Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, January 17, 2012

గిలానీకి ఊరట



raza_gilani telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema-ప్రజాస్వామ్యానికే పాకిస్థాన్ పార్లమెంట్ ఓటు
-విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధాని.. మూడింట రెండొంతుల మెజారిటీ
-19న సుప్రీంకోర్టుకు హాజరవుతా: గిలానీ ప్రకటన
-రాజీనామా చేయరన్న పీపీపీ నేత
-నష్టనివారణ చర్యల్లో అధికార పక్షం
-కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటన
-‘ధిక్కారం’ కేసులో 19న హాజరవ్వాలని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
-ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
-జర్దారీని కలిసిన గిలానీ
-స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్


మెమోగేట్ కుంభకోణం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సైన్యం ఓవైపు.. అవినీతి కేసులను తిరిగి తెరిచే విషయమై నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు మరోవైపు.. ప్రజలను గాలికొదిలేసి, నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలు ఇంకోవైపు.. ముప్పేట దాడిలా చుట్టుముట్టిన సమస్యలతో, నిత్యం మనుగడ ప్రశ్నార్థకమైన పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య అనుకూల తీర్మానాన్ని పార్లమెంట్ దిగువ సభ సోమవారం రాత్రి మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించింది. దీంతో యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వారం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు జారీచేయడంతో ఆయన ఇక పదవి నుంచి దిగిపోవడం ఖాయమనిపించింది. కానీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజని అభివర్ణించారు. పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాస్వామ్యమే అన్నింటికన్నా గొప్పదని అన్నారు. సర్వాధికారాలు గల పార్లమెంట్‌కే అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. మిలిటరీ, న్యాయవ్యవస్థలతో తమకు విభేదాలున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతానని, కోర్టు ధిక్కారం కేసులో బేషరతు క్షమాపణ చెబుతానని అన్నారు.


supreme-court_PK telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇస్లామాబాద్, జనవరి 16:రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోపాటు మరో ఎనిమిది వేల మందిపై అవినీతి ఆరోపణల కేసులను తిరిగి తెరవాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదో ఈ నెల 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను జస్టిస్8 నజీర్ ఉల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. తమ ఆదేశాలను పాటించాలంటూ సుప్రీంకోర్టు గిలానీకి పలుమార్లు గుర్తుచేసినా ఆయన కావాలనే పెడచెవిన పెట్టారని, అందువల్ల తనపై కోర్టు ధిక్కార విచారణను ఎందుకు చేపట్టకూడదో ఆయన చెప్పాలని పేర్కొంది.

ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
అవినీతి కేసులను తిరిగి తెరవాలంటూ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని అటార్నీ జనరల్(ఏజీ) అన్వర్‌ఉల్‌హక్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తమకు ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను దేశ అధ్యక్షుడికి, ప్రధానికి, ఇతర అధికారులకు తెలిపానని, వారి నుంచి తనకు ఎలాంటి స్పందనలూ రాలేదని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తోందని ఏజీ.. కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముల్క్.. ఏజీపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలపటం, వారి స్పందనలను కోర్టుకు చెప్పటం మీ బాధ్యత కాదా?, ఇందులో మీరు కొత్తగా చేస్తున్నదేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

ఏదేమైనా కేసులను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ ఆదేశాలు కావాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏజీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే ఈ సమయంలో అలాంటిదేమీ చేయొద్దని ధర్మాసనం ఏజీకి సూచించింది. అనంతరం గిలానీకి నోటుసు జారీ చేసింది. ‘కోర్టు ఆదేశాలను గిలానీ అమలుచేయనందునే ఆయనకు ఈ నోటీసు జారీచేశాం’ అని ముల్క్ విలేకర్లకు చెప్పారు. మెమోగేట్ కుంభకోణం విషయమై ఇప్పటికే సైన్యంతో ముఖాముఖి తలపడుతూ అస్థిత్వ ప్రమాదం ఎదుర్కొంటున్న పాక్ సర్కారు పరిస్థితిని సుప్రీంకోర్టు తీర్పు మరింత దిగజార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా పాక్ ప్రధానికి కోర్టు ధిక్కార నోటీసులు రావడం ఇది రెండోసారి. 1997 నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కూడా ఈ తాఖీదులు అందాయి.

జర్దారీతో గిలానీ భేటీ
సుప్రీంకోర్టు నోటీసు, పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ప్రధాని గిలానీ.. అధ్యక్షుడు జర్దారీ, అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అగ్రనేతలతో సోమవారం భేటీ అయ్యారు. కోర్టు నోటీసు జారీచేసిన కొద్దిసేపటికే ఆయన జర్దారీని కలిశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనతో చర్చించారు. అనంతరం పీపీపీ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జర్దారీ కూడా హాజరయ్యారు. కోర్టు నోటీసుపైన, సాయంత్రం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైన ఈ భేటీలో చర్చించారు. సైన్యంతో జగడం, కోర్టు నోటీసుల వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని నివారించేందుకు గిలానీ చేత రాజీనామా చేయించాలని పీపీపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రాజీనామా చేస్తానన్న గిలానీ!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని గిలానీ అన్నట్లు వార్తలొచ్చాయి. తన రాజీనామా ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను సుస్థిర పరుస్తుందంటే పదని నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు ఆర్మీ న్యూస్8 చానెల్ తెలిపింది. గిలానీ దిగిపోతే కొత్త ప్రధానిగా పీపీపీ నేత ఖమర్ జమాన్ ఖైరా, ఆధ్యాత్మిక వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌షా, కీలక భాగస్వామ్య పక్షం(పీఎంఎల్-క్యూ) నేత పర్వేజ్‌ఇలాహీల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఈ మీడియో పేర్కొంది. కానీ ఆ వార్తలను అవామీ నేషనల్ పార్టీ చీఫ్ ఖండించారు.

ప్రధానితోపాటు కోర్టుకు వెళ్లనున్న పీపీపీ నేతలు
పీపీపీ నేతలు, భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ నెల 19న ప్రధాని గిలానీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి మౌలాబుక్స్ చందోలియా తెలిపారు. గిలానీ ప్రభుత్వం తన పూర్తికాలం అధికారంలో ఉంటుందని చెప్పారు. తమపై జరుగుతున్న ఈ కుట్రలల్నీ భగ్నమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కోర్టు నోటీసును స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
ప్రధాని గిలానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీచేయటాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. యావద్దేశం కూడా న్యాయస్థానం ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. ‘సామాన్యుల సాధకబాధకాలను తీర్చాల్సిన పాలకులు నేరస్తులను కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఈ మేరకు న్యాయవ్యవస్థను కూడా భష్ఠుపట్టించాలని చూస్తున్నారు. జర్దారీని రక్షించేందుకు వారు ఎంత మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను మోహరించినా ప్రజలంతా దేశ అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకంతో ఉన్నారు’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

సమాచారం ఇచ్చేందుకు బ్లాక్‌బెర్రీ నో
మెమోగేట్ కుంభకోణానికి సంబంధించి పాక్-అమెరికా వ్యాపారి ఇజాజ్, అమెరికాలో అప్పటి పాకిస్తాన్ రాయబారి హుస్సేన్ హక్కానీలు తమ నెట్‌వర్క్ ద్వారా ఇచ్చిపుచ్చుకున్న సమాచారాన్ని వెల్లడించేందుకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) నిరాకరించింది. వినియోగదారుల అనుమతి లేకుండా ఈ వివరాలను తాము బయటపెట్టలేమని తేల్చిచెప్పింది. ఈ కేసును విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ విషయాన్ని ఏజీ తెలిపారు. హక్కానీ ఉపయోగించిన రెండు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు అమెరికాలోని అతని కార్యాలయంలోగానీ నివాసంలోగానీ దొరకలేదని కూడా చెప్పారు.

ఏమిటీ మెమోగేట్?
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం పాక్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు జర్దారీ భయపడ్డారు. ఈ కుట్రను నిలువరించేందుకు అమెరికా సాయం కోరారు. ఈ మేరకు సంతకంలేని ఓ మెమో పంపారు. జర్దారీ తరఫున హక్కానీ రాసిన ఆ లేఖను ఆయన ఆదేశాల మేరకే తాను అమెరికాకు అందజేశానని పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్‌ఇజాజ్ బహిరంగంగా చెప్పారు. ఇది వివాదాస్పదమవడంతో హక్కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

‘మెమో’ దర్యాప్తునకు ఇజాజ్ డుమ్మా
మెమోగేట్ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇజాజ్ ఈ కేసుపై సోమవారం జరిగిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తునకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిషన్ ముందుకు భద్రతా కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ దాక తనకు గడువు ఇవ్వాలని కోరారు. కమిషన్ మూడోసారి సోమవారం భేటీ అయిన కొద్దిసేపటికే ఇజాజ్ తరఫు న్యాయవాది అక్రమ్‌షేఖ్ ఈ విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. కుంభకోణంలో.. ఇజాజ్, హక్కానీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న సమాచారాలను వెల్లడించేందుకు రిమ్ నిరాకరించిన నేపథ్యంలో ఇజాజ్ గైర్హాజరీ ప్రధాన్యం సంతరించుకుంది.

ఇజాజ్, హక్కానీ, పాషాలకు సమన్లు
జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తునకు గైర్హాజరైన ఇజాజ్‌కు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 26న జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. మీరు కూడా 23వ తేదీన హాజరై వాంగ్మూలాలు ఇవ్వాలని హక్కానీ, ఐఎస్8ఐ చీఫ్ అహ్మద్‌షుజాపాషాలకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు ఇచ్చింది.

‘ముషారఫ్ తల’కు నూటొక్క మిలియన్లు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ను హతమార్చిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని బలోచిస్తాన్ జాతీయ నేత అక్బర్‌బుగ్తి మనవడు షాజైన్‌బుగ్తి ప్రకటించారు. నగదు బహుమతితోపాటు వంద మిలియన్ల విలువైన బంగ్లాను కూడా ఇస్తామని విలేకర్లకు ఆదివారం చెప్పారు. 2006లో ముషారఫ్ ఆదేశాలతో బలోచిస్తాన్‌లోని కుహ్లు జిల్లాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్‌లో అక్బర్‌బుగ్తి మృతిచెందారు?

ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు
-‘ఎన్నార్వో’ తప్పు చేసింది ఎవరు: గిలానీ

ఇస్లామాబాద్, జనవరి 16: పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాని గిలానీ మాట్లాడుతూ సైన్యంగానీ న్యాయస్థానాలుగానీ వ్యవస్థను గాడితప్పించేలా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మెమోగేట్ కుంభకోణం, అవినీతి కేసుల విషయంలో సైన్యం, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో వ్యవహరించిన తీరును గిలానీ ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కోర్టులపై మాకు పూర్తివిశ్వాసం ఉంది. అందుకే ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతాను. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై ఓటు విషయంలో మేము ఏ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోలేదు. జర్దారీకి రాజ్యాంగం రక్షణకవచంలా ఉంది. సర్కారును నిందించేవారు.. అవినీతి కేసుల నుంచి నిందితులను కాపాడేలా జాతీయ సయోధ్య ఉత్తర్వులు (ఎన్‌ఆర్‌ఓ) రూపొందించినవారిపై ఎలాంటి చర్యలూ కోరకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని గిలానీ.. ముషారఫ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎన్‌ఆర్‌ఓను ఎవరు తెచ్చారు. ఆ తప్పు మేం చేయలేదు. ఆ పొరపాటు చేసినవారు ఇప్పుడు దేశం బయటున్నారు. మళ్లీ ఇప్పుడు దేశంలోకి రావాలనుకుంటున్నారు’’ అని పాక్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్న ముషారఫ్ ప్రయత్నాలను గిలానీ ఎండగట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని ప్రపంచానికి చాటేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

Take By: T News

Read more...

తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట



CMpostlist telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema -నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు

ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.

నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.

పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.

CMpostlist_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.

సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.

నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.

మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.

Take By : T News

Read more...

Sunday, January 15, 2012

Man throws ink at Ramdev after Batla House comment

Angry over Baba Ramdev's remark that the 2008 Batla House shootout was not fake, a man threw black ink on the face of the yoga guru during his press conference here Saturday, police said.

The attacker, Kamran Siddiqui, was detained by the police after he was caught and roughed up by Ramdev's supporters within the club premises.

"When Baba said that Batla House encounter was not fake, Kamran threw ink on him. He lives in south Delhi's Okhla area and supposedly runs a non-government organisation Real Cause," said a senior Delhi Police official.

In the Sep 19, 2008, Batla House shootout in Delhi, two alleged Indian Mujahideen members and one police officer were killed in public view. 

Certain local groups and some political parties, however, alleged it was a staged shootout.

Ramdev was holding a press conference on black money and corruption at the Constitution Club here Saturday.

Wiping the ink off his face, a nonplussed Ramdev remarked later, "What have I done to deserve this?"

Ramdev said he had asked for the black money to be returned to the country and instead got black ink.

"Those who fight for truth have to pay the price. We are fighting to get black money back to the country and instead I got black ink...What did I do to deserve this?" Ramdev said to reporters.

"This incident won't affect me. We will continue to fight against the odds, come what may," he added.

Read more...

టెట్‌ను రద్దు చేయాలి : డీవైఎఫ్‌ఐ

-18,19 తేదిల్లో సదస్సులు : డీవైఎఫ్‌ఐ
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

టెట్‌ను నిరసిస్తూ ఈ నెల 18,19 తేదిల్లో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులను నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కే భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి తెలిపారు.

Read more...

సంబురాలు సంక్రాంతి

పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి. కొత్త అల్లుళ్ల రాకలు. యువకుల గాలిపటాల కేరింతలు. పిల్లల బొమ్మరిల్లాటలు. ఇలా హడావిడి మధ్య, ఎముకలు కొరికే చలితో సయ్యంటూ సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. మూడు రోజులు జరుపుకునే పండుగ ఎంతో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. ఆడబిడ్డల రాకతో పల్లెల్లో కళకళలాడుతుంటాయి. పండుగ రోజు ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లులను తలపించే ముగ్గులేసేందుకు యువతుల ఉత్సాహాలు ఒకవైపు. డూడూ బసవన్న అంటూ తెల్లారేసరికి వచ్చే గంగిద్దులవారి చప్పుళ్లతో సంక్రాంతి పండుగ కొత్త కాంతిని సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ విశిష్టత పై ‘టీ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

సంబురాలు సంక్రాంతి
సంక్రాంతి అంటే ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేశాధి, ద్వాదశ రాశులందూ క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి మొదలవుతుంది. ఏడాదికి 12 సంక్రాంతులుంటే కాగా పుష్యమాసంలో, హేమంతరుతువులో చల్లటి గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగుపెడతాడు. అందుకే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెబుతుంటారు. ఈ ఉత్తరాయణ కాలం నుంచి చేయు దానాలను ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, దుంపలు,కాయగూరలు, పండ్లు మొదలైనవి ఈ కాలమందు చేయు దానాల వల్ల స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు.

గంగిద్దుల సందడి.......
తెల్లారే సరికి ఇళ్ల ముందు హరిదాసు కీర్తనలు వినిపిస్తుంటాయి. గంగిద్దులను ఆడించే అలంకరించిన గంగిద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు,సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. అయ్యవారికి దణ్ణం పెట్టు...అమ్మవారికి దణ్ణం పెట్టంటూ గంగిద్దుల వారి సందడి ఎంతో రమణీయంగా ఉంటుంది. పండించిన పంట సంక్రాంతికి ముందే రావడంతో ఆ ధాన్యాన్ని గంగిద్దుల వారికి దానంగా ఇస్తుంటారు.

ఆకట్టుకునే హరిదాసుల కీర్తనలు....
సంక్రాంతి పండుగ రోజు హరిలో రంగ హరి అంటూ నడి నెత్తి పై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో , కంచు గజ్జెలు గల్లుగల్లుమనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిడుతలు కొడుతూ హరిదాసులు చేసే కీర్తనలు ఎంతో ఆకట్టుకుంటాయి. తల పై అక్షయపాత్ర కదలకుండా హరిదాసులు కీర్తనలు చేస్తూ పాడటం ఎంతో బాగుంటుంది. గతంలో ఇలాంటి వేడకలుండేవి. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హరిదాసులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

పిల్లల గాలిపటాల ఆటలు...
పండుగ రోజులో పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురేస్తుంటారు. కనువిందైన గాలిపటాలు ఎగిరేస్తూ సందడి చేస్తారు. చిన్నపిల్లలు బొమ్మరిలాటలాడుతుంటారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటుంటారు. బావమరదళ్ల సయ్యాటలు సంక్రాంతి రోజు కనిపిస్తుంటాయి.

వాకిళ్లలో వెలిసే గొబ్బెమ్మలు...
స్త్రీలు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటారు. యువతులు, ఆడపిల్లలు ఆవుపేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు వాకిళ్లల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ గొబ్బెమ్మల మీద గరకపోసలు, రంగుల పూలరేకులు పసుపు, కుంకుమలు పెడతారు.

ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు...
సంక్రాంతి పండుగ తెల్లారి జరుపుకునే కనుమ రోజు ఇళ్లల్లో ప్రత్యేకమైన పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా భోజనాలు తయారు చేసుకొని తింటారు. కనుమ రోజంతా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఇలా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

Read more...

పతంగుల పండగ

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది రంగురంగుల పతంగులు. ఆకాశాన్నంతా రంగులమయం చేసే పతంగుల కహానీ తెలియాలంటే ఇతర రాష్ట్రాలు, దేశదేశాలు చుట్టాల్సిందే. ఆ సంగతులు ఈ సంక్రాంతి రోజున మీకోసం..మొట్టమొదటిసారిగా 2,000 సంవత్సరాల క్రితం చైనా దేశం తయారు చేసింది. అంటే.. ఐదవ సెంచరీలో ైచైనీస్ తత్త్వవేత్తలు మోజీ,లూబాన్ పేపర్ కైట్‌లను ఉపయోగించారని తేలింది. ఈ పేపర్ కైట్లను తమని తాము ప్రమాదం నుంచి రక్షించుకొవడానికి, సమాచారాన్ని పంపించడం కొరకు ఉపయోగించారు. అంతేకాదు, మీడివియల్ అనే జాతి చైనీయులు కైట్లను దూరాన్ని, గాలి వేగాన్ని, మనిషిని ఎత్తడానికి, సిగ్నలింగ్, మిలిటరీ ఆపరేషన్స్ కొరకు ఉపయోగించేవారు. అప్పటి కైట్స్ మందంగా, దీర్ఘచతురవూసకార ఆకారంలో ఉండేవి. భారతదేశంలో ఫైటర్ కైట్‌ను ‘పతంగ్’లా మార్చారు. కైట్లను వింత వింత ఆకారాలలో, తోకలు లేకుండా, తాళ్ళతో కట్టి వింతగా తయారు చేస్తున్నారు. మనదేశంలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు పోటీలను నిర్వహిస్తున్నారు.

300 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కైట్స్ ఫెస్టివల్లో సంప్రదాయ పండగలు, కట్టుబాట్లు అన్నీ కన్పిస్తాయి. ఆసియా : ఆసియాలో.. వాహ్ జాలా బుడి కైట్‌ను తయారు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. వెదురు కట్టడంపై పేపర్‌తో కవరింగ్ చేసి దానిపై వేరువేరు రంగులతో డెకరేట్ చేస్తారు. ఆసియా దేశాల్లో ఈ పండగ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు కైట్ ఫైటింగ్ మొదలౌతుంది. ఫైటర్ కైట్ అంటే కైట్ ఎగరవేసేటప్పుడు ఇంకొకరి కైట్‌ను తెంచడం. ఫైటర్ కైట్స్ చిన్నగా, మందంగా, వజ్రపు ఆకారంలో ఉంటుంది. పేపర్, వెదురు కర్రను ఉపయోగిస్తారు. ఈ కైట్లకు తోకలు పెట్టరు.ఆఫ్ఘానిస్తాన్ : ఆఫ్ఘానిస్తాన్‌లో కైట్ ఎగరవేయడం ఒక సంప్రదాయకమైన ఆటగా భావిస్తున్నారు. ఈ ఆటను ధరి (గుడిపారన్ బాజి) అని అంటారు. ఫైటర్ కైట్‌ను ఎగురవేయడానికి ఉపయోగించే తాళ్ళను గాజుపొడి, గ్లూతో చేస్తారు.

kite-festival talangana patrika telangana culture telangana politics telangana cinemaదీనితో పోటీపడేవారి కైట్‌ను కట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఈ తాళ్ళు మనుషులకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. తాలిబన్ల చట్టం ప్రకారం ఇతర కారణాల వల్ల కైట్‌ను ఎగురవేయడం నిషేధించారు. పాకిస్థాన్‌లో పతంగి ఎగురవేయడాన్ని ‘గుడి బాజి’ లేదా ‘పతంగ్ బాజి’ అంటారు. వీళ్ళు స్ప్రింగ్ ఫెస్టివల్లో ఈ కైట్‌లను ఎగుర వేస్తారు. దీన్నే జస్‌నే బహారాన్ లేదా బసంత్ అని కూడా అంటారు. వీళ్ళు సంవత్సరం మొత్తం కైట్స్‌ను ఎగురవేస్తారు. కైట్స్ ఫైటింగ్ చాలా కన్నులపండగగా ఉంటుంది. కానీ అర్బన్ సెంటర్స్ ముఖ్యంగా లాహోర్‌లో ఫైటర్స్ కైట్‌తో పోటీ పడిన వారు ఓడిపోతే వారి దగ్గర ఉన్న మారణాయుధాలతో వెంటపడుతూ చాలా సంబరంగా ఎగురవేస్తారు. గాజు పొడితో తయారు చేసిన తాళ్ళతో మాంజాలు వాహనదారులపై పడి ఒకసారి ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి కైట్స్ ఎగురవేయడాన్ని పంజాబ్‌లో నిషేధించారు. వియత్నాంలో తోకలేని పతంగులను ఎగురవేస్తారు. లక్నోలో ఇండియా కైట్స్ ఎంతో ప్రసిద్ధి. వీళ్లు కూడా సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకొంటారు. బీహార్, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్ కైట్ ఫైటింగ్‌లో ఆరితేరిన రాష్ట్రాలు. ఉత్తారాయణానికి ముందు వాడోధర, సూరత్, అహ్మదాబాద్‌లో మూడురోజులు పాటు ఈ పతంగులను ఎగురవేస్తారు. బేర్‌ముడా కైట్. వేయ్‌ఫాంగ్, షాన్‌డాంగ్, చైనాలకు కైట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా పేరొచ్చింది. చైనాలో పెద్ద మ్యూజియమ్ ఉంది. ఇందులో వేల కైట్స్‌ను సేకరించి ఉంచారు. జపాన్, యూకే, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్‌లోని మాలేస్ కైట్‌లను చేపలు పట్టడానికి ఉపయోగించేవారు.

Take By: T News

Read more...

Saturday, January 14, 2012

‘టెట్’ను తక్షణమే రద్దు చేయాలి

- జీఓ 7ను ఉపసంహరించుకోవాలి
- జీఓ 3ని యథాతథంగా అమలు చేయాలి
- ఎస్జీటీ పోస్టుల్లోనూ అవకాశం కల్పించాలి
- బీఈడీ విద్యార్థుల ధర్నా, రాస్తారోకో
- సచివాలయ ముట్టడికి యత్నం

13NGK04A-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
: ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఈడీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీకి హాజరవ్వాలంటే టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టెట్‌ను పూర్తిగా రద్దుచేసి, ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను బీఈడీ అర్హతతోనే నింపాలని కోరారు. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని, జీఓ 7ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలు పరిష్కారమయ్యేంత వరకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరారు. ఆయా డిమాండ్లతో శుక్రవారం పలు జిల్లాల్లో బీఈడీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకో చేశారు. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్‌లో నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో టెట్‌ను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ధర్నాకు నాగం జనార్దన్‌డ్డి, సీపీఎం, జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. నాగం మాట్లాడుతూ ఏసీ గదుల్లో ఉండే ఎవరో ఒక అధికారి నిర్ణయా న్ని ప్రభుత్వం అమలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడు కుంటోందని దుయ్యబట్టారు. టెట్‌తో కొత్తగా జరిగే ప్రయోజనమేమీ లేదని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. గద్వాలలో మంత్రి డీకే అరుణకు నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్‌పై వినతిపత్రం ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా డీఎస్సీ రాసేందుకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

వెంపటి రాజేష్ అనే బీఈడీ విద్యార్థి గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్య గౌడ్ మాట్లాడుతూ టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులన్నింటినీ నేరుగా రిక్రూట్ చేయాలని, ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అర్హుత గల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని వెంపటి రాజేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరులో టెట్‌ను రద్దు చేయాలంటూ బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 7 రద్దు చేసి, జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఈడీ నిరుద్యోగులకు ఎస్‌జీటీలో అవకాశం ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

నిజామాబాద్ జిల్లా కామాడ్డిలో టెట్‌ను రద్దు చేయాలని విద్యావాలంటీర్లు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీలో అందరికీ అర్హత ఇవ్వాలని కోరుతూ మెదక్ జిల్లా సిద్దిపేట, చేగుంటలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చేగుంటలో హైదరాబాద్-మెదక్ రహదారి పై అభ్యర్థులు రాస్తారోకో చేపట్టి టెట్ జీవో ప్రతులను దహనం చేశారు. జీవో 7 రద్దు చేయాలని, పదోన్నతుల కౌన్సెలింగ్ నిలిపేయాలంటూ డిమాండ్ చేస్తూ బీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకారులు హైదరాబాద్‌లో సెక్ర ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టెట్‌ను రద్దు చేయాలని రాష్ట్ర బీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.

Take By : T News

Read more...

నందమూరి ఫ్యామిలీ డ్రామా.. అదుర్స్!

- చంద్రబాబు చక్కర్.. నందమూరి ఫ్యామిలీ డ్రామా
- నట, రాజకీయ వారసత్వంపై రచ్చకెక్కుతున్న ఆధిపత్య పోరు

- ఓవైపు ‘అధినాయకుడు’ మరోవైపు ‘నందీశ్వరుడు’
- ఒంటరవుతున్న జూనియర్
- పేరు మార్చుకున్న తారకరత్న
- ఇకపై ఇండవూస్టీలో మరో ఎన్టీఆర్
- బాబుకు దూరమైన జూనియర్
- స్టూడియోఎన్ నుంచి లోకేష్ ఔట్!
- బాలకృష్ణ మద్దతూ బాబుకే
- చక్రం తిప్పుతున్న చంద్రబాబు?


నందమూరి-నారా కంబైన్స్
సమర్పించు..! ప్రముఖ రాజకీయ చాణక్యుడి మార్గ‘దర్శకత్వం’లో! సినిమాలో రాజకీయం..
రాజకీయంలో సినిమా కలగలిసిన సరికొత్త స్క్రీన్‌ప్లే!
రాజకీయ, నట వారసుపూవరు? ఇదీ స్టోరీ లైన్! సినిమా పేరు
‘ఆధిపత్య పోరు’! నటీనటులు పాతవారే. కాకపోతే కొత్త పాత్రల్లో! మొన్నటిదాకా అక్కరకొచ్చిన పాత్ర.. ఇప్పుడు భారంగా తయారైంది! ఆ క్యారెక్టర్ పక్కకు పోయి.. అదే పేరుతో మరో క్యారెక్టర్ ముందుకు వచ్చింది. మరికొన్ని క్యారెక్టర్ల తీరూ మారిపోయింది. కొంతకాలంగా షూటింగ్ జోరుగా
సాగుతోంది! ప్రస్తుతం క్లయిమాక్స్ పనులు పూర్తి చేసుకుంటూ.. వీలైనంత త్వరలో
రచ్చకెక్కనుంది.

babu2012-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతలవని తలంపుగా బాలకృష్ణ పర్యటనలకు వెళ్లి తొడలు కొట్టడంలోని ఆంతర్యమేంటి? తారక రత్న తన పేరును ఎన్టీఆర్ అని మార్చుకోవడం వెనుక కిటుకేంటి? తన మామ చానల్‌లో ఆధిపత్యం వహిస్తున్న నారా లోకేష్‌ను జూనియర్ ఎన్టీఆర్ తప్పించడం వెనుక మతలబులేంటి? మొన్నటి ఎన్నికల ముందు అక్కున చేర్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి వంశం దూరంగా ఉంచడంలో రాజకీయం ఏమిటి? కొత్త రాజకీయ చిత్రంలో నారా చంద్రబాబు పాత్రేంటి? ‘అధినాయకుడు’, ‘నందీశ్వరుడు’తో చంద్రబాబు ఆడిస్తున్న చదరంగంలో జూనియర్ ‘దమ్ము’ నిరూపించుకుంటాడా? అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆధిపత్య పోరు’!

(-హైదరాబాద్) మొన్నటిదాకా తమదంతా ఒకే కుటుంబం అని చెప్పుకున్న నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు విభేదాలు బట్టబయలవుతున్నాయి. చాలా కాలందూరం పెట్టి.. మళ్లీ దగ్గరకు తీసుకున్న హరికృష్ణ రెండో భార్య తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ దూరం పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే నట సమ్రాట్ నందమూరి తారక రామారావుకు నట వారసుడిని తానేనని రుజువు చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.

బాలకృష్ణ తర్వాత సినిమా రంగంలో మూడోతరం ఎవరూ క్లిక్ కాకపోవడం కూడా జూనియర్‌కు కలిసొచ్చింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సలహా మేరకు రాజకీయ బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. తన పదునైన ఉపన్యాసాలతో భారీగానే జనం దృష్టిని ఆకర్షించాడు. దీంతో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టగల చరిష్మా ఉన్నవాడిగా జూనియర్ నిలుస్తాడన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇదే అంశం నందమూరి వంశంలో ఇతర యువతారలకు గిట్టడం లేదని తెలుస్తోంది. ఫలితంగానే జూనియర్‌ను పక్కనపె తతంగం నడుస్తోందని సినీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి!

కలిసొచ్చిన తాత పోలికలు
జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ చిత్రంతో బాలనటుడిగా రంగవూపవేశం చేశారు. అచ్చుగుద్దినట్లు తాత పోలికలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకొని ప్రేక్షకులు ఆదరించారు. సినిమా సినిమాకీ ఎదుగుతూ, అతి తక్కువ కాలంలోనే సినీ పరిక్షిశమలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. నందమూరి అభిమానులు చేత యంగ్‌టైగర్‌గా పిలుపించుకుంటూ తిరుగులేని హీరోగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే మొదట్లో జూనియర్‌ను నందమూరి కుటుంబం పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. కానీ.. హీరోగా మంచి గుర్తింపు రావడంతో అనివార్యంగా అతడిని కుటుంబంలో కలుపుకోవాల్సి వచ్చిందని పరిశీలకులు చెబుతుంటారు.

తర్వాతి కాలంలో జూనియర్.. నందమూరి కుటుంబంలో ప్రముఖ స్థానాన్నే పొందాడు. ఇదంతా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కృషిగానే పేర్కొంటుంటారు. ఏడాది పాటు శ్రమించిన చంద్రబాబు.. జూనియర్‌ను నందమూరి ఫ్యామిలీలో ఒకడిని చేయగలిగారని అంటారు. ఇందులో ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నవాదన లేకపోలేదు. దానిని నిరూపించే ఘటనలు అనంతరకాలంలో జరిగాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి కుటుంబంతో సంబంధాలు సరిగ్గా లేవు. హరికృష్ణ మొదటి భార్య తనయుడు కళ్యాణ్‌రామ్‌తో జూనియర్‌కు సత్సంబంధాలు లేవని చెబుతుంటారు. కుటుంబాల మధ్య రాకపోకలు కూడా వుండేవి కావు. జూనియర్‌కు, బాలకృష్ణకు మధ్య కూడా అంత బలమైన సాన్నిహిత్యం ఉన్నట్లు దాఖలాలు లేవు. బాలకృష్ణ కూతురికి, చంద్రబాబు కొడుకుకి నిశ్చితార్థం జరిగిన రోజు మధ్యలోనే జూనియర్ బయటికి వచ్చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారి తీసింది.

ఇటువంటి పరిస్థితుల్లో 2009 ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుందని భావించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేకసార్లు మాట్లాడటం ద్వారా అందర్నీ ఒక్క దగ్గరకు చేర్చారు. ఇక తాత స్థాపించిన టీడీపీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్షికమాల్లో పాల్గొని మామయ్య చంద్రబాబు నాయుడు మెప్పు కూడా పొందాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయించడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. మొత్తంగా జూనియర్ కూడా నందమూరి ఫ్యామిలీలో ఇమిడిపోయారని ఆయన అభిమానులూ, టీడీపీ శ్రేణులూ సంతోషించాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమలో ఒకడిగా ఆత్మీయంగా మెలిగిన జూనియర్‌ను ఇప్పుడు మెల్లమెల్లగా అటు సినీ రంగంలో ఒంటరిని చేసేందుకు, భవిష్యత్ రాజకీయ చిత్రం నుంచి తొలగించేందుకు పావులు కదులుతున్నాయని తెలుస్తోంది.

‘కథ’ మొదలైంది ఎక్కడంటే...
ఇది దాదాపు ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటన! కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో తనకు అవమానం జరిగిందని ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అలిగిన సందర్భంలో ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని చెబుతారు. తండ్రికి జరిగిన అవమానంపై ఆగ్రహించిన జూనియర్.. ఆ రోజు నుంచే ఇకపై టీడీపీతో కానీ, చంద్రబాబుతో కానీ సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో సింగపూర్‌లో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే జూనియర్‌కు ఫోన్ చేసి.. బుజ్జగించేందుకు ప్రయత్నించారని, కానీ.. చంద్రబాబు ఫోన్‌ను జూనియర్ ఆన్సర్ చేయలేదని వార్తలొచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అంతరం పెరిగిందని చెబుతున్నారు.

బాలకృష్ణ సైతం ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మారారని సమాచారం. రామారావు పేరు పెట్టుకుని సినిమాల్లోకి జూనియర్ రావడం, ఎదగడం జీర్ణించుకోలేకపోయిన నందమూరి కుటుంబీకులు.. జూనియర్‌కు పోటీగా హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కల్యాణ్‌రామ్‌ను, ఎన్టీఆర్ మరో తనయుడు మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కళ్యాణ్‌రామ్ సొంతంగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అంటూ తాత పేరు మీద సొంతంగా బేనర్‌ను స్థాపించాడు. నిజానికి అప్పటికి అంత అవసరం లేకపోయినా.. ఏనాటికైనా జూనియర్ ఎన్టీఆర్.. తాత పేరుతో బేనర్ స్థాపించి.. ఆ క్రెడిట్ కూడా కొట్టేస్తాడేమోనన్న అనుమానంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో బేనర్ స్థాపించాడన్న వాదన ఉంది.

ఇక తారకరత్న విషయానికొస్తే అతనితో ఒకే రోజు 9 చిత్రాలు ఓపెనింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేయించాలని చూశారు. అయితే అందులో ఒకటి రెండు మినహా మిగతా చిత్రాలన్నీ అటకెక్కాయి. ఆ తర్వాత తారకరత్న పెద్దగా ప్రయత్నాలు చేసింది లేదు. ఈ మధ్య పూర్తిగా దృష్టి కేంద్రీకరించి.. నందీశ్వరుడు పేరుతో సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ చిత్రం నుంచి ఇకపై తన పేరు నందమూరి తారక రామారావుగా మార్చుకుంటున్నట్లు తారకరత్న ప్రకటించడం ఈ కుటుంబంలో రోజు రోజుకు రగులుతున్న చిచ్చుకు, ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. తారకరత్న పేరు మార్పిడి విషయంలో నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలం కూడా ఉందని సమాచారం.

బాలకృష్ణ తర్వాత నందమూరి వంశంలో తదుపరి స్థానం జూనియర్ ఎన్టీఆర్‌దేని అందరూ అంటుండటం కూడా నందమూరి కుటుంబీకులు తారకరత్న పేరు మార్పుపై ప్రభావం చూపిందని పరిశీలకులు అంటున్నారు. అటు బాలకృష్ణ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని చేసిన ప్రకటన కూడా ఈ ఆధిపత్య పోరులో భాగమేనని తెలుస్తోంది. రాజకీయవారసుడు కూడా జూనియరేనన్న ముద్ర పడిపోక ముందే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

డైలమాలో ఎన్టీఆర్ కెరీర్
నందమూరి కుటుంబం నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో భవిష్యత్‌లో జూనియర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే గత దసరాకు బాలకృష్ణ శ్రీరామరాజ్యం విడుదలకు సిద్ధమవుతుండగా జూనియర్ ఆ సినిమాకు పోటీగా తన ‘ఊసర విడుదల చేయాలని నిర్ణయించుకోవడంతో శ్రీరామరాజ్యం నవంబరులో విడుదలైందని సమాచారం. సినిమా కథ బాగున్నా.. ఊసర చిత్రానికి రామారావు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత లభించడంతో అది యావరేజీ చిత్రంగా నిలిచింది. శ్రీరామరాజ్యం చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం జూనియర్ అని తెలిసిన నందమూరి అభిమానులు ఈ చిత్రానికి నందమూరి వ్యతిరేక ప్రచారాన్ని చేశారని తెలిసింది. ఇక ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ నటనకు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ లాంటి వారే ప్రశంసల వర్షం కురిపించినా జూనియర్ నుంచి ఆ చిత్రం గురించి కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం.

పైఎత్తుల్లో జూనియర్
తనను నందమూరి కుటుంబం మళ్లీ వెలి వేస్తోందని గమనించిన జూనియర్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తన మామ నార్నే శ్రీనివాసరావుతో కలిసి తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు సమాచారం. ఫలితంగానే స్టూడియో ఎన్ బాధ్యతల నుంచి లోకేష్‌ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ను తప్పించిన జూనియర్.. స్టూడియోఎన్‌ను తన ఆధీనంలో తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామం చంద్రబాబు, బాలకృష్ణలకు మరింత ఆగ్రహం కల్గించిందని సమాచారం. త్వరలోనే జూనియర్ మరో చానల్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ పరిక్షిశమలో చర్చ జరుగుతోంది. స్టూడియో ఎన్‌లో ఇవాల్టికివాళ చంద్రబాబు నారావారిపల్లె పర్యటనకు పెద్దగా ప్రచారం కూడా ఇవ్వలేదు.

గత కొద్దికాలం నుంచే ఈ చానల్‌లో చంద్రబాబు ప్రచారం తగ్గినట్లు చెబుతున్నారు. అయితే మెలితిప్పిన మీసంతో ‘నందీశ్వరుడు’ అంటూ హంగామా చేసిన మాత్రాన తారకరత్న అలియాస్ కొత్త ఎన్టీఆర్‌కు ఒరిగేదేమీ లేదని, ఎవరు అవునన్నా కాదన్నా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేంత వరకు బాలకృష్ణ తర్వాత మళ్ళీ ఆ చరిష్మా జూనియర్‌కే ఉంటుందని పరిక్షిశమ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తాజా పరిణామాలు నందమూరి కుటుంబంలో ఆధిపత్యపోరు సాగుతున్నదన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో జరుగుతున్నదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Take By : T News

Read more...

Sunday, January 1, 2012

Great Cartoon .................................. Just Think










Source: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP