Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telangana agitation. Show all posts
Showing posts with label Telangana agitation. Show all posts

Thursday, March 21, 2013

సడక్‌బంద్ - sadak bandh

హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 


పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్త కోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Sadak Bandhఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాయశవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

Sadak Bandhఅలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.

Read more...

Tuesday, September 18, 2012

No Telangana resolution in Assembly: Kiran



TRS floor leader E. Rajender and BJP's state president G. Kishan Reddy, along with other TRS and BJP leaders demonstrate at Gun Park near the Assembly premises in Hyderabad on Monday. Photo: Mohammed Yousuf

 
Andhra Pradesh Chief Minister N. Kiran Kumar Reddy on Monday ruled out passing a resolution in the Assembly seeking creation of separate Telangana and asserted that no one could force the Centre to take a decision on the bifurcation of the state.

“Political parties, except one or two, are grossly divided on regional lines. So naturally any resolution on the statehood issue will be defeated in the House. I told the Telangana Rashtra Samiti MLAs clearly that any resolution on Telangana (in the Assembly) can be contrary to their liking,” he told news persons during an informal chat after the House was adjourned for the day.

Questioned about the then Union Home Minister P. Chidambaram’s statement (on December 9, 2009) that the process for creation of Telangana would be initiated after a resolution in the Assembly, Mr. Reddy remarked: “Indira Gandhi also made a statement in Parliament in 1969-70 (on Telangana). Jawaharlal Nehru came here to find a solution but the Telangana issue remained unresolved for the last 50 years.” 


It was a sensitive issue and no one could force the Centre to take a decision, he said.

“The Government is strong in Delhi to take a decision. It has to take all issues into consideration while taking a decision in the interest of the state and the country. The Government should protect interests of all people.” 

Mr. Reddy, however, hoped the Centre would come out with a decision soon on the vexatious statehood issue. The CM recalled that agitation for a separate Telangana state was more intense in 1969.

“I was in school at that time. The situation was more intense than,” he said, referring to the ongoing agitation for a separate state.

Earlier, TRS members disrupted the Assembly proceedings on the first day of the monsoon session demanding a resolution seeking creation of Telangana state.

The house was adjourned for the day without transacting any business as members of other Opposition parties like TDP, YSR Congress and BJP, too, raised different issues.

As two adjournments did not bring order in the house, Speaker Nadendla Manohar adjourned it for the day. 

Take By: The Hindu News



Read more...

Wednesday, February 8, 2012

5వ కేటగిరీ లోనూ.. కేసలు ఎత్తేయండి



CM talangana patrika telangana culture telangana politics telangana cinema -అవసరమైన చర్యలు చేపట్టండి
-మిగతా కేసులనూ ఎత్తేయండి
-ఉద్యమ కేసులపై సీఎం కిరణ్ కీలక నిర్ణయం
-సీఎస్, డీజీపీలతో ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 ():తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో కేటగిరీలోతీవూవమైన నేరారోపణ కింద నమోదు చేసిన 140 కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మిగతా కేటగిరీల్లో ఇంకా మిగిలి ఉన్న 306 కేసులను కూడా ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. 

ముఖ్యంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి వారిపై కేసుల ఉపసంహరణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదో కేటగిరీ కేసుల ఉపసంహరణ విషయంలో తానేమీ చేయలేనని హోంమంత్రి సబితాఇంవూదాడ్డి కూడా చేతుపూత్తేసిన నేపథ్యంలో.. ఈ కేసులపై సీఎం జారీ చేసిన ఆదేశాలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఉపశమనం కలిగించనున్నాయి. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, డీజీపీ దినేశ్‌డ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నవంబర్ 11, 2009- అక్టోబర్ 15, 2010 మధ్య కాలంలో 1,44 కేసులు నమోదయ్యాయని, వీటిని ఐదు కేటగిరీలుగా విభజించామని సీఎంకు అధికారులు వివరించారు.

మొదటి కేటగిరీలోని 565 కేసుల్లో ఇప్పటికే 399 కేసులను జీవోలు జారీ చేయటం ద్వారా ఉపసంహరించామని, మరో 166 కేసులను పోలీసుల దర్యాప్తు స్థాయిలోనే ఎత్తివేసినట్టు తెలిపారు. ఇక, కేటగిరీ 2, 3, 4ల్లోని 247 కేసుల్లో 169 కేసులను ఎత్తివేశామని, మరో 306 కేసులు ఎత్తివేయాల్సి ఉందని వివరించారు.

 By: T News

Read more...

Monday, December 26, 2011

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Friday, December 23, 2011

సిన్నబోతున్న సింగరేణి

-ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు 123వ వసంతంలోకి సింగరేణి
-సింగరేణిని ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు వ్యాపార సరుకుగా మార్చి
-అడ్డగోలుగా తవ్వేస్తున్నారు
-యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ
-ఉద్యోగాలపై ప్రైవేటీకరణ దెబ్బ
-యాంత్రీకరణతో మరో ఎసరు
-30 వేల మంది కార్మికుల తొలగింపు
-నాడు ప్రాంత పరిశ్రమల కోసమే

karmikulu-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinema( కోల్‌బెల్ట్ ప్రతినిధి):‘తల్లి నవ్వితే మాగాణి.. ఎద తలుపు తీస్తే సింగరేణి’ అన్నాడో కవి... కానీ మన సింగరేణి సీమాంధ్ర కడుపునింపితే, మాగాణి భూములు బొందల గడ్డలుగా మిగులుతున్నాయి. తెలంగాణ గర్భాన్ని చీల్చి, నల్లబంగారంతో దేశానికి వెలుగులిస్తున్న సింగరేణి సీమాంధ్ర సర్కారు కుట్రలు, కుతంవూతాలతో కుదేలవుతోంది. శ్రమైక జీవన సౌందర్యం, కార్మికుల అవిక్షిశాంత పోరాటాలతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్న ఈ సిరుల తల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గల్లా పెట్టెలు నింపేందుకు పరిమితమవుతోంది. ఓపెన్‌కాస్టు తవ్వకాలతో నాలుగు జిల్లాల్లో గోదావరి పొడువునా ఉన్న పల్లెలన్నీ బొందల గడ్డలుగా మారాయి. యాంత్రీకరణ పేరుతో సాగుతున్న ఉపరితల బొగ్గు గనుల్లో కనీస ఉపాధి కరువైంది. మరో వందేళ్లకు సరిపడే బొగ్గునిల్వలున్నా నేటికీ కోల్ కారిడార్‌కు మోక్షం కల్పించలేదు. మాంచెస్టర్ ప్రణాళికలకు రూపమివ్వలేదు. కొత్త పరిక్షిశమలను ఏర్పాటుచేయకపోగా ఇక్కడున్న పరిక్షిశమలను సీమాంధ్ర సర్కార్ మూసివేసింది. మరోవైపు కోల్ కారిడార్ పేరిట కొత్త బావుల ఏర్పాటుకు ప్రణాళికలు రచించి, మరింత దోపిడీకి తెరలేపుతోంది. నాలుగు జిల్లాల్లోని వందలాది గ్రామాలు దుమ్ముధూళితో కన్నీళ్లు పెడుతున్నాయి. అయినా సీమాంధ్ర సర్కారు కనికరించడం లేదు. అంతే కాదు సింగరేణిలో గడిచిన ఆరు సంవత్సరాల్లో వివిధ ప్రమాదాల్లో 83 మంది మృత్యువాత పడ్డారు. ఇదేకాలంలో శ్వాసకోశ వ్యాధులతో 120మందికిపైగా చనిపోయారు. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న నల్ల సూరీళ్లకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. డిసెంబర్ 23తో 123వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణిపై నమస్తే తెలంగాణ ఫోకస్..ఉత్తర తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన వరం. హైదరాబాద్ లేని తెలంగాణను ఎట్లా ఊహించలేమో, సింగరేణి లేని తెలంగాణను కూడా ఊహించలేం. 1889లో నిజాం కాలంలో అవతరించిన సింగరేణి నిజాం పారిక్షిశామిక అవసరాలకు ముడి సరుకును అందించే బొగ్గునే కాదు ఒక నూతన పారిక్షిశామిక విప్లవాన్ని సృష్టించింది. ఆంధ్రవూపదేశ్ అవతరణకు పూర్వదశ సింగరేణి నిజాం ఏలుబడిలో ఉన్న కాలం. ఈ రెండు దశలను ఒకసారి పరిశీలిస్తే పారిక్షిశామిక ప్రగతికి ముడి సరుకును అందించే బొగ్గు పరిక్షిశమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్లే నిజాం రాజు అంతవరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న హైదరాబాద్ దక్కన్ కంపెనీ నుండి మెజార్టీ షేర్లు కొనుగోలు చేసి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణికి ఖ్యాతి తెచ్చారు. నిజాం ఎంతటి నిరంకుశ రాజయినప్పటికీ తన దేశ అవసరాలకు తన ప్రజల అవసరాలకు భంగం కలిగించేలా వ్యవహరించలేదు. నిజాం స్టేట్ అవసరాల కోసం పరిమిత స్థాయిలో బొగ్గు తవ్వకాలు సాగించారు. నిజాం ఏలుబడిలో సింగరేణిలో సాగిన మొదటి 66 సంవత్సరాల కాలంలో మొత్తం బొగ్గు తవ్వకాలు 50 మిలియన్ టన్నులకు మించలేదు. ఆతర్వాత పరిస్థితిని పరిశీలిస్తే 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే 50.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. నిజాం కాలంలో జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తికి సమానంగా ఒక్క సంవత్సరంలో బొగ్గును తవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణి నుండి తవ్విన బొగ్గు సంపద ఎవరికి లాభాలు పండిస్తుందో, ఎవరికి కన్నీళ్ళు మిగిల్చిందో తేలాల్సిన అంశం!!

నిజాం స్టేట్‌లో ఫ్యూడల్ దొరలు, భూస్వాములు, దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల దోపిడీలు, దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. నీ బాంచెన్ కాల్మొక్త అంటూ ప్రజలు అణిగిమణిగి ఉండేవారు. దొరల దోపిడీ పీడను భరించలేక పారిపోయి వచ్చినవారికి సింగరేణి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్నది. బొగ్గు గనుల్లో పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఊళ్ళలో దొరతనం భరించలేనివారికి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్న పారిక్షిశామిక ప్రాంతం ఆకర్షించింది. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ అధికారుల పెట్టుబడిదారి స్వభావరీత్యా ఒక నూతన పారిక్షిశామిక సంస్కృతికి అంకురార్పణ జరిగి తదనంతర కాలంలో కార్మిక వర్గ చైతన్యానికి నాంది పలికింది. సింగరేణి కార్మికులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింగరేణి కార్మికులు వందలాది మంది గెరిల్లా యోధులుగా పాల్గొని పోరాటంలో అమరులయ్యారు. సింగరేణి చరివూతలో కార్మిక ఉద్యమంలో అదొక ఉజ్వల ఘట్టం. 1952లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వనరులు స్థానిక అభివృద్ధికి దోహదపడటం, బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం అనే రెండంచెల అభివృద్ధి విధానం ఎజెండా మీదికి రావడం జరిగింది.

రాష్ట్ర అవతరణతో తలకిందులైన పరిస్థితి
karmikulu-telangana-News3 talangana patrika telangana culture telangana politics telangana cinema1956 నవంబర్ 1న ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరిస్థితి మొత్తం తలకిందులైంది. స్థానిక వనరులు స్థానిక ప్రజలకు చెందకుండా ఉమ్మడి రాష్ట్రం పేరిట దోచుకుపోయే ప్రాంతీయ నయా వలస విధానానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు పరిమితమై సాగించే బొగ్గు ఉత్పత్తి రాష్ట్ర అవతరణ తర్వాత ఆంధ్ర ప్రాంత అవసరాలను కూడా తీర్చాల్సివచ్చింది. బొగ్గు వ్యాపార సరుకుగా మారింది. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసి సొమ్ము చేసుకునే విధానం మొదలైంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడింది. నిజాం కాలంలో కొత్తగూడెం, ఇల్లందు, బెల్లంపల్లి ప్రాంతాలకు పరిమితమైన బొగ్గు తవ్వకాలు ఆంధ్రవూపదేశ్ అవతరణ తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మాదారం, గోలేటి, అటు వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు. ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటికి 1956-57లో 1.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గత సంవత్సరం 2009-10 నాటికి 50.4 మిలియన్ టన్నులకు చేరుకున్నది. వార్షిక ఉత్పత్తి 25 రెట్లకు పెరిగిపోయింది. ఇలా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆంధ్రవూపాంతానికి తరలించి బొగ్గు ఆధారిత పరిక్షిశమలను అక్కడ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతం కేవలం ముడి సరుకును అందించే ప్రాంతంగా మిగిలిపోయింది. అదే సమయంలో బొగ్గును వ్యాపార సరుకుగా మార్చి అమ్మకాలు సాగించిన మిగులు నిధులను కూడా ఉమ్మడి రాష్ట్రం పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రవూపాంత అభివృద్ధికి ఖర్చు చేయడం మొదలైంది. రాష్ట్రానికి కేటాయించిన బొగ్గులో మూడింట రెండొంతులు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు వినియోగిస్తున్నాయి. మిగతా బొగ్గు రాష్ట్రంలోని 46 సిమెంట్ కంపెనీలు, 43 స్పాంజ్ ఐరన్ యూనిట్స్, 19 సీపీపీ యూనిట్లు మాత్రమే కాకుండా వార్షికంగా 4200 టన్నులకు మించి వాడే 182 చిన్న పరిక్షిశమలకు కేంద్ర బొగ్గు శాఖ ఉత్వర్వుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఉత్పత్తిలో 92 శాతం సరఫరా చేయాల్సి వస్తోంది. ఇట్లా వినియోగించే పరిక్షిశమల్లో 80 శాతం ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులవే.

విద్యుత్‌లోనూ అన్యాయం
తెలంగాణలోని రామగుండంలో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్‌టీపీసీ, కొత్తగూడెంలోని ఏపీ జెన్‌కోకు చెందిన 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌కు సింగరేణి బొగ్గే సరఫరా అవుతున్నది. ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చే విధంగా మొదటి పిట్ హెడ్ వద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాభదాయకం అనే అంతర్జాతీయ నిపుణుల అభివూపాయాన్ని కూడా కాలదన్ని సింగరేణికి చెందిన మణుగూరు ఏరియాలో ఏపీ జెన్‌కో మొదట నిర్మించతలపెట్టిన 1260 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వందల కిలోమీటర్ల దూరానికి ఇక్కడి బొగ్గు తరలించుకు పోయే విధంగా అప్పటి ఏపీఎస్‌బీ చీఫ్ ఇంజినీర్ నార్ల తాతారావు తన పలుకుబడితో విజయవాడకు తరలించి అక్కడ విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారన్న వాదన ఉంది. రామగుండంలోని ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం వల్ల ఎన్‌టీపీసీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 71 శాతం తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరిలకు సరఫరా అవుతోంది. కేవలం 21 శాతం మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు. అందులో తెలంగాణకు అందుతున్నది నామమావూతమే. కానీ ఈ ప్లాంట్ కోసం సేకరించిన 10 వేల ఎకరాల భూమి తెలంగాణవారిదే. ఆ మేరకు ఈ ప్రాంత వాసులు నిర్వాసితులయ్యారు. గత 30 ఏళ్లుగా నష్టపరిహారం సక్రమంగా అందక నిర్వాసితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 10 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ నుంచి మళ్ళించారు.

singareni-telangana-News2 talangana patrika telangana culture telangana politics telangana cinemaఆ మేరకు అక్కడ ఆయకట్టు తగ్గింది. ఇలా రామగుండం ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్‌కు ఇక్కడి బొగ్గునే ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యుత్‌లో మాత్రం ఒక్కశాతం కూడా ఈ ప్రాంత రైతులకు చెందడం లేదు. కొత్తగూడెం ఏపీ జెన్‌కో కేటీపీఎస్ నుండి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 70 శాతం ఉభయగోదావరి జిల్లాలకే కేటాయించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు తప్ప ఇందులో తెలంగాణకు వచ్చేదేమీ లేదు. వీటీపీఎస్‌లో 1260, రాయలసీమలో 420 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పారు. ఇటీవల వీటీపీఎస్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. సి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌టీపీసీ సింహావూదిలో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసే 1000 మెగావాట్లు మొత్తంగా కోస్తాంవూధకు ఇప్పించి ఆ ప్రాంత అవసరాలు తీర్చుకుంటున్నారు. రామగుండం బీ థర్మల్ కేంద్రాలను కూడా మూసి తెలంగాణ ప్రజలను మరింత అష్టకష్టాలకు గురిచేశారు.

సంపద శాశ్వతంగా దక్కకుండా కుట్రలు
తెలంగాణ బొగ్గు సంపద శాశ్వతంగా తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర పాలకులు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్స్ పేరుమీద బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం జరుగుతోంది. అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ ఎంత వేగవంతంగా జరుగుతున్నదో గత సంవత్సరం కంపెనీ ప్రకటించిన వార్షిక నివేదికలోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2008-09లో సింగరేణిలో జరిగిన వార్షిక ఉత్పత్తి 44.55 మిలియన్ టన్నులు. ఇందులో 32.46 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 13 ఓపెన్ కాస్టు గనుల నుండి రాగా 37 భూగర్భ బావుల నుండి 12.9 మిలియన్ టన్నులు వచ్చింది. అందులో 8 మిలియన్ టన్నులు మిషన్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి జరిగింది. కేవలం 4.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం మానవ శ్రమ ఆధారిత హ్యాండ్ సెక్షన్ ద్వారా జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో నాలుగింట మూడో వంతు పాత్ర వహిస్తున్న ఓపెన్‌కాస్టు గనుల్లో 80 శాతం పనులు ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. 14 ఓపెన్‌కాస్టు గనుల్లో పన్నెండింటిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారు. సింగరేణికి వచ్చే సగం లాభాలు వీరి జేబుల్లోకే పోతున్నాయి.

విపరీతమైన విధ్వసం
ఆంధ్ర పాలకుల వలస దోపిడీసింగరేణి కార్మికుల మూలుగుల్ని పీలుస్తున్నది. అణిచివేత, హక్కుల హరింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. 1989-90లో 1.16 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 65 వేలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. . 2020 నాటికి మరో 30 వేల మంది పదవీ విరమణ ద్వారా బయటికి పోనున్నారు. పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న ఓపెన్‌కాస్ట్ విధానం వల్ల ఇప్పటికే తెలంగాణలో 74 ఏజెన్సీ ప్రాంతంలోని తాండాలు, ఊర్లు నేలమట్టమయ్యాయి. వారి బతుకులు సర్వనాశనమయ్యాయి. పెద్ద ఎత్తున వాగులు, వంకలు, అడవులు నాశనమవుతున్నాయి. సంపద తెలంగాణది అయితే లాభాలు సీమాంధ్ర బడాబాబుల జేబుల్లోకి పోతున్నాయి. నిజాం కాలంలో తవ్వి తీసిన బొగ్గు నిజాం స్టేట్‌లోని పరిక్షిశమలైన రైల్వే, రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పొగాకు, వస్త్ర, సిమెంట్ తదితర పరిక్షిశమల అవసరాలను తీర్చేది. ఈ ప్రాంతంలో తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత పారిక్షిశామిక అవసరాలకు వినియోగించడం వల్ల ఆ మేరకు పారిక్షిశామిక అభివృద్ధి ఫలితాలు ప్రాంత ప్రజలకు దక్కాయి. పర్యావరణ విధ్వంసం కూడా పరిమితంగా ఉండిపోయింది. బొగ్గు తవ్వకాల వల్ల నిజాం కాలంలోని 66 సంవత్సరాలు పర్యావరణ విధ్వంసం ఇవాళ ఒక్క సంవత్సరంలోనే జరిగిపోతుంది.

కుంభకోణాలు.. అప్పులు
singareni-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర ప్రభుత్వం అవలంబించిన నూతన బొగ్గు విధానం విదేశీ బొగ్గు దిగుమతులకు కల్పించిన రాయితీలు వారికి మార్కెట్ సృష్టించడానికి కల్పించిన కోల్ లింకేజ్ డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు వందల కోట్ల కుంభకోణాలకు దారి తీశాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ పరిక్షిశమను నిర్వీర్యపరిచి నూతన బొగ్గు బ్లాకులను పెద్ద ఎత్తున ప్రైవేటు పరం చేస్తూ పోయింది. వారికి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే స్వేచ్ఛను, అనేక రాయితీలను, చట్టపరమైన వెసులుబాటును కల్పించింది. సింగరేణి దశాబ్దకాలంగా లాభాలు సాధిస్తున్నప్పటికీ ఈ పరిస్థితుల వల్లే ఈ రోజుకీ అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వడ్డీలు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్లు, అటు కేంద్రానికి 400 కోట్లు పన్నులు, రాయల్టీల పేరిట చెల్లించడం, మరోవైపు 400 కోట్ల రూపాయలు డివిడెంట్లు ఇవ్వడం ఆగ లేదు. గత పది సంవత్సరాల్లో ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగితే పన్నుల రూపంలో రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటిన్నరట్లు, కేంద్ర ప్రభుత్వానికి 20 రెట్లు పన్ను చెల్లింపులు పెరిగాయి. గత సంవత్సరం బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన 6396 కోట్లలో నాలుగింట మూడు వంతులు ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అలాగే ప్రభుత్వం బొక్కసంలోకి వెళ్ళిపోయింది. సింగరేణి తరతరాల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే మార్గం లేదని కార్మికులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటికి 44 సార్లు సమ్మె చేశారు. మరో వందరోజుల సమ్మెకూ సై అంటున్నారు.

ఇదీ ఆటుపోట్ల సింగరేణి
ప్రకృతి వల్ల ఏర్పడిన సహజ ఇంధనం బొగ్గు. గోదావరి నదీ తీరమంతా ఉన్న ఈ బొగ్గుతో వేలాది పరిక్షిశమలు పని చేస్తున్నాయి. 1771లో మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో గల రాణిగంజ్ వద్ద బొగ్గు తవ్వకం ప్రారంభించగా 1850 నుంచి తవ్వకాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మధ్యవూపదేశ్‌లో 1862లో, ఆతరువాత 1871లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో గల సింగరేణి గ్రామంలో బొగ్గును కనుగొన్నారు. బ్రిటిష్ అధికారి విలియం కింగ్ కనుగొన్న ఈ బొగ్గును 1989 నుంచి దక్కన్ కంపెనీ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. 1920లో సింగరేణి కంపెనీగా సంస్థ పేరు మారింది. బొగ్గు గనులు ప్రారంభమయి 123 సంవత్సరాలవుతున్నది. సింగరేణి యాజమాన్యం 2003 నుంచి ప్రతీ సంవత్సరం సింగరేణి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సింగరేణి భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. 51 శాతం రాష్ర్టం, 49 శాతం కేంద్రం వాటాలు ఉన్న సంస్థ. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రవేశపెట్టిన నూతన పారిక్షిశామిక, ఆర్థిక విధానాల ఫలితంగా తీరు మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడులు లేవు. అయితే ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి డివిడెంట్‌ను, ఇతర పన్నులను వెయ్యి కోట్లకుపైగానే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పొందుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ప్రారంభించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం సింగరేణి నాలుగు వేల కోట్లకుపైగా అప్పు చేసింది. ఇలా ప్రతి ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మట్టిలో కలిసిన మోడల్ మాంచెస్టర్
-ఉన్న పరిక్షిశమల మూసివేత.. ఊసేలేని కొత్త పరిక్షిశమలు
-నడిరోడ్డున ఉద్యోగులు.. తరిగిపోతున్న సింగరేణి సిరులు

karmikulu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema(కరీంనగర్ ప్రతినిధి/గోదావరిఖని):సింగరేణిలో మరో వందేళ్లకు సరిపడా నిల్వలున్నాయి. గడిచిన 122 ఏళ్లలో సింగరేణి ఇప్పటి వరకు 1050 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఇంకా 8 నుంచి 10వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఏటా 10శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతున్న సింగరేణి సంస్థకు బొగ్గు ఆధారిత పరిక్షిశమలు నెలకొల్పుకోవడానికి కావల్సిన అన్ని వనరులూ ఉన్నా.. అ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులతో కిటకిటలాడిన సింగరేణి నేడు కేవలం 65వేల మంది కార్మికులకే పరిమితమైంది. సింగరేణి బొగ్గు ఆధారితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండంలో నెలకొల్పిన 2600 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్టీపీసీ మినహా మరే పరిక్షిశమ లేకుండా పోయింది. గతంలో రామగుండంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ‘ఎ’ థర్మల్, ‘బి’ థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా వాటిలో ‘ఎ’ థర్మల్ కేంద్రం మూతపడింది. బొగ్గు ఆధారిత పరిక్షిశమ అయిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 11 ఏళ్ల క్రితమే మూసేశారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా విద్యుత్ కోత వల్లే ఎఫ్‌సీఐని మూసివేయాల్సి వచ్చిందని సర్కారు నిస్సిగ్గుగా ప్రకటించింది. నైజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న జిల్లాల్లో 80 పరిక్షిశమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించగా, సీమాంధ్ర సర్కారు వాటిని తుంగలో తొక్కింది. నిజానికి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి మంచిర్యాల మీదుగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని వరంగల్ జిల్లా భూపాలపల్లిని కలుపుతూ అక్కడి నుంచి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు పారిక్షిశామిక కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు వెళ్లినా ఏనాడూ పట్టించుకోలేదు.

బొగ్గు మనది.. వెలుగులు మందివి..
boggu talangana patrika telangana culture telangana politics telangana cinemaబొగ్గు మనది.. నీళ్లు మనవి.. శ్రామికులు మనవాళ్లు. కానీ వెలుగులు మాత్రం మందికి.. మనకు మాత్రం చీకట్లు..! ఇదీ మన దౌర్భాగ్యం! సింగరేణి బొగ్గు ఆధారిత పరిక్షిశమగా 200 మెగావాట్ల విద్యదుత్పత్తి లక్ష్యంగా రామగుండంలో 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎన్టీపీసీకి పునాది రాయివేశారు. 1983 అక్టోబర్ 23న ఉత్పత్తి మొదలైంది. నాటి నుంచి నేటివరకు అంచలంచెలుగా 7 యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దక్షిణాదిరాష్ట్రాలకు వెలుగులు పంచుతోంది. నిజానికి ఇంత భారీ ప్లాంటు తెలంగాణలో ఉండటం గర్వకారణమే అయినా, అ మేరకు కేంద్రం మనకు వాటా కేటాయించకపోవడం దారుణం. 2,600 మెగావాట్లలో మన రాష్ట్రానికి దక్కుతున్న వాటా కేవలం 29 శాతం మాత్రమే! తమిళనాడుకు 22 శాతం, కర్ణాటకకు 16 శాతం, కేరళకు 12 శాతం, గోవాకు 5 శాతం, పాండిచ్చేరికి 2 శాతం, మిగిలిన 14 శాతంలో కొంత ఇతర రాష్ట్రాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆ 29 శాతం వాటా కేవలం మన పది జిల్లాకు దక్కేది.

తప్పని కరెంటు కోతలు...
ఎన్టీపీసీ ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండటంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణలోని మెజార్టీ రైతులు వ్యవసాయ మోటార్లపై అధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరెంటు కోసం అన్నదాత కన్నీళ్లు పెట్టని రోజంటూ ఉండదు. 2006-07లో 500 మెగావాట్ల సామర్థ్యంతో 7యూనిట్ ప్రారంభించినప్పుడు తమకు కనీసం ఇరవై శాతం అదనంగా విద్యుత్ కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. కానీ.. కేంద్రం కరుణించలేదు. ఏటా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నుంచి 6 టీఎంసీల నీటిని ఎన్టీపీసీ వాడుతోంది. ఈ నీళ్లతో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కనీసం మరో 60వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. సింగరేణి అధారంగా నడుస్తున్న ఎన్టీపీసీలో మన వాటా పెరిగితే తప్ప తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.

ఇవీ మైలురాళ్లు
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఅంగ్లేయుల పాలన కాలంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలో ఓ నల్లరాయి మండుతూ కనిపించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అప్పటి బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అక్కడ తవ్వకాలు జరపగా, బొగ్గు నిక్షేపాలు బయట పడ్డాయి.

1870 - బొగ్గు నిక్షేపాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అన్వేషణ
1889 - బొగ్గు ఉత్పత్తికి అంకురార్పణ
1920 - అంగ్లేయుల నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాధీనం, ‘దక్కన్ కంపెనీ’గా నామకరణం
1945 - లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
1949 - రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి, సింగరేణిగా నామకరణం
1951 - విద్యుత్తు సౌకర్యంతో డ్రిల్లింగ్ పనుల ప్రారంభం
1953- బ్యాటరీతో నడిచే క్యాప్ ల్యాంపుల (టోపీ లైట్లు) ప్రవేశం
1974 - భూఉపరితల గనులకు శ్రీకారం
1976 - యంత్రాల ప్రవేశం
1983 - లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
1986 - బ్లాస్టింగ్ గ్యాలరీ విధానంతో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
1992, 1996 - ఖాయిలా పడ్డ పరిక్షిశమల జాబితాలోకి సింగరేణి
1994 - జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓసీపీ(ఉపరితల గని)-2 ఏర్పాటు
1998 - గుర్తింపు కార్మిక సంఘాల ఏర్పాటు
2002 - నష్టాలను అధిగమించి లాభాల బాట
2009 - అడ్రియాల్ మైన్ వద్ద లాంగ్‌వాల్ ఏర్పాటు
2010 - ఫిబ్రవరి 14 అదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200ల
మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శంకుస్థాపన


Take By: T News

Read more...

Thursday, December 22, 2011

T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

Hyderabad: With an aim to espouse the cause of industrialists from Telangana region, the Telangana Chambers of Commerce and Industry (TECCI) has been launched on Wednesday.

TRS MLA K T Rama Rao, who unveiled the new industry body, urged industrialists from Telangana to develop TECCI into an eminent industry body on the lines of the Confederation of Indian Industry (CII). M Venkateswarlu, Managing Director, RDF Power Gen Limited, has been elected president of the body. Y Jaihind Reddy, Managing Director, Jaihind Constructions Private Limited, is the vice-president, while D Ashok Kumar, Proprietor, Mahalaxmi Gas Agency, is the secretary.

The newly-formed industry body has also launched its website www.Tecci.rg which has information on the industrial sector in the region. In the objectives listed out on the website, TECCI stated that it would focus on small, medium and major Industries, besides power, agriculture, trade and government related issues. 

The body will soon organise a roundtable conference to review the prevailing situation and adopt measures to develop industrial sector in Telangana.

 Take By: The Hans India News

Read more...

తెలంగాణ పరిక్షిశమల్ని కాపాడుకుందాం - T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

 (TEECI Means - Telangana Chambers of Commerce and Industry)

సీమాంవూధుల దోపిడీని అరికడుదాం: వక్తల పిలుపు
తెలంగాణ యవనికపై ‘టెక్కి’ ఆవిర్భావం
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
తెలంగాణను విదర్భతో ముడిపెట్టొద్దు: పేర్వారం
తెలంగాణ ప్రజలు పాలేర్లుగా మారాల్సి వస్తోంది: విపకాశ్
టెక్కీ ఆవిర్భావం శుభపరిణామం: అల్లం నారాయణ

tred-talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 21 ():‘‘భారత్ హెవీ ఎలక్షికికల్స్ లిమిటెడ్‌లో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి (సీమాంధ్ర వ్యక్తి) తన పలుకుబడిని ఉపయోగించి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 3,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీంతో స్థానిక తెలంగాణ యువత తమ ఉపాధి అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది.’’

‘‘బూర్గుల రామకృష్ణారావు (తెలంగాణ వ్యక్తి) సమీప బంధువు ఒకరు పరిక్షిశమ స్థాపించేందుకు తన భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా, బ్యాంకు మొండిచేయి చూపింది. చివరకు విసుగెత్తిన ఆయన భూమిని ఓ సీమాంవూధుడికి విక్రయించాడు. తెలంగాణ వ్యక్తికి రుణం ఇచ్చేందుకు అంగీకరించని ఆ బ్యాంకు సీమాంధ్ర వ్యక్తికి అదే భూమిపై రెండు నెలల్లో రుణం మంజూరు చేసింది.’’

‘‘తెలంగాణకు చెందిన పారిక్షిశామికవేత్త ఒకరు విశాఖపట్నం సమీపంలో సిమెంట్ పరిక్షిశమ స్థాపనకు ప్రయత్నించి అనువైన స్థలం కోసం సంప్రదించగా ఏపీఐఐసీ తాను సేకరించిన ధరకంటే 10 రెట్లు అధికంగా ధరకు భూమిని కేటాయించింది. ఆ స్థలంలోనూ సిమెంట్ పరిక్షిశమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల పాటు సీమాంధ్ర నాయకులు, పారిక్షిశామిక వేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు మరో స్థలంలో ఆయన పరిక్షిశమ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.’’

... ఇవి తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టీఈసీసీఐ-టెక్కి) ఆవిర్భావ సమావేశంలో పలువురు వ్యక్తులు ఉదహరించిన సంఘటలు. సీమాంవూధుల పాలనలో తెలంగాణ పారిక్షిశామిక రంగం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, అణచివేతకు సంబంధించిన ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా రంగాల్లో దోపిడీకి గురైన తెలంగాణ సమాజం ఉత్తేజితమై దోపిడీదారులపై తిరుగుబావుటా ఎగురవేస్తున్న క్రమంలో తాజాగా తెలంగాణ పారిక్షిశామిక వేత్తల సైతం తమ పోరాటానికి అంకురార్పణ చేశారు. ఒకప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లిన తెలంగాణ పారిక్షిశామిక రంగం దశల వారీగా దెబ్బతినడం వెనుక ఉన్న సీమాంవూధుల కుట్రను ఎండగడుతూ, పునురుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది. 

తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య వేత్తలకు ప్రోత్సాహం అందించి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయంగా టెక్కీ ఆవిర్భవించింది. ఈ కార్యక్షికమం బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ సీహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. టెక్కి వెబ్‌సైట్‌ను పేర్వారం రాములు ఆవిష్కరించారు. పెన్నార్ ఇండవూస్టీస్8 చైర్మన్ జె.ఉపేందర్‌రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్షికమంలో టెక్కి అధ్యక్షుడు ఎం ఉపాధ్యక్షులు వై.జైహింద్ రెడ్డి, వేదకుమార్, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, విపకాశ్, ప్రముఖ రాజకీయ నాయకులు కమలాకర్, ప్రొ.రమేష్, ఇండవూస్టియలిస్ట్ బ్రహ్మయ్య, జె.బాపుడ్డి తదితరులు మాట్లాడారు.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ హనుమంతరావు అభివూపాయపడ్డారు. ఆర్థిక ప్రగతిని సాధించడం అనేది భారత ఆర్థిక ప్రణాళికలో కీలకాంశం అన్నారు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచీ అమలుచేస్తున్న ప్రణాళికల్లో నిర్ధేశించుకున్న లక్ష్యాలతో పోలిస్తే సాధించిన ప్రగతి తక్కువగానే ఉందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత అభివృద్ధిలో వేగం పుంజుకున్నప్పటికీ పేదరిక పెరిగారనారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు పారిక్షిశామికవేత్తలకు మంచి ఊపునిచ్చాయని పేర్కొన్నారు. 

జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్8గఢ్ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆయా ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అభివృద్ధి మాతృ రాష్ట్రాల(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధికంటే ఎక్కువుందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇంతకు ముందు రాష్ట్రాలు సైతం చిన్నవిగా మారాయని తెలిపారు. తద్వారా ఈ రాష్ట్రాల్లోనూ(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధి రేటు పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో బీహార్ సాధించిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మహరాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కారణంగానే విదర్భ, తెలంగాణకు పోలికుందని పలువురు భావిస్తారు, కానీ ‘విదర్భ నిరాదరణకు గురైతే తెలంగాణ దోపిడీకి గురైందని’ ప్రొ.జయశంకర్ ఒక చక్కని వివరణ ఇచ్చారని హనుమంతరావు గుర్తుచేశారు. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో 62 శాతం తెలంగాణ ప్రాంతంలో ఉండగా, వాటిలో 75శాతం సీమాంధ్ర వ్యక్తులకు చెందినవేనన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల్లోనూ తెలంగాణ వారికి 25శాతం కూడా దక్కలేదన్నారు.

రక్తం మరిగిపోతోంది: పేర్వారం
అనాదిగా తెలంగాణ అణచివేతకు గురికావడం ఒకెత్తయితే 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం పరిణామాలతో అంతకు మించిన అన్యాయం జరుగుతోందని రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్8 పేర్వారం రాములు అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాన మంత్రి తదితరులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే మాలాంటి రిటైర్డ్ ఉద్యోగులకూ రక్తం మరిగిపోతోంది’ అని ఘాటుగా స్పందించారు. ‘ఆంవూధవూపదేశ్ ఆవిర్భావానికి వ్యతిరేకంగా 1952లోనే (నేను రెండో తరగతిలో ఉన్నా) ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది..’ అని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక డిమాండ్లకు పోలిక లేదన్నారు. తెలంగాణను విదర్భతో ముడిపెట్టడం తగదని పేర్కొన్నారు. తెలంగాణలో పారిక్షిశామిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని, సీమాంవూధుల పెత్తనం మొదలయ్యాకే ఈ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

అవినీతిలో ఎందెందు వెతికినా సీమాంవూధులే: కేటీఆర్
దేశంలో జరిగిన దాదాపు అవినీతి కుంభకోణాల్లో సీమాంవూధుల పాత్ర ఉండటం వారి దోపిడీ విధానానికి నిదర్శనమని టీఆర్‌ఎస్8 ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్న నానుడిని వీరు నిజం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజాం షుగర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్8 రాజశేఖరడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి వైఎస్8 తాను అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరించి నిజాం షుగర్స్‌ను కోలుకోలేని స్థితికి వచ్చేలా చేశారని మండిపడ్డారు. తెలంగాణ భూములను కొల్లగొ చంద్రబాబు ప్రభుత్వం కిటీకీలు తెరిస్తే కాంగ్రెస్8 ఏకంగా తలుపులే తెరిచిందన్నారు.

అభివృద్ధికంటే దోపిడే అధికం: ప్రకాశ్
సీమాంవూధులు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్ధం అని ప్రముఖ తెలంగాణవాది విపకాశ్ అన్నారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉందని గుర్తుచేశారు. తమకు అనువైన ప్రాంతంగా భావించి తెలంగాణకు వచ్చిన సీమాంవూధులు అంచెలంచెలుగా ఇక్కడి వనరుల్ని దోచుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వారుపెట్టిన పెట్టుబడులకన్నా ప్రభుత్వం ద్వారా పొందిన రాయితీలు, ప్రయోజనమే అధికమన్నారు. చర్లపల్లి పారిక్షిశామికవాడలో ఉన్న సుమారు 500 కంపెనీల్లో 300 వరకు సీమాంవూధుల ఆధీనంలోనివే అయినప్పటికీ, ఆయా కంపెనీల పెట్టుబడులు మిగతా వాటితో పోలిస్తే 10శాతం కూడా లేవని చెప్పారు. కేవలం ఫార్మా రంగంలోనే సీమాంవూధులు అధికంగా పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. పరిక్షిశమల కోసం స్థలాల్ని కోల్పోయిన తెలంగాణ ప్రజలు సొంత భూముల్లో పాలేర్లుగా మారాల్సిన దుస్థితికి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విధ్వంసం నుంచి పునరుజ్జీవనం దిశగా: అల్లం
అడుగడుగునా విధ్వంసానికి గురైన తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య రంగాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ అభివూపాయపడ్డారు. సీమాంవూధులు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ సమాజాన్ని దోపిడీకి గురిచేశారన్నారు. తొలుత సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ దోపిడీ ఆరంభమైందని వివరించారు. ఒకప్పటి మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ పవర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఐమాక్స్ శిథిలాల కిందికి చేరిపోయిందన్నారు.

మీడియా హౌజ్‌లూ అదే దారిపట్టాయని చెప్పారు. విదర్భ వెనుకబడిన ప్రాంతం అయితే తెలంగాణ దోపిడీకి గురైన ప్రాంతం అని అన్నారు. సీమాంవూధుల విచ్చలవిడి దోపిడీతో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నష్టపోయిందని, నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి సంస్థపూన్నో ఖాయిలా పడ్డాయని పేర్కొన్నారు. ఐడీపీఎల్ మూతపడిన వెంటనే చౌటుప్పల్ పరిసరాల్లో సీమాంవూధులకు చెందిన సుమారు 40ఫార్మా కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ పారిక్షిశామిక రంగం ఆర్థిక స్వావలంభన సాధించి నిలదొక్కుకోవడంలో భాగంగా టెక్కీ ఆవిర్భావం తొలి అడుగని ఆయన అన్నారు.

Take By: T News

Read more...

Saturday, December 17, 2011

జైపాల్ దూరాశ!



jaipal-reddy-caricature talangana patrika telangana culture telangana politics telangana cinema-సొంత గడ్డపై కనిపించని రాజకీయ భవిష్యత్
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం

హైదరాబాద్, డిసెంబర్ 16 ():తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పదవుల వల విసురుతుంటే మరో వైపు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని మన నేతలు అందలమెక్కేందుకు అర్రులు చాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తుది అంకానికి చేరుకున్న దశలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు, హోదాల ఆశలు చూపించి వారిని చల్లార్చిన హైకమాండ్, తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి జైపాల్‌డ్డిపైనా పదవుల బాణం విసిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో జైపాల్‌ను మరో ఏడాదిలో ఖాళీకానున్న ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించనున్నట్లు ప్రచారం మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పుడు జైపాల్ పేరును తెరమీదికి తీసుకురావడం వెనుక అధిష్ఠానం మతలబు ఏమిటో స్పష్టమవుతోందని మేధావులు, తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తున్నామంటూ ప్రచారం సాగిస్తూనే ప్రత్యేక రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌లో కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని జైపాల్‌డ్డి కూడా పదవీ సోపానం ఎక్కే ప్రయత్నంలో ఉన్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో జైపాల్‌కు వచ్చిన బెర్త్ కూడా తెలంగాణ ప్రాంత కోటాలోనే వచ్చింది.

కేబినెట్ హోదాగల ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం 2004, 2009లో అవకాశం కల్పించింది. రాజకీయ అనుభవం, మంచి పార్లమెం అధిష్ఠానంతో దగ్గరి సంబంధాలు కలిగి విశ్వాస పాత్రుడిగా పేరు... వంటివి జైపాల్‌కు అర్హతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత నేతగానే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో గుర్తింపు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తీసుకురావడానికి తెలంగాణనే అర్హతగా, ప్రామాణికంగా అధిష్ఠానం గుర్తించినట్లు వినిపిస్తోంది. ఉప్పెనలా, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడిచినా, సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో సకలజనుల సమ్మె కొనసాగినా, పార్టీలకు అతీతంగా ప్రజావూపతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించినా కూడా కేంద్ర కేబినెట్‌లో ఉంటూ జైపాల్‌డ్డి ఎక్కడ కూడా, ఏనాడు కూడా తెలంగాణ విషయంలో స్పష్టంగా మాట్లాడక పోవడం, కేంద్ర మంత్రికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర విషయంలో డొంకతిరుగుడు వైఖరి ప్రదర్శిస్తు వచ్చినందుకే ప్రతిఫలంగా అధిష్ఠానం జైపాల్‌కు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలని, పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జైపాల్‌డ్డిపై గతంలో ఒత్తిడి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తామని కూడా వారు జైపాల్ వద్ద పేర్కొన్నారు.

ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న సమయంలో కూడా జైపాల్ హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉఁటూ మౌనం పాటించారు. తెలంగాణవాదం బలపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే భయం జైపాల్‌ను వెంటాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని జైపాల్ భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా ఆయన ఇప్పటికి నాలుగు చోట్ల తిరిగారు. రాజకీయ చివరి అంకంలో ఎన్నికల్లో ఓడిపోయి తెరమరుగు కావడం కంటె రాజకీయాల్లో రిటై్మంట్ కావడమే మంచిదన్న ఆలోచనతో జైపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వారు ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉందని జైపాల్ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేక పోయినా తెలంగాణ కోటాలో ఉపరాష్ట్ర పతి పదవిపై జైపాల్ కన్నేసినట్లు మరో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కనీసం మద్దతుగా మాట్లాడక పోగా తాను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదిని కాదని, జాతీయ వాదినని ప్రకటించుకుంటూ జైపాల్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి సమైక్యవాదుల సరసన జైపాల్ నిలిచారని టీ వాదులు నేటికి మండిపడుతుంటారు. సమైక్యవాదం వైపు మొగ్గుచూపుతూనే తెలంగాణ కోటాలో అందలమెక్కుతూ వచ్చిన జైపాల్‌కు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కూడా అదే ఖాతాలో వస్తుందేమోనని పార్టీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP