Wednesday, October 24, 2012
Tuesday, October 23, 2012
రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు - వస్తున్నా మీకోసం’ యాత్రలో చంద్రబాబు
(మహబూబ్నగర్): ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు
వ్యతిరేకిని కాదు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సింది కాంగ్రెస్.
తెలుగుదేశం కోరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు. తెలంగాణలో
టీడీపీని అంతమొందించేందుకు పలు పార్టీలు చేస్తున్న కుట్ర ఇది. తెలంగాణ
ఏర్పాటుపై గతంలోనే టీడీపీ స్పష్టమైన అభివూపాయం తెలిపింది’’ అని టీడీపీ
అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ‘వస్తున్నా
మీకోసం’ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల
ప్రాజెక్టు మీదుగా మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించింది. ఇక్కడ తెలంగాణ
ఆడపడుచులు బతుకమ్మలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర
రాజోలి గ్రామానికి చేరుకుంది. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు
ప్రసంగించారు.
రాష్ట్రంలో కొన్ని పార్టీలు తనను తెలంగాణ
వ్యతిరేకిగా ముద్ర వేశాయని ఆయన వాపోయారు. 2009లోనే ప్రణబ్ముఖర్జీకీ
తెలంగాణపై తమ పార్టీ తరఫున వైఖరి స్పష్టం చేసి, కేంద్రానికి లేఖ ఇచ్చానని
తెలిపారు. తెలంగాణ ఇచ్చేది తన చేతుల్లో లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు కోసం ఇటీవల కూడా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే దొంగపూవరో.. దొరపూవరో
తెలుస్తుందని చంద్రబాబు చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే టీడీపీ
స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం
నాన్చుడుధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల తన పాలనలో రాజోలిబండ
మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు అన్యాయం జరగలేదని,జిల్లాకు సాగునీటి వాటాలో
అక్రమాలు జరగలేదని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలోనే అభివృద్ధి పనులు
చేపట్టామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత
కల్పించేందుకు కృషి చేస్తామని, నిరుద్యోగులకు రూ. వెయ్యి భృతి కల్పిస్తామని
హామీ ఇచ్చారు. మూడేళ్ల కిత్రం వచ్చిన వరదలకు రాజోలి గ్రామం పూర్తిగా
మునిగిపోవడంతో ప్రజలు, చేనేత కార్మికులు నిరాక్షిశయులయ్యారని, వారిని
కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆదుకోలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే
నేతన్న అభివృద్ధి కోసం రూ కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. బహిరంగ
సభకు ముందు సుంకేసుల ప్రాజెక్టు నుంచి వస్తూ మధ్యలో గంగమ్మ ఆలయంలో పూజలు
నిర్వహించారు. అనంతరం మసీదును సందర్శించి ముస్లింలతో మాట్లాడారు. సుంకేసుల
ప్రాజెక్ట్ నుంచి సీమ ప్రాంతానికి సాగునీటిని తరలిస్తూ మహబూబ్నగర్
జిల్లాకు కనీసం తాగునీటిని కూడా అందివ్వలేదని పలువురు రైతులు ఫ్లెక్సీలతో
నిరసన తెలిపారు. అనంతరం రాజోలి నుంచి శాంతినగర్ వరకు చంద్రబాబు పాదయాత్ర
నిర్వహించారు.
నేడు అలంపూర్ నియోజకవర్గంలో బాబు పాదయాత్ర
హైదరాబాద్:
చంద్రబాబు చేస్తున్న ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర మంగళవారం మహబూబ్నగర్
జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ పెట్రోల్ బంక్, జోలకల్లు, కోంకల క్రాస్
రోడు, వెంకటాపురం స్టేజ్, ఐజ మండలంలోని పడిదాపురం, ఉప్పల క్రాస్
ప్రాంతాలలో సాగుతుందని వెల్లడించాయి.
- T News
రగిలిన రాజోలి
-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు
రాజోలి
రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను
అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు
పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన
సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత
పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు
నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు
చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి
తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి
చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.
బాబు
పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం,
స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్
వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట
పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన
వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు
జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు.
చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను
అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు
గురయ్యారు.
( మహబూబ్నగర్) :వస్తున్నా
మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
నాయుడుకు మహబూబ్నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను
తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు
పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు..
తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లకు
తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది.
సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా
జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ
జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో
పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు
వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన
తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి
మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ
దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త
పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను
చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ
నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ
నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన
వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని
అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం
తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును
నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన
తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం
చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ
రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను
పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు
పోలీస్స్టేషన్కు తరలిస్తామని ప్రకటించారు.
కానీ కొత్తకోట మీదుగా
ఆత్మకూర్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ
రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు
కోదండరాం, శ్రీనివాస్గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు
కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందుకు
నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ
నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో
విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో
ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా
పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ
నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్డ్డి ఖండించారు.
సోమవారం
ఉదయం నుంచి మక్తల్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో
టీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా
చైర్మన్ రాజేందర్డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్నగర్
వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా..
తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు
తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా
వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.
- T News
Sunday, October 21, 2012
Filmmaker Yash Chopra, the King of romance passes away
Yash Chopra was admitted to hospital after he was diagnosed with dengue.
The news of Yash Chopra’s demise was confirmed by a tweet from well known director Mahesh Bhatt. Bhatt tweeted, “Heartbreaking news Yash Chopra passes away!”
Yash Chopra, an institution in himself spent a life doing what he loved and that was to spread romance through some of his masterpieces he created in the form of love epics like ‘Silsila’, ‘Chandni’, ‘Lamhe’, ‘Dil To Pagal Hai’ and ‘Veer Zaara’.
The legend was working on his last film called ‘Jab Tak Hai Jaan’ which is scheduled to release this Diwali. During the shooting of JTHJ, Yash Chopra’s trip to Switzerland with SRK and Katrina (lead actors in the film) had to be cancelled after he was admitted to Lilavati hospital.
డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో సైనా విజయం
డెన్మార్క్: డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది.
ఫైనల్లో జర్మనీ షట్లర్ షెంక్పై 21-17, 21-8 తేడాతో సైనా గెలుపొందింది. ఈ
విజయం సైనాఖాతాలో తొలి డెన్మార్క్ ఓపెన్ టైటిల్, ఈ ఏడాది రెండో సూపర్
సిరీస్ టైటిల్ పొందింది.
Take BY: T News
Saturday, October 20, 2012
టెట్, డియస్సిలకు వీడ్కోలు ‘టెస్ట్’ టాలెంట్ చాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (డియస్సి) రెండింటి స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదే టెస్ట్.
ఇదెలా ఉంటుంది? టెస్ట్ అంటే ఏమిటి?
టెస్ట్
అంటే టీచర్ ఎలిజబులిటీ, సెలక్షన్ టెస్ట్ - Teacher Elijibility &
Selection Test-TEST. అంటే ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష.
టెస్ట్ ఆలోచన ఎందుకు?
మన
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షగా టెట్ - టీచర్ ఎలిజబులిటీ టెస్ట్,
ఉపాధ్యాయ ఎంపిక కోసం డిఎస్సి నిర్వహిస్తున్నారు. అప్పటికే డిప్లొమా ఇన్
పబ్లికేషన్స్, బి.ఇ.డి, లాంగ్వేజ్ పండిట్స్ పాసైన ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు
రెండు పరీక్షలు నిర్వహించటం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి. ఈ విధానం ఏ
రాష్ట్రంలో లేదని ఏదో ఒక దానిని రద్దు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు
డిమాండ్ చేస్తున్నారు. చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు
దీనిని వ్యతిరేకించాయి. దీనితో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ రెండింటినీ
కలిపి టెస్ట్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనినే విద్యామంత్రి
డియస్సి ఫలితాల సమయంలో ప్రకటించారు.
ఏదో ఒక దానిని రద్దు చేయకుండా, రెండింటినీ కలపడమెందుకు?
2009
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత నిర్ధారించేందుకు టెట్ పరీక్షను
విధిగా నిర్వహించాలి. దీని నుంచి ఏ రాష్ట్రానికీ మినహాయింపు లేదు.
ఇదేవిధంగా ఉపాధ్యాయ ఎంపికల కోసం గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం
డియస్సిలను నిర్వహించి దానిలో ఏ ఒక్కటి రద్దు చేసే అవకాశం లేక రెండింటినీ
కలిపి టెస్ట్గా నిర్వహించాలని భావిస్తోంది.
టెస్ట్ మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది?
టెట్, డియస్సిలను కలిపి వేస్తున్నందుకు రెండు పరీక్షల్లో ఉన్న కామన్గా ఉంచే విభాగాలను తొలగించి నైతన స్వరూపంలో టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వ అభిమతం. అంటే ఒక పరీక్షలో ఉండే విభాగం మరొక పరీక్షలో ఉంటే దానిని తొలగిస్తారు. దీనివల్ల రిపిటీషన్ ఉండదు. డి.యస్.సి., బి.ఇ.డి.లు ప్రొపెషన్ కోర్సులు ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకటి పాసై ఉపాధ్యాయ పోస్టు అభిలషిస్తున్న వారికి ఇలా రెండు పరీక్షలు నిర్వహించడం ఏ రాష్ట్రంలోనూ లేదు.
ఎలాంటి పరీక్ష రూపొందిస్తారు?
ఇటు డియస్సీ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలు, అటు టెట్ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలలో ఏవైతే రిపీట్ అవుతాయో వాటిని కొత్త టెస్ట్ పరీక్షలో తొలగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉదా॥ లాంగ్వేజీ అంశాలు, కంటెంట్ అంశాలు రెండు రకాల పరీక్షలలో రిపీట్ అవుతున్నాయి. అటువంటి సిలబస్లో ప్రశ్నలు తగ్గిస్తారు. అలాగే అటు డియస్సీ, ఇటు టెట్ పరీక్షలను కలుపుతున్న దృష్ట్యా రిపీటెడ్ సిలబస్ గురించే కాకుండా పరీక్ష సమయం, ప్రశ్నల సంఖ్య వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తూ టెస్టు పరీక్షను సమగ్రంగా రూపొందించనున్నారు. టెట్ పరీక్ష స్ట్రక్చర్ అండ్ కంటెంట్ను ఎస్.సి.టి.ఇ. రూపొందించింది. కాబట్టి దానినే రాష్ట్రాలు పాటించాలి. అదే సమయంలో టెట్కు వెయిటేజీ 20 శాతం మార్కులు, డియస్సీ పరీక్షకు 80 శాతం ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
3 గంటల పరీక్ష టెస్టు?
నూతనంగా రూపొందిస్తున్న టెస్టు పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఖరారు చేసే ప్రతిపాదన లున్నాయి. డియస్సిలో 2.30 గంటలలో 160 ప్రశ్నలు అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉండేది. అదే టెట్ పరీక్షలో 2.30 గంటలలో 120 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంది. నూతన టెస్టులో 200 ప్రశ్నలకు 200 జవాబులను గుర్తించేలా పరీక్ష వ్యవధి 3 గంటలు నిర్ణయిస్తారని తెలుస్తోంది. టెస్టులో 200 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డియస్సీ పరీక్షకు 80 మార్కులు టెట్ పరీక్షకు 20 మార్కులు విధానం నిష్పత్తిలో కొత్త టెస్టు నిర్మాణంలో 70.:30 నిష్పత్తి లేదా 60:40 నిష్పత్తిలో ప్రశ్నలు ఇవ్వనున్నారనేది సమాచారం. మొత్తం మీద టెట్ కంటే డియస్సీ సిలబస్ నుంచే అధిక ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.
టెస్ట్ ఏర్పాట్లు మొదలయ్యాయా?
ఇంకా లేదు. మంత్రిగారు విధాన ప్రకటన చేశారుగానీ ఇప్పటి వరకు ఎటువంటి ... సన్నాహాలు ఆరంభం కాలేదు. .. కొత్త పరీక్ష విధానం, సిలబస్ రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీని నియమిస్తుంది. కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎన్.సి.ఇ.ఆర్.టి. సిలబస్లో మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే ఇంతవరకు ఈ దశల్లో ఏదీ ఆరంభం కాలేదు.
మరి.. టెస్ట్ నోటిఫికేషన్ను ఎప్పటిలోగా ఆశించవచ్చు?
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామాలకు కట్టుబడి ఉంది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఈ దశలు పూర్తి చేసి ఆపై నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెస్ట్-2013గా నోటిఫికేషన్ వెలువడవచ్చు. ఈ దశలు పూర్తి చేసేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పట్టదని అధికార వర్గాలు చెబు తున్నాయి.
Take BY: T News
Read more...
రాంబాబు సినిమాపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
Cameraman Ganga tho Rambabu (CGR) film stopped in Telangana
The screening of Pawan Kalyan starrer ‘Cameraman Ganga tho Rambabu’ was stopped in many theatres across Telangana on the second day of its release on Friday following protests by Telangana supporters against objectionable scenes which they claimed hurt their sentiments.
తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది
తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్రాజు
- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’
తెలంగాణ
ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్
గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు,
సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన
సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో
థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్లో
పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను,
ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు నివాసంపైనా గుర్తు
తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర
దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్
నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో
దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు అతికష్టంమీద దిగి వచ్చారు.
సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా
నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను
తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను
శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం
చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం
అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే
వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి
పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర
ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే
తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు
ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల
ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని
ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు
చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ
తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్ఎస్
అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల
అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని
అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి
నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్
చర్చించినట్లు సమాచారం.
పూరీ సారీ
‘కెమెరామెన్
గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో
దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా
ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు.
అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ
మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు
ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ
నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం
తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్రాజుతో చర్చించి తొలగించామని
చెప్పారు. దిల్రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు,
నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు
తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా
అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను
అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా
దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ..
రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ
సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం
మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం
బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట
వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి
చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.
Sunday, October 14, 2012
Make Money Online With Facebook? How
Make Money Online With Facebook? How
clikc this link and Join free
Start earn money
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)