Tuesday, October 30, 2012
Myanmar camps overwhelmed after fresh unrest: UN
Buddhist-Muslim bloodshed in Rakhine state has caused more than 28,000 people to flee their homes this month, UNHCR said in a statement.
It is clearly urgent that law and order be restored to prevent further violence and that access is facilitated so that aid can be provided to those in need," the agency said.
The latest fighting, which erupted on October 21, has seen whole neighbourhoods razed in a spate of arson attacks that United Nations staff reported had resulted in "widespread destruction and displacement".
Dozens of people have been killed in the fresh unrest.
Thousands from mainly Muslim communities have streamed towards camps already struggling to cope with the 75,000 people displaced by earlier clashes in June.
With the new influx, these already overcrowded camps are being stretched beyond capacity in terms of space, shelter and basic supplies such as food and water," UNHCR said.
Food prices in the area have doubled and there are not enough doctors to treat the sick and wounded."
- Siasat News
Read more...
Cyclone Nilam stationary, to cross TN coast tomorrow
Monday, October 29, 2012
మూడు వ్యక్తిత్వాల కలయిక
సినీ రంగంలో మూడు దశాబ్దాల జైత్రయాత్ర.. సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర
పాలిటిక్స్లో మెరిసిన రాజకీయ ధీరుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..

ఆడాడు..
ఆడించాడు..! పాడాడు.. పాడించాడు..! నవ్వాడు.. నవ్వించాడు..! నడిచాడు...
నడిపించాడు! ఆయన వేసిందే డాన్స్.. ఆయన చేసిందే స్టంట్! సూపర్స్టార్
కృష్ణలా పదునుగా డైలాగ్లు చెప్పగల స్వరం.. నటరత్న ఎన్టీఆర్లా హావభావాలు
ఒలికించగల కౌశలం.. నట సామ్రాట్ ఏఎన్నార్ను మరిపించేలా స్టెప్పులు వేసే
తుంటరితనం! అంతెందుకు.. నవరసాలనూ తన నటన ద్వారా వెండితెరపై చిలకరించగల
అరుదైన నటుడాయన! చంటబ్బాయ్.. ఇంద్ర.. ఆపద్భాందవుడు.. స్వయం కృషి.. ఠాగూర్..
గ్యాంగ్ లీడర్.. హిట్లర్.. ఆరాధన.. అభిలాష.. మంచు పల్లకీ.. జగదేక వీరుడు
అతిలోక సుందరి!! సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడమే తెలిసిన
అతికొద్ది మంది నటుల్లో ఒకరు! భిన్నమైన పాత్రలను విభిన్నంగా పోషించిన
దిట్ట! మూడు దశాబ్దాల విజయవంతమైన సినీజీవితంలో అశేష ప్రజాభిమానం సొంతం
చేసుకుని.. సామాజిక సేవారంగంలో విశిష్ఠపాత్ర పోషిస్తూ.. రాజకీయాల్లోకి
అడుగుపెట్టి.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతమై.. ఇప్పుడు కేంద్ర
మంత్రిగా మరో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు! విజయానికి మారుపేరుగా
నిలిచాడు! సినిమా.. సామాజిక సేవ.. రాజకీయం!! మూడు రంగాల్లోనూ ఎగసిన కెరటం!
ఒకే మనిషిలో ముగ్గురు మొనగాళ్లను నింపుకున్న వ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం
పేరే... చి..రం..జీ..వి..!
చిరంజీవి అసలు పేరు శివ శంకర వరవూపసాద్.
నర్సాపురం సమీపంలోని చిన్న పల్లెటూరైన మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22 న
జన్మించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివిన చిరంజీవి.. నర్సాపురంలోని
వైఎన్ఆర్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. తర్వాత సినిమాల్లో చేరాలని
భావించినప్పుడు ఆయన తండ్రి ముందు చదువుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఉభయతార
కం అన్నట్లు మద్రాస్ వెళ్లి ఐసీడబ్ల్యూ కోర్సులో చేరిన చిరంజీవి..
సమాంతరంగా నటనలో శిక్షణ పొందారు. 1976లో ఆయన మద్రాస్ ఫిలిం
ఇన్స్టిట్యూట్లో చేరారు. పునాదిరాళ్లు సినిమాలో దర్శకుడు రాజ్కుమార్
అవకాశం ఇవ్వడంతో మొదటిసారి చిరంజీవి మొఖానికి రంగు వేసుకున్నారు. ఆ నిర్మాత
క్రాంతికుమార్ కే వాసు దర్శకత్వంలోని ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం ఇ
చ్చారు. తొలి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ.. ప్రాణం ఖరీ దు మొదట
విడుదలైన సినిమా. తొలి సినిమాకు ఆయనకు లభించింది వెయ్యి నూటపదహార్లు.
కుటుంబంలో ఆంజేయస్వామిని పూజించేవారు. దాంతో స్క్రీన్నేమ్గా తల్లి సలహా
మేరకు చిరంజీవి అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాలే కాకుండా పలు తమి ళ,
కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 149సినిమాల్లో నటించిన
చిరంజీవి.. అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. తొలుత చిన్న చిన్న
క్యారెక్టర్లు, విలన్ పాత్రలు వేసిన చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీ
సినిమా పూర్తిగా మార్చివేసింది.
చిరంజీవి
ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది.
సుప్రీం హీరోగా మొదలైన ఆయ న ప్రస్థానం.. మెగాస్టార్కు చేరుకుంది. చిరంజీవి
సినిమాల్లోకి వచ్చేసరికే ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్బాబు
వంటి దిగ్గజాలు యూత్ కారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో సైతం తన
సత్తా నిరూపించుకున్నాడు చిరంజీవి. వారందరి ఉత్తమ మేళవింపుగా తెలుగు సినీ
రంగానికి అందివచ్చాడు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్హాసన్. మాస్
స్టైల్ కింగ్ రజనీకాంత్.. ఆ ఇద్దరినీ తనలో నింపుకున్న నటుడని సీనియర్
దర్శకుడు కే బాలచందర్ చేసిన వ్యాఖ్య చిరంజీవి నటనా చాతుర్యానికి నిదర్శనంగా
నిలిచిపోతుంది. ఫిలింఫేర్ మ్యాగజీన్ చిరంజీవిని ఉద్దేశించి.. బిగ్గర్ దేన్
బచ్చన్ అని సంబోధించినా.. ది వీక్ మ్యాగజైన్ ఆయనను న్యూ మనీ మిషన్ అని
అభివర్ణించినా.. అది ఆయన ప్రజాదరణనే చాటుతుంది.
1980లో అల్లు
రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. అప్పటికి
చిరంజీవి చేసిన సినిమాలు 11 మాత్రమే. మనవూరి పాండవులు సినిమా షూటింగ్
సందర్భంగా చిరంజీవిని చూసిన అల్లు.. అప్పుడే ఆయనను అల్లుడిగా చేసుకోవాలని
నిర్ణయించుకున్నారట. వీరి వివాహానికి ఎన్టీరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు.
వీరికి కుమ్తాలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్చరణ్ తేజ ఉన్నారు. రాంచరణ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన హీరోగా ఎదుగుతున్నాడు. చిరంజీవి సోదరులు
నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా సినీరంగంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇం
డస్ట్రీలో అత్యధిక పరిహారం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.
బాపూ
దర్శకత్వంలో రూపొందిన మనవూరి పాండవులు చిత్రంతో చిరంజీవికి గుర్తింపు
వచ్చింది. ఐ లవ్ యూ, ఇది కథ కాదు, 47 రోజులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ
వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. 1979లో ఎనిమిది సినిమాలు చేసిన
చిరంజీవి.. మ రుసటి సంవత్సరం 14 సినిమాలు చేశారు. 1981లో న్యాయం కావాలి
సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్లో రామయ్య, వీధిలో
కృష్ణయ్య, అభిలాష వంటి సినిమాలతో మళ్లీ కథానాయకుడిగా తెరపైకి వచ్చారు.
ఇంట్లో రామయ్య, వీధి లో కృష్ణయ్య సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1982లో కే
విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శుభలేఖ చిత్రానికిగాను చిరంజీవికి ఫిలిం
ఫేర్ అవార్డు లభించింది. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి సినీ ప్రస్థానం
దిశను మార్చివేసింది. సిల్వెస్టర్ స్టల్లోన్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా
ఫస్ట్ బ్లడ్ సినిమా ఆధారంగా తీసిన ఖైదీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్
అయింది. చిరంజీవికి యాక్షన్ హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టింది. 1983 చివరి
నాటికి ఆయన చేసిన సినిమాలు 60కి చేరుకున్నాయి.
ఆ తర్వాత మూడేళ్ల కాలంలో
క్రమక్షికమంగా అగ్రహీరోగా ఎదిగాడు చిరంజీవి. అందు కు మంత్రిగారి
వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ,
కొండవీటి రాజా, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి సినిమాలు ఇందుకు దోహదం చేశాయి.
విజేత సినిమా కోసం 1985లో ఆయన తన మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
1987లో పసివాడి ప్రాణం సినిమా హిట్ తో చిరంజీవి స్టార్డమ్ అందుకున్నారు. ఈ
సినిమాతో కొత్త నృత్య ఒరవడి ‘బ్రేక్ డ్యాన్స్’ను చిరంజీవి చేశారు. ఈ తరహా
డ్యాన్స్కు ఆయన పెట్టింది పేరుగా మారారు. అంతకుముందే దొంగ సినిమా కోసం
మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్లోని నృత్యాన్ని చేశారు. అది ప్రేక్షకుల్లో
నాటుకుపోయింది. 1987లో స్వయం కృషి సినిమాకు గాను ఆయన తొలిసారి ఉత్తమ
నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటికే స్టార్డమ్ అందుకున్న సుప్రీం
యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవి ఒక లోప్రొఫైల్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా
బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషం. తాను ఎలాం టి పాత్రనైనా
చేయగలనని ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించుకున్నారు.
ఖైదీ తర్వాత
అయన అనేక హిట్లు కొట్టారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్
786, స్టేట్రౌడీ, కొండవీటి దొంగ, కొదమసింహం, రాజా విక్రమార్క,
గ్యాంగ్లీడర్, ఘరానా మొగుడు వంటి భారీ హిట్లు నమోదు చేశారు. పది కోట్లకు
మించిన రెవెన్యూ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు
సృష్టించింది. శ్రీదేవితో జతకట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా
అద్భుతమైన సోషియోఫాంటసీ సినిమాగా నిలిచిపోయిం ది. చిరంజీవి సినిమాల్లో
ఒకానొక అత్యుత్తమమైన సినిమాగా ఇప్పటికీ చెక్కుచెదరని స్థానం పొందింది.
చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసేనాటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులకు
విపరీతమైన ప్రజాదరణ ఉండేది. ఆ సమయంలో చిరంజీవి తనదైన శైలిలో స్టెప్పులు
వేయడం, మునుపు చూడని పద్ధతుల్లో సాహసోపేతమైన స్టంట్స్ చేయడం ఆయనకు క్రమేణా
అగ్రస్థానం కల్పించింది. సంఘర్షణ చిత్రం షూటింగ్ సమయంలో క్లైమాక్స్
సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ వెళ్లి
శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటిగుట్టు సినిమాలో ట్యూబ్లైట్
పట్టుకుని పోరాడే సమయంలో కూడా గాయపడ్డారు. దొంగ సినిమాలో 11అంతస్తుల భవనం
గోడపై నిలబడి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తాయి.
బావగారు బాగున్నారా చిత్రం కోసం ఒక టీనేజ్ పిల్లాడి మాదిరిగా బంగీజంప్
చేసి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు ఆయన
తెలుగు సినీరంగంపై ఏకఛవూతాధిపత్యం వహించారనడంలో సందేహం లేదు. చిరంజీవి సహ
నిర్మాతగా రూపొందిన రుద్రవీణ చిత్రం జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు
అందుకుంది.
అవార్డులు కోకొల్లలు
చిరంజీవికి అవార్డులు
కోకొల్లలు. తెలుగులో ఏ సినీ హీరోకూ లభించని స్థాయిలో పది ఫిలింఫేర్
అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన
పద్మభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ
డాక్టరేట్తో సత్కరించింది.
ప్రతిఘటన సినిమాకు రీమేక్గా హిందీలో
ప్రతిబంధ్ (1990) ద్వారా హిందీలోనూ విజయం సాధించారు చిరంజీవి. ఆజ్కా
గూండారాజ్ (గ్యాంగ్లీడర్), జెంటిల్మన్ సినిమాలతో బాలీవుడ్లోనూ తనకు
అభిమానం ఉందని రుజు వు చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాలో నటనకు గాను
ఆయనకు రెండో సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. 1990వ దశకంలో
కొన్ని అపజయాలు ఎదురైనా.. తిరిగి నిలదొక్కుకున్న చిరంజీవి.. 1997లో
హిట్లర్తో తెలుగు సినీ రంగానికి రారాజు తానేనని నిరూపించుకున్నారు.
మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలు ఆయన
నటనా కౌశలాన్ని చాటాయి. 1999లో హాలీవుడ్లో కూడా చిరంజీవి అడుగుపె ది
రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా సెట్లపైకి వెళ్లినా.. తెలియని
కారణాలతో నిలిచిపోయింది.
చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్య సినిమాతో
పునఃవూపారంభమైంది. ఈ సినిమా సూపర్హిట్ కొట్టింది. 2002లో వచ్చిన ఇంద్ర
సినిమా అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడోసారి ఉత్తమ
నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. సామాజిక కోణంలో వచ్చిన ఈ సినిమా
తర్వాత ఇదే కోణంలో ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ వంటి సినిమాలు
చిరంజీవి స్థానం ఎవరూ కదల్చలేనిదని నిరూపించాయి. తెలుగు సినిమా
వజ్రోత్సవాల్లో ఆయనకు ‘లెజెండ్’ పురస్కారం అందజేసి.. తెలుగు సినీ పరిక్షిశమ
తనను తాను గౌరవించుకుంది. పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం, గాడ్ఫాదర్లు
లేకుండానే చిరంజీవి సాధించిన విజయాలు.. నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఒక హీరో
అలా ఎదగడాన్ని కనీసం ఊహించలేం.
- T News
మెగా విస్తరణ
22 మంది ప్రమాణం
17 కొత్త ముఖాలే
పలువురికి పదోన్నతులు
మంత్రివర్గంలో చేరని రాహుల్
ముగిసిన పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్కే అగ్రతాంబూలం
చిరంజీవికి స్వతంత్ర సహాయ హోదా
కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, కిల్లి కృపారాణి,
బలరాంనాయక్, సర్వేలకు చోటు
పల్లంరాజుకు ప్రమోషన్.. పురంధేశ్వరి శాఖ మార్పు
పెట్రోలియం నుంచి సైన్స్కు జైపాల్రెడ్డి
వీరప్పమొయిలీకి పెట్రోలియం
సల్మాన్ ఖుర్షీద్కు విదేశాంగశాఖ
బన్సల్కు పట్టణాభివృద్ధితోపాటు
పార్లమెంటరీ వ్యవహారాలు
న్యూఢిల్లీ,
అక్టోబర్ 28: చాలాకాలంగా నలుగుతున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
పూర్తయింది. కొత్తగా 22 మందిని చేర్చుకుంటూ, పలువురి శాఖలను మారుస్తూ
ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆదివారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణను
ముగించారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి
ప్రణబ్ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్షికమానికి ఉప
రాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కాంగ్రెస్
అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేత
సుష్మాస్వరాజ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న
నేపథ్యంలో ఇవే చివరి మార్పులు చేర్పులు కావచ్చని భావిస్తున్నారు. ఆదివారం
మొత్తం 22 మంది ప్రమాణం స్వీకరించగా, వీరిలో 17 మంది మంత్రిపదవి చేపట్టడం
ఇదే తొలిసారి. మార్పులు చేర్పుల అనంతరం కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య
78కి పెరిగింది. ప్రభుత్వం విధానపరంగా చలనరహితంగా మారిందని, అవినీతిమయమై
పోయిందని ఆరోపణలు వెల్లు నేపథ్యంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో యువతకు
అవకాశం కల్పించారు. కొందరి శాఖలు మార్చారు. సహాయ మంత్రులు కొందరికి
కేబినెట్, స్వతంత్ర హోదా కల్పించి పదోన్నతులు కల్పించారు. ఇంకొందరి అదనపు
శాఖలను తొలగించారు. ఈసారి మార్పుల్లో ఆంధ్రవూపదేశ్కే ప్రాధాన్యం
లభించింది. కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించారు. కే చిరంజీవికి స్వతంత్ర
సహాయ మంత్రి హోదా (పర్యాటకం) లభించింది. కోట్ల సూర్యవూపకాశ్డ్డి (రైల్వే),
కిల్లి కృపారాణి (కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), పోరిక
బలరాంనాయక్ (సామాజిక న్యాయం, సాధికారత), సర్వే సత్యనారాయణ (రోడ్డు రవాణా,
హైవే) లకు సహాయమంవూతులయ్యారు. పల్లంరాజుకు ప్రమోషన్ లభించింది. ఇప్పటిదాకా
రక్షణశాఖ సహాయమంవూతిగా ఉన్న ఆయనకు మానవ వనరుల అభివృద్ధి శాఖతో కేబినెట్
హోదా కల్పించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పురంధేశ్వరిని
వాణిజ్య, పరిక్షిశమల శాఖకు మార్చారు. ఇప్పటిదాకా కీలకమైన పెట్రోలియం శాఖను
నిర్వహిస్తున్న ఎస్ జైపాల్డ్డికి సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖను
కేటాయించారు. పెట్రోలియం, సహజవాయు శాఖను వీరప్పమొయిలీకి అప్పగించారు.
మొత్తంగా మరిన్ని ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా ఉన్నవారే మన్మోహన్ కీలక
బృందంలో భాగమయ్యారు.
ప్రధానమంవూతికి చాలా సన్నిహితంగా భావించే
విదేశాంగశాఖను సల్మాన్ ఖుర్షీద్కు కట్టబెట్టారు. అవినీతి ఆరోపణలు
ఎదుర్కొంటున్న ఆయనను న్యాయశాఖ నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు మార్చడం
పదోన్నతిగానే భావించవచ్చు. ముఖ్యమైన న్యాయశాఖను అశ్వనికుమార్కు
అప్పగించారు. ఖుర్షీద్ అదనంగా నిర్వహించిన మైనారిటీ వ్యవహారాల శాఖను
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, కర్ణాటక ముఖ్య నేత కే రహ్మాన్ఖాన్
చేపట్టారు. జలవనరులశాఖ మంత్రి పవన్కుమార్ బన్సల్ను రైల్వేశాఖకు మార్చారు.
గనుల మంత్రిత్వశాఖలో సహాయమంవూతిగా ఉన్న దిన్షా పటేల్కు కేబినెట్ హోదా
కల్పించారు. కపిల్సిబల్ ప్రాముఖ్యాన్ని కూడా తగ్గించారు. మానవ వనరుల
అభివృద్ధి శాఖను మినహాయించి, ఆయనను కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మంత్రిగా పరిమితం చేశారు. మరింత ఉన్నతస్థాయి శాఖలు కావాలనుకున్న గులాంనబీ
ఆజాద్ కోరికను పట్టించుకోలేదు. ఈసారి పునర్వ్యవస్థీకరణలో కొత్తవారిని,
యువతను చేర్చుకోవడం ముఖ్యాంశమయింది. మొత్తం 22 మందిలో ఆంధ్రవూపదేశ్,
పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర
మంత్రివర్గంలో చేరుతారని ఎంతోకాలంగా ఊహిస్తున్న రాహుల్గాంధీ ఈసారీ
దూరంగానే ఉండిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు ఎక్కువ
ప్రాముఖ్యమివ్వాలనుకుంటున్నారని, తన విజ్ఞప్తికి స్పందించలేదని
ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతలు
నిర్వహిస్తున్నవారి శాఖలను ప్రధాని ఈసారి వేరేవారికి బదలాయించారు. తృణమూల్
కాంగ్రెస్ మంత్రుల నిష్క్రమణ, విలాస్రావ్ దేశ్ముఖ్ మృతి, తాజాగా కొందరు
మంత్రుల రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీచేశారు. రాహుల్గాంధీకి
సన్నిహితులుగా భావించే ముగ్గురు సహాయమంవూతులకు స్వతంత్ర హోదా కల్పించారు.
జ్యోతిరాదిత్య సింధియాకు విద్యుత్శాఖను, సచిన్ పైలట్కు కార్పొరేట్
వ్యవహారాలను అప్పగించారు. ఇప్పటివరకు ఈ శాఖలను వీరప్పమొయిలీ కేబినెట్
హోదాలో నిర్వహించారు. జితేంవూదసింగ్కు యువజన, క్రీడల వ్యవహారాలు
కేటాయించారు. ఇప్పటిదాకా అంబికాసోనీ నిర్వహించిన సమాచార, ప్రసారశాఖ
స్వతంత్ర సహాయమంత్రి పదవి మనీష్తివారీకి లభించింది. ఇదివరలో ఐపీఎల్
వివాదంతో విదేశాంగశాఖ సహాయమంత్రి పదవి నుంచి వైదొలగిన శశిథరూర్ తాజాగా మానవ
వనరుల సహాయమంత్రి అయ్యారు. పవన్కుమార్ బన్సల్ నుంచి పార్లమెంటరీ
వ్యవహారాలను కమల్నాథ్కు అప్పగించారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా
కూడా కొనసాగుతారు.
కేబినెట్ మంత్రులు
కే రహ్మాన్ ఖాన్, దిన్షా పటేల్,
అజయ్ మాకెన్ , పల్లం రాజు , అశ్విని కుమార్, హరీష్ రావత్, చంద్రేశ్ కటౌచ్
సహాయ మంత్రులు
మనీష్ తివారీ, సర్వే సత్యనారాయణ,
శశిథరూర్, కొడికున్నిల్ సురేష్
సహాయ మంత్రులు
పొరిక బలరాం నాయక్
కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి
కిల్లి కృపారాణి
తారిఖ్ అన్వర్
అధిర్ రంజన్ చౌదరి
ఏహెచ్ ఖాన్ చౌదరి
నినాంగ్ ఇరింగ్
రానీ నారా
లాల్చంద్ కటారియా
దీపాదాస్మున్షీ
Sunday, October 28, 2012
12 మంది కొత్త ముఖాలు
-మొత్తం ఏడుగురు మంత్రుల రాజీనామా
-ఎస్ఎం కృష్ణ బాటలో సోనీ, వాస్నిక్, సహాయ్, ఖండేలా, అగాథా, విన్సెంట్ పాలా..
-రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్
-ఆనంద్ శర్మకు విదేశాంగ శాఖ!
-పెట్రోలియం నుంచి జైపాల్డ్డి ఔట్.. మానవ వనరుల శాఖకు మార్చే అవకాశం
-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్గాంధీ?
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. భారీస్థాయిలో మంత్రిమండలి ప్రక్షాళనకు తెరలేచింది. పాతవారి నిష్క్రమణ..కొత్తవారి ఆగమనంతో మన్మోహన్ కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. యూపీఏ కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు తప్పుకోగా, మరో 12 మంది కొత్తవారు చేరనున్నారు. 12 మంది సహాయ మంత్రులకు పదోన్నతి లభించనుంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర కేబినెట్లో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేంద్ర మంత్రులైన అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సుబోధ్కాంత్ సహాయ్, సహాయ మంత్రులైన మహాదేవ్ ఖండేలా, అగాథా సంగ్మా, విన్సెంట్ పాలా శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
తాజా మార్పులలో జైపాల్డ్డిని పెట్రోలియం శాఖ నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చవచ్చునని భావిస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ ఆనంద్శర్మ లేదా సల్మాన్ఖుర్షీద్కు దక్కవచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర ఎంపీ పురంధేశ్వరికి పదోన్నతి కల్పించి వాణిజ్య శాఖను ఇవ్వనున్నారని, రాహుల్ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించవచ్చునని చెబుతున్నారు.
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)



