Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, November 14, 2011

26న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు అధికారికంగా మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. 1172 వీఆర్‌వో పోస్టులు, 6063 వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీఆర్‌వోల ఎంపికకు కనీస అర్హతగా ఇంటర్మీడియట్, వీఆర్‌ఏ పోస్టులకు కనీస అర్హతగా పదవ తరగతిగా నిర్ణయించారు. నోటిఫికేషన్లను జిల్లాల వారిగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ పోస్టులకు స్థానికులనే ఎంపిక చేస్తామని చెప్పారు. దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ డిసెంబర్ 17. జనవరి 2న అర్హతా జాబితా విడుదల చేయనున్నారు. ఎంపికైన వారికి జనవరి 18 నుంచి 28 వరకు ఇంటర్వూలు నిర్వహించనున్నారు. అనంతరం తుది జాబితాను జనవరి 30న ప్రకటించనున్నారు. 31లోపు పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.



Read more...

పూటకో మాట!

- 12.11.2011
Manmo-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘తెలంగాణ ఓ సంక్లిష్టమైన సమస్య. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంద్వారా సమస్యను పరిష్కరించలేం. ఒక జాతీయ సమస్యకు కనుగొనే పరిష్కారం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఆమోదించగల ఆచరణాత్మకమైన పరిష్కారం కోసం కసరత్తు చేస్తాం’
- మాల్దీవుల నుంచి తిరిగివస్తూ విమానంలో విలేకరుల సమావేశంలో ప్రధాని


- 20.10.2011
‘తెలంగాణ సమస్య 1950నుంచి ఉంది. తెలంగాణ సమస్య సంక్లిష్టతల కారణంగా సత్వర నిర్ణయం సాధ్యం కాదు. అన్ని పక్షాలకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని పక్షాల మధ్య ఏకాభివూపాయం సాధించి నిర్ణయం తీసుకుంటాం. అద్వానీ పరుషపదాలు మానుకోవాలి’
- దక్షిణావూఫికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రధాని


- 6.10.11
‘ప్రత్యేక తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అభివూపాయంతో నేను ఏకీభవిస్తున్నాను. సంక్లిష్టమైన సమస్యపై ఏకాభివూపాయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ప్రకాశ్ కరత్ రాసిన లేఖకు సమాధానంగా


- 4.10.2011
‘తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు తెలుసు. వాస్తవ పరిస్థితులు మాకు తెలియకుండా ఎవరూ అడ్డుకోలేరు. తెలంగాణాపై సత్వర నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆజాద్‌తో మాట్లాడి ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళతా. సకల జనుల సమ్మె విరమించండి’.
- టీఆర్‌ఏస్ అధినేత కేసీఆర్, 31 మందితో కూడిన ప్రతిని బృందంతో ప్రధాని


- 4.10.2011
మీ సమస్యలు నాకు తెలుసు. మీరు చెప్పే విషయాలను సోనియాకు వివరిస్తాను. రెండు మూడు పాయింట్ల రూపంలో నాకు రాసివ్వండి. కోర్ కమిటీ సమావేశంలో అందరి దృష్టికి ఈ విషయాలను తీసుకు అందులో ఏదో ఒక నిర్ణయం వస్తుంది’.
- టీ కాంగ్రెస్ నేతలతో సమావేశంలో ప్రధాని


- 16.09.11
‘సకల జనుల సమ్మెపై నాకు నివేదికలు అందుతున్నాయి. త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటాం’.
- టీ కాంగ్రెస్ నేతలతో ప్రధాని


- 20.07.11
‘తెలంగాణా అంశాన్ని చూస్తున్న ఆజాద్‌కు మీ అభివూపాయాలను నివేదిస్తాను. అందరితో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుంటాం. శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేసుకోండి. హింసకు తావులేకుండా వ్యవహరించండి’.
- సీమాంధ్ర నేతలతో సమావేశంలో ప్రధాని


- 10.06.11
‘తెలంగాణలో ఉన్న గంభీరత నాకు తెలుసు. ఆ అంశంపట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. తొందరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం’.
- 44 నిముషాలపాటు గోడు వెల్లబోసుకున్న
టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ప్రధాని


- 03.08.11
‘తెలంగాణ అంశాన్ని ఆజాద్ చూస్తున్నారు. ఆయన్ను పని పూర్తి చేయనివ్వండి. సంప్రదింపులు పూర్తయిన తర్వాత విషయాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’.
- తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో ప్రధాని


- 11.03.11
‘ఆంవూధవూపదేశ్‌లోని పరిస్థితుల గురించి మాకు తెలుసు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు ఆగండి. పార్టీతో చర్చించి ప్రజలు, రాష్ట్రం, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటాం’.
- పార్లమెంట్ ఆవరణలో కావూరి సారథ్యంలోని సీమాంధ్ర ఎంపీలతో ప్రధాని


- 17.02.11
తెలంగాణపై ఏకాభివూపాయం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలతో హోం మంత్రి చిదంబరం ఒక దఫా సమావేశమయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించాం. ఆంధ్రవూపదేశ్‌లో అన్ని పార్టీలతో మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దీంతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం అవుంతుంది. ఇది మంచి ముగింపుకు చేరుకునేలా చూడాల్సి ఉంది.
- విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని


- 25.05.10
ప్రభుత్వం ముందు కొత్త రాష్ట్రాల ప్రతిపాదనలేవీ లేవు. ఆంధ్రవూపదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పరిశీలను అప్పగించాం. ఆయన ప్రఖ్యాతిగాంచిన న్యాయమూర్తి. ఈ కమిటీ నివేదిక రాకుండా తెలంగాణ అంశంలో స్పందిచలేను’.
- యూపీఏ2 ఏడాది పరిపాలన పూర్తయిన
సందర్భంగా ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రధాని


- 06.03.10
బీజేపీ హయాంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాల పరిస్థితి వేరు. అక్కడ ఏకాభివూపాయం రావడంతో రాష్ట్రాల ఏర్పాటు సులభంగా జరిగింది. తెలంగాణ సమస్య వేరు. ఆంధ్రవూపదేశ్ పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ ఏకాభివూపాయం సాధిస్తుంది. సమస్య పరిష్కారానికి మార్గదర్శక ప్రణాళిక సూచిస్తుంది. 2010 డిసెంబర్ 31కి కమిటీ నివేదిక వస్తుంది’.
- వెంకయ్య వ్యాఖ్యలకు సమాధానంగా
రాజ్యసభలో మాట్లాడుతూ ప్రధాని


- 11.01.10
‘ముందు శాంతిసాధన. ఆ తర్వాతే తెలంగాణపై తదుపరి చర్చలు. ఈనెల 5 వ తేదీన 8 పార్టీల నేతలతో జరిగిన చర్చల వివరాలను చిదంబరం నాకు వివరించారు. ఆ విషయంలో జరిగిన చర్చల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మా మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి’.
- ఫ్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్‌లతో
జరిగిన భేటీలో ప్రధాని


- 17.12.09
తెలంగాణ సమస్య జటిలంగా మారింది. మేం ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఆర్ధికమాంద్యం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాం. ఈ సెగలు అన్ని రాష్ట్రాలకు పాకితే ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బ తింటుంది. మేం అన్ని ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’.
- సీమాంధ్ర నేతలతో మాట్లాడుతూ ప్రధాని


- 17.12.09
తెలంగాణ చాలా కీలకమైన సమస్య .దీని ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాలపై పడుతుంది. ఏం నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతీయ మనోభావాలను, ఆందోళనలను దష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ఏం చేసినా భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది’.
- జేపీతో సమావేశంలో ప్రధాని


- 16.12.09
ఆంధ్రవూపదేశ్ లో ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేశాయి. అందుకే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయించాం. తెలంగాణ ఇవ్వడం వలన ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని ఊహించాం. అందుకు తగిన సమయం పడుతుందని మేం భావించాం’.
- రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ
సమావేశంలో ప్రధాని


- 05.12.09
‘తెలంగాణలో ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉంటే, అక్కడ కాంగ్రెస్ ఎలా గెలిచింది. ఈ సమస్య 50 ఏళ్ల నుంచి ఉంది. తెలంగాణ ఏర్పాటుకు అనేక సమస్యలు ఉన్నాయి’.
- లాబీయింగ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్
ఎంపీలను ప్రశ్నించిన ప్రధాని 



Read more...

జౌర ఏక్ ధోకా!

తెలంగాణపై మళ్లీ కాంగ్రెస్‌ది అదే మోసం కళ్ళకు కనిపించని ఉద్యమ తీవ్రత.. త్యాగాలు.. బలిదానాలు
సీమాంధ్ర నేతలకు తలొగ్గిన వైనం ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రజలు

cong-final-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఫిర్ ఏక్‌బార్.. అదే ధోకా.. అదే కాంగ్రెస్.. అదే తెలంగాణ అంశం.. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ మళ్ళీ పచ్చి మోసం.. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నామని, త్వరలోనే ఇచ్చేస్తామనే రీతిలో వ్యవహరించి ఆ సమస్యను మళ్ళీ మొదటికి తెచ్చింది. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నది. అదే మా సంప్రదాయమని నొక్కి చెబుతున్నది. ఇచ్చిన మాటను తుంగలో తొక్కుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంవూతితో ప్రకటన చేయించిన కాంగ్రెస్, విషయాన్ని అనేక మలుపులు తిప్పి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఇన్నాళ్లు ఆడుకున్నది.

తెలంగాణ ప్రాణాలతో చెలగాటమాడింది. చివరికి సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి తెలంగాణపై వెనుకడుగు వేస్తోంది. ఆరు దశాబ్దాలుగా ఉన్న ప్రజల డిమాండ్‌ను, జరుగుతున్న ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలను కళ్లు ఉండికూడా చూడలేకపోతున్నది. అహింసాయుతంగా తెలంగాణ ప్రజలు వెలిబుచ్చిన ఆకాంక్షను ప్రజాస్వామ్య స్ఫూర్తితో అర్థం చేసుకోలేకపోయింది. తెలంగాణకు సానుకూలంగా ఉన్నామని నటిస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న అధికార పక్షం ఇప్పుడు ప్లేటు ఫిరాయించిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

హైదరాబాద్, నవంబర్ 13(): తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరిన్ని సమస్యలే నంటూ ప్రధానితో కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయించింది. అంతకు రెండు, మూడు రోజుల ముందు రెండో ఎస్సార్సీ అంటూ పార్టీ నేతలతో పాట పాడించింది. అంతకు ముందు తెలంగాణ, సీమాంధ్ర నేతలతో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ ఆజాద్‌తో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. అది ముగిసిన తరువాత జాతీయ స్థాయిలో యూపీఏ భాగస్వామ్య పక్షాల అభివూపాయ సేకరణ అవసరమని చెప్పింది. రాష్ట్ర విభజనపై అతి త్వరలోనే నిర్ణయమని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇలా నమ్మించడాలు తెలంగాణ విషయంలో నిజానికి ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్ఠానానికి అందజేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆ మేరకు కాంగ్రెస్ 2004 ఎన్నికలకు ముందు సీడబ్ల్యూసీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేసింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌తో 2004లో కలిసి ఎన్నికలకు వెళ్ళడం ద్వారా తెలంగాణకు తాను సానుకూలంగా ఉన్నాననే సంకేతాలిచ్చింది. ఎన్నికల సమయంలో కరీంనగర్, సికింవూదాబాద్‌లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని, తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ప్రకటించారు. ఆ తరువాత పార్టీ ప్రణబ్ కమిటీ వేసింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమం, కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. 2009 ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలో తెలంగాణ ఆంశాన్ని తీసుకొచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు.

ఆ తరువాత తెలంగాణపై తేల్చేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాది పాటు కమిటీ నివేదిక పేరిట కాలయాపన చేసింది. నివేదిక వచ్చిన తరువాత మళ్ళీ ఆజాద్‌తో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. అది ముగిసిన వెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించాకే నిర్ణయం ఉంటుందన్నది.

మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు సైతం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమేనంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశకు చేరుకోవడం, ఉద్యోగ సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతుండడం, టీఆర్‌ఎస్ బలపడుతున్న దాఖలాలు కనిపించడంతో తెలంగాణ పోరాటానికంటూ టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీని వేసుకున్నారు. తాము కూడా అధిష్ఠానంతో తెలంగాణ కోసం పోరాటం సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సమావేశాలు, హస్తిన పర్యటనలతో ఇదిగో తెలంగాణ వచ్చేస్తుంది, అదిగో రేపో, మాపో నిర్ణయం రానున్నది,సానుకూల సంకేతాలు వస్తున్నాయి, పార్లమెంట్ సమావేశాలకు ముందే తెలంగాణపై ప్రకటన ఉంటుందని తెలంగాణ వాదులను నమ్మిస్తూ వచ్చారని ఆ పార్టీ వర్గాలే ఇప్పుడు నిప్పులు చెరగుతున్నాయి.

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం వైపు నుంచి వచ్చిన ప్రకటనలు, వ్యాఖ్యలతో తెలంగాణపై కాంగ్రెస్ మళ్ళీ రూటు మార్చిందనే విషయం పక్కాగా తేలిపోయింది. ప్రధాని, దిగ్విజయ్‌సింగ్, రషీద్ అల్వీ, ఆజాద్‌ల తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పట్లో తెలంగాణ ఇచ్చేది లేదని కాంగ్రెస్ తన వైఖరిని పరోక్ష సంకేతాల ద్వారా స్పష్టం చేసింది. ఇది తాజాగా జరిగిన మోసం.

గతంలో కూడా రెండు మార్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసగించింది. 1969లో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని తన వ్యూహాలు, ఎత్తుగడలతో నీరుగార్చింది. ఆ తరువాత 1972లో మరో సారి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అప్పట్లో తెలంగాణ డిమాండ్‌తో ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) 1971లో తెలంగాణలోని 11 పార్లమెంట్ స్థానాల్లో విజయఢంకా మోగించి కాంగ్రెస్‌ను తెలంగాణ దెబ్బ చూపించింది. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ తరువాత టీపీఎస్ నేతలకు పదవులు, ప్రలోభాలతో చీల్చి తనవైపుకు తిప్పుకున్నారు. చివరకు టీపీఎస్‌కు నాయకత్వం వహించిన మర్రి చెన్నాడ్డికి పదవి ఇవ్వడంతో అప్పటి వరకు తెలంగాణపై గట్టిగా ఉన్న ఆయన కూడా ఆ తరువాత మెత్తపడి ఇందిరమ్మకు జై పలికారు. అయితే టీపీఎస్ ఎంపీ ఎస్పీగిరి మాత్రం అప్పట్లో ఈ ప్రలోభాలకు తలొగ్గకుండా తెలంగాణ వాదానికే కట్టుబడి ఉన్నా ఫలితం లేక పోయింది.

ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైతే అప్పుడు సానుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తూనే సొంత పార్టీలో, బయట తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతలను పదవుల ఆశ చూపించి ఉద్యమాలను దెబ్బతీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసిందనే ఆరోపణలు లేకపోలేదు. తాజా ఉద్యమంలో సైతం టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీలో చీలిక తెచ్చి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడంలో విజయం సాధించిన అధిష్ఠానం ఉద్యమాన్ని అంతే స్థాయిలో దెబ్బతీసే ప్రయత్నాలు సాగించింది. కాంగ్రెస్‌పై నమ్మకం లేకనే ఆ పార్టీ తెలంగాణ నేతలు ఎంత చెప్పినా జనం వారిని విశ్వసించలేని పరిస్థితి వచ్చింది. తెలంగాణపై కాంగ్రెస్ తాజా వైఖరితో కాంగ్రెస్ మోసం మరోసారి బయటపడిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలే ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలతో యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందనే భావం ప్రజలకు కలుగుతున్నదని ఆ పార్టీ ఎంపీలే అంగీకరించడం గమనార్హం.

సమైక్య వాదులకు కాంగ్రెస్ అధిష్ఠానం తలొంచి, తెలంగాణకు మోసం చేసిందని మరి కొందరు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను నిశ్చేష్టులను చేశాయని మరి కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ప్రధాని మన్మోహన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరో వైపు టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్టీ తాజా వైఖరిపై భవిష్యత్తు కార్యచరణ కోసం సోమవారం భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన టీ వాదులు తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

KKKK-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రధాని మన్మోహన్ చదువుకున్న మూర్ఖుడిలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. ప్రధానికి కింగ్‌ఫిషర్‌పై ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలపై లేదు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కో ఖతం కరో, తెలంగాణ హాసిల్ కరో అనే నినాదంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
- కే తారక రామారావు, టీఆర్‌ఎస్ నేత

రెండో ఎస్సార్సీ ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు. యూపీఏ-1 హయాంలోనే ఎస్సార్సీ ప్రతిపాదనను మేం తోసిపుచ్చాం. ఇక ప్రధాని ప్రకటన చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదు. తెలంగాణపై ఇదేం నాన్చుడు ధోరణి.. విషయం త్వరగా తేల్చాలి.
- ప్రకాశ్ కరత్, సీపీఎం నేత

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్
పార్టీ పెనంలోంచి సగం పొయ్యిలో, మరో సగం తీహార్ జైల్లో పడుతుంది. తెలంగాణ విషయంలో ప్రధాని
ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదు. దీంతో యూపీఏ తెలంగాణ ఇవ్వదని తేలిపోయింది.
-విద్యాసాగర్ రావు, బీజేపీ నేత

ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని అవమానపర్చారు. ప్రజాస్వామిక సంప్రదాయాలను ప్రధాని అగౌరవపర్చారు.
తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందే.
- స్వామిగౌడ్, ఉద్యోగ జేఏసీ నేత

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP