమైనవి 16 రైతు బజార్లు ఉన్నాయి. ఏ ఒక్క రైతు బజారులోనూ రైతులు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు అప్పటికప్పుడు అమ్ముకొని పోవాల్సి వస్తోంది. లేకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి టామాటలను కిలోకు ఒక్క రూపాయి చొప్పున దళారులు కొంటారు. వాటిని వినియోగదారులకు రూ. 6 చొప్పున అమ్ముతారు. దళారుల దందా మూలంగా ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.
రవాణా చార్జీలు పెరగడం కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పెరిగిన డీజిల్ ధరలు రైతులపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. పంట వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్నింది మొదలు మార్కెట్‌కు కూరగాయలను తరలించే వరకు డీజిల్ ధరల ప్రభావం వారిపై పడుతున్నది. రైతులు నష్టపోవడానికి ఇదీ ఓ కారణం. రైతులు పండించిన పంటలు బహిరంగ మార్కెట్‌లో వారే ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం కల్పించినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.
tama05 talangana patrika telangana culture telangana politics telangana cinema

హైబ్రీడ్ విత్తనాలతో రైతుల బేజారు
విత్తనాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రకరకాల కంపెనీల పేరుతో హైబ్రీడ్ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. హైబ్రీడ్ విత్తనాల పంటలు ఏపుగా పెరుగుతున్నాయి తప్ప కాత కాయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు కాంప్లెక్స్ ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోతున్నది తప్ప పంట దిగుబడి రావడం లేదు. హైబ్రీడ్ విత్తనాలతో వచ్చిన తొలి పంటను రిలయన్స్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. మలి పంటను తీసుకోవడానికి ఈ సంస్థలు నిరాకరిస్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ రైతులు మార్కెట్‌కు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నది.

చైతన్యం నింపని సదస్సులు
ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులు రాజకీయ సదస్సులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ కాలంలో ఏయే పంటలు వేయాలి.. ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పంటను మార్కెట్‌కు తరలించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? దళారుల బారిన పడకుండా పంటను ఎలా విక్రయించుకోవాలి తదితర విషయాల్లో రైతులకు ఈ సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా వీటిని నిర్వహించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్‌కు ధరల సెగ
హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. మరో 20 రోజుల్లో ఉత్పత్తి పడిపోనుంది. వారం రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.1 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పడిపోవడం, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు వాటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా సరిపడా కూరగాయలు దిగుమతి కావడం లేదు. నగరంలో రోజుకు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 200-300 మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ కూరగాయలు లేకపోవడంతో దళారులదే రాజ్యంగా మారుతోంది. వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్‌లో 40 శాతం ధరలను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.
4654 talangana patrika telangana culture telangana politics telangana cinema

దళారుల ధరలు..
రైతుబజార్లలో ధరలకు సంబంధించి 1999లో ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. వాటి ధరలు సమీపంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ల ధరలకు దగ్గరగా ఉండాలి. ఎస్టేట్ అధికారులు, రైతులు కలిసి నాణ్యత ప్రమాణంగా ధర ఖరారు చేయాలి. కానీ హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూరగాయల రేట్ల ఆధారంగా హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లలో ధరలు నిర్ణయిస్తున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే అక్కడ సాధారణంగా ధరలు పెంచుతారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రైతుబజార్లపై పడుతుంది. వాస్తవంగా అక్కడి కూరగాయలకు, రైతుబజార్లలో రైతులు తీసుకువచ్చే వాటికి ఎలాంటి సంబంధం లేదు.

మెదక్‌లో కూర‘గాయాలు’: రాష్ట్ర రాజధాని మెదక్ జిల్లాకు ఆనుకొని ఉండటంతో నగరవాసుల కూరగాయల అవసరాల్లో సింహభాగం మెదక్ జిల్లానే తీరుస్తున్నది. జిల్లాలోని వర్గల్, ములుగు, గజ్వేల్, తూప్రాన్, జగదేవపూర్, తొగుట, గుమ్మడిదల, జిన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 170 నుంచి 200 టన్నుల కూరగాయలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. నగరవాసుల అవసరాలు తీరుస్తున్నా స్థానికంగా మాత్రం కూరగాయల రేట్లు మండిపోతున్నాయి.

మహబూబ్‌నగర్, ఖమ్మంలో కష్టాలు
జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో నీటి శాతం తగ్గింది. వాటితో పాటు ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల కూరగాయలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనూ కూరగాయల ధరలు భగ్గున మండుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యులు మార్కెట్లో కూరగాయలు కొనలేని దుస్థితి ఏర్పడుతోంది. అంగట్లో అదిరిపోయే ధరలతో సామాన్యుల దిమ్మ తిరుగుతోంది. పూటగడవని కూలీలకు పచ్చళ్ళే పంచభక్షపరమాన్నాలుగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర అందటంలేదు.

ఆదిలాబాద్ అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత పక్షం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, వర్షాభావ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక కొన్ని కూరగాయలు మార్కెట్‌లలో దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. మార్కెట్‌లో క్యాలిఫ్లవర్, తోటకూర, బీరకాయ, గోరుచిక్కుడు, దోసకాయ, చిక్కుడుకాయ లాంటి కూరగాయలు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే టమాట, ఆనిగపుకాయ, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంతికూర, దిగుబడి 50 శాతం మేరకు తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాబేజీ పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి.

కరీంనగర్‌లో తగ్గిన విస్తీర్ణం
కరువు కారణంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2,65 హెక్టార్లు కాగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. లేబర్ కొరత కారణంగా కూరగాయలు సాగు మాని పత్తిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. పత్తిపంటకు గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో అటువైపు మొగ్గుచూపారు. ఎక్కువ కూరగాయల ఉత్పత్తులు జరిగే కరీంనగర్ మండలాన్నే తీసుకుంటే గత ఏడాది 1500 ఎకరాల్లో సాగు జరిగితే ఈ ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. బోయినపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో ఏటా ఐదు వందల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే ఈ ఏటా రెండువందల ఎకరాల్లో మాత్రమే సాగుజరిగింది. జిల్లాలో ఒక్క టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వరంగల్, నిజామాబాద్, నల్లగొండతో పాటు సీమాంవూధలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

Take By: T News

Read more...

Monday, January 30, 2012

అధికారానికి బడుగులే!

సామాజిక న్యాయం చట్టుబండలుబీసీలకు రిజర్వేషన్లు ఏవి?
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమూ అంతంతేఎక్కడా దక్కనిదామాషా వాటా

- పార్టీల్లోనూ టికెట్లు కరువే
- మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు
- సంక్షేమ పథకాల కుప్పల్లో కూరుకుపోయిన బలహీన వర్గాలు
- అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే
- పార్టీ జెండా మోయడానికే పరిమితం!


kulammain talangana patrika telangana culture telangana politics telangana cinema(, హైదరాబాద్)వారికి జెండా మోయడం తెలుసు! తమ నాయకులను అధికారంలోకి తేవడం తెలుసు! పార్టీ కోసం గొంతుచించుకుని అరవగల సత్తా వారిది! నేతలు ఇబ్బంది పడితే తామే ఇబ్బందిపడినట్లు బాధపడే మనస్తత్వం వారిది! ఏళ్ల తరబడి కొన్ని కొన్ని పార్టీలను నమ్ముకుని ఉన్నారు! అగ్రకుల పార్టీ నేతలకూ ఆ విషయం తెలుసు! అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత ప్రేమ! కానీ ఆ ప్రేమ వారితో జెండా మోయించేంత వరకే! ఓట్ల పండగలో వెంట తిప్పుకోవడం వరకే! మహా అయితే అందులో ముఖ్యమైన వారికి ఐదో పదో పదవులు, కొన్ని ప్రయోజనాలు కల్పించడం! అంతవరకే! కానీ వారిలో ఎవరూ ఆ పార్టీలో కీలక స్థానాలకు ఎదగలేరు! ఇక ముఖ్యమంత్రి పదవంటే మాటలా! ఇది దశాబ్దాలుగా రాజకీయ కుల సమరంలో ఎప్పుడూ ఓడిపోతున్న బడుగు వర్గాల కార్యకర్త పరిస్థితి! ఓట్ల పరంగా అధిక సంఖ్యాకులైనప్పటికీ.. అధికార పంపిణీలో మాత్రం చిన్నచూపే! టికెట్లు కేటాయించే దగ్గర మొదలు.. గెలిస్తే కీలక పదవులు కట్టబె అదే వివక్ష! బడుగులకు రాజ్యాధికారం సహించని తత్వమేనన్నది కడుపుమండినవారి విమర్శ! అది అగ్రకుల తత్వమేనన్నది సమాజాన్ని కాచివడపోసిన వారి మాట! ఏది ఏమైనా.. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నాయి! అగ్రకుల పెత్తనంలో కొనసాగుతున్న పార్టీలు వారిని ఆ స్థాయికి తీసుకురావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి! ఇది నగ్న సత్యం!రాష్ట్ర చరివూతలో అప్పుడు ఇప్పుడూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందని పండుగానే ఉంది. ఓట్ల రాజకీయాల కోసం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ఈ పార్టీలే దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోవడం గమనార్హం.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తమ ఆటలు సాగవనేది గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు బీసీలు ఉద్యమాలతో సంఘటితం కాకుండా దృష్టిమళ్ళించే చర్యలకు పాల్పడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినవారిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నప్పటికీ.. అధిక శాతం ఓట్లున్న బీసీలకు రాజకీయపార్టీలు తగిన రీతిలో టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ‘పదవుల్లో’ లేకుండా పోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రకుల పక్షపాత పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ ‘రాజకీయ అధికార’ సామాజిక నేపథ్యమే ఇందుకు నిదర్శనం. 1955 నుంచి 2004 వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థుల కుల నేపథ్యం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం పౌరులందరికీ ‘రాజకీయ సమానత్వం’ ఇచ్చింది. దీన్ని అన్ని స్థాయిల్లో ఆచరణలో నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చట్టసభల్లో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు వారి వారి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలదే బాధ్యతగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి స్పీకర్, మంత్రులు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీ అధినాయకులు, కేంద్రంలో, రాష్ట్రంలో నియమితులైన మంత్రుల సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాజకీయ సమానత్వం చట్టుబండలైన విషయం బట్టబయలు అవుతుంది.

గత అరవై సంవత్సరాల కాలంలో రాజకీయ నిర్ణయాధికారం అందరికీ సమానంగా రాలేదనేది నగ్నసత్యం. రాజకీయాధికారం సాధించిన కొన్ని అగ్రకులాలు జనాభా రీత్యా అల్ప సంఖ్యాకులైనప్పటికీ వారు తమ చేతుల్లోకి అధికారాన్ని వినియోగించుకుని త్వరితగతిన అభివృద్ధి సాధించగలిగారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అంతా ఆ కీలక ‘నిర్ణయాధికారం’ చుట్టూ పరివూభమిస్తున్నది. నిర్ణయాధికారం లేని కారణంగా జనాభా పరంగా 0% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో సగభాగమైన మహిళలు వెనుకబాటుతనానికి, అసమానతలకు, వివక్షకు, దోపిడీకి నిరంతరం గురవుతున్నారు. ఫలితంగా ఈ వర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి రాజకీయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యంలేక కేవలం ‘ఓటర్లు’గా మిగిలిపోతున్నారు. రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కమ్మ, రెడ్డి కులాలకు ప్రస్తుతం కాపులు కూడా జతకలుస్తున్నారు. దీంతో మెజారిటీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వావలంబన, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి వాటిని కోల్పోతున్నారని బడుగు వర్గాల నేతలు విమర్శిస్తున్నారు.

బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్, టీడీపీలు
ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల(బీసీ) కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించాయి. అయితే ఆచరణలో బీసీలైన బలహీనవర్గాలకు ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందలేదు. సంక్షేమ పథకాలపై వివరీతంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వాలు ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఓట్లను రాబట్టుకున్నాయి. కానీ బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో బ్యాంకుల జాతీయకరణ, సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ, ఇరవై సూత్రాల అమలు, ఆర్థిక సరళీకృత విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ వెనుకబడిన కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి జరగలేదన్నది జగద్విదితం. వివిధ సంక్షేమ పథకాలు అన్నీ నిద్రావస్థలో నిమగ్నమయ్యాయి. ఫలితంగా బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి బయటపడి 192లో ఎన్.టి.రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఎన్టీర్ తన పార్టీని పటిష్టపరుచుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓట్ల రాజకీయాల్లో బీసీలు అన్ని పార్టీలకు అవసరమైనప్పటికీ వాస్తవంగా బీసీ జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా లభించలేదు. బీసీల సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన టీడీపీ.. అధికార పంపిణీ విషయంలో బీసీలకు మొండిచెయ్యి చూపింది. అందుకే మెజారీటీ బీసీలు టీడీపీకి ప్రత్యామ్నాయంగా మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఓట్ల రాజకీయాలు, అగ్రకులాల ఎత్తుగడల మధ్య బీసీ ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాలు, అధికారమార్పిడితో సమిధలుగా మారి రాజ్యాధికారానికి దూరమయ్యారు.

టిక్కెట్ల కేటాయింపుల స్థాయిలోనే దగా!
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికల్లో కేటాయించే టికెట్లలో అగ్రతాంబూలం అగ్రకులాలకే దక్కుతున్నదన్నది వాస్తవం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా దాదాపు 90 శాతం సీట్లు అగ్రకులాలకే ఇస్తున్నాయి. వాటిల్లో కాంగ్రెస్ సహజంగానే తన ఆధిపత్య కులమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. టీడీపీ తన ఆధిపత్య కులమైన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. పేరుకు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మాటలు చెబుతున్న ఈ రెండు పార్టీలూ తమ తమ సామాజిక వర్గాలకే పదవులు పొందే అవకాశం ఇస్తున్నాయి. పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీచ చేయలేని ఆర్థిక పరిస్థితులు బీసీలకు మరో ఆటంకం. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమున్నా బీసీల వద్ద తగినన్ని ఆర్థిక వనరులు, నియోజకవర్గమంతా ఒంటరిగా తిరిగి వ్యక్తిగతంగా ప్రచారం, బలసమీకరణ, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విధాన ప్రకటనలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు కలుగుతున్నాయి.

నైజాం స్టేట్ విలీనం తర్వాత
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు 1956లో అంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1962 ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు, ఆంధ్రవూపాంత ప్రజా ప్రతినిధులతో కలిసి ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ఏర్పాటైంది. మళ్ళీ ఆతర్వాత 1962లో ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ఒకేసారి సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ద్విసభ్య నియోజకవర్గాలున్నాయి. ఆయా స్థానాల్లో జనరల్ అభ్యర్థితో పాటు అదే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉండేది. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ద్విసభ్య 23 అభ్యర్థులు, తెలంగాణ ప్రాంతంలో ద్విసభ్య 21 మంది అభ్యర్థులు కలిపి మొత్తంగా 44 ద్విసభ్య నియోజకవర్గాల నుంచి ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధి గెలిచే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా రూపొందించి 54 శాసనసభ స్థానాలను షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ)లకు రిజర్వు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 10 స్థానాలు అదనంగా పెరిగినప్పటికీ వారికి కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకు ముందు వరకు ఎస్సీ, ఎస్టీల్లో జిల్లాకు కనీసం ఒక్కరిద్దరికైనా ప్రాతినిధ్యం దక్కేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దీనికి గండిపడినట్లయ్యింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఏర్పాటులో స్థానాల గుర్తింపు వల్ల శాసనసభ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగి జిల్లా స్థాయిలో సంఖ్యాపరంగా భిన్నత్వం గోచరిస్తున్నది. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తదుపరి 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాలో న్యాయం జరగలేదనే అభివూపాయం ఇప్పటికీ వ్యక్తం అవుతున్నది. దీంతో అధికార వ్యవస్థలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర పరిమితంగానే ఉంటోంది.




kulam talangana patrika telangana culture telangana politics telangana cinema


Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP