Saturday, October 20, 2012
Cameraman Ganga tho Rambabu (CGR) film stopped in Telangana
The screening of Pawan Kalyan starrer ‘Cameraman Ganga tho Rambabu’ was stopped in many theatres across Telangana on the second day of its release on Friday following protests by Telangana supporters against objectionable scenes which they claimed hurt their sentiments.
తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది
తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్రాజు
- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’
తెలంగాణ
ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్
గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు,
సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన
సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో
థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్లో
పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను,
ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు నివాసంపైనా గుర్తు
తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర
దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్
నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో
దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు అతికష్టంమీద దిగి వచ్చారు.
సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా
నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను
తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను
శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం
చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం
అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే
వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి
పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర
ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే
తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు
ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల
ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని
ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు
చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ
తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్ఎస్
అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల
అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని
అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి
నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్
చర్చించినట్లు సమాచారం.
పూరీ సారీ
‘కెమెరామెన్
గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో
దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా
ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు.
అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ
మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు
ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ
నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం
తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్రాజుతో చర్చించి తొలగించామని
చెప్పారు. దిల్రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు,
నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు
తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా
అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను
అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా
దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ..
రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ
సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం
మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం
బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట
వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి
చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.
Sunday, October 14, 2012
Make Money Online With Facebook? How
Make Money Online With Facebook? How
clikc this link and Join free
Start earn money
Tuesday, September 18, 2012
No Telangana resolution in Assembly: Kiran
Read more...
కదిలింది తెలంగాణ
21న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు
- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్తో ఫోన్లో సంప్రతింపులు
()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను
కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద
ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్ఎస్
అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో
తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు
కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం
లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన
వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు
ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన
నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు
వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర
ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ
పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని
తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని
నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం
గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు
భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్కుమార్
షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి
అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్కమిటీ సమావేశాలకు
రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ
తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్కమిటీ
చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.
ఈ సమావేశం
సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్లు అధినేవూతికి తమ అభివూపాయాలను
నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ
అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి
కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో
తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం.
కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో
సీరియస్గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
హైదరాబాద్లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర
హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు
సమాచారం. ఆదివారం కరీంనగర్లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం
వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు
సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్కమిటీ సమావేశం
ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల
విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి,
టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి,
బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని
ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు
చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
అదే
సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో
సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన
మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ
దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర
ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె
దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే
తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని
చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష
సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే
విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి
సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం
తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం
నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ
జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న
భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం
జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్
మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం
చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి?
అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన
రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన
నాకు మంచి మిత్రుడు.
ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం
వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అనేది
కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని
చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా
విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్ఎస్ విలీనం విషయం 2014
ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని
అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా
ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు
20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును..
కేసీఆర్ కలిశారు.
కేసీఆర్తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు
చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే
చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై
త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్ను నిరోధించలేమని ఆయన
వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి
హాజరవడం విశేషం.
నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత
రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి
సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి
ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్
నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే
వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను
అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం
ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం
నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని
ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి
తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్తో రవి మరోవిడత సంప్రతింపులు
జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల
సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్ప ప్రధాని మన్మోహన్సింగ్కు వివరించారు.
ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి,
విషయాలు వివరించినట్లు సమాచారం.
అనంతరం కేసీఆర్ను కలిసేందుకు
వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన..
ఫోన్లోనే కేసీఆర్ను సంప్రతించారు. కోర్కమిటీ భేటీ తర్వాత మీడియా
వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి
ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్తో రవి ఫోన్లోనే
సంప్రతిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ
గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త
ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ
నాయకుడున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద
వ్యాఖ్యానించారు.
‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66
ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్కు ఆంతరంగికుడైన ఆ నేత
చెప్పడం గమనార్హం
Take BY: T News
Monday, September 17, 2012
Earn free mobile recharge by sending SMS ( Read & Think)
The messages are send at the lightning fast speed without any
advertisement attached to it. The other ways to earn through ULTOO is by
referring a friend you get payed Rs 1 for every friend referral.
Sign Up
Advantages of using ultoo.com- Get 2 paisa for every message you send.
- Get 1 Rs. for every friend you invite.
- Get 2 Rs. for creating a new account.
- Get free recharge for your mobile of a minimum 10 Rs. Balance.
- Easily manageable:
you can save your contacts easily and without any delay.
your message will be sent in just no time across INDIA. - Its highly secured and spam free.
- You need to have a minimum of 10 Rs balance to redeem your first recharge.
- You cannot send multiple messages and fool them by sending them the same message to your contacts.
- You need to send minimum 500 messages to earn 10 Rs and thus it will take nearly 2 hours continuously to earn it.
- Again the users sometimes gets irritated for the number of advertisements used on
- ultoo.com/login.php?refererCode=1278620E&flag=hide
@ Voice2telangana.blogspot.com
Read more...
‘Suthi Velu’ dead
స్వేచ్ఛకోసం ..నెత్తురోడిన మెతుకు సీమ
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
మెదక్, (): 1947 ఆగస్టు 15న దేశం మొత్తం మీద ఓ వైపు సంబురాలు జరుగుతుంటే మరోవైపు ఆంధ్రవూపదేశ్లోని తెలంగాణ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఫర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రజలు రజాకార్ల వ్యతిరేక పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇండియన్ యూనియన్లో విలీనమవ్వడానికి నిజాం నిరాకరించాడు. తన ఆధీనంలోని రాజ్యంలో 1947 ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదని నిషేధాజ్ఞలు విధించాడు. 1946 మే 10, 11వ తేదీల్లో సంగాడ్డి మండలం కంది గ్రామంలో జరిగిన 13వ ఆంధ్రమహాసభలతో ఉత్తేజితులైన ప్రజలు జిల్లావ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. గ్రామాల్లో పండించిన పంటలు, ఆస్తులు దోచుకుంటున్న రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామ గ్రామాన యువకులు, ఆర్యసమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. 1947 జూన్ 16, 17, 18వ తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ సమావేశాలకు జిల్లా నుంచి తేర్పోల్కు చెందిన జె.రామిడ్డి తదితరుల నాయకత్వంలో పలువురు హాజరయ్యారు. ఊరూరా జెండా వందనాలు చేయాలని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్వాదులు జిల్లాలోని కల్పగూర్, అల్లాదుర్గం, శంకరంపేటల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే రజాకార్ల దురాగతాలు పెచ్చుమీరడంతో ఆవేదన చెందిన నాందెడ్ జిల్లా తహసీల్దార్ ఫరీద్మీర్జా 1947 జూలై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేయడం ఉద్యమకారులకు మరింత బలాన్నిచ్చింది. 1947 ఆగస్టు 11న జోగిపేటలో బస్వ మాణయ్య అనే నాయకుడి ఇల్లు సోదా చేసి ఆయనను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆగ్రహం చెంది పోలీస్స్టేషన్పై దాడికి యత్నించగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు ఉద్యమకారులు మెదక్ను ఎంచుకున్నారు.
మెదక్లో తూటాలకు ఎదురొడ్డి పతాకావిష్కరణ
1947 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, తూటాలకు ఎదురొడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు మెదక్ పట్టణాన్ని ఎంచుకున్నారు. మెదక్ నివాసి గడియారం హన్మంతరావు నివాసంలో ఈ విషయమై రహస్యంగా సమావేశం నిర్వహించి శంకర్రావు తోటలో జెండా వందనానికి రంగం సిద్ధం చేశారు. 1947 ఆగస్టు 15న జెండా ఆవిష్కరించిన వారిని కాల్చి చంపుతామని ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు హెచ్చరికలు జారీ చేశారు. రజాకార్ల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు మెదక్లో జెండా వందనానికి హాజరుకాగా, కూచన్పల్లికి చెందిన రామాగౌడ్ పతాకావిష్కరణ చేశారు. 1947 సెప్టెంబర్ 2న సంగాడ్డిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు నిర్ణయించారు. మహంకాళి నారాయణ, వెంకయ్య, శంకర్ల నాయకత్వంలో సెప్టెంబర్ 2న తెల్లారేసరికి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
సజీవ దహనాలు
1947 సెప్టెంబర్ 4న కోడూర్ గ్రామ పటేల్ రంగాడ్డి రజాకార్ల దురాగతానికి బలవ్వగా, ఖాదిరాబాద్లో ఉద్యమకారుడు దుగ్గిశెట్టి విశ్వనాథం తండ్రిని రజాకార్లు సజీవ దహనం చేశారు. రైతు సంగప్ప అనే వ్యాపారిని 1947 అక్టోబర్ 24వ తేదీన రజాకార్లు సజీవ దహనం చేసి చంపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పటాన్చెరు మండటం జానకంపేట వాసులు కంది శ్రీనివాస్రావు నాయకత్వంలో బాణాలతో పోరాడారు. కంది కిషన్రావు, శ్రీనివాస్రావు, మచ్చ వెంక గుప్తల ఆధ్వర్యంలో పటాన్చెరు, పరిసర గ్రామాల్లో ఉద్యమకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించి పటాన్చెరు మండలం పటాన్చెరు, పాటి ఘణపూర్, కిష్టాడ్డిపేట గ్రామాలకు చెందిన వెంకటరత్నం, మల్లయ్యలను అరెస్ట్ చేసి సికింవూదాబాద్ జైల్లో నిర్బంధించారు.
దగ్ధమైన సదాశివపేట
1947 అక్టోబర్ 24వ తేదీ సదాశివపేటలో చరివూతలో మరువలేనిది. ఆ రోజు ఒకవైపు దసరా పండగ సంబురాలను ప్రజలు జరుపుకుంటుండగా..అజాంఖాన్, శంశోద్దీన్ల నాయకత్వంలో రజాకార్లు సదాశివపేటపై దాడి చేసి మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను దగ్ధం చేశారు. కిరోసిన్ దుకాణంతో పాటు మొదలుపెట్టిన ఈ దహనకాండకు తన దుకాణానికి తోరణం కడుతున్న సంగప్ప అనే వ్యాపారిని అదే దుకాణంలో వేసి సజీవ దహనం చేశారు.
ప్రేరణనిచ్చిన కలం యోధుడు మాణిక్యరావు
సురవరం ప్రతాప్డ్డి ప్రారంభించిన గోల్కొండ పత్రికలో పాత్రికేయుడిగా పనిచేసిన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. ఫిరోజ్ మీర్జా, బాకర్ అలీమీర్జా, సిరాజుల్హాసన్ వంటి ప్రగతి కాముక ముస్లిం మేధావుల మాటలను పెడచెవిన పెట్టిన మత ఛాందసవాద, ఫాసిస్టు భావజాల రజాకార్ల మాటలు విని ప్రజలపై విపరీతమైన దురాగతాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ నిజాంపై హైదరాబాద్ స్టేట్ ప్రజల పిలుపు మేరకు ఇండియన్ యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరిట 1948 సెప్టెంబర్ 13న నల్దురుపై దాడి చేసి వశపర్చుకున్నాయి. ఆ తర్వాత వరుసగా భారత సైన్యాలు పురోగమించడంతో నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారు. దీంతో నిజాం రాజ్యం భారత యూనియన్లో విలీనమైంది. రాచరిక పాలన అంతమైంది.
సెప్టెంబర్ 17 తెలంగాణం
హైదరాబాద్,
సెప్టెంబర్ 16 ):
1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు
తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో
మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే
పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ
స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో
దోబూచులాడాయి..!
బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం
నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని
గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..!
దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న
తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు
జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!
దేశానికి
స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు
పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు
కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ
తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం
కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను
అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన
తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది.
నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు
జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు
ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం
మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన
రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన
దినమా, విద్రోహ దినమా..
ఇదీ చరిత్ర...
బ్రిటిష్
పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్
యూనియన్లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు
రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా
చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో
తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు
తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్
కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం
ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం
చేయాల్సిందేనని నినదించారు.
ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట
కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు
ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే
ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట
సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ
ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు
ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు
అమరులయ్యారు.
గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల
ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా
విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం
మంత్రి సర్దార్ వల్లభాయ్ప హైదరాబాద్ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు
వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ
సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి
వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి
పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా
హైదరాబాద్ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్కు ఏడాదిపాటు హైదరాబాద్ను
పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్ప ఆశచూపించారు.
ఆ క్రమంలో
జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948
సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను
ఇండియన్ యూనియన్లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి
సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల
రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ
ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ
ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో
నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు
పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు
కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్లో
1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
‘సమైక్య’ కుట్ర..:నిజాం
నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంవూధలో కలిపేశారు.
దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట
తెలంగాణను అణచివేస్తూనే ఉంది.
Take By: T News
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)