Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Urdu News. Show all posts
Showing posts with label Urdu News. Show all posts

Thursday, December 22, 2011

చీకటి ఖండంలో భారత్ కబ్ఝా!

africa-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 
- ఇది ఇండియన్ ఇంపీరియలిజం!
- 80 పైగా భారత కంపెనీల పాగా
- సౌదీ, సౌత్ కొరియా వంటి దేశాలూ ఉన్నాయి..
- భారీగా వ్యవసాయ భూముల ఆక్రమణ
- లక్షల హెక్టార్లు.. ఏళ్ల తరబడి లీజులు


ఆఫ్రికా! చాలా కాలం వరకూ ఇది ఓ చీకటి ఖండం! అంతుపట్టని రహస్యం! కాలం గడిచే కొద్దీ అందులోని అమూల్యమైన, అపారమైన ఖనిజ సంపద, వనరుల సంగతి జగతికి విదితమైంది! వెలుగుల తోవలో అడుగు పెట్టిన ఆఫ్రికా అక్కడే మరోమారు చీకటి ఊబిలో కూరుకుపోయింది! ఆఫ్రికా ఖండంలోని వనరులపై కన్నేసిన అనేక దేశాలు.. దాన్ని తమ దోపిడీకి వనరుగా మార్చుకున్నాయి. కొన్ని దేశాలు ప్రత్యక్షంగా వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోగా.. కొన్ని దేశాలు పరోక్షంగా ఆఫ్రికా దేశాల వనరులను దోచు కుంటున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒకప్పటి బ్రిటిష్‌వలస రాజ్యంగా ఉండి, వలస పాలన బాధలు అనుభవించిన భారత దేశం కూడా ఈ నయా వలస దోపిడీలో భాగస్వామి కావడమే!

సోమాలియాలో ఆకలికి అల్లాడుతున్న చిన్నారులను గుర్తు తెచ్చుకోండి! ఎముకలు తేలిన దేహం, లోపలికి పోయిన కళ్లు, బేల చూపులు! పెను ఆహార సంక్షోభానికి నిదర్శనాలు! వీరి ఆకలికి, వీరి పోషకాహార లేమికి కారణాలేంటి? తగినంత ఆహార ఉత్పత్తి లేకపోవడమా? ఉత్పత్తికి తగిన వనరులు లేకపోవడమా? కాదు. కానే కాదు. వీరితో ఆకలి కేకలు వేయిస్తున్నది దారిద్య్రం, అసమానతలే! కళ్ల ముందు ధాన్యం గరిసెలున్నా.. ఉత్పత్తి, పంపిణీలోని తారతమ్యాలే వారి పేగులను మలమల మాడిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది! వారూ వీరూ అనిలేదు. పెట్టుబడిదారీ సమాజం అమెరికా మొదలుకుని, సామ్యవాద దేశమైన చైనా వరకు.. పెట్టుబడిదారీ దేశాల దోపిడీ పదఘట్టనల కింద మార్కెట్‌లు కోల్పోయి నయా ఆర్థిక విధానాల మాయాజాల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న భారత్‌వంటి దేశాలు మొదలు.. చమురు సొమ్ముతో సకల విలాసాలు అనుభవిస్తున్న సౌదీ అరేబియా వరకు.. తిలా పాపం తలా పిడికెడు చందాన వ్యవహరిస్తున్నాయి. ఒక్క సూడాన్‌లోనే ఏడు లక్షల హెక్టార్లను దక్షిణ కొరియా లీజులకు తీసుకుంది. టాంజానియాలో సౌదీ అరేబియా ఐదు లక్షల హెక్టార్ల లీజులపై సంతకాలు చేసింది. 80కిపైగా భారతీయ కంపెనీలు 240 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇది ఆఫ్రికా అభివృద్ధికి సహకారమా? లేక భూకబ్జానా?

ఆఫ్రికాలో అపారమైన జల వనరులున్నాయి. అంతకు మించి అతి తక్కువ ఖరీదుకు సారవంతమైన వ్యవసాయ భూములు దొరుకుతాయి. భారత్‌లో అయ్యే ఖర్చులో సగమే ఇక్కడ అవుతుంది. ఇంకేం.. భారతదేశానికి చెందిన కంపెనీలు ఆఫ్రికాలో అడుగు పెట్టాయి. 2010 నాటికి వివిధ ఆఫ్రికా దేశాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు 80కిపైగా భారతీయ కంపెనీలు ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనెగల్, మోజాంబిక్, టాంజానియా, ఉగాండా వంటి దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ పంటల నిమిత్తం 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ మొత్తం ఉత్పత్తిని తిరిగి తమ దేశానికి లేదా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఉద్దేశించారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ అనే గ్రూపునకు చెందిన ఎస్‌ఎన్ పాండే ఏడాది క్రితం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఆవూఫికాలో వ్యవసాయ ఖర్చులు భారత్‌తో పోల్చితే దాదాపు సగం. ఇక్కడి పొలాల్లో పెద్దగా ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదు. కూలీలు కూడా చౌకకు దొరుకుతారు.

వ్యవసాయ దిగుబడి అత్యధికంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇక్కడ కనీస వేతనం రోజుకు 8 బిర్‌లు. (ఒక బిర్ మన కరెన్సీలో సుమారు మూడు రూపాయలు). దీనికి తోడు పలు ఆఫ్రికా దేశాలు భారతీయ వ్యవసాయ కంపెనీలు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా 99 ఏళ్ల లీజులు ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా కారు చౌక ధరలకే. భారతదేశంలోని పంజాబ్‌లోని దోవాబా ప్రాంతంలో ఎకరం పొలం లీజుకు (కౌలుకు) ఇస్తే కనీసం 40వేల రూపాయలు చెల్లించాలి. కానీ.. ఆఫ్రికా దేశాల్లో అదే ఎకరం భూమికి కేవలం 700 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే పంజాబ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకునే బదులు ఆఫ్రికాలో 60 ఎకరాలను కైవసం చేసుకోవచ్చన్నమాట.

132838-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తమకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతోనో, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించే సామర్థ్యం లేకపోవడంతోనో, లాలూచీలు పడో ఆయా ఆఫ్రికా దేశాలు తమ భూములను లీజుకు ఇచ్చేస్తున్నాయి. ఈ లీజులాటలో దారుణంగా నష్టపోతున్నది మాత్రం స్థానికులే. ఇథియోపియా వంటి దేశాల్లో సమర్థవంతమైన ప్రభుత్వాలు లేకపోవడం, ప్రజాస్వామ్యం లేకపోవడంతో భూ సేకరణ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిర్వాసితులయ్యే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వద్ద పెద్ద ఎత్తున పంటలు పండుతున్నా.. తిండికి నోచుకోక అలమటిస్తున్నారు.

పెల్లుబుకుతున్న నిరసన
అయితే ఇటీవలి కాలంలో విదేశీ భూ కబ్జాలపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా తమ పశువులకు మేత దొరకడం లేదని, నీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను పెద్ద ఎత్తున లీజులు పొందిన కంపెనీలు ఈ భూముల్లో విదేశీ పెట్టుబడుల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలులభిస్తాయని, వారి జీవన స్థితిగతులు మెరుగై, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతందని వాదిస్తున్నాయి. ఇథియోపియాలో మూడు లక్షలకుపైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. కానీ.. పూర్తి యంత్ర పరిజ్ఞానంపై ఆధారపడి జరిగే వ్యవసాయ పనుల్లో కేవలం 20వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయని అంచనా.

లీజు వ్యవహారాలను వ్యతిరేకించినందుకు అనేక మంది స్థానికులు హత్యలకు గురయ్యారని, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని ఇటీవల బీబీసీ పేర్కొనడం విశేషం. స్థానిక భూములను, నదీ జలాలను వెర్దాంత హార్వెస్ట్స్ బారి నుంచి కాపాడేందుకు పలు సంస్థలు ఇప్పటికే పోరాటాలు ప్రారంభించాయి. ఈ భూములను ఖాళీ చేయించి అక్కడ తేయాకు, సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం భూములను లీజులకు ఇస్తే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అక్కడి పోరాట సంస్థలు వాదిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారి మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ‘‘గంబెలాలో ప్రస్తుతం జరుగుతున్నది న్యూఢిల్లీలో లేదా ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్, బిస్‌మార్క్, నార్త్ డకోటా వంటి ప్రాంతాల్లో జరిగితే ఏమవుతుంది? ఇది అనూహ్యం. ఆ దేశాలు ఇటువంటి సంస్థలను అనుమతించని పక్షంలో ఇథియోపియాలో ఈ లీజులను ఎలా సమర్థిస్తారు?’’ అని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియా ప్రతినిధి ఒబాంగ్‌మెథో ప్రశ్నిస్తున్నారు.

భారీ స్థాయి వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి యాంత్రిక పద్ధతుల్లో జరిగే వ్యవసాయం పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అంటున్నారు. వీటికి పెద్ద ఎత్తున జల వనరులు వినియోగమవుతాయని, అది భూగర్భ నీటి మట్టాలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఫలితంగా భూమి, నీటికి మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లొసుగుల ఒప్పందాలు
Juba007-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం ఒక ఐదు భారత కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బయటపెట్టింది. అయితే.. ఈ ఒప్పందాలన్నీ పూర్తిగా లొసుగులతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీజులు పొందిన కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని నదులపై ఆనకట్టలు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. తమకు కావల్సినన్ని బోరుబావులు ఏర్పాటు చేసుకోవచ్చు. తమకు నచ్చిన పద్ధతిలో సాగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నీటిని వాడుకున్నందుకు చెల్లింపుల సంగతి, ఎంత నీటిని, ఎంతకాలం వాడుకోవాలి అన్న విషయాల్లో మాత్రం ఒప్పందాల్లో ఎక్కడా నిర్దిష్టంగా లేదని విమర్శలున్నాయి. కార్మికులకు వేతనాలు, వారి హక్కులు, వారి పని పరిస్థితులపై కూడా ఎక్కడా నిర్దిష్టమైన షరతులు ఒప్పందాల్లో లేకపోవడం విశేషం. పైగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునే తీరు స్థానికులకు పరిచయం చేయాలన్న నిబంధనలు కూడా లేవు. దీనితో విదేశీ కంపెనీలు ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఇథియోపియాకు ఒరిగే లాభమేంటని విదేశీ కంపెనీలను వ్యతిరేకిస్తున్న సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

4.5 కోట్ల హెక్టార్లు లీజులకు...
చైనా, సౌదీ అరేబియా, కువైట్, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్‌తో పాటు తాను సైతం అంటూ భారత దేశానికి చెందిన కంపెనీలు అనేక ఆఫ్రికా ఖండంలో వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నాయి. పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేయడమే కాకుండా.. స్థానికుల కడుపు మాడ్చి, ఆహారాన్ని బయటి దేశాలకు ఎగుమతులు చేసుకుని సొమ్ములు మూటగట్టుకుంటున్నాయి. దీనికి మూలాలు 2008 నుంచే ఉన్నాయి. 2008, 2009 సంవత్సరాల మధ్య దాదాపు 4.50 కోట్ల హెక్టార్ల భారీ వ్యవసాయ క్షేత్రాల ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు తాజా నివేదిక పేర్కొన్నది.

సహకారమే : చైనా ఆఫ్రికా దేశాల్లో భూ కబ్జాలకు తాము పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. ఆఫ్రికా వ్యవసాయ రంగ అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హోంగ్ లీ చెప్పారు. ఆఫ్రికా స్థానికులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా వారి భూముల్లో వారే సమర్థవంతంగా వ్యవసాయం చేసుకునేందుకు దోహదం చేస్తున్నామని తెలిపారు. తమ చర్యలకు ఆఫ్రికా దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గమనించాలని లీ కోరారు. ‘‘ఆవూఫికాలో నయా సామ్రాజ్యవాదం ఉన్న సంగతి నిజమే కానీ.. అది చైనా నుంచి కాదు’’ అని ఆయన చెప్పారు.

విదేశాల్లో వెంచర్లు ప్రారంభించే భారతీయ కంపెనీలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ధోరణులను కొనసాగిస్తాయన్న భావన ఉంది. కానీ.. పేద దేశాలపై కొన్ని కంపెనీలు ఎలా తమ సామ్రాజ్యవాదకోరలను సాచి, పెద్ద ఎత్తున భూములు కబ్జాచేస్తున్నాయన్నది, ఆయాపేద దేశాల్లో స్థానికులకు చేస్తున్నదేంటన్నది పెద్దగా బయటికి వచ్చింది లేదు. అయితే రిక్ రాడెన్ అనే పరిశోధకుడు దీనిపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న వ్యవసాయ భూముల విషయంలో భారత పాత్ర ఏంటన్నదానిపై ఒక పత్రం విడుదల చేశారు. తమపై దారుణాలకు పాల్పడుతున్నాయంటూ పశ్చిమ దేశాలపై భారత్ పలుఅంశాల్లో విమర్శిస్తూ ఉంటుంది. అయితే..అదే స్థాయిలో ఆయా పేద దేశాలపై భారతకంపెనీల దోపిడీ కొనసాగుతుండటమే ఇక్కడ ఆశ్చర్యం కల్గించే అంశం. దీనికి ప్రభుత్వ అండదండలు ఉండటం మరో కీలకాంశం. ఇక్కడ
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భారత ప్రభుత్వం రుణాలు కూడా మంజూరు చేస్తోంది. దీన్ని భారత ప్రభుత్వం కేవలం వ్యాపారంగానే చూస్తోంది.

కరుటూరి సామ్రాజ్యం
ఇథియోపియాలోని గంబెలా ప్రాంతంలో కరుటూరి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే భారతీయ కంపెనీ భారీ లీజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ జికావో, ఇటాంగ్ జిల్లాల్లో లక్ష హెక్టార్ల భూమిని కౌలుకు తీసుకుంది. పామాయిల్ తోటలు, తృణధాన్యాలు పండించేందుకు ఈ భూమిని పొందింది. మరో రెండు లక్షల హెక్టార్లపైనా కన్నేసింది. రుచిసోయా ఇండవూస్టీస్ అనే కంపెనీ గంబెలా, బెనిషంగుల్ గుమెజ్ రాష్ట్రాల్లో లక్షన్నర హెక్టార్ల భూమిని పాతికేళ్లకు లీజుకు తీసుకుంది. ఇలాంటివి ఆఫ్రికా దేశాల్లో కోకొల్లలు. తమ దేశంలోని బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని ఇథియోపియా ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. నిపుణులు మాత్రం ఇథియోపియాలో ఆ మాటకొస్తే మొత్తం ఆఫ్రికాలో బంజరు భూములు అనే మాటే లేదని తేల్చి చెబుతున్నారు.

మాది కేవలం వ్యాపారమే
తమపై వస్తున్న విమర్శలను మాత్రం ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం చేస్తున్న భారతీయ కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. తాము నయా సామ్రాజ్యవాదులం కాదని, కేవలం ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నామని చెబుతున్నాయి. తాము ఇక్కడి కార్మికులకు కనీసం వేతనం 8 బిర్‌లు ఇస్తున్నామని కరుటూరి గ్లోబల్‌వివరణ ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఒక బిర్‌కు 3 రూపాయలు. అంటే రోజుకు ఇథియోపియన్ కార్మికులకు దక్కుతున్న వేతనం కేవలం 24 రూపాయలు. ఇథియోపియా చట్టాలకు లోబడే పని చేస్తున్నామని, పర్యావరణ చట్టాలను అనుసరిస్తున్నామని పేర్కొంటోంది. తాము ఇప్పటికే 20వేల మందికి ఉపాధి కల్పించనున్నామని ఒక వార్తా పత్రికతో కరుటూరి గ్లోబల్ వ్యవస్థాపకుడు సాయి రామకృష్ణ చెప్పారు. ఆస్పత్రి, సినిమాహాల్, పాఠశాల, డేకేర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటివేమీ ఏర్పడుతున్నట్లు సంకేతాలు లేవని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియాకు చెందిన ఒబాంగ్ మెథో అంటున్నారు.

ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లు మన దేశంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో విదేశీ కార్పొరేట్‌లు చేస్తున్నట్లే ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉభయ దేశాల్లోని ప్రగతిశీలవాదులు ఐక్యంగా ఉద్యమించాలని మెథో అభివూపాయపడ్డారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌లతో స్థానికుల కడుపు నిండుతుందనుకుంటే పొరపా ఆయన అన్నారు. ఈ ఒప్పందాలు అవినీతి రాజకీయ నాయకులు, విదేశీ ఇన్వెస్టర్ల జేబుల్లోకి డాలర్లు నింపడం తప్ప మరోటి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందాల్లో చాలా వాటిలో పాదర్శకత లేదని ఆయన విమర్శించారు.
 
Take By: T News : http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=4&ContentId=55067

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు

-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు



DSC_8486-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.

సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.

ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.

తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .

తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.

తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం

Telangana History 

Read Part - 1 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

Read Part - 3 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html


Take By: T News .

Read more...

Sunday, December 18, 2011

'Makkah becoming one of world’s most modern cities'

Makkah, December 18: Makkah is being transformed into one of the world’s most modern cities as a result of the many multi-billion riyal projects underway, said Dr. Osama Al-Bar, Mayor of Makkah.


Al-Bar said that a number of projects are close to completion, including the additions to the Grand Mosque and two tunnels for pedestrians from Al-Hujun to the Grand Mosque.


The Jabal Omar Project is expected to be completed in the near future and would provide accommodation for pilgrims close to the Grand Mosque.

Many pilgrims have to rent accommodation far away from the Grand Mosque at present, making it difficult for them to attend the five daily prayers, said Al-Bar. Other mega projects underway are the SR23 billion Makkah metro that will provide public train transport for the entire city.


There are also extensions being made to Ring Roads two, three and four, costing SR200 million. A total of SR800 million is being spent on building 4,000 houses for citizens in the Umm Al-Jood area.


In addition, SR100 billion will be spent on upgrading various residential neighborhoods. A total of SR12 billion of this amount will come from the private sector.


The Bawwaba mega project, west of Makkah, will see 34 districts set up over an area of 80 million square meters. Tenders will be issued for this project.


Projects already completed include the two new floors of the Masa’a – where pilgrims perform the ritual of moving between the mounts of Al-Safa and Al-Marwa. In addition, the train service for pilgrims at the Holy Sites has been operational for the past two years, said Al-Bar.

Take By: Siasat News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP