-ప్రభుత్వ ఆస్పవూతుల్లో స్తంభించిన అత్యవసరం
-రాష్ట్రంలో13 మంది రోగుల మృతి
-గాంధీలో 10 మంది.. నీలోఫర్లో ఒకరు, కర్నూలులో ఇద్దరు..
-జూడాలతో చర్చలు విఫలం
-స్టైపెండ్ పెంచేది లేదన్న సర్కారు
-డిమాండ్లు తీరేదాకా సమ్మె
-తేల్చిచెప్పిన జూడాలు
- వినియోగదారుడు విలవిల
- దిగుబడి తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- దళారులదే రాజ్యం
- రైతుకు దక్కని మద్దతు
- ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
- మార్కెట్లో స్టోరేజీల కొరత
- పెరిగిన రవాణా చార్జీలు
- బెండకాయలు కిలో రూ. 40
- వంకాయలు కిలో రూ. 30ఏది కొన్నా జేబుకు చిల్లే
- చుక్కల్లో కూరగాయల ధరలు
చిక్కుడు... కొండెక్కింది..! చింతపండు మరీ పులుపెక్కింది..! కాకరకాయ చేదునే మిగులుస్తున్నది..! ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ, ఊర్ల గడ్డ.. ఏ కూరగాయలు తీసుకున్నా భగ్గుమంటున్నాయి. పాలకూర, మెంతికూర, చుక్కకూర.. ఏ ఆకుకూర అయినా ముట్టుకుంటేనే మూర్ఛ వచ్చేలా ఉంది. ఎన్నడూ లేనంతగా మార్కెట్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. పొద్దస్తమానం కాయకష్టం చేసి వాటిని పండించే రైతుకు మాత్రం మద్దతు ధర దక్కడం లేదు. దళారుల రాజ్యంలో ఇటు రైతు, అటు వినియోగదారుడు నిండా మునిగిపోతున్నారు. వారం వ్యవధిలో మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు ఊహించని స్థాయిలో పెరిగి పోయాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్కు పోతే... ఒకటీ, రెండు కూరగాయలు తప్ప ఏమీ కొనలేని పరిస్థితి.
ఇన్నాళ్లు 15 రూపాయలకు కిలో దొరికిన బెండకాయలు ఇప్పుడు రూ.40 పెట్టినా గానీ దొరకడం లేదు. రవాణా చార్జీలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి కరువు పరిస్థితులూ తోడై దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గి పోవడం తోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటు న్నారు. తాము పంట పండించినా మార్కెట్లో అమ్ము కోవడానికి ప్రభుత్వ సహకారం లభించడం లేదని, ఫలితంగా దళారులను ఆశ్రయిస్తున్నా మని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు కూరగాయల ధరలు పెరిగి పోవడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
(టీ న్యూస్-నెట్వర్క్): గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి.. అన్నట్లుంది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 69,42,562 హెక్టార్లలో కూరగాయల పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. డిమాండ్కు తగ్గ దిగుబడి లేకపోవడంతో మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరిగిపోతే వాటిని పండించిన రైతులు ప్రయోజనం పొందాలి. కానీ వారికి మద్దతు ధర దక్కడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దళారులు మాత్రమే బాగుపడుతున్నారు. రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. డిమాండ్ను బట్టి కూరగాయాలకు వారే ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్లో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 650 వరకు రైతు బజార్లు ఉన్నాయి.
హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానమైనవి 16 రైతు బజార్లు ఉన్నాయి. ఏ ఒక్క రైతు బజారులోనూ రైతులు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు అప్పటికప్పుడు అమ్ముకొని పోవాల్సి వస్తోంది. లేకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైతుల నుంచి టామాటలను కిలోకు ఒక్క రూపాయి చొప్పున దళారులు కొంటారు. వాటిని వినియోగదారులకు రూ. 6 చొప్పున అమ్ముతారు. దళారుల దందా మూలంగా ఇటు రైతులు, అటు వినియోగదారులు మోసపోతున్నారు.
రవాణా చార్జీలు పెరగడం కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పెరిగిన డీజిల్ ధరలు రైతులపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. పంట వేసేందుకు ట్రాక్టర్తో దుక్కి దున్నింది మొదలు మార్కెట్కు కూరగాయలను తరలించే వరకు డీజిల్ ధరల ప్రభావం వారిపై పడుతున్నది. రైతులు నష్టపోవడానికి ఇదీ ఓ కారణం. రైతులు పండించిన పంటలు బహిరంగ మార్కెట్లో వారే ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం కల్పించినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.
హైబ్రీడ్ విత్తనాలతో రైతుల బేజారు
విత్తనాలను ఉత్పత్తి చేసే సంస్థలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రకరకాల కంపెనీల పేరుతో హైబ్రీడ్ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. హైబ్రీడ్ విత్తనాల పంటలు ఏపుగా పెరుగుతున్నాయి తప్ప కాత కాయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు కాంప్లెక్స్ ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోతున్నది తప్ప పంట దిగుబడి రావడం లేదు. హైబ్రీడ్ విత్తనాలతో వచ్చిన తొలి పంటను రిలయన్స్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తాయి. మలి పంటను తీసుకోవడానికి ఈ సంస్థలు నిరాకరిస్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ రైతులు మార్కెట్కు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నది.
చైతన్యం నింపని సదస్సులు
ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రైతు చైతన్య సదస్సులు రాజకీయ సదస్సులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ కాలంలో ఏయే పంటలు వేయాలి.. ఏ మోతాదులో ఎరువులు వాడాలి.. పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పంటను మార్కెట్కు తరలించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి? దళారుల బారిన పడకుండా పంటను ఎలా విక్రయించుకోవాలి తదితర విషయాల్లో రైతులకు ఈ సదస్సుల ద్వారా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కుబడిగా వీటిని నిర్వహించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్కు ధరల సెగ
హైదరాబాద్లో కూరగాయల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. మరో 20 రోజుల్లో ఉత్పత్తి పడిపోనుంది. వారం రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.1 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం పడిపోవడం, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రకాల కూరగాయలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు వాటిని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా సరిపడా కూరగాయలు దిగుమతి కావడం లేదు. నగరంలో రోజుకు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 200-300 మెట్రిక్ టన్నులు దిగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ కూరగాయలు లేకపోవడంతో దళారులదే రాజ్యంగా మారుతోంది. వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మార్కెట్లో 40 శాతం ధరలను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.
దళారుల ధరలు..
రైతుబజార్లలో ధరలకు సంబంధించి 1999లో ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. వాటి ధరలు సమీపంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ల ధరలకు దగ్గరగా ఉండాలి. ఎస్టేట్ అధికారులు, రైతులు కలిసి నాణ్యత ప్రమాణంగా ధర ఖరారు చేయాలి. కానీ హైదరాబాద్తో సహా ఇతర ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. బోయిన్పల్లి మార్కెట్లోని కూరగాయల రేట్ల ఆధారంగా హైదరాబాద్ నగరంలోని రైతుబజార్లలో ధరలు నిర్ణయిస్తున్నారు. బోయిన్పల్లి మార్కెట్కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే అక్కడ సాధారణంగా ధరలు పెంచుతారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రైతుబజార్లపై పడుతుంది. వాస్తవంగా అక్కడి కూరగాయలకు, రైతుబజార్లలో రైతులు తీసుకువచ్చే వాటికి ఎలాంటి సంబంధం లేదు.
మెదక్లో కూర‘గాయాలు’: రాష్ట్ర రాజధాని మెదక్ జిల్లాకు ఆనుకొని ఉండటంతో నగరవాసుల కూరగాయల అవసరాల్లో సింహభాగం మెదక్ జిల్లానే తీరుస్తున్నది. జిల్లాలోని వర్గల్, ములుగు, గజ్వేల్, తూప్రాన్, జగదేవపూర్, తొగుట, గుమ్మడిదల, జిన్నారం వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వంటిమామిడిలోని కూరగాయల మార్కెట్ నుంచి ప్రతిరోజూ సుమారు 170 నుంచి 200 టన్నుల కూరగాయలు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. నగరవాసుల అవసరాలు తీరుస్తున్నా స్థానికంగా మాత్రం కూరగాయల రేట్లు మండిపోతున్నాయి.
మహబూబ్నగర్, ఖమ్మంలో కష్టాలు
జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో నీటి శాతం తగ్గింది. వాటితో పాటు ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల కూరగాయలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పడిపోయింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు కూరగాయలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోనూ కూరగాయల ధరలు భగ్గున మండుతున్నాయి. ధరలు చుక్కలనంటుతుండటంతో సామాన్యులు మార్కెట్లో కూరగాయలు కొనలేని దుస్థితి ఏర్పడుతోంది. అంగట్లో అదిరిపోయే ధరలతో సామాన్యుల దిమ్మ తిరుగుతోంది. పూటగడవని కూలీలకు పచ్చళ్ళే పంచభక్షపరమాన్నాలుగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర అందటంలేదు.
ఆదిలాబాద్ అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత పక్షం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, వర్షాభావ పరిస్థితులు, సాగు ఖర్చులు పెరగడం, రవాణా చార్జీలు తడిసి మోపెడు కావడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక కొన్ని కూరగాయలు మార్కెట్లలో దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. మార్కెట్లో క్యాలిఫ్లవర్, తోటకూర, బీరకాయ, గోరుచిక్కుడు, దోసకాయ, చిక్కుడుకాయ లాంటి కూరగాయలు అంతంత మాత్రంగానే దొరుకుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే టమాట, ఆనిగపుకాయ, బెండకాయ, కాకరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంతికూర, దిగుబడి 50 శాతం మేరకు తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, క్యాబేజీ పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి.
కరీంనగర్లో తగ్గిన విస్తీర్ణం
కరువు కారణంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2,65 హెక్టార్లు కాగా 700 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. లేబర్ కొరత కారణంగా కూరగాయలు సాగు మాని పత్తిపంట వైపు రైతులు మొగ్గు చూపారు. పత్తిపంటకు గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో అటువైపు మొగ్గుచూపారు. ఎక్కువ కూరగాయల ఉత్పత్తులు జరిగే కరీంనగర్ మండలాన్నే తీసుకుంటే గత ఏడాది 1500 ఎకరాల్లో సాగు జరిగితే ఈ ఏడాది ఐదు వందల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. బోయినపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో ఏటా ఐదు వందల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే ఈ ఏటా రెండువందల ఎకరాల్లో మాత్రమే సాగుజరిగింది. జిల్లాలో ఒక్క టమాట మినహా అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వరంగల్, నిజామాబాద్, నల్లగొండతో పాటు సీమాంవూధలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
Take By: T News
-మాఫీ ప్రకటించి రెండేళ్లయినా
- పూర్తి నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- రూ.312 కోట్లలో విడుదలైంది 114 కోట్లే
- వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అంటున్న బ్యాంకులు
హైదరాబాద్, జనవరి 21( ): పాత రుణాలు మాఫీ కావు.. కొత్త రుణాలు అందవు.. వడ్డీల మోతతో బ్యాంకుల హుకూం.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులివి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తున్నామని 2009లో ప్రకటించిన ప్రభుత్వం రెండేళ్లయినా ఆ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. మూడో వంతు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇదిలాఉండగా ప్రభుత్వం విడుదల చేసే అసలు సొమ్ముతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రుణాల్ని మాఫీ చేస్తామంటూ బ్యాంకులు నిబంధన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు అంద దీంతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
గొప్పగా ప్రకటించి..
చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం 2009లో ప్రకటించింది. ఈ మేరకు 2008, మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సహకార సంఘాలు, ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న రుణాలను (239 కోట్ల రూపాయలను) వడ్డీ కలిపి (రూ.312 కోట్లు) మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో సుమారు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం కలిగింది. అయితే రుణ మాఫీని అమలు చేయడంలో సర్కారు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 2009-10 బడ్జెట్లో రూ.312 కోట్లను కేటాయించినా నిధులను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో నిధులను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పింది.
తీరా రూ.109 కోట్లను మాత్రం విడుదల చేసింది. 2010, మార్చి నాటికే విడుదల చేయాల్సిన ఈ నిధులు 2011, ఏప్రిల్లో విడుదలయ్యాయి. ఈ జాప్యాన్ని పట్టించుకోని బ్యాంకులు 2010, ఏప్రిల్ నుంచి వడ్డీ కట్టాలని తేల్చిచెప్పాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్లోనూ రుణమాఫీకి రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తం రూ.312 కోట్ల రుణమాఫీ నిధుల్లో ఇప్పటివరకు రూ.114 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసినా చేనేత బడ్జెట్లో పదో వంతు నిధులు కూడా విడుదల చేయకపోవడం చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఇప్పటికే 20 నెలలకు చేరిన వడ్డీ భారం
2010, ఏప్రిల్లో విడుదల చేసిన రూ.109 కోట్ల రుణమాఫీ నిధులకు సంబంధించి లబ్ధిదారులు 20 నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంది. మిగతా రుణ నిధులు ఎప్పుడు విడుదలవుతాయో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఒకవేళ ఈ నిధులు త్వరలోనే విడుదలైనా వడ్డీ భారం తడిసిమోపెడు కానుంది. అసలు కంటే వడ్డీ భారం అధికమయ్యే ప్రమాదమూ లేకపోలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పాత రుణాలు మాఫీ కాక ఇటు కొత్త రుణాలు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Take By: T News
- ఇంధన సర్దుబాటు చార్జీల మోత
- డిస్కమ్ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం
- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన కమిషన్
- హైకోర్టు తీర్పుకు లోబడి 2008-09 ఎఫ్ఎస్ఏ అమలు
- 2009-10 ఎఫ్ఎస్ఏ ఫిబ్రవరి నుంచి వసూలు- విద్యుత్ వినియోగదారులపై రూ. 3038 కోట్ల పరోక్ష వడ్డన
- యూనిట్కు 35 నుంచి 40 పైసల భారం
హైదరాబాద్, జనవరి 17 (: గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) వసూలుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఫిబ్రవరి నెలనుంచి ఎఫ్ఎస్ఏ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించింది. మంగళవారం రాత్రి పదిగంటల వరకు కసరత్తు జరిపి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీచేసింది. గత రెండేళ్లకు సంబంధించి సరాసరిగా ప్రతి యూనిట్పై 35 నుంచి 40 పైసల చొప్పున ఇంధన సర్దుబాటు భారం పడనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి న ప్రతిపాదనల్లో ఈఆర్సీ రూ.3038 కోట్ల మేరకు ఆమోదం తెలిపింది.
2008-09 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్లు రూ.3,141.97 కోట్ల ఎఫ్ఎస్ఏను ప్రతిపాదించగా ఈఆర్సీ రూ. 1,638.82 కోట్లకు ఆమోదం తెలిపింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్లు 1,480కోట్లు ప్రతిపాదించగా ఈఆర్సీ మాత్రం రూ.1,400కోట్లకు సర్దుబాటు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వినియోగదారులపై సగటున 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క యూనిట్పై 33.88పైసల చొప్పున, 2009-10 ఆర్థిక సంవత్సరంలో 44.05 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. రెండు సంవత్సరాలకు సంబంధించి గృహ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు సర్చార్జీ (ఎఫ్ఎస్ఏ) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.
గత సెప్టెంబర్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ముఖ్యమంవూతికి నివేదిక అందజేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల ఇంధన సర్దుబాటు ఛార్జీల మొత్తం దాదాపు రూ.577కోట్లను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరడ్డి ప్రకటించడంతో మిగతా వినియోగదారులు (నాన్ డొమెస్టిక్) హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసును గత సెప్టెంబర్లో హైకోర్టు బెంచ్ విచారించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు, ప్రభుత్వానికి చురకలు పెట్టింది. దాంతో 2008-09 ఇంధన సర్దుబాటు చార్జీల అమలు అంశం హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్ఎస్ఏను వినియోదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి మనోహరరాజు ‘T’కు వెల్లడించారు.
Take By : T News
-లోక్సభలో రోజంతా చర్చ..
-లొసుగులపై విపక్షాల రచ్చ
-తొందరేంలేదు.. మళ్లీ తీసుకురండి
-2, 3 నెలలైనా ఫర్వాలేదు: సుష్మ
-అవినీతిపై పోరుకు సహకరించండి
-లోక్పాల్ను ఆమోదించండి
-పార్లమెంటుకు ప్రధాని విజ్ఞప్తి
-సీబీఐని చేర్చేది లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 27:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోక్పాల్ బిల్లును మంగళవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్సభ ఆమోదించింది. ఒకవైపు బలమైన లోక్పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ముంబైలో నిరాహార దీక్షకు కూర్చోగా, మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై పలు పార్టీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లుపై చర్చలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును తేవాలని బీజేపీ డిమాండ్ చేయగా, మార్పులు అవసరమని వివిధ పార్టీలు సూచించాయి. సమతుల్యతతో రూపొందించిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శలు, విసుర్లు, ఛలోక్తులతో ఆసక్తి కలిగించారు.లోక్సభలో బిల్లు పెడుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి పార్లమెంటు ఔన్నత్యం గురించి నొక్కిచెప్పారు. ‘‘మనం ఈ సభకు మాత్రమే తలవంచాలి. అంతేతప్ప మరెవరికీ కాదు’’ అని పరోక్షంగా అన్నాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి సంబంధించిన నేరానికి పాల్పడ్డట్లు విశ్వసించిన పక్షంలో అలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అధికారం లభిస్తుందని, లోక్పాల్, లోకాయుక్త బిల్లుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని మంత్రి చెప్పారు. లాలు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల లోకాయుక్తలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. లోకాయుక్తల ఏర్పాటు గురించి, గుజరాత్లో అవినీతి నిరోధక వ్యవస్థ లేకపోవడం గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా ఏఐఏడీఎంకే, బీజేపీ సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లు పూర్తి లోపాలతో ఉందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.
‘‘బిల్లును ఉపసంహరించాలి. హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తిరిగి స్థాయీసంఘానికి పంపించండి. 3, 4 నెలల తర్వాత తిరిగి ప్రవేశపెట్టండి. ఈ సమావేశాల్లోనే బిల్లు కావాలని మేం కోరాం. కాని, మేము ఇలాంటి బిల్లును కోరుకోలేదు’’ అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తలకు సంబంధించి ప్రభుత్వం తొలుత గందరగోళాన్ని తొలగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా అనుసరించాలా లేదా వాటి ఇష్టవూపకారం వ్యవహరించవచ్చా అన్నది స్పష్టం చేయాలన్నారు. మంత్రి కపిల్ సిబల్ ఐచ్ఛికమంటుంటే మరోమంత్రి నారాయణస్వామి విధిగా నెలకొల్పాల్సిందేనంటున్నారని ఆమె తప్పుబట్టారు. బిల్లు సమాఖ్య స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. లోక్పాల్లో మైనారిటీల రిజర్వేషన్కు సంబంధించి ఆమె రెండో అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ప్రతిపాదన విభజనకు విత్తనాలను నాటుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండానే మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఉన్నత పదవులను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె లాలూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కుటిలత్వాన్ని లాలు అర్థం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఇప్పుడాయన తెలుసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆమె వ్యాఖ్యానించగా, ‘‘బీజేపీ దేశాన్ని విడదీయాలని కోరుకుంటోంది’’ అని లాలూ బదులిచ్చారు. లోక్పాల్ను ప్రభుత్వం అన్ని రకాలుగా నియంవూతించేలా ప్రస్తుత బిల్లు ఉందని, ప్రధానికి చాలా రక్షణలు కల్పించారని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని సుష్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కపిల్సిబల్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బిల్లును ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా లోకాయుక్తల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంతో విభేదించాయి. బలమైన లోక్పాల్ అవసరమని, ఆ వ్యవస్థ పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య కోరారు.
-సీబీఐని లోక్పాల్లో చేర్చం
-ప్రధాని మన్మోహన్ స్పష్టీకరణ
లోక్పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ప్రధాని మన్మోహన్సింగ్ తోసిపుచ్చారు. దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేప లేదని స్పష్టం చేశారు. లోక్పాల్, లోకాయుక్త బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకుంటూ అవినీతిపై పోరాటంలో ఫెడరలిజం అడ్డంకి కాకూడదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి క్యాన్సర్పై పోరాటంలో కలిసిరావాలని, బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘సీబీఐని లోక్పాల్ పరిధిలోకి తీసుకురావడమనే ప్రతిపాదన సరికాదు. దానివల్ల పార్లమెంటుకు వెలుపల ఒక కార్యనిర్వాహక నిర్మాణం ఏర్పడుతుంది.. అది ఎవరికీ జవాబుదారీకాకుండాపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది’’ అని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతి, దాని పర్యవసానాలు ఎలా దారితీస్తున్నాయో గుర్తుంచుకోవాలని, గత ఏడాది కాలంలోనే ప్రజాక్షిగహం ఎలా వ్యక్తమయిందో గమనించాలని అన్నారు. అందుకే ప్రతిపాదిత బిల్లును ఆమోదించాలని కోరారు. బిల్లును రూపొందించే ముందు విసృ్తతంగా సంప్రతించామని, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. లోక్పాల్పై రోజంతా చర్చ కొనసాగగా, ప్రధానమంత్రి అలాగే కూర్చున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, అవినీతిపై పోరాటంలో సభ అభివూపాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. లోకాయుక్తల ఏర్పాటు అవసరాన్ని ప్రధానమంత్రి గట్టిగా సమర్థించారు. ‘ఆమ్ ఆద్మీ’ (సాధారణ పౌరుడు) పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్, మునిసిపల్ సేవలు, భూమి రికార్డులు, పోలీస్, రేషన్షాపులు.. తదితర నిత్యావసర సమస్యలన్నీ రాష్ట్రాలకు, స్థానిక అధికార సంస్థలకు సంబంధించినవని, ఈ సమస్యల పరిష్కారానికి లోకాయుక్తల ఏర్పాటు అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘లోకాయుక్తలను ఏర్పరచకపోతే అవినీతి క్యాన్సర్ విస్తరిస్తుంది. ఈ విషయంలో మనం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదు’’ అని ఆయన అన్నారు.
లోక్పాల్తో అవినీతి పోదు: ములాయం
లోక్పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. లోక్సభలో లోక్పాల్ బిల్లుపై చర్చలో పాల్గొంటూ- పార్లమెంటు కన్నా మరేదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘లోక్పాల్ బిల్లు అవినీతిని నిర్మూలించదు. బిల్లులో చాలా లోపాలున్నాయి. అది చాలా అంశాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం లోక్పాల్ కన్నా పెద్దది. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. దానికన్నా మరేదీ ఉన్నతం కాదు. ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఎంపీలు భయపడతారు’’ అని ఆయన అన్నారు. ‘‘సీబీఐపై చేసిన ఆరోపణలను లోక్పాల్పైనా చేయొచ్చు. ఈ లోక్పాల్ బిల్లు అమలుచేయాల్సినంత మంచిదేంకాదు’’ అని ములాయం వ్యాఖ్యానించారు.
సీబీఐకి స్వేచ్ఛ, కొత్త లోక్పాల్ అవసరం: జేడీ (యూ)
ప్రభుత్వం మెరుగైన బిల్లు తేవాలని, సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు అవినీతిని నిరోధించలేదని ఆయన లోక్పాల్పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఫలితంగా కోర్టు కేసుల సంఖ్య పెరగడం తప్ప అసలైన ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీకి మంత్రి కపిల్ సిబల్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని చెప్పే బదులు బిల్లును మెరుగుపరచాలని సూచించారు.‘‘ప్రజలు ఈ నాటకాన్ని అర్థంచేసుకోవడం లేదని సిబల్ భావిస్తున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు అవినీతిని నిర్మూలిస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక చట్టాలను తేవాలనుకునేవారు బీహార్లోని నితీష్కుమార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తొలి లోక్పాల్.. మన్మోహన్!
తొలి లోక్పాల్గా నిజాయితీపరుడైన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను ఎన్నుకోవాలని ఆర్జేడీ నేత లాలూవూపసాద్ యాదవ్ సూచించగా మంగళవారం లోక్సభలో నవ్వులు విరిశాయి. అందరు బిగ్గరగా నవ్వగా, ప్రధాని మన్మోహన్ చిరునవ్వుతో స్పందించారు. లోక్పాల్ ఎన్నిక ప్రక్రియ గురించి లాలూ మాట్లాడుతూ తనకు ఆయన కంటే నిజాయితీపరుపూవరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు మరొకరిని ప్రధానమంవూతిగా చేసుకోండి’’ అని అధికార కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అన్నా హజారే తీరుపై లాలూ మండిపడ్డారు.
Take By: T News
మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం కన్నా రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చిందనే అభివూపాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏదైనా సామాజిక వర్గాన్ని బాగుపరచాలనే చర్చ వచ్చినప్పుడల్లా ప్రభుత్వం కోటాతో సరిపెట్టి వివాదాల తుట్టె కదుపుతున్నది. కానీ ఆయా సామాజిక వర్గాల సమక్షిగాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతులకున్న 27 శాతం రిజర్వేషన్లలో మైనారిటీలకు నాలుగున్నర శాతం ఉప కోటా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ తరువాత సార్వవూతిక ఎన్నికలు కూడా సమీపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. దాదాపు 115 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు.
ఈ కోటా ముస్లింలకు తమ ప్రభుత్వ కానుక అనీ, యూపీ ఎన్నికల్లో ములాయం పార్టీకి పడే ముస్లిం ఓట్లన్నీ తమకే వస్తాయని, ఇక యూపీలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించడం కోటా రాజకీయానికి నిదర్శనం. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుందనే రీతిలో ఒక ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.
మరోవైపు జమాతే ఇస్లామీ హింద్ వంటి సంస్థలు మాత్రం ఈ కోటా కల్పించడాన్ని ముస్లింలను మోసం చేయడంగా అభివర్ణించాయి. ఇప్పటికే ముస్లింలలోని కొన్ని కులాలు బీసీలకు కేటాయించిన 27 శాతం కోటాలో రెండు నుంచి మూడు శాతం పొందే అవకా శం ఉందని, ఇప్పుడు మైనారిటీలు అందరికీ కలిపి కేటాయించే 4.5 శాతం కోటాలో వారికి అదనంగా ఒరిగేదేమీ ఉండదని ముస్లిం మత పెద్దలు కొందరు అంటున్నారు. ఉదాహరణకు జైనులు ఎంతో అభివృద్ధి చెందారని 4.5 శాతంలో వారితో ముస్లింలను కలపడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. అయితే 27 శాతం కోటాలో వెనకబడిన తరగతుల వారితో పోటీ పడే బదులు, నాలుగున్నర శాతంలో మిగతా మైనారిటీలతో పోటీ పడడం సులభమనే వారూ ఉన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి వినబడుతున్నది.
ముస్లింలతో పాటు మైనారిటీలందరికీ కలిపి నాలుగున్నర శాతం రిజర్వేషన్ కల్పించడం కంటి తుడుపు చర్య అనే అభివూపాయం ముస్లిం మేధావులలో వ్యక్తమవుతున్న ది. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ముస్లింలకు పది శాతం రిజర్వేష న్ కల్పించాలని వారు కోరుతున్నారు. పైగా ఈ మేధావి వర్గం అభివూపాయపడుతున్నట్టు ముస్లింల సమక్షిగాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా కేవలం కోటా కల్పించడం వల్ల కూడా ఫలితం ఉండదు. యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కానీ, ఆ తరువాతి రంగనాథ్మిశ్రా కమిషన్ కానీ ముస్లింల దయనీయ పరిస్థితిని వివరించాయి.
ప్రణాళికా సంఘం విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక (2011) కూడా ముస్లింల వెనుకబాటుతనాన్ని కళ్ళకు కట్టింది. ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పేదరికం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చూస్తే ముస్లింల అభివృద్ధి రేటు తక్కువగా ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలను ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసిందని కాదు.
ఈ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ముస్లింల పరిస్థితి చెప్పడానికే భిన్న వెనుకబడిన వర్గాలతో పోల్చడం. 2004-05 నుంచి 2007-08 నాటికి పోల్చి చూస్తే నగర ప్రాంతాలలో ముస్లింలలో విద్యాభివృద్ధి 5.3 శాతం కాగా, ఎస్సీలలో 8.7, ఎస్టీలలో 8 శాతం ఉంది. శిశు మరణాల సంఖ్య కూడా మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2.5 శాతం మాత్రమే ఉన్నారు.
ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని మించిన సమస్యలను ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నది. ముస్లింలను ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రధాన స్రవంతి చేయడానికి ఇష్టపడని, గిట్టుబాటు కాని పనులను వారు చేపట్టవలసి వస్తున్నది. భద్రతా రాహిత్యం, అస్తిత్వ సంక్షోభం, వివక్ష, దేశ భక్తిని శంకించడం వంటి సమస్యలను ముస్లింలు ఎదుర్కొంటున్నారని సచార్ కమిటీ పేర్కొంది.
వీరికి అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాలలో కోటా కల్పించడం వల్ల కొన్ని తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోటాతోనే సమస్యలన్నీ తీరుతాయనే భ్రమలను ప్రభుత్వం కల్పించకూడదు. దీర్ఘకాలిక సామాజిక - ఆర్థికాభివృద్ధి వ్యూహంలో కోటా కల్పించడం కూడా ఒక భాగం కావాలె. ప్రత్యేకించి ఆత్మాభిమానంతో బతికే గౌరవనీయ పరిస్థితులు కల్పించాలె.
అంతే తప్ప ముస్లింలకు ఏదో ఒరగ బెడుతున్న అభివూపాయాన్ని ఇతర మతాల వారికి కల్పించడం, బీసీ ల కోటా నుంచి కేటాయించి తగవులు పెట్టడం వంటి చర్యలు తక్షణ రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయేమో కానీ, సామాజిక సామరస్యానికి, సంక్షేమానికి దోహదపడవు. కాంగ్రెస్ వంటి బాధ్యతాయుత రాజకీయ పక్షం, కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో అడుగులు వేయాలే తప్ప రాజకీయ ఎత్తుగడలకు దిగడం భావ్యం కాదు.
Take By: T News
- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?
హైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.
వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్కు గుడ్బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్కుమార్డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
Take By: T News
- కనీస వేతనాలకు కత్తెరేసే కుతంత్రం
- యాజమాన్యాల అమానుషం
- ‘స్టార్’ సమావేశాల్లో ‘మెజారిటీ’ నాటకం
- అదే జరిగితే సేట్ల జేబుల్లోకి వేల కోట్లు
- భారీ మొత్తాలు కోల్పోనున్న కార్మికులు
- జీవో మార్పుకోసం నెల్లూరు మాజీ ఎమ్మెల్సీ తంటాలు
- దానం, షబ్బీర్, రాజేశ్వర్ పాత్రపై కార్మికుల మండిపాటు
- సమరానికి సిద్ధం.. కాంగ్రెస్ను ఖతం చేస్తాం
-జీవో 41 సవరణకు సీమాంధ్ర సర్కారు సిద్ధం
( - నిజామాబాద్):ప్రభుత్వ జీవో ప్రకారం కనీసం వేతనం రూ. 150 చెల్లించలేమని అలా చేస్తే నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదముందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలుకుతున్నారు. సీమాంధ్ర సర్కారులోని పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే బీడీ కార్మికులు వెయ్యి బీడీల ఉత్పత్తిపై రూ.60 నష్టపోయే ప్రమాదముంది. బీడీ కార్మికుల జీవితాలు మసిబారిపోతూనే ఉంటాయి. జీవనాధారంగా ఎంచుకున్న పని వారి జీవితాలను గొప్పగా నిలబెట్టకపోగా, ఆరోగ్యాన్ని పలు విధాలుగా హరించి వేస్తూనే ఉంటుంది.
సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవనమో, ఆరోగ్య భద్రతకు హామీయో ఉండదు. అయినా ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళదీయాలికదా అనే భావనతోనే కూటికోసం తెలంగాణలో కోట్ల కుటుంబాలు బీడీ పరిక్షిశమనే ఆధారం చేసుకున్నాయి. వాళ్ల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిజేసే ఈ పని సేట్లకు, యాజమాన్యాలకు మాత్రం కోట్ల సంపదను సమకూర్చుతోంది. కార్మికులకేమో సరైన కనీస వేతనాలు లభించవు. సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ ఏడాది జూన్లో వెయ్యి బీడీల తయారీకి కనీస వేతనాన్ని రూ.150గా ఖరారుచేస్తూ జీవో నంబర్ 41 విడుదలయింది. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మిక శాఖ, ప్రభుత్వం.. అన్నీ ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే విడుదలైన ఆ ఉత్తర్వు పని అంతటితోనే ముగిసిపోయింది.
ఆచరణకు రాలేదు. కారణం?.. స్వార్థపర యాజమాన్యాల దురాశ! తమ లాభాలు కొల్లగొట్టుకపోతాయనే అపోహ. అంతే.. ఆ జీవోకు అడ్డుచక్రం వేయాలనుకున్నారు. అధికారంలో ఉన్న నేతలను అందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కావాలనుకున్న వర్గాలన్నింటినీ సంప్రదించారు. విలాసవంతమైన నక్షత్ర హోటళ్లలో సంప్రతింపుల ప్రహసనం నడిపారు. అన్యాయం కదా అనేవారికి అవకాశమీయలేదు. అన్ని రకాల మాయోపాయాలూ ప్రయోగించారు. చివరికి.. ‘మెజారిటీ’ పేరిట కార్మికుల కడుపు కొట్టేందుకు ఏకమయ్యారు. పదకొండు సంవత్సరాల పోరాటం ఫలితంగా కనీస వేతనాన్ని రూ.102 నుంచి రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినా.. ఇప్పుడు కుట్రపూరితంగా ఆ మొత్తం రూ.115కు పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. స్వార్థపర యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారుకు తోడు ఇక్కడి తెలంగాణ ద్రోహులు కూడా ఈ దారుణానికి అండగా నిలవడం కార్మిక వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. స్వయానా కార్మికమంత్రి దానం నాగేందర్, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అండదండలతో బీడీ యాజమాన్యాలు జీవో 41ని సవరింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బీడీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం కుయుక్తులకు తలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. యాజమాన్యాల ప్రయత్నాలను తిప్పికొ సోమవారం హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశం కావాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయం తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిక్షిశమ తనను నమ్ముకున్న కార్మికులను కాపాడుకోలేకపోతోంది. ఆ కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్న సంఘాలను దెబ్బతీసేందుకు ఎన్నో మాయోపాయాలు..
కపట నాటకాలు. ఇప్పుడు ఆ కార్మికవర్గం వెన్ను విరిచేందుకు స్వార్థ యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారు పథకం ప్రకారం పావులు కదుపుతున్న తీరు రోత కలిగిస్తోంది. గుండెలను రగిలిస్తోంది. లక్షల మంది కార్మికులు లడాయిచేసి సాధించుకున్న కనీసవేతనాల జీవోను సవరించే నయవంచన ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర ప్రతిఘటనను చవిచూసే పరిణామాలను కొని తెచ్చుకోనున్నాయి. కుట్రలు ఫలిస్తే ఈ ఒక్క ఆరు నెలల్లోనే తెలంగాణ జిల్లాల్లోని ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులు రమారమి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. హైదరాబాద్ కేంద్రంగా సీమాంధ్ర సర్కారు పెద్దలు, బీడీ యాజమాన్యాలు కూడబలుక్కుని నడుపుతున్న గూడుపుఠాణీ వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బుగ్గికానున్నాయి.
నయవంచన.. కుట్రల పరంపర..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణ సూచికల ప్రాతిపదికన కనీస వేతనాలు అందజేయాలని 11ఏళ్లుగా తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మిక రంగంలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోని కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో 2010 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు చరివూతాత్మకమైన సమ్మె జరిగింది. 32 రోజులపాటు కొనసాగిన సమ్మెవల్ల తెలంగాణ జిల్లాల్లోని బీడీ యాజమాన్యాలు కోట్లాది రూపాయల ఉత్పత్తిని కోల్పోయాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 56 సంఘాలతో సమ్మె కాలంలోనే నవంబర్ 24, 25, 26 తేదీల్లో చర్చలు జరిపింది. దీని ఫలితంగానే డిసెంబర్ 30న కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ 1381 నంబరుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేశారు.
వెయ్యి బీడీల తయారీకి 130 రూపాయలు కనీస వేతనంగా పేర్కొంటు జారీచేసిన నోటిఫికేషన్పై మంత్రి దానం నాగేందర్ సమక్షంలో బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. జీవన ప్రమాణ సూచికలు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రాతిపదికన ప్రతి వెయ్యి బీడీల తయారీకి 150 రూపాయల కనీస వేతనం అమలు పూర్తిగా శాస్త్రీయబద్ధమేనని కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ సమావేశంలో స్పష్టంచేశారు. ఆ సమావేశం కొనసాగింపుగానే జూన్ 31వ తేదీన ప్రభుత్వం 130 రూపాయలు కనీస వేతనంగా, 7 రూపాయల 50 పైసలు కరువు భత్యంతోపాటు ఇతర అంశాలపై చెల్లింపుల ద్వారా 150 రూపాయలను ఖరారు చేస్తూ జీవో నంబర్ 41ను జారీ చేసింది.
ఆ జీవోను అమలుచేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జూలై 6 నుంచి పదిరోజులపాటు అక్రమంగా లాకౌట్ ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జూలై 27న త్రైపాక్షిక కమిటీని వేసింది. బీడీ సేట్లకు అనుకూలమైన సంఘాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల బాధ్యులకు ఎక్కువ సంఖ్యలో కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. బీడీ పరిక్షిశమతో ఏమాత్రం సంబంధంలేని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను (నెల కిందట పదవీ కాలం ముగిసింది) సైతం త్రైపాక్షిక కమిటీ సభ్యుడిగా నియమించారు. ఐఎఫ్టీయూ, సీఐటీయూ, డీఎంఎస్, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలతోపాటు ముఖ్యమైన బీడీ సంఘాల యాజమాన్యం ప్రతినిధులను కమిటీలో చేర్చారు. ఏనాడూ ఆ పని చేయని త్రైపాక్షిక కమిటీ మొక్కుబడిగా సెప్టెంబర్ 12న, నవంబర్ 9న మాత్రమే సమావేశాలు జరిపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండానే కార్మిక సంఘాల అభివూపాయాలను మాత్రమే స్వీకరించింది.
రెండ్రోజుల్లోనే తారుమారు.. ఆరునెలల్లోనే వెయ్యి కోట్ల నష్టం
కనీస వేతనాల జీవో అమలుకోసం సీఐటీయూ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా చర్చలపేరిట సమావేశాలను నిర్వహించాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 150 రూపాయలు చెల్లించలేమని, నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలికారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలో కనీస వేతనాలు ఇస్తుండగా లేని నష్టాలు ఇక్కడెందుకు వస్తాయని సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయినా మెజార్టీ మంత్రాంగాన్ని తెరపైకి తెచ్చిన యాజమాన్యాలు 70 సంఘాల అంగీకారం ఉందంటూ కనీస వేతనాల జీవోను సవరించాలంటూ సర్కారును ఆశ్రయించాయి. వెయ్యి బీడీల తయారీపై ఇప్పుడు ఇస్తున్న 102 రూపాయలను 115 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనకు బీడీ కార్మికసంఘాలు పచ్చజెండా ఊపాయి. సీమాంధ్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే ప్రతి బీడీ కార్మికుడు వెయ్యి బీడీల ఉత్పత్తిపై భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవో విడుదలైనప్పటినుంచి ఈ ఆరు నెలల కాలంలోనే ఆ మొత్తం రూ. వెయ్యి కోట్ల పైగా ఉంటుంది.
రోజుకు వందకోట్ల బీడీ ఉత్పత్తి
సంక్షోభంలో ఉన్నామంటూ నమ్మబలుకుతున్న సేట్లు కనీస వేతనాలు పెంచితే పరిక్షిశమనే తరలిపోతుందని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. బీడీ కంపెనీలు వెయ్యి బీడీలను 40 కట్టలుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు లాభాలను గడిస్తుంటాయి. ఉత్పత్తిచేస్తున్న కార్మికులకు మాత్రం 102 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ లెక్కన యాజమాన్యాలకు రోజువారీగా అంతులేని లాభాలు వస్తూనే ఉన్నాయి.
ప్రతిరోజు తెలంగాణ జిల్లాల్లో వందకోట్ల సంఖ్యలో బీడీ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక్క దేశాయి కంపెనీలోనే లక్షమంది కార్మికులు 10 కోట్ల బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. శివాజీ, టెలిఫోన్, చారుబాయి, ఠాకూర్, హిమ్మత్లాల్ తదితర కంపెనీలు ప్రతిరోజు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బీడీలను తయారుచేయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, కరీంనగర్లో లక్షన్నర మంది, మెదక్ జిల్లాలో లక్ష 20 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో లక్ష మంది, వరంగల్లో 30వేల మంది బీడీలు చుడుతూ జీవనం గడుపుతున్నారు.
గూడుపుఠాణిపై సమరం: ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనాల జీవోను సవరించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ చెప్పారు. జీవో 41ని యథాతథంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నామన్నారు.
కాంగ్రెస్కు కష్టకాలమే: ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్
జీవోను సవరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు కష్టకాలం తప్పదని ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సిద్ధిరాములు హెచ్చరించారు. సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్ పెద్దలు బీడీ యాజమాన్యాలతో కుమ్మకై్క లక్షలాది మంది తెలంగాణ బీడీ కార్మిక కుటుంబాలను నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆయన ఆరోపించారు.
మెజార్టీ సంఘాలపేరిట జీవోను సవరించే కుట్రను అడ్డుకునేందుకు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. జీవోను మార్చితే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు.
Take By: T News
- కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.
.
హైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
కిరణ్కుమార్డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.
వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్కుమార్డ్డి సర్కార్ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్కుమార్డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.
ఇదే రకమైన ఫీడ్బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్కుమార్డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్కుమార్డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్కుమార్డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్కుమార్డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.
కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్కుమార్డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్కుమార్డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.
తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్కుమార్డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.
ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్కుమార్డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్కుమార్డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్కుమార్డ్డి కోరినట్టు చెబుతున్నారు.
ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్కుమార్డ్డి వాదిస్తున్నారు.
Take By: T News
- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం
( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!
దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!
రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.
అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్కు సంకేతాలు పంపిస్తుంది.
చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.
పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.
దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.
ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.
అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!
Take By: T News :
సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుందా?
My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP